link
stringlengths 41
231
| text
stringlengths 28
5k
|
---|---|
https://www.telugupost.com/movie-news/hippy-heroine-digangana-suryavamshi-124236/ | హిప్పీ సినిమాలో కార్తికేయ కి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీ గురించి హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గుండ్రని మొహంతో, మత్తెక్కించే కళ్ళతో, అందమైన శరీరాకృతి తో హాట్ యాంగిల్ అయినా తగ్గనని చెప్పే ఆమె వాలకం అన్ని సమపాళ్లలో రంగరించి కలగలిపిన దేవతలా దిగంగన సూర్యవంశీ ఉందని.. హిప్పీ సినిమా గనక హిట్ అయితే ఈ అమ్మాయి కూడా క్లిక్ అవుతాడని అన్నారు. మరి నిజంగానే చూడగానే ఆకర్షించే అందంతో దిగంగన సూర్యవంశీ ఈ తరం హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా కనబడింది. సినిమా విడుదలకు ముందు హిప్పీ ప్రీ రిలీస్ ఈవెంట్ తర్వాత దిగంగన సూర్యవంశీ టాపిక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా నడిచింది. మరి నిన్న ప్రేక్షకులముందుకు వచ్చిన హిప్పీ సినిమాకి కనీసం మిక్స్డ్ టాక్ కూడా పడలేదు. సినిమాకి ప్లాప్ టాక్ రాగా అందులో కార్తికేయ కి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీ కి మంచి మార్కులు పడుతున్నాయి. కార్తికేయ కేరెక్టర్ తో ఆడుకునే అమ్మాయిగా దిగంగన సూర్యవంశీ చక్కని నటనను కనబర్చింది. అందమైన నటన, అందం తో ఆకట్టుకుంది దిగంగన సూర్యవంశీ. కొన్ని యాంగిల్స్ లో అందంగా కనిపించింది. మరి ఈ సినిమా హిట్ అయితే గనక దిగంగన సూర్యవంశీ కి మరిన్ని అవకాశాలైతే వచ్చేవి. యంగ్ హీరోల కన్ను దిగంగన సూర్యవంశీ మీద పడేది. కానీ హిప్పీ టాక్ తో దిగంగన సూర్యవంశీ నష్టపోయేలా కనబడుతుంది |
https://www.telugupost.com/movie-news/tollywood-popular-actress-poonam-kaur-reacts-on-the-results-of-andhra-assembly-elections-1539471 | టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అయితే ఆమె స్పందన మాత్రం భిన్నంగా ఉంది . "వై నాట్ 175 అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు’ అని ట్వీట్ చేసింది. దీనికి #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేసింది. పూనమ్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అధికారంలోకి రాబోతున్న టీడీపీ, జనసేన కూటమి కి సుగాలి ప్రీతి కేసును త్వరగా పరిష్కరించాలంటూ కోరింది.Waiting to see #sugalipreeti issue getting resolved in #andhrapradesh, her mother deserves long awaited justice - 🙏.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 6, 2024 అందరూ కలిసుండాలని...దీంతో పాటు మరో ట్వీట్ కూడా పూనమ్ కౌర్ చేసింది. ఈసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి పోవాలని ఆకాంక్షించింది. జగన్ మరింత బలోపేతం కావాలని తెలిపింది. 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి కారకులైన వారంతా ఇప్పుడు కలిసుండాలని తానుకోరుకుంటున్నానని ట్వీట్ చేసింది. ఆ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి చేసిన కృషిని పూనమ్ కౌర్ ప్రశంసించింది. సహనం, పట్టుదలతో అంతా ఒక్కటవ్వాలని కోరుకుంది ఈ అమ్మడు.The architects of #ysjaganmohanreddy garu’s previous success were the three important women of his life , his mother , his sister , his wife YS Bharathi garu who truly teaches patience and perseverance in her own ways , I wish the entire family togetherness , love and peace ✌️ 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 7, 2024 |
https://www.telugupost.com/movie-news/krish-akhil-movie-108604/ | క్రిష్ – అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఏంటి నమ్మట్లేదా! మరి ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. న్యూస్ విన్న క్రిష్ కూడా షాక్ అయ్యాడని సమాచారం. అతనికి ఇంతవరకు అఖిల్ తో సినిమా చేద్దాం అని ఆలోచన కూడా రాలేదట. నిజానికి క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తరువాత ఏ సినిమా చేయాలి అనేది ఫిక్స్ అవ్వలేదు. అల్లు అర్జున్ తో అతనికి మంచి స్నేహం ఉంది కాబట్టి అతనితో సినిమా చేయొచ్చు అంటున్నారు కానీ అది కూడా క్లారిటీ లేదు. ఇక నాగ్ కి కానీ, అఖిల్ కి కానీ ఇంతవరకు కలవలేదని క్రిష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. మరి ఈ వార్త ఎందుకు పుట్టింది? ఎవరు పుటించారు? మిస్టర్ మజ్ను ప్రమోషన్ కోసమే పుటించారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏది అయితేనేమి క్రిష్ మాత్రం ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చేసాడు. దాంతో ఈ వార్తకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. అటు అఖిల్ కూడా తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు. |
https://www.telugupost.com/movie-news/సినిమా-పోయిందన్నారు-53657/ | నాని - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఎంసీఏ.. గత గురువారమే విడుదలై యావరేజ్ టాక్ తో కూడా కలెక్షన్స్ దుమ్ము దులుపుతుంది. క్రేజీ కాంబినేషన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందు నుండే మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. అందుకే విడుదలైన మొదటి రోజు సినిమా టాక్ ఎలా వున్నా కలెక్షన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా విడుదలయ్యాక యావరేజ్ టాక్ రావడమే కాకుండా క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి యావరేజ్ రేటింగ్ ఇచ్చి సినిమా మీద హోప్స్ లేకుండా చేశారు. కానీ నాని కున్న క్రేజ్, సాయి పల్లవి క్రేజ్, దిల్ రాజు క్రేజ్ మొత్తంగా ఈ సినిమాని బాక్సాఫీసు వద్ద స్టడీగా నిలబెట్టేశాయి. ఇకపోతే నాని ఎంసీఏ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటే.. అటు ఓవర్సీస్ లోను కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. యావరేజ్ టాక్ వలన, క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ వలన ఓవర్సీస్ కలెక్షన్స్ మీద ప్రభావం పడలేదు. కేవలం ఎంసీఏ ప్రీమియర్లతోనే 3.03 లక్షల డాలర్లు కొల్లగొట్టేసింది. అలాగే హలో విడుదలైన శుక్రవారం కూడా ఎంసీఏ కి 1.17 లక్షల డాలర్ల వరకు కలెక్షన్లు వచ్చాయంటేనే అక్కడ ఓవర్సీస్ లో ఎంసీఏ సత్తా ఏమిటో తెలుస్తుంది. అయితే ఎంసీఏ వీకెండ్ కన్నా ముందే హాఫ్ మిలియన్ మార్కు దాటేసిందన్నది ట్రేడ్ రిపోర్ట్. అయితే ఇంతకు ముందు నాని సినిమాలు రెండూ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. వీకెండ్ కలెక్షన్లు స్టడీగా కొనసాగితే ఈ విషయంలో హ్యాట్రిక్ కొట్టిన ఘనత నాని ఖాతాలో పడిపోతుంది అని అంటున్నారు. అలాగే ఎంసీఏ కి మొదటి రోజు అదిరి పోయే కలెక్షన్స్ రావడానికి మరో కారణం ఎంసిఎ విడుదల అయ్యే నాటికి బరిలో ఒక్క సినిమా కూడా లేదు. అంతకు ముందు వారం వచ్చిన సినిమాలన్నీ టపా కట్టేయడంతో పోటీ పడి మరీ థియేటర్లన్ని నానికే ఇచ్చారు. ఈ విధంగా యావరేజ్ అనుకున్న సినిమా కలెక్షన్స్ లో మాత్త్రం హిట్. |
https://www.telugupost.com/movie-news/అందుకే-నయన్-ను-సూపర్-స్టా-60149/ | సైరా నరసింహా రెడ్డి చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి 151వ చిత్రం కావడంతో సినిమాపై మరింత అంచనాలు ఎక్కువ అయ్యాయి. అదేవిధంగా సినిమాపై గాసిప్పులు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. అసలు ఇంతకీ ఈ సినిమాలో నయనతార నటిస్తుందా లేదా అనేది ఇంకా అందరిలోనూ మదిలో మెదిలే ప్రశ్న.అయితే కచ్చితంగా ఈ సినిమాలో నయన్ నటిస్తుందట. నిన్నటివరకు వచ్చిన గాసిప్పులు అన్ని వట్టిదే అని తెలిసిపోయింది. ఆ పాత్రకోసం దాదాపు రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట నయన్. ఆమె అడిగినంత ఇవ్వటానికి నిర్మాత రామ్ చరణ్ ఒప్పుకున్నారట. ఆమె తీసుకునే రెమ్యునరేషనే సౌత్ లోనే ఏ హీరోయిన్ డిమాండ్ చేయడం లేదు. సినిమా హిట్ - ఫ్లాపులతో సంబంధం లేకుండా సాగిపోతోంది నయన్ కెరీర్. అందుకే నయన్ ను మాత్రమే సూపర్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు. కుర్రహీరో నుండి పెద్ద హీరో దాకా అందరితో నటించేస్తోంది. అలానే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తా చూపిస్తోంది.మొన్నటివరకు నయన్ కోసమే సినిమా షూటింగ్ లేట్ అవుతుందని అన్నారు. మరి ఇప్పుడు నయన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా షూటింగ్ కి వెళ్ళటమే ఆలస్యం. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. |
https://www.telugupost.com/movie-news/sharwanand-in-don-role-102165/ | గత ఏడాది డిసెంబర్ లో హీరో శర్వానంద్ ఇద్దరు దర్శకులను లైన్ లో పెట్టి ఒకేసారి రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు... ఎన్నడూ లేనిది శర్వా ఇలా ఒకేసారి రెండు సినిమాలను ఎలా మేనేజ్ చేస్తాడో.. అసలెప్పుడు తొందరగా సినిమాలు చెయ్యని శర్వానంద్ రెండు సినిమాల షూటింగ్స్ లో బాగా బిజీగా మారుతున్నాడు అన్నారు. హను రాఘవపూడితో పడి పడి లేచే మనసు, సుధీర్ వర్మ సినిమాలని ఏకకాలంలో పూర్తి చేస్తాడన్నారు. కానీ శర్వా మాత్రం ఎప్పటిలాగే కూల్ గా హను రాఘవపూడి పడి పడి లేచే మనసు పూర్తి చేసేసాడు. ఇక సుధీర్ వర్మ సినిమా మాత్రం కాస్త ఆలస్యంగా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లగా.. షూటింగ్ బాగా ఆలస్యమవుతూ వచ్చింది. ఒకానొక సమయంలో సుధీర్ వర్మ - శర్వా సినిమా ఆగిపోయిందనే న్యూస్ కూడా వచ్చింది. తాజాగా ఫస్ట్ లుక్ రెడీ కానీ.. టైటిల్ దొరకడం లేదంటున్నారు.నిజ జీవిత ఘటనల ఆధారంగా...సుధీర వర్మ, శర్వా సినిమా స్క్రిప్ట్ మీదే చాలా రోజులు కూర్చున్నాడు. అయితే వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1990 ప్రాంతంలో వైజాగ్ లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఉండబోతుందట. కథ ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడట. మరి కథకు తగ్గట్టే టైటిల్ కూడా విరాటపర్వం అని అనుకున్నారు. అయితే టైటిల్ అంతా ఓకె అనుకున్నాకే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ ఉంటుందట. మరి కాస్త లేట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా శర్వానంద్ చెబుతున్నాడు. |
https://www.telugupost.com/movie-news/u-turn-first-weekend-collections-89102/ | సమంత ప్రధాన పాత్రలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యు టర్న్ మూవీ సూపర్ టాక్ తోనే కాదు.. సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన మొదటి షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత కేరెక్టర్, ఆమె నటన, గ్లామర్ అన్ని సినిమాకు ప్లస్ గా మారడమే కాదు... స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం, డైరెక్షన్ అన్ని సినిమా విజయానికి దోహద పడ్డాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ కొల్లగొట్టింది. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శైలజ రెడ్డి అల్లుడితో గట్టి పోటీకి దిగిన యు టర్న్ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఫస్ట్ వీకెండ్ లో యు టర్న్ వరల్డ్ వైడ్ గా కొల్లగొట్టిన కోట్లు...ఏరియా: ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కోట్లలోనైజాం 1.12సీడెడ్ 0.35గుంటూరు 0.28ఈస్ట్ గోదావరి 0.25వెస్ట్ గోదావరి 0.19కృష్ణ 0.33నెల్లూరు 0.11ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 2.99ఇతర ప్రాంతాలు 0.27ఓవర్సీస్ 0.80వరల్డ్ వైడ్ షేర్స్ 4.06 |
https://www.telugupost.com/movie-news/kajal-agarwal-to-work-with-nagarjuna-akkineni-in-his-next-movie-141289/ | ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతో సర్దుకుపోతుంది. అమ్మడుకి స్టార్ అండ్ యంగ్ హీరోలెవరు అవకాశాలు ఇవ్వడం లేదుకానీ, తెలుగు, తమిళ, హిందీలోనూ సీనియర్ హీరోల సరసనే ఛాన్సులొస్తున్నాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా సీనియర్ హీరోల చెంతకు చేరేలా కనబడుతుంది. ఇంతకుముందు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందనే న్యూస్ వినబడుతుంది. మన్మధుడు 2 లో రకుల్ లాంటి యంగ్ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన నాగార్జున… ఇపుడు కాజల్ అగర్వాల్ తో జోడికట్టబోతున్నాడట. ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు 2 సినిమాల ప్లాప్స్ తర్వాత నాగార్జున సాల్మన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చెయ్యబోతున్నాడు. కళ్యాణ్ కృష్ణ బంగార్రాజుని పక్కనబెట్టి మరీ సాల్మన్ అనే కొత్త దర్శకుడుకి కమిట్ అయిన నాగ్ ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయబోతున్నాడట. మరి నాగార్జున కోసం శ్రియ, అనుష్క, నయనతార కాకుండా లేటెస్ట్ గా సీనియర్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్లిన కాజల్ అగర్వాల్ అయితే బావుటనుందని నాగ్ కి ఫైనల్గా కాజల్ నే సెట్ చేస్తున్నారట. మరి గతంలో రామ్ చరణ్ సరసన మగధీరతో నటించిన కాజల్, తర్వాత చిరు సరసన ఖైదీ నెంబర్ 150 లో నటించింది. ఇక నాగ చైతన్య తో దడ అనే ప్లాప్ మూవీలో నటించిన కాజల్ ఇప్పుడు తండ్రి నాగ్ తో జోడికట్టబోతుందన్నమాట |
https://www.telugupost.com/movie-news/mehabooba-puri-jagannath-70815/ | పూరి జగన్నాధ్ దర్శకత్వ నిర్మాణంలో ఆకాష్ పూరి - నేహా శెట్టి జంటగా తెరకెక్కిన మెహబూబా సినిమా మహానటి ముందు అడ్రెస్స్ గల్లంతైంది. పూరి కనెక్ట్స్ పేరుతొ ఛార్మి - పూరి సంయుక్తంగా నిర్మించిన మెహబూబా సినిమాని హిట్ చేయాలని చాలా పరితపించారు. సినిమా విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తమ సినిమా హిట్ అని సక్సెస్ మీట్స్, సక్సెస్ టూర్స్ అంటూ ఛార్మి అండ్ కో తెగ హల్చల్ చేస్తున్నారు. మరి పూరి జగన్నాధ్ తనకి తన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో మొత్తం ఊడ్చి ఈ సినిమాని తెరకేక్కించాడు. కానీ అసలే ప్లాప్స్ లో ఉన్న పూరీని తన కొడుకు ఆకాష్ కూడా ఆదుకోలేకపోయాడు. ఇక పూరి జగన్నాధ్ అటు దర్శకుడిగానూ, ఇటు నిర్మాతగానూ ప్లాప్ ను మూడగట్టుకున్నాడు.మందు గ్లాసుతో డ్యాన్సు....కానీ అది ఒప్పుకోవడానికి ఛార్మి గాని పూరి గాని సిద్ధంగా లేరు. తమ మెహబూబా సినిమా హిట్ అని సోషల్ మీడియా లో ఎంతగా చెలరేరిగిపోతున్నారంటే మెహబాబా సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ మందు పార్టీ చేసుకుంటున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి ఇంకా మెహబూబా టీమ్ లోని కొందరు మందు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ పార్టీలో ఛార్మి మందు గ్లాస్ పట్టుకుని డాన్స్ చెయ్యడం మాత్రం అందరిని షాక్ కి గురి చేస్తుంది. హీరోయిన్ గా అవకాశాలు లేక పూరి తో చేరి పూరి కనెక్ట్స్ ని మెయిన్చే టెయిన్ చేస్తున్న ఛార్మి మెహబూబా పబ్లిసిటీ కార్యక్రమాల్లోనూ, షూటింగ్ విషయంలోనూ ఎంతలా హల్చల్ చేసిందో తెలిసిందే. కానీ మరీ పార్టీలో మందు గ్లాసులు పట్టుకుని ఈ డాన్స్ ఏంటి అంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఛార్మి మెహబూబాతో అన్ని పోగొట్టుకుంది కానీ మందు మిగిలింది అంటూ సైటర్లు కూడా వేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/dil-raju-bagged-naandi-rights-183708/ | దిల్ రాజు తెలివితేటలూ వేరయా అన్నట్టు దిల్ రాజు మెచ్చాడు అంటే దానికి విపరీతమైన క్రేజు, విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. ప్రస్తుతం దిల్ రాజు నుండి షాదీ ముబారక్ మూవీ మార్చ్ 5 న రాబోతుంది. మరోపక్క దిల్ రాజు కదుపుతున్న పావులు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. నిన్నగాక మొన్న భారీ ఎత్తున శంకర్ – రామ్ చరణ్ తో పాన్ ఇండియా రేంజ్ లో మూవీ ప్రకటించి షాకిచ్చాడు. ఇప్పుడు దిల్ రాజు చేసిన ఓ పనికి అందరూ షావుతున్నారు. అదేమిటంటే గత శుక్రవారం విడుదలైన నాంది సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది సినిమా పాజిటివ్ టాక్ తో పాజిటివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. దానితో సైలెంట్ గా రంగంలోకి దిగిన దిల్ రాజు.. నాంది టీం ని అప్రిషియేట్ మీట్ అంటూ పెట్టి అందరిని సన్మానించాడు. మంచి సినిమాని నిలబెట్టే ఉద్దేశ్యంతో దిల్ రాజు ఇలా చేసాడనుకున్నారు.కానీ అక్కడ విషయం ఏమిటి అంటే దిల్ రాజు నాంది రీమేక్ రైట్స్ కొనబట్టే ఇలాంటి థాంక్యూ మీట్స్ పెట్టాడట. నాంది తెలుగులో సూపర్ హిట్ అవడంతో ముందుగా మేల్కొన్న దిల్ రాజు నాంది రీమేక్ రైట్స్ కొనేసాడట. మరి ఈ మధ్యన దిల్ రాజుకి హిందీ మీద ఫోకస్ ఎక్కువవుతుంది. ఇప్పటికే జెర్సీ రీమేక్ ని హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు నాంది రైట్స్ పట్టుకుని అక్కడా ఈ సినిమాని రీమేక్ చెయ్యడానికి బయలుదేరబోతున్నాడు. మరి ఇప్పటికే బాలీవుడ్ పరిచయాలతో దిల్ రాజు బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి రెడీ అవుతున్నాడు. జెర్సీ షాహిద్ కపూర్ తో హిట్ కొట్టాక నాందీని మొదలు పెడతాడో.. లేదంటే ముందే స్టార్ట్ చేస్తాడో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/bigg-boss-telugu-season-5-grand-finale-will-begin-soon-1344582 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే మరికాసేపట్లో ప్రారంభంకానుంది. విజేతలు ఎవరన్నది పక్కన పెడితే ఈ మార్ థాన్ షో అదిరిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రోమోలు చూసినా అదే అర్థమవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఐదు కంటెస్టెంట్లున్నారు. సన్నీ, మానస్, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, సిరిలు ఉన్నారు. వీరిలో విజేత ఎవరన్నది దాదాపుగా ఇప్పటికే తేలిపోయింది. సన్నీయే విజేత అని బయటకు లీకులు వచ్చేశాయి. రన్నరప్ గా శ్రీరామచంద్ర నిలిచారని తెలుస్తోంది.మూడు సినిమాల నుంచి....అయితే షో లో శ్యామ్ సింగరాయ్ మూవీ ప్రమోషన్ కోసం నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవిలు సందడి చేయనున్నారు. నేరుగా వారిద్దరూ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ తో కొద్ది సేపు గడపనున్నారు. ఇక రాజమౌళి బ్రహ్మాస్త్ర నుంచి రణబీర్ కపూర్, ఆలియా భట్, పుష్ప సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు సుకుమార్, రష్మిక మందన్న, దేవిశ్రీ ప్రసాద్ లు స్టేజీ పై హడావిడి చేయనున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అదిరిపోయేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/rana-daggupati-hiranya-kashyapa-movie-123890/ | బాహుబలి లో భల్లాల దేవుడిగా, రుద్రమదేవిలో రుద్రమదేవిని ఆరాధించే యువకుడిగా.. అదరగొట్టే నటనతో ఆకట్టుకున్న రానా తనకి నచ్చితే ఎలాంటి కేరెక్టర్స్ చెయ్యడానికి అయినా సిద్ధపడుతున్నాడు. హీరోగానే కాదు, అటు నిర్మాతగానూ రానా కొత్త అవతారమెత్తబోతున్నాడు. ఇక ఓ అన్నంత హీరోగా ఎదగలేకపోయిన రానా… హీరోగా స్టార్ రేంజ్ అందుకోలేకపోయాడు. కానీ బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గాను పేరు సంపాదించాడు. తాజాగా రానా మీద 200 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారట. రుద్రమదేవి సినిమా టైం లో దర్శకుడు గుణశేఖర్ హిరణ్య కశ్యప సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ బడ్జెట్ ప్రోబ్లెంస్ తో ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. తాజాగా ఆ సినిమా త్వరలోనే రానా హీరోగా పట్టాలెక్కబోతుంది. నిన్నమొన్నటివరకు బడ్జెట్ కారణంగా ఈసినిమా ఆగిపోయిందనే న్యూస్ నడిచింది. కానీ ఈమధ్యన గుణశేఖర్ మా సినిమా హిరణ్య కశ్యప మొదలవబోతుందని ప్రకటించాడు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా ఉంటుంది కానీ.. సురేష్ బాబు మాత్రం 200 బడ్జెట్ పెట్టడానికి ఒప్పుకోలేదట. 100 కోట్లు పెట్టినా పర్లేదు. రానాకి ఎలాగూ బాలీవుడ్లో మార్కెట్ ఉంది కాబట్టి 100 పెట్టిన పర్లేదనుకున్నారట. కానీ గుణశేఖర్ మాత్రం హిరణ్య కశిప బడ్జెట్ ని 200 కోట్లకి చేసేసరికి సురేష్ బాబు ఆలోచనలో పడడంతో ఆ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదట. అయితే గుణశేఖర్ పట్టువదలని విక్రమార్కుడిలా ట్వంటీయత్ ఫాక్స్ సెంచరీ సంస్థతో చేతులు కలిపి… వాళ్ల సాంకేతిక సహకారం తీసుకుని, వాళ్లనీ నిర్మాణంలో భాగస్వాముల్ని చేసాడట. అయితే సినిమా నాణ్యత కోసం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్నివాడాలి. అందుకోసం 200 కోట్ల బడ్జెట్ అవసరం అని గుణశేఖర్ వాదన. కానీ సురేష్ మాత్రం రానా మీద అంత పెట్టడం వెస్ట్ అనుకుని.. ఆలోచిస్తుంటే.. తాజాగా గుణశేఖర్ కూడా నిర్మాతగా హిరణ్యకశిప లో భాగస్వామిగా మారబోతున్నాడట. ఇక సినిమా మీద హైప్ కోసం బాలీవుడ్ స్టార్స్ ని ఎంపిక చెయ్యాలని గుణశేఖర్ భావిస్తున్నాడట మరి ఒక్క రానానే నమ్ముకుంటే పనిజరగదు కనక… ఇలా ఆలోచిస్తున్నారట. |
https://www.telugupost.com/top-stories/telugu-desam-party-chief-chandrababu-confirmed-tickets-to-two-ycp-mlas-who-were-involved-in-cross-voting-1469655 | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారట. మిగిలిన ఇద్దరికి మాత్రం నో చెప్పేశారట. పార్టీ వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని వారిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ఇద్దరికే 2024 ఎన్నికల్లో టిక్కెట్ హామీని చంద్రబాబు ఇచ్చారంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవిల రాజకీయ భవిష్యత్ పై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి.ఆనం, కోటంరెడ్డిలకు...ఈ నలుగురిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు మాత్రమే టిక్కెట్ హామీ పార్టీ అధినేత నుంచి లభించిందంటున్నారు. ఆనంకు ఆత్మకూరు నియోజకవర్గం, శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్లు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. వారిద్దరూ గత కొంత కాలంగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నదీ అందుకేనట. ముందుగానే చంద్రబాబుతో మాట్లాడుకున్న తర్వాత వారిద్దరూ థిక్కార స్వరం వినిపించారంటారు. అందుకే వారిద్దరి నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించినా పెద్దగా బాధపడలేదు. మొన్న సస్పెండ్ చేసినా పెద్దగా ఆశ్చర్యానికి లోను కాలేదు.బలమైన నేతలు కావడంతో...ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోదరుడు గిరిధర్రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు శ్రీధర్ రెడ్డి కూడా కండువా కప్పేసుకుంటారు. ఆనం విషయంలో అది జరగకపోయినా ఆయన దారి కూడా అదేనన్నది ఇక అందరికీ తెలిసిన విషయమే. ఆత్మకూరులో పార్టీ గెలవాలంటే ఆనం అవసరమని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. అక్కడ సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆనం ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ఇక నెల్లూరు రూరల్ లో కొంత పాత టీడీపీ నేతలు కోటంరెడ్డి చేరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అది టీ కప్పులో తుపాను మాత్రమేనని చంద్రబాబు భావిస్తున్నారు. మెల్లగా సర్దుకుంటాయని, వారి చేరికలకు ఇంకా సమయం ఉండటంతో అసమ్మతిపై చంద్రబాబు పెద్దగా దృష్టిపెట్టలేదు.నియోజకవర్గాల్లో అసంతృప్తి...ఇక మరో ఇద్దరి ఎమ్మెల్యేల పరిస్థితి ఎటూ గాకుండా ఉంది. ఉండవల్లి శ్రీదేవిని పార్టీలో కూడా చేర్చుకునే అవకాశం లేదు. ఆమెకు టిక్కెట్ సంగతి అటుంచితే ఆమెకు పార్టీలో ఎంట్రీ కూడా కష్టమేనని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఆమెపై నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తి అందుకు కారణమంటున్నారు. ఇకమరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సయితం ఉదయగిరి టిక్కెట్ టీడీపీ ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, నియోజకవర్గంలో అసంతృప్తితో కొత్త నేతకు అక్కడ టీడీపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ మాత్రం ఎటూ కాకుండా పోయిందంటున్నారు. |
https://www.telugupost.com/crime/pharmacy-student-tejaswini-re-postmortem-1368396 | ఏపీలో సంచలనంగా మారిన సత్యసాయి జిల్లా బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసు మలుపులు తిరుగుతోంది. ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. తిరుపతిలో కాలేజీ హాస్టల్లో ఉన్న తమ కూతురిని తీసుకొచ్చి హత్యాచారం చేశారని ఆందోళనకు దిగారు. తాము రాకుండానే పోస్టుమార్టం చేశారని ఆమె తండ్రి ఆరోపించారు. అత్యాచారం ఆరోపణలు రావడంతో తేజస్విని డెడ్బాడీకి రీ పోస్టుమార్టం నిర్వహించారు. రీ పోస్టుమార్టం రిపోర్ట్లో తేజస్వినిపై అత్యాచారం జరగలేదని.. ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. శుక్రవారం వచ్చిన రిపోర్టుల్లో ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు లేవని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ముఖంపై ఉన్న గాయాలపై స్పష్టత రావాల్సి ఉంది. బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని, అదే పట్టణానికి చెందిన సాదిక్ గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారని తెలుస్తోంది. సాదిక్ ఫోన్ చేసి రమ్మనడంతో ఆమె తన ఇటుక బట్టీలు తయారు చేసే స్థలంలో ఉన్న షెడ్డుకి వచ్చింది. రాత్రి 10 గంటల వరకూ అక్కడే ఉన్నారని.. భోజనం తీసుకొచ్చేందుకు సాదిక్ బయటికెళ్లిన సమయంలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. తమ కుమార్తె డెడ్బాడీ సాదిక్ షెడ్డులో దొరకడం.. తాము రాకుండానే పోస్టుమార్టం చేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంటూ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్యాచారం జరగలేదని.. యువతి మృతిపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/dhanush-aishwarya-sons-photos-at-rajinikanth-lal-salaam-audio-launch-event-1517316 | Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ తన స్టార్డమ్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాగా రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకొని, ఇటీవల విడాకులతో విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఒకరి పేరు 'యాత్ర', మరొకరి పేరు 'లింగ'. ఈ ఇద్దరికీ సంబంధించిన పలు ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా కొన్ని సరికొత్త ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఐశ్వర్య దర్శకురాలిగా 'లాల్ సలాం' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబందించిన ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఇక అమ్మ తెరకెక్కించిన సినిమా ఆడియో లాంచ్ కి కొడుకులు యాత్ర, లింగ ముఖ్య అతిథులుగా వచ్చారు.ప్రస్తుతం వారు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అవి చూసిన ఆడియన్స్ ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైన కొడుకులు తండ్రి ఆస్తులు పంచుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం తండ్రి పోలికలను సగం సగం పంచుకున్నారు.. అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్ ఆ ఫోటోకి నిజంగా అప్ట్ అని చెప్పాలి. మరి ఆ ఫోటోని మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) |
https://www.telugupost.com/movie-news/వసూళ్లలోనే-కాదు-వ్యూస్-ల-23099/ | నాచురల్ స్టార్ నాని విజయ పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి 3 న విడుదలైన నేను లోకల్ సూపర్ హిట్ ఐయ్యి తొలి నాలుగు రోజులకే బయ్యర్స్ ని ప్రాఫిట్ జోన్లో పడేసింది. రెండవ వారం కూడా స్ట్రాంగ్ రన్ దక్కించుకుంటున్న నేను లోకల్ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకుల దగ్గర నుంచి సి సెంటర్ ప్రేక్షకుల వరకు అందరిని అమితంగా ఆకట్టుకుంటోంది. తొలి రోజు సెకండ్ హాఫ్ వీక్ గా ఉందన్న టాక్ వినిపించినప్పటికీ ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై ఏ మాత్రం పడలేదు. ఈగ తరువాత నాని 30 కోట్ల రూపాయలకు చేరువ అవుతున్న చిత్రం ఇదే కావటం విశేషం. గత వారం విడుదలైన ఓం నమో వెంకటేశాయ మరియు ఎస్-3 చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ ప్రభావం చూపకపోవటంతో నేను లోకల్ చిత్రానికి మార్గం సుగమం ఐయ్యింది.ఇదిలా ఉండగా దిల్ రాజు తాజాగా నేను లోకల్ చిత్రంలో నుంచి కొన్ని డిలీటెడ్ సన్నివేశాలని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఒకప్పుడు ప్రతి దర్శకుడు సినిమా నిడివి కచ్చితంగా రెండున్నర్ర గంటల పాటు ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల స్థాయిలో గంటా నలభై ఐదు నిమిషాల నిడివితో కూడా మన చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కమర్షియల్ చిత్రాలలో వుండే పాటలు, ఫైట్స్ కారణంగా ఇవి రెండు గంటల పదిహేను నిమిషాలు లేదా అంతకంటే తక్కువ వుండేలానే జాగ్రత్త పడుతున్నారు తప్పితే రెండున్నర్ర గంటల నిడివితో వచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ప్రయత్నాలు ఎవరూ చేయటం లేదు. అలా అని ఎడిటింగ్ ఫైనల్ కట్ జరిగే సమయానికి సరిగ్గా సినిమా కోరుకున్న నిడివి తో ఉండదు. చాలా ఫ్యూటేజి మిగిలిపోతుంటుంది. సినిమా బాగా ఆడుతుంటే విడుదల అనంతరం కొన్ని అదనపు సన్నివేశాలు జోడిస్తుంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా మారిపోయింది. సినిమా ఫలితం ఎలా వున్నా డిలీటెడ్ సీన్స్ అంటూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వ్యూస్ పరంగానూ బిజినెస్ చేసుకునే వెసులుబాటు నిర్మాతలకు కలుగుతోంది. నేను శైలజ చిత్రానికి ఇలానే చేశారు. ఇప్పుడు నేను లోకల్ లో ఫస్ట్ సాంగ్ కి లీడ్ సీన్స్ కొన్ని ఎడిటింగ్ టేబుల్ వద్దనే ఆగిపోగా వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అధిక వ్యూస్ దక్కించుకుంటున్నారు దిల్ రాజు. |
https://www.telugupost.com/movie-news/organizers-have-again-changed-the-venue-of-valtheru-veeraiya-pre-release-event-celebration-1456196 | వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల వేదికను నిర్వాహకులు మళ్లీ మార్చారు. విశాఖలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయతే తొలుత ఆర్కే బీచ్ అనుకున్నారు. అయితే పోలీసులు నిరాకరించడంతో దానిని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కు మార్చారు.ఏయూ గ్రౌండ్స్ నుంచి...కానీ ఏం జరిగిందో తెలియదు కాని ఉన్నట్లుండి మళ్లీ వేదికను మార్చారు. తిరిగి ఆర్కే బీచ్ లోనే నిర్వాహకులు వేడుకను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు వాల్తేరు వీరయ్య వేడుకలను నిర్వహించడానికి తిరిగి సన్నాహాలు ప్రారంభించారు. పోలీసులు అనుమతితోనే నిర్వాహకులు వేదికను మార్చినట్లు తెలుస్తోంది. |
https://www.telugupost.com/movie-news/చరణ్-ఎలా-ఒప్పుకున్నాడో-53936/ | రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ పూర్తి కావొచ్చింది. మరికొన్ని రోజుల్లో టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నా.... ఇంకొద్ది రోజుల్లోనే పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకోనుంది. ఇక సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు సుకుమార్ బిజిగా మారినా రామ్ చరణ్ మాత్రం బోయపాటి సినిమా కి షిఫ్ట్ అవుతాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమాతో రామ్ చరణ్ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు బోయపాటి - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కబోయే సినిమా మీద ఒక ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. అదేమిటంటే... వీరికలయికలో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ 80% వరకు రాజస్థాన్ లోనే జరగనుందట. రాజస్థాన్ ఎడారిల్లో రాజమహల్స్ లో ఆ 80 % షూటింగ్ పూర్తి చేసి.. ఆ తరువాత మిగతా షూటింగ్ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో చేయనున్నారట. అయితే అసలు రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ అంటే.. దాదాపు అన్నీ యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాలో ఉన్నాయా అనే సందేహం వస్తోంది. మరి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు అంటే మనకు వెంటనే... అల్లు అర్జున్ - బోయపాటి కలయికలో వచ్చిన సరైనోడు సినిమా గుర్తొస్తుంది. అంటే చరణ్ - బోయపాటి సినిమా కూడా సరైనోడు సినిమా తరహాలో ఉండబోతుందా? అనే అనుమానం వచ్చిన వెంటనే బోయపాటి సరైనోడు సీక్వెల్ తీస్తున్నాడా అనిపిస్తుంది. మరి అంత యాక్షన్ సన్నివేశాలుంటే చరణ్ ఎలా ఒప్పుకుంటాడో అనేది ప్రస్తుతానికి పెద్ద సందేహమే. చూద్దాం ఏం జరుగుతుందో. |
https://www.telugupost.com/movie-news/నేను-లోకల్-టు-డేస్-వరల్డ్-22018/ | ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 2 .92సీడెడ్ 1 .00వైజాగ్ 0 .95ఈస్ట్ గోదావరి 0 .81వెస్ట్ గోదావరి 0 .46క్రిష్ణ 0 .53గుంటూరు 0 .63నెల్లూరు 0 .26యూ.ఎస్.ఏ 1.94రెస్ట్ ఆఫ్ ఇండియా & రెస్ట్ ఆఫ్ వరల్డ్ 1 .15టు డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 10 .65 |
https://www.telugupost.com/movie-news/ranga-martanda-and-das-ka-dhamki-movies-releasing-on-ott-platforms-1470912 | థియేటర్లలో విడుదలైన సినిమాలు రోజుల వ్యవధిలోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే బలమైన కథ అయితే.. ఆ సినిమా సూపర్ హిట్ అయి లాభాలు ఆర్జిస్తుంది. అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన రెండు సినిమాలు సూపర్ హిట్ అయి.. ఇప్పుడు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన రంగమార్తాండ.. ఓటీటీలోకి కూడా సైలెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది.ఆరేళ్ల తర్వాత దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. తమ నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి చూపించారు. మరాఠీ చిత్రమైన నటసామ్రాట్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. గత నెల ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్ తోనే ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేసింది. ఎలాంటి ప్రచారం లేకుండా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న రంగమార్తాండ.. అమెజాన్ ప్రైమ్ లోకి సైలెంట్ గా వచ్చింది.మాస్ కా దాస్.. విశ్వక్సేన్ - నివేదా పేతురాజ్ జంటగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. విశ్వక్సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా మార్చి 22న విడుదలై.. థ్రిల్లింగ్ హిట్ గా నిలిచింది. విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఏప్రిల్ 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన ఆహాలో దాస్ కా ధమ్కీ విడుదల కానుంది. |
https://www.telugupost.com/movie-news/హీరోయిన్-కి-తక్కువ-కేరెక-47626/ | అనసూయ యాంకర్ గా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చినప్పటినుండే గ్లామర్ షోకి తెర తీసింది. ఆమె యాంకర్ గా అడుగెట్టాకే యాంకర్స్ అందరూ కాస్తో కూస్తో గ్లామర్ షోకి సిద్ధమయ్యారు, అంతకుముందు చుడి దార్లు, సారీస్, ఓణీలతో కనబడిన వారంతా అనసూయ పుణ్యమా అని అందాల ఆరబోతకు దిగారు. అనసూయ పెళ్లి చేసుకుని పిల్లలను కన్నప్పటికీ ఆమె గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పటినుండి ఇప్పటికి ఒకటే ఫిజిక్ ని మెయింటింగ్ చేస్తూ హీరోయిన్స్ కి సైతం పోటీ ఇచ్చే స్టేజి కి వచ్చేసింది. వెండితెర మీద హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేద్దామనుకున్న ఈ భామకి అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సెల్ అవడానికి ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది.అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఇరగదీస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న అనసూయ ఇప్పుడు చాల స్లిమ్ లుక్ లో నాజూగ్గా తయారైంది. ఈ టీవీలో జబర్దస్త్ స్టేజ్ మీద కత్తిలాంటి డ్రెస్సులతో ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్న అనసూయ.... ఆంటీ అయినప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో మాత్రం వీణలు మీటుతూనే ఉంది. తాను చేసే ఈవెంట్స్ కి వెళ్లే ముందు కొన్ని ఫొటోస్ ని ప్రత్యేకంగా తీయించుకుని వాటిని తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేస్తుంటుంది. ఇక ఆ ఆఫొటోలకు కావాల్సిన లైక్ లు కామెంట్స్ పడుతుంటాయి అది వేరే విషయం.ఇక ఇప్పుడు కూడా తాజాగా అనసూయ ఒక కత్తిలాంటి ఫొటోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో అనసూయ మరి చిన్న అమ్మాయిలా... అదిరిపోయే ఫిజిక్ తో హీరోయిన్స్ కి పోటీగా కనబడుతుంది. మరి అనసూయకైతే అదే ఉద్దేశ్యం ఉంది. తాను హీరోయిన్ అవ్వాలని.. మరి ఈ ఫొటోస్ చూసి అయినా ఆమెకి గ్లామర్ రోల్స్ ఎమన్నా ఇస్తే బావుంటుంది... దర్శక నిర్మాతలు మీరు... ఓ సారి ఆలోచిస్తే బావుంటుంది. |
https://www.telugupost.com/movie-news/prema-katha-chitram-3-116945/ | వేసవి సెలవల్లో మొదటిసారిగా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నాగ చైతన్య – సమంత జంటగా నటించిన మజిలీ మూవీ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మొదటి షోకే మజిలీ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే మజిలీ ప్రమోషన్స్ ని సమంత – నాగ చైతన్య లు కలిసి అదరగొట్టేసారు. ఇద్దరు కాంబో ఇంటర్వూస్ ఇవ్వడం.. అలాగే సమంత సోలో ఇంటర్వూస్, దర్శకుడు శివ నిర్వాణ ఇంటర్వ్యూ , సెకండ్ హీరోయిన్ దివ్యంశ కౌశిక్ లు సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ పెంచారు. మరి మజిలీకి పోటీగా ఈ రోజు ఉగాది కానుకగా ప్రేక్షకులముందుకు రాబోతున్న ప్రేమకథా చిత్రం 2 కి పెద్దగా ఊపు కనబడడం లేదు. సోషల్ మీడియాలో ప్రేమ కథా చిత్రం 2 కౌంట్ డౌన్ పోస్టర్ తప్ప ఎక్కడా ఆ సినిమా ప్రమోషన్స్ లేవు. అసలు ప్రేమ కథా చిత్రం 2 ఈ రోజు థియేటర్స్ లోకి వస్తుందన్న విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు కూడా. మరి నందిత స్వేత, సుమంత్ అశ్విన్, సిద్ధి ఇడ్నాని లు జంటగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ చాలా వీక్ గా వున్నాయి. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మజిలీ మీద పోటీకి దిగుతున్న ప్రేమ కథా చిత్రం 2 పొజిషన్ ఏమిటనేది మరికొద్దిసేపట్లో తేలిపోతుంది. |
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-maahesh-babu-sarileru-mekevvaru-movie-story-124491/ | ప్రసుతం మహేష్ బాబు ఫ్యామిలీ తో ట్రిప్ కి వెళ్లారు. తిరిగి రాగానే తన 26 వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో పాల్గొననున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతోంది. దిల్ రాజు అండ్ అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో రష్మిక పాత్రల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో మహేష్ పాత్ర… ఆంధ్ర నుండి కాశ్మీర్ ప్రయాణిస్తుండగా రష్మిక మందన్న ను చూసి ప్రేమలో పడతారట. ట్రైన్ లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి అని చెబుతున్నారు. మహేష్ పాత్ర బట్టి చూస్తే ఇందులో మహేష్ ను లవర్ బాయ్ పాత్రలో చూడొచ్చని తెలుస్తోంది. దాంతో మహేష్ అభిమానులు కూడా తన హీరో పాత్ర ఎలా ఉండబోతుందో అని ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని కీలక పాత్రల్లో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ నటించనున్నారు. అలానే ఈమూవీకి దేవిశ్రీ సంగీతం హైలైట్ కానుందని తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా ఈమూవీ రిలీజ్ అవుతుందని ముందుగానే ప్రకటించారు మేకర్స్. |
https://www.telugupost.com/crime/wife-and-husband-commits-suicide-at-bollaram-railway-track-due-to-financial-troubles-1352158 | ఆర్థిక ఇబ్బందులు భరించలేక భార్య, భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలంగాణలోని బొల్లారం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. రెండ్రోజులుగా తల్లిదండ్రులు భూలక్ష్మి, కొండయ్యలు కనిపించకపోవడంతో.. కూతురు ఆశాజ్యోతి కుషాయిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆశాజ్యోతి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దంపతుల కోసం గాలించగా.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బొల్లారంలోని క్యావెలరి బ్యారక్స్ వద్ద ఉన్న రైలు పట్టాలపై విగతజీవులుగా కనిపించారు.Also Read : వేధించడం వాస్తవమే.. కానీ ఇంత దారుణం జరుగుతుందనుకోలేదు : వినోద్ జైన్కొండయ్య తిరుమలగిరి ఆర్మీ రీజియన్ లో సుబేదారిగా విధులు నిర్వహిస్తుండగా.. వారి కుమార్తె ఆశాజ్యోతి కుషాయిగూడ పీఎస్ లోనే కాని స్టేబుల్ గా ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా వారి కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు ఆశాజ్యోతి వెల్లడించింది. దాంతో.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే భూ లక్ష్మి, కొండయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. |
https://www.telugupost.com/movie-news/నవంబర్-1-న-రెమో-ఆడియో-రిలీ-10056/ | శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ 'రెమో'. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో నవంబర్ 1 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దిల్ రాజు మాట్లాడుతూ - ''హీరో శివకార్తికేయన్ రెమో సినిమాలో మూడు వేరియేషన్స్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మరింత సపోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. డెబ్యూ డైరెక్టర్ బక్కియ రాజ్ కన్నన్ చేసిన సినిమా తమిళనాడులో 65-70 కోట్లు కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. రెమో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న శివకార్తికేయన్కు అభినందనలు. ఈ చిత్రం ఆడియో నవంబర్ 1 న విడుదల అవుతుంది'' అన్నారు. |
https://www.telugupost.com/movie-news/మహానటి-మాములుగా-లేదు-42131/ | అశ్వినీదత్ అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మహానటి చిత్రం మొదలు పెట్టినప్పటినుండి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ ఎంపిక కాగా... టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఒక కీ రోల్ చేస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్, జెమినీ గణేశన్ పాత్ర చేస్తుండగా... ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి నటులు కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తూ ఇదొక మినీ మల్టి స్టారర్ చిత్రంలా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమా మొదలుపెట్టి ఇన్ని రోజులు అయినా ఈ సినిమాకి సంబందించిన సావిత్రి లుక్, జెమినీ గణేశన్ లుక్స్ మాత్రమే రివీల్ చేసిన చిత్ర యూనిట్ 'మహానటి' చిత్ర ఫస్ట్ లుక్ మాత్రం ఇప్పటివరకు రివీల్ చెయ్యలేదు. షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న 'మహానటి' చిత్రం గురించి ఎవరెవరు ఆ సినిమాలో నటిస్తున్నారో అనే ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా విషయాలేమి బయటకి రాలేదు. అయితే ఎటువంటి లుక్ విడుదల కాకపోయినా... అలాగే ఈ చిత్రం గురించిన ఫుల్ డిటైల్స్ లేకపోయినా.. ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడడమే కాదు మంచి క్రేజ్ కూడా వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకోవడానికి ఎగదబడుతున్నారనే అనే టాక్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా 'మహానటి' ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా చెబుతున్నారు.ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 'మహానటి' ఓవర్సీస్ హక్కులను నిర్వాణ సినిమాస్ వారు ఏకంగా 4.5 కోట్లకు కొనేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి మినీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రానికి ఈ రేంజ్ లో ఓవర్సీస్ హక్కులకు భారీ ధరరావడం విశేషమే అని చెప్పుకోవాలి. దీన్నిబట్టే 'మహానటి' చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలున్నాయి అర్ధమైపోతుంది. మరి ఓవర్సీస్ లోనే 'మహానటి' ఈ రేంజ్ ధర పలికితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మహానటి' చిత్రం ఇంకే రేంజ్ లో అమ్ముడుపోతుందో అంటున్నారు. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి బ్రహ్మాండమైన ఆఫర్స్ వస్తున్నాయంటున్నారు. మరి మీడియం బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 30 నుండి 40 కోట్ల బిజినెస్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఓవర్సీస్ లో 'మహానటి' రైట్స్ ని కొన్న నిర్వాణ సంస్థ వారు తాజాగా రెండు హిట్ సినిమాలు కొని మంచి లాభాల్లో ఉన్నారు. 'ఆనందో బ్రహ్మ, అర్జున్ రెడ్డి' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నారు వీరు. మరి 'మహానటి'తో కూడా హ్యాట్రిక్ కొట్టేస్తారేమో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/director-omkar-sentment-ocotber-132223/ | మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సెంటిమెంట్స్ కి డోకా లేదు. ఒక్కొక్కరు ఒకొక్క సెంటిమెంట్ ని నమ్ముతారు. మన ఇండస్ట్రీ లో ఇలా చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కి కొత్తగా డైరెక్టర్ ఓంకార్ చేరాడు. అతను డైరెక్ట్ చేసిన ఏ సినిమా అయినా అక్టోబర్ లో రిలీజ్ చేస్తుంటాడు. తాను డైరెక్ట్ చేసిన రాజుగారి గది సినిమా అక్టోబర్ లోనే రిలీజైంది. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన రాజుగారి గది-2 సినిమా కూడా అక్టోబర్ లోనే రిలీజైంది. ఇది మొదటి పార్ట్ అంత హిట్ అవ్వలేదు కానీ హిట్ అయితే అయింది. ఇప్పుడు అతని లేటెస్ట్ చిత్రం రాజుగారి గది-3 సినిమాను కూడా అక్టోబర్ లోనే విడుదల చేస్తున్నాడు ఓంకార్. ఫస్ట్ లుక్ పోస్టర్….. రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అవికా గౌర్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నారు. దసరా బరిలో ఈచిత్రం ను తీసుకుని రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు ఓంకార్. ఆయన సెంటిమెంట్ మళ్లీ వర్క్ అవుట్ అవుతుందేమో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/keerti-suresh-in-mahanati-77842/ | 'మహానటి' సినిమాను ఏమంటు ఒప్పుకుందో తెలియదు కానీ ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ సంపాందించని పేరు ఈ సినిమాతో సంపాదించుకుంది కీర్తి సురేష్. ఒకేసారి 20 సినిమాలు చేసిన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమెను వెదుక్కుంటూ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి మరో ప్రెస్టీజియస్ సినిమాలో నటిస్తుందని టాక్. మరోసారి కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించనుంది.బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ జీవిత కథ చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర చేయనుంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే సావిత్రి, నాగేశ్వరరావులు లేకుండా వుంటారా? అందులోనూ ఆ రెండు పాత్రల నిడివి కూడా కాస్త ఎక్కువే. నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తుండగా.. సావిత్రి పాత్రలో కీర్తి ని తీసుకుంద్దాం అనుకుంటున్నారు మేకర్స్. బాలకృష్ణ కూడా సావిత్రి పాత్ర ఒకే చెప్పాడని తెలుస్తుంది.మొదట నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్యని తీసుకుంద్దాం అనుకున్నారు కానీ ఆ పాత్ర చేయడానికి చైతన్య ఒప్పుకోకపోవడంతో సుమంత్ ని తీసుకుంటున్నారు. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రకు, సావిత్రి పాత్రకు మధ్య కీలక సన్నివేశాలు ఉన్నాయట అందుకోసమే ఆ పాత్రకు కీర్తి అయితే కరెక్ట్ అనుకుని ఆమెను తీసుకున్నట్టు సమాచారం. మహానటి పాత్రను రెండు సార్లు పోషించే అవకాశం రావడం కీర్తి కి అదృష్టమే అని చెప్పాలి |
https://www.telugupost.com/crime/there-was-tragedy-in-konaseema-three-died-after-falling-into-godavari-1535035 | కోనసీమలో విషాదం నెలకొంది. గోదావరిలో పడి ముగ్గురు మరణించారు. గోదావరి నది స్నానానికి వెళ్లిన ముగ్గురు అందులో మునిగిపోయి మరణించారని స్థానికులు చెబుతున్నారు. కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం బడుగువాని లంకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.ఈతకు వెళ్లి...మృతులు ముగ్గురూ ఆలమూరు మండలం చిలకపాలపాడు గ్రామస్థులగా గుర్తించారు. మృతదేహాలను బయటకు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి మృతితో బడుగువాని లంకలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈత రాకపోవడం వల్లనే మరణించినట్లు ప్రాధమికంగా గుర్తించారని తెలిసింది. |
https://www.telugupost.com/movie-news/shock-for-prabhas-181119/ | ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ ని వరస బెట్టి మొదలు పెట్టడమే కాదు.. అందుకు తగిన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్న ప్రభాస్ కి ఒకే ఒక్క రోజు షాకుల మీద షాకులు తగిలాయి. ఎంతో ఉత్సాహంతో ముంబై వెళ్లి అక్కడ ఓ స్టూడియోలో వేసిన సెట్ లో ఆదిపురుష్ సినిమాని గ్రాండ్ గా ఓపెనింగ్ చేద్దాం అనుకున్న ప్రభాస్ కి ఆదిపురుష్ సెట్ లో ఫైర్ ఆక్సిడెంట్ జరగడం షాకిచ్చింది. ఆదిపురుష్ ఓపెనింగ్ కి అటు ఇటుగా ఆదిపురుష్ షూటింగ్ కోసం వేసిన ఓ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఆదిపురుష్ ఓపెనింగ్ ని హడావిడి లేకుండా ముగించేసింది ఓం రౌత్ టీం. ఇక ఆదిపురుష్ సెట్ దగ్ధం అయినా.. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రభాస్ అండ్ ఆదిపురుష్ టీం ఊపిరి పీల్చుకుంది.ఆ గొడవ ఇంకా సద్దు మణగక ముందే ప్రభాస్ కి మరో షాక్ తగిలింది. అదేమిటి అంటే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ షూటింగ్ ముగించుకుని వెళుతున్న సలార్ టీం సభ్యులు రీసెంట్ గా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గోదావరి ఖని – పెద్దపల్లి లోని సింగరేణి బొగ్గు గనుల్లో సలార్ షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ షూటింగ్ ముగించుకుని వెళుతున్న టెక్నీకల్ సిబ్బంది వ్యాను హైవే మీద యూటర్న్ తీసుకుంటుండగా.. లారీ గుద్దడంతో సలార్ టెక్నీకల్ సిబ్బందిలో ఐదుగురు గాయాలపాకలవగా.. వారిని దగ్గర్లోనే ఉన్న మమత హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం కలగకపోవడంతో సలార్ టీం ఊపిరి పీల్చుకుంది. మరి ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ షూటింగ్ విషయంలో ఇలా జరగడం నిజంగా ప్రభాస్ కి పెద్ద షాకే. |
https://www.telugupost.com/crime/up-woman-kills-infant-son-with-spade-to-dispel-sickness-1456658 | టెక్నాలజీ యుగం.. కంప్యూటర్ యుగమంటూ.. ఓ పక్క అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే.. మరోవైపు ఇప్పటికీ మూఢ నమ్మకాలతో చేయరాని పనులు చేస్తున్నారు కొందరు. ఆ మూఢనమ్మకాలతో కన్నబిడ్డల ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడట్లేదు. స్వార్థం, మూఢ నమ్మకాలు, చేతబడులతో తమ జీవితాలను తామే చేజేతులా నాశనం చేసుకుంటూ.. బిడ్డల జీవితాలను ఆగం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి యూపీలో వెలుగుచూసింది. 35 ఏళ్ల మహిళ మూఢనమ్మకంతో తన నాలుగు నెలల కొడుకుని చంపుకుంది.ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లా ధనుదీ గ్రామానికి చెందిన మంజూ అనే మహిళ.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె భర్త కాన్పూర్ లో కూలీ పనులు చేస్తుంటాడు. మూఢ నమ్మకంతో తన కొడుకుని హతమార్చింది. నాలుగు నెలల పసిగుడ్డు అని కూడా చూడకుండా పారతో కొట్టి అత్యంత దారుణంగా చంపేసింది. ఆ సమయంలో ఆమెకు కన్న మమకారం కూడా గుర్తు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు మంజూని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/taxiwala-movie-story-96946/ | విజయ్ దేవరకొండ కొత్త సినిమా టాక్సీవాలా 17న విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది టాక్సీవాలా టీం. అయితే టాక్సీవాలా ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.... ఇప్పుడు టాక్సీవాలా మీద కొన్ని సెటైర్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదల కష్టాలు ఎదుర్కొని.. సినిమా మొత్తం లీకైన టాక్సీవాలా మీద ప్రేక్షకుల్లో హైప్ పెంచేందుకు విజయ్ దేవరకొండ నానా తిప్పలు పడుతుంటే.. ఇపుడు వినబడుతున్న రూమర్ చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు తగ్గిపోయేలా ఉన్నాయి. నిన్న విడుదలైన టీజర్ లో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న విజయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు ఒక పాత వింటేజ్ కారు కొనుక్కుంటాడు. ఆ కారుతో ఎంతోకొంత సంపాదించి సమస్యల నుండి బయటపడొచ్చనేది అతని ఉద్దేశ్యం.అచ్చం డోరా కథలానే..?అయితే ఆ కారులో దెయ్యం ఉంటుంది. ఆ కారులోని దెయ్యం అందరినీ భయపెడుతోంది. మరి ఈ టాక్సీవాలా కథతో ఇప్పుడు నయనతార గతంలో తమిళంలో నటించిన డోరా కథతో ముడిపెడుతున్నారు కొందరు. టాక్సీవాలా కథ, నయనతార డోరా కథ ఒకేలా ఉన్నాయని... డోరాలో కూడా నయనతార ఒక కారు కొనుక్కుంటే... ఆ కారులో మరణించిన చిన్న పాప ఆత్మ... తనని చంపిన వారి మీద పగ తీర్చుకోవడానికి చూడడం, దానికి నయనతార హెల్ప్ చెయ్యడం జరుగుతుంది. మరి నిన్న టాక్సీవాలా ట్రైలర్ లో కూడా విజయ్ కొన్న కారులో దెయ్యం కాన్సప్ట్ చూస్తుంటే అది... డోరా కథతో మ్యాచ్ అవుతుందని అంటున్నారు.కాపీ కొట్టాడా..? చూడకుండానే తీశాడా..?మరి విజయ్ డోరా సినిమాని కాపీ కొట్టి కొత్తగా చేశాడా..? అనే అనుమానాలు ఇప్పుడు ఫిలింనగర్ లో మొదలయ్యాయి. కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డోరాని కాపీ కొట్టాడా..? లేదంటే అతను ఆ సినిమా చూడకుండా ఈ కథను ప్రిపేర్ చేశాడా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ రేజ్ అయ్యాయి. |
https://www.telugupost.com/crime/man-ends-his-life-by-jumping-from-balanagar-flyover-1479546 | ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని బాలానగర్ లో వెలుగుచూసింది. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కోమటిబస్తీకి చెందిన కొర్రా అశోక్ (35)గా గుర్తించారు. బాలానగర్ సీఐ కె.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ వృత్తిరీత్యా వెల్డింగ్ పని చేస్తుంటాడు. కొన్నేళ్లుగా సరిగ్గా పనిచేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. భార్య, సంజీవరెడ్డినగర్ లో ఉండే బంధువుల నుంచి డబ్బులు తీసుకుని ప్రతిరోజూ మద్యం సేవించేవాడు.డబ్బులు ఇవ్వకపోతే ఫ్లై ఓవర్ పై నుంచి దూకుతానని, లేదంటే ఉరేసుకుంటానని పలుమార్లు కుటుంబ సభ్యుల్ని బెదిరించాడు. ఆరు నెలల క్రితం ఇలాగే చనిపోతున్నానంటూ తమ్ముడు అభిలాష్ కు ఫోన్ చేయగా.. అతని వచ్చి రక్షించాడు. సోమవారం మరోసారి తప్పతాగి ఎవరికీ చెప్పకుండా బాలానగర్ ఫ్లై ఓవర్ ఎక్కి దూకేశాడు. ఈ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఇది గమనించిన స్థానికులు అశోక్ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీకి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. |
https://www.telugupost.com/movie-news/this-combination-is-super-159891/ | కొరటాల శివ కి స్టార్ హీరో రామ్ చరణ్ తో చేస్తే మెగా హీరోతో సినిమా బోణి అవుతుంది అనుకుని రామ్ చరణ్ తో సినిమాకి లైన్ క్లియర్ చేసుకుని ముహూర్తం కూడా పెట్టాడు. కానీ ఏమైందో రామ్ చరణ్ కొరటాల శివ సినిమా నుండి తప్పుకుని.. కొరటాల ని తండ్రి చిరు ఆచార్యకి తగిలించాడు. రామ్ చరణ్ కాకపోయినా చిరు తగలడంతో కొరటాల హాప్పీనే. కాకపోతే యంగ్ హీరో స్టార్ హీరో రామ్ చరణ్ అయితే ఇంకా సూపర్. అయితే కొరటాల కి ఇప్పుడు మరో స్టార్ మెగా హీరో దొరకబోతున్నాడట. ప్రస్తుతం అలా వైకుంఠపురములో హిట్ తో పాన్ ఇండియా లెవల్లో పుష్ప ని సుకుమర్ తో కలిసి చేస్తున్న అల్లు అర్జున్ తర్వాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేసినా.. చెయ్యకపోయినా.. కొరటాలతో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. కొరటాల శివ తో బన్నీ కొత్త కలయిక అయినప్పటికీ.. మెగా కంపౌండ్ లోనే ఏడాది కాలంగా ఉంటున్న కొరటాల శివ బన్నీ కి అదిరిపోయే ఓ లైన్ చెప్పాడట. దానితో బన్నీ చేద్దాం సర్ అంటూ కొరటాలకి మాటిచ్చినట్లుగా అది కూడా పాన్ ఇండియా లెవల్ స్క్రిప్ట్ తోనే సినిమాకి దిగుదామని అల్లు అర్జున్ కొరటాలతో గట్టిగ చెప్పినట్టుగా న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. కొరటాల శివ పంధాలోనే బలమైన సామజిక సందేశమున్న కథాంశంతోనే ఈ సినిమా ఉండబోతుంది అని.. దానికి బన్నీ అల్లరిని, కామెడీని జోడించి పాన్ ఇండియా మెచ్చే స్క్రిప్ట్ తోనే కొరటాల – అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది ఆనే టాక్ నడుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/allu-arjun-new-record-80308/ | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , డైనమిక్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా మరో మైల్స్టోన్ ఈ చిత్ర విజయం లో భాగమయింది. యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ తో విడుదలైన సరైనోడు చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో ఇండియాలో ఏ చిత్రం కూడా సాధించలేని రికార్డుని చేరుకుంది. 200 మిలియన్ వ్యూస్ ని క్రాసయ్యింది. అంతేకాదు తెలుగు సినిమా సత్తా మరోసారి ఈ చిత్రం తో నిరూపించడం విశేషం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్ కి బోయపాటి శ్రీను టేకింగ్ తోడై తెలుగు చలనచిత్ర రికార్డులే కాకుండా ఇండియాలో ఇలాంటి అరుదైన రికార్డు సాధించటం తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం.ఇందుకే కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అనేదిఅంతే కాకుండా 6 లక్షల 66 వేల లైక్స్ తో హైయ్యస్ట్ వ్యూవ్స్ సాధించిన చిత్రం గా బన్ని మరోక్కసారి తన సత్తా చాటుకున్నాడు. గతం లో బన్ని నటించిన దువ్వాడ జగన్నాధం చిత్రం 176 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు నెలకోల్పాడు. తన రికార్డు తనే సరైనోడు చిత్రంతొ బ్రేక్ చేసుకున్నాడు. ఇవేకాకుండా గతంలో రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు కూడా రికార్డు స్థాయి వ్యూస్ సాధించాయి. అందుకే బన్నిని ఫ్యాన్స్ అందరూ కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని ముద్దుగా పిలుచుకుంటారు.. |
https://www.telugupost.com/movie-news/mega-studio-in-rangasthalam-set-77860/ | దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన రంగస్థలం సినిమా కోసం చాలా రోజులు గోదావరి జిల్లాల్లోని గోదావరి పరిసరప్రాంతాల్లో షూటింగ్ చేసాడు. కానీ అక్కడ చరణ్ ఫాన్స్ వలన షూటింగ్ కి ఇబ్బంది కలగడంతో... హైదరాబాద్ నడిబొడ్డున అంటే జూబ్లీహిల్స్ వంటి కాస్ట్లీ ప్రాంతంలో రంగస్థలం కోసం 12 కోట్లతో పల్లెటూరి సెట్ వేశారు. మరా సెట్ లోనే సినిమా సగభాగం ని తెరకెక్కించారు. అయితే ఆ రంగస్థలం సెట్స్ ని సినిమా పూర్తయ్యాక కూడా తియ్యకుండా సందర్శనార్ధం అలానే ఉంచేశారు. ఇక అదే రంగస్థలం సెట్స్ లో చిరంజీవి తన సై రా నరసింహారెడ్డి షూటింగ్ కొంత కానిచ్చేశాడు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ రంగస్థలం సెట్స్ వేసిన స్థలం లో ఒక స్టూడియో ని నిర్మించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లోని ఈ స్థలాన్ని రామ్ చరణ్ కొన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్లేస్ లోనే ఓ మెగా స్టూడియో ని కట్టాలన్న ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడట. నిజానికి చిరంజీవి కూడా ఎప్పటినుండో ఓ స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు. గతంలో చిరంజీవి వైజాగ్ లో సినిమా స్టూడియో కట్టే యోచనతో స్థలం చూసినట్టు టాక్ వినిపించింది. కానీ చిరు తర్వాత రాజకీయాల్లో బిజీ అవడంతో..ఆ ఆలోచన సైడ్ అవ్వడం జరిగింది.అయితే ప్రస్తుతం హీరోగా, నిర్మాతగానే కాకుండా పలు వ్యాపారాల్లో కొనసాగుతున్న రామ్ చరణ్ ఇప్పుడు స్టూడియో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే సై రా నిర్మతగా చేస్తూనే... బోయపాటి తన 12 వ సినిమాలో రామ్ చరణ్ బిజీగా వున్నాడు. |
https://www.telugupost.com/movie-news/harish-shankar-varun-tej-pooja-hegde-jigarthanda-remake-valmiki-132202/ | హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వాల్మీకి ఈ నెల 20 న విడుదల కాబోతుంది. తమిళ జిగర్తాండ కి రీమేక్ గా వస్తున్న వాల్మీకి సినిమా మీద మంది అంచనాలే ఉన్నాయి. వరుణ్ తేజ్ మాస్ లుక్, పూజ హెగ్డే లంగా ఓణీ లో పల్లెటూరి లుక్స్ అన్ని సినిమా మీద మంచి ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మరో తమిళ హీరో కూడా నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ లో ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటిలో మెగా అభిమానులున్నారు. ఇక వాల్మీకి అసలైతే ఈ నెల 13 నే విడుదల కావాల్సి ఉంది. కానీ నాని గ్యాంగ్ లీడర్ కోసం వాల్మీకి వెనక్కి వెళ్ళింది. ఇక పోస్టర్స్ తో టీజర్ తో సాంగ్స్ తో సినిమా మీద అంచనాలు పెరుగుతుంటే.. లేటెస్ట్ గా బయటికొచ్చిన న్యూస్ తో సినిమా మీద మరింత హైప్ పెరిగేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ తాజాగా సోషల్ మీడియాలో వినబడుతుంది. తమిళ జిగర్తాండ లో ఓ హీరో తో గెస్ట్ రోల్ ప్లే చేయిస్తున్నట్టుగా…. వాల్మీకి లోను ఓ హీరో గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోల్ కోసం నితిన్ సంప్రదించగా నితిన్ ఒప్పుకున్నాడని తెలుస్తుంది. మరి నితిన్ రాకతో ఈ వాల్మీకి పై మరింత హైప్ పెరగడం ఖాయమంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/shooting-begun-adi-purush-181004/ | ప్రభాస్ పాన్ ఇండియా జోరు చూస్తుంటే.. ఈసారి ప్రభాస్ ఫాన్స్ కి ఊపిరి తీసుకోలేనన్ని సెలెబ్రేషన్స్ ఖాయంలాగే అనిపిస్తుంది. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ జాడ లేదు.. ఈలోపే ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనుల్లో సలార్ కి సంబందించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఫిబ్రవరి 10 వరకు జరగనున్న సలార్ షూటింగ్ నుండి ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఆదిపురుష్ కి జంప్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రోజే అధికారికంగా ప్రభాస్ – ఓం రౌత్ కాంబో ఆదిపురుష్ ఆరంభమైంది. భారీ అంచనాలు మధ్యన అనౌన్స్ చేసిన ఆదిపురుష్ ప్రాజెక్ట్ ని ఓం రౌత్ మొదలు పెట్టేసాడు. ఇప్పటికే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని సెట్ చేసుకున్న ఓం రౌత్ తన టీం తో ఆదిపురుష్ ఆరంభానికి రంగం సిద్ధం చెయ్యడమే కాదు.. అధికారికంగా మొదలు పెట్టేసి ప్రభాస్ ఫాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చేసాడు. మరి ప్రభాస్ సలార్ అండ్ ఆదిపురుష్ అండ్ నాగ్ అశ్విన్ సినిమాలకు పక్కాగా డేట్స్ కేటాయించుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా సెట్ చేసుకోవడంతో ప్రభాస్ దర్శకులు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగేస్తున్నారు. ఆదిపురుష్ సీత వేటలోనే ఉన్న ఓం రౌత్ ఆదిపురుష్ కోసం డ్రీం గర్ల్ హేమమాలిని ని తీసుకోబోతున్నాడనే న్యూస్ ఉంది. |
https://www.telugupost.com/crime/ap-youth-drowns-in-canada-waterfall-silver-falls-canada-1483500 | ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మచిలీపట్నం చింతగుంటపాలెంకు చెందిన ట్రెజరీ ఉద్యోగి పొలుకొండ శ్రీనివాస్, మీనాకుమారిల కుమారుడు లెనిన్ నాగకుమార్ లేక్హెడ్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అతడు 2021లో కెనడా వెళ్లాడు. నాగకుమార్ గత సోమవారం స్నేహితులతో కలిసి కెనడాలోని సిల్వర్ఫాల్స్కు వెళ్లాడు. అక్కడ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు.మచిలీపట్నానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థి కెనడాలోని అంటారియో సమీపంలోని సిల్వర్ ఫాల్స్ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతుడు పోలుకొండ నాగ లెనిన్ కుమార్ గా గుర్తించారు అక్కడి అధికారులు. లెనిన్ లేక్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్లో MSc చదువుతున్నాడు, 2021లో కెనడా వెళ్ళాడు. అతను ఇటీవలే తన చివరి సెమిస్టర్ పరీక్షలను రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. చదువు పూర్తి కావడంతో ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. సోమవారం లెనిన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి సిల్వర్ ఫాల్స్ వద్దకు వెళ్లాడు. అక్కడే నీటిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన తర్వాత లెనిన్తో పాటు ఉన్న అతని స్నేహితుల్లో ఒకరి నుండి తమకు ఫోన్ వచ్చిందని అతని మామ వేణుగోపాలరావు చెప్పారు.సిల్వర్ ఫాల్స్కి విహారయాత్రకు వెళ్లారు. ఇద్దరు ఒడ్డున కూర్చొని ఉండగా, లెనిన్ మరో స్నేహితుడితో కలిసి జలపాతం దిగువన ఈత కొట్టడానికి వెళ్ళారు. లెనిన్కు ఈత తెలుసని చెప్పారు వేణుగోపాల రావు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఈత కొడుతుండగా అతను మునిగిపోయాడని అతని స్నేహితులు తెలిపారని అన్నారు రావు. లెనిన్ కష్టపడటం చూసి, అతని స్నేహితులు ఎమెర్జెన్సీ నెంబర్ ను సంప్రదించారు. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ వారు అతని మృతదేహాన్ని బయటకు తీశారు. మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మతో మాట్లాడి లెనిన్ భౌతికకాయాన్ని మచిలీపట్నానికి తీసుకురావడంలో సహాయం చేయాలని కోరారు. |
https://www.telugupost.com/movie-news/sradha-kapoor-renumaration-in-saho-movie-129587/ | మన టాలీవుడ్ హీరోయిన్స్ కి రెమ్యూనరేషన్ మహా అయితే కోటిన్నర, రెండు కోట్లు లోపే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఉండదు. మన టాలీవుడ్ లో ఒక్క అనుష్కనే అంత తీసుకుంటుంది. లేటెస్ట్ గా విజయశాంతి తన రీఎంట్రీ సినిమా కోసం రెండు నుంచి మూడుకోట్ల వరకు రెమ్యూనిరేషన్ ఇవ్వనున్నారని టాక్ వస్తుంది. ఈమె రీఎంట్రీ సినిమా సరిలేరు నీకెవ్వరు. సాహోలో మాత్రం…. సమంత కూడా కోటి, కోటిన్నర వరకు తీసుకుంటది. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ అయినా అంతకు మించి ఉండదు. రకుల్ ప్రీత్ సింగ్ మన్మధుడు 2 సినిమాకు కోటిన్నరకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుందని టాక్. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాప్ సాహో విషయానికి వస్తే ఆ సినిమాలో హీరోయిన్ శ్రద్ధ కపూర్. అమ్మో అంతా…? ఈసినిమా కోసం ఆమె అక్షరాలా అయిదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంది. ఆమె బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి అక్కడ రేట్లు తగ్గట్టుగానే తీసుకుంది. పైగా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆమె అడిగినంత ఇచ్చేసారు మేకర్స్. అయితే శ్రద్ధ కపూర్ ను తీసుకోవడం వల్ల నిర్మాతకు వచ్చేలాభం ఏంటంటే ఈమూవీ బాలీవుడ్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. అక్కడ కలెక్షన్స్ కి ఏ ఢోకా ఉండదు. అందుకే ఆమెని తీసుకోవడానికి కారణం. |
https://www.telugupost.com/movie-news/heroine-koratala-chiranjeevi-film-96562/ | చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం పూర్తి కాగానే.. కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ... చిరు కోసం కథను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ కొరటాల శివ - చిరు కాంబో ఫిక్స్ అనేది నిజం. ప్రస్తుతం చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీగా ఉంటే... కొరటాల మాత్రం చిరు సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. సైరా షూటింగ్ కొలిక్కి రావడమే తరువాయి. కొరటాల మూవీ కోసం చిరు రెడీ అవుతాడు. అయితే చిరు - కొరటాల సినిమా కోసం కథలో ఇంకా పర్ఫెక్షన్ రాని కారణంగా డిసెంబర్ లో మొదలవుతుంది అనుకున్నా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి తర్వాత మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా ఈమధ్యన వార్తలొచ్చాయి.కాలా హీరోయిన్ ను తీసుకొస్తారా..?ఇక ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే టాక్ ఉంది. అలాగే చిరు పక్కన తమన్నా భాటియా నటిస్తుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇక తమన్నా అయితే చిరుకి సెట్ కాదని మెగా అభిమానులు కూడా లబోదిబోమన్నారు. తాజాగా చిరు సరసన కొరటాల మూవీలో నటించబోయే హీరోయిన్ బాలీవుడ్ నుండి రాబోతుంది. రజనీకాంత్ సరసన కాలా సినిమాలో నటించిన హ్యూమా ఖురేషి చిరు సరసన నటించబోతుందనే టాక్ మొదలైంది. చిరు మూవీ కోసం హ్యూమా ఖురేషీని ఎంపిక చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.వెంకీ మామతో కూడా...మరి కాలా సినిమాలో రజనీకి స్పేహితురాలిగా పనిచేసి ఆకట్టుకున్న హ్యూమా... వెంకటేశ్ - నాగ చైతన్య కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ వెంకీ మామాలో వేంకటేశ్ సరసన నటిస్తుందనే న్యూస్ ఉంది. మరి తాజాగా చిరు పక్కన కూడా ప్లేస్ కొట్టేసిన హ్యూమా ఇప్పుడు తెలుగులో సీనియర్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. |
https://www.telugupost.com/crime/top-maoist-leader-from-telangana-katakam-sudarshan-dies-due-to-heart-attack-1479278 | సీపీఐ మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆదివారం ఉదయం మీడియా ద్వారా ప్రకటించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ మే 31న గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన సంస్మరణార్థం నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప సభలను నిర్వహించనున్నట్లు తెలిపింది. కటకం సుదర్శన్ బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి.వరంగల్ లో పాలిటెక్నిక్ చదివిన ఆయన.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దోపిడీకి గురవుతున్న ఆదివాసీల హక్కుల కోసం పోరాడేందుకు నక్సల్లో జాయిన్ అయ్యాడు. 1978లో సుదర్శన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2011 నవంబర్ లో కిషన్ జీ ని హతమార్చిన తర్వాత 14 మంది సభ్యులతో పొలిటికల్ బ్యూరోకు నాయకుడిగా వ్యవహరించారు. ఏపీ, తెలంగాణ నక్సల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీలోనే సాధన అనే మహిళను వివాహం చేసుకోగా.. గత కొంతకాలం క్రితం నిర్వహించిన ఎన్కౌంటర్లో ఆమె మరణించారు. 2011 చత్తీస్ఘడ్లోని దంతేవాడ మారణకాండలో ప్రధాన సూత్రదారిగా ఉన్న సుదర్శన్పై 21 కేసులు నమోదయ్యాయి. |
https://www.telugupost.com/movie-news/koratala-shiva-kaira-advani-80042/ | కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా 2018లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో మంచి వసూళ్లు సాధించిన చిత్రం. డీవీవీ దానయ్య నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సుమారు 200 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. అయితే, ఇంత భారీ విజయం సాధించినా, వసూళ్లు కూడా బాగా జరిగినా చిత్ర దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీకి ఇంకా పారితోషకం పూర్తిగా ఇవ్వలేదట నిర్మాత.పారితోషకం ఇవ్వకుండానే .....తన పారితోషకం చెల్లించాలని కొరటాల శివ ఎన్నిసార్లు అడిగినా సదరు నిర్మాత నుంచి స్పందన లేదంట. అయితే, దానయ్యతో మరో సినిమా చేయాల్సి ఉన్నందున కొరటాల గట్టిగా అడగలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక కైరా అద్వానీకి కూడా భరత్ అనే నేను సినిమా పారితోషకం పూర్తిగా అందకముందే బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ తో డీవీవీ నిర్మిస్తున్న చిత్రానికి సైన్ చేసింది. దీంతో తన పారితోషకం వస్తుందనే ఆశతో ఉందట. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా కూడా నిర్మిస్తున్నారు దానయ్య. అయితే, పారితోషకం విషయంలో దానయ్య ఇలానే వ్యవహరిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. |
https://www.telugupost.com/movie-news/balagam-movie-show-on-screen-in-telangana-villages-1470059 | కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్య హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి, కొడుకు హర్షిత్ లు కలిసి రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.20 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే బలగం సినిమాకు రెండు అంతర్జాతీయ అవార్డులు కూడా రావడంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది.ఒకానొకప్పుడు గ్రామాల్లో పెద్ద తెరలు ఏర్పాటు చేసి.. వాటిపై సినిమాలను ప్రదర్శించేవారు. ఇప్పుడు తెలంగాణలోని పల్లె పల్లెలో బలగం సినిమాను ఇలాగే చూస్తూ.. కంటతడి పెట్టుకుంటున్నారు ప్రజలు. అందరూ కలిసి అలా సినిమా చూడటం ఒక మధురమైన జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఉండటం, పైగా బలగం సినిమాను ఊరంతా కలిసి చూడటం అనేది ఆ సినిమాను అసలైన విజయం అనే చెప్పాలి.బంధాలను, అనుబంధాలను మరచిపోయి, పగలు.. ప్రతీకారాలంటూ అయినవారికి దూరమవుతున్న నేటి సమాజానికి బంధాల విలువ గురించి అద్భుతంగా చూపించింది బలగం. సినిమా చూస్తున్నంతసేపు అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. సినిమా కనిపించే క్యారెక్టర్లలో తమను తాము ఊహించుకుని కుమిలిపోతున్నారు. తెలంగాణలోని పల్లెల్లో బలగం సినిమా ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.బలగం సినిమా దండోరా #Balagam @VenuYeldandi9 @priyadarshi_i #kistapuram #munugodu #nalgonada pic.twitter.com/8GEHpWwpWC— Shiva Pulkaram (@shiva4bharat) April 2, 2023 |
https://www.telugupost.com/movie-news/తెలుగులో-నటించనన్నాడుగా-22301/ | మొన్నామధ్యన తెలుగులో నటించాలంటే తెలుగు వచ్చి ఉండాలని... ఒకవేళ తెలుగు రాకపోతే మొహంలో హావభావాలను పలికించడం కష్టం కాబట్టి తెలుగులో ఇక నటించకపోవచ్చని స్టేట్మెంట్ ఇచ్చాడు అరవింద్ స్వామి. గతంలో రోజా, బొంబాయి చిత్రాలతో 90 వ దశకంలో ఒక ఊపు ఊపిన ఈ హీరో కొంతకాలం సినిమాలకి దూరమయ్యాడు. అయితే చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ తమిళంలో 'తని ఒరువన్' చిత్రంతో విలన్ గా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమా ఏ రేంజ్ హిట్టో అందరికి తెలిసిందే. అదే చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ 'ధ్రువ'గా రీమేక్ చేసాడు. అయితే తెలుగులో కూడా అరవింద్ స్వామి, రామ్ చరణ్ కి విలన్ గా నటించి కేక పుట్టించాడు. మళ్ళీ 'ధ్రువ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరయ్యాడు అరవింద్ స్వామి 'ధ్రువ' చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యాక అరవింద్ స్వామి తెలుగులో మరిన్ని సినిమాలు ఒప్పుకుంటాడేమో అని అనుకున్నారు. కానీ అరవింద్ మాత్రం తెలుగు భాష రాదు కాబట్టి తెలుగులో నటించడం అనేది కొంత సమస్యే అని చెప్పాడు.అయితే ఇప్పుడు అరవింద్ స్వామి తమిళంలో నటించిన మరో మూవీ తెలుగులో రీమేక్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఆ మూవీలో అరవింద్ మళ్ళీ తెలుగు రీమేక్ లో కూడా నటిస్తాడని అంటున్నారు. అరవింద్ స్వామి - జయం రవి తాజాగా నటించిన 'బోగన్' చిత్రం తమిళంలో గత వారం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'బోగన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. జయం రవి, హన్సిక హీరో హీరోయిన్స్ గా నటించిన 'బోగన్' లో అరవింద్ స్వామి ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించాడని... ఇక తెలుగు రీమేక్ లో కూడా ఆరోల్ ని అరవిందే చేస్తాడని అంటున్నారు. అయితే తెలుగు రీమేక్ నిజంగా ఉంటే తాను అందులో నటించడానికి నో చెప్పక పోవచ్చని అంటున్నాడు అరవింద్ స్వామి. అంటే అరవింద్ తెలుగులో మరొకసారి నటిస్తానని చెప్పకనే చెప్పినట్లు లేదూ...! |
https://www.telugupost.com/movie-news/రాజశేఖర్-అందుకే-కన్నీళ్ల-47528/ | సీనియర్ హీరో రాజశేఖర్ - శ్రద్ద దాస్, పూజ కుమార్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ‘పి.ఎస్.వి.గరుడవేగ 126.18 ఏఎం’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గత రాత్రి అంటే శుక్రవారం రాత్రి ‘పి.ఎస్.వి.గరుడవేగ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కి నర్తించిన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఈ ఫంక్షన్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.అయితే ఈ వేడుకలో హీరో రాజశేఖర్ వేదిక మీద కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన అంతలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఈ సినిమా విడుదలకు ముందే ఆయన తల్లి కాలం చెయ్యడంతో.. ఈ ఈవెంట్ లో ఆయన అంతగా ఎమోషన్ అయ్యారు. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ కి సక్సెస్ అనేదే లేకుండా పోయింది. ‘పి.ఎస్.వి.గరుడవేగ' తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాలని రాజశేఖర్ ఆశపడుతున్నారు. అయితే తనకు సక్సెస్ రావాలని తన తల్లి ఎంతగానో ఇదయ్యారని.. కానీ ‘పి.ఎస్.వి.గరుడవేగ' సినిమా విడుదల కాకుండానే ఆమె చనిపోవడంతో తన నెత్తిన పిడుగుపడిన ఫీలింగ్ వచ్చిందని చెప్పారు.అలాగే తన బావమరిది మురళి కూడా తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నారని.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. కానీ సినిమా నిర్మాతలకు ఎటువంటి లాస్ రాకూడని భావించి ఈ ఫంక్షన్ కి అటెంట్ అయ్యానని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనదని.. ఈ సినిమా టీజర్ విడుదల చేసిన ఐదు రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని.. తెలిసినప్పుడు మా అమ్మ గారు నా దగ్గరే ఉన్నారని... తన కొడుక్కి చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయం దక్కుతుందని... చాలా సంతోషంగా కనిపించారు అని చెప్పడమే కాకుండా..... నేను సినిమాల్లో చాలా నష్టపోయానని మా అమ్మానాన్నలకు బాధ. నాకు సెట్ కానీ సినిమాల్లో నటించి చాలా ఆస్తులు కోల్పాయని చెప్పారు. |
https://www.telugupost.com/movie-news/chalaki-chanti-acident-125195/ | జబర్దస్త్’ లాంటి కామెడీ షో తో చాలామంది తెలుగు ఇండస్ట్రీ వస్తున్నారు. అలానే చలాకీ చంటి కూడా. కాకపోతే చంటి సినీ ఇండస్ట్రీకి వచ్చినా తరువాతే ‘జబర్దస్త్’ లోకి వచ్చాడు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ ‘జబర్దస్త్’ షో చేస్తున్న చంటి ఈ తెల్లవారుఝామున రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చలాకీ చంటి విజయవాడ నుండి హైదరాబాద్ కి తన కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. కోదాడ మండలం కొమరబండ దగ్గర ఆయన ప్రయాణిస్తోన్న కారు ఆగివున్న లారీని వెనుకనుండి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచారం. వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి వైద్యం చేస్తున్నారు అని టాక్. టాలీవుడ్ కి ఏదో జరుగుతుంది. వరసగా గాయాలు అవుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్,వరుణ్ తేజ్, శర్వానంద్,నాగ శౌర్య, సందీప్ కిషన్, నితిన్ ఇలా వరస అందరికి గాయాలు అవ్వడం అందరిని ఆశర్యనికి గురి చేస్తుంది |
https://www.telugupost.com/international/pakistani-hindu-businessman-shot-dead-in-sindh-over-land-dispute-1352653 | భారత్ శత్రుదేశమైన పాకిస్థాన్ లో మరో దారుణం జరిగింది. దేశం విడిచి వెళ్లాలని ఓ హిందూ వ్యాపారిని హెచ్చరించగా.. అతను ససేమిరా వెళ్లనని చెప్పడంతో దారుణంగా కాల్చి చంపారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. సింధు ప్రావిన్స్ లోని ఘోట్కీ జిల్లాకు చెందిన సతన్ లాల్ ను దహర్ సామాజిక వర్గానికి చెందిన కొందరు కొన్నేళ్లుగా బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఆయనకు ఉన్న భూమిని తమకు అప్పగించి, దేశం విడిచి వెళ్లిపోవాలని బెదిరించారని తెలిపారు.Also Read : నేటి నుంచి తెలంగాణలో డిజిటల్ క్లాసులుకళ్లు పొడిచారని, కాళ్లు, చేతులపై కత్తితో గాయాలు చేశారని ఆ వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ దేశానికి చెందినవాడినని, చావనైనా చస్తాను కానీ వారికి మాత్రం లొంగేది లేదని స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టుతో పాటు స్థానిక అధికారులను కూడా వేడుకున్నారు. కానీ.. అంతలోనే ఊహించని దారుణం జరిగింది. సతన్లాల్కు చెందిన భూమిలో ఏర్పాటు చేసిన కాటన్ ఫ్యాక్టరీ, ఫ్లోర్ మిల్ ప్రారంభోత్సవం జరుగుతుండగా వచ్చిన దుండగులు ఆయనను కాల్చి చంపారు. సతన్లాల్ స్నేహితుడు ముఖి అనిల్ కుమార్ను ఉటంకిస్తూ 'ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' ఈ విషయాన్ని వెల్లడించింది. లాల్ హత్యకు నిరసనగా మంగళవారం ఘోట్కీ జిల్లాలో నిరసనలు చేపట్టారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బచల్ దహార్, అతడి మద్దతుదారులను అరెస్ట్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/100-థియేటర్స్లో-గౌతమిపు-10137/ | నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం కావడం, తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధారంగా రూపొందుతోన్న చిత్రం కూడా కావడంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు దర్శకుడు క్రిష్, నిర్మాతలు వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు సినిమా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు.సినిమా ఫస్ట్లుక్కి ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఇటీవలవిడుదల చేసిన టీజర్కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ను 2.6 మిలియన్స్ ఆడియెన్స్ వీక్షించారు. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయడానికి భారీ ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసందర్భంగా... చిత్ర నిర్మాతలు వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ''నందమూరి బాలకృష్ణగారు నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్కు అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు జనవరి 12, సంక్రాంతికి విడుదలవుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణగారు నటించిన 100వ చిత్రం కావడంతో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను యు.ఎస్., యు.కె. సహా ప్రపంచ వ్యాప్తంగా వంద లోకేషన్స్లో ఒకేసారి విడులయ్యేలా ప్లాన్ చేశాం. డిసెంబర్ మొదటివారంలో ఈ వేడుకను గ్రాండ్ లెవల్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, కబీర్ బేడి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంతన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్. |
https://www.telugupost.com/movie-news/జూలై-నెలాఖరున-కథలో-రాజకు-35989/ | వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి". శిరువూరి రాజేష్వర్మ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సౌందర్య నర్రా, ప్రశాంతి , సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగశౌర్య మరో కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నమిత ప్రమోద్, నందితలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్ లు సంగీత సారధ్యం వహించిన పాటలు ఇటీవల ఆన్ లైన్ ద్వారా విడుదల చేయగా శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. అదే విధంగా.. టీజర్-ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకొంది. తొలుత ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ.. సినిమా అందరికీ చేరువవ్వాలన్న ఆలోచనతో.. "కథలో రాజకుమారి" చిత్రాన్ని జూలై నెలాఖరుకు విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన మా చిత్రాన్ని జూన్ లో విడుదల చేద్దామనుకొన్నాం. కానీ.. జూలై నెలాఖరుకు విడుదలను వాయిదా వేయడం జరిగింది. సినిమా ఎక్కువమంది జనాలకు చేరాలన్న ఆలోచనతోనే సినిమాను జూలై నెలాఖరుకు వాయిదా వేయడం జరిగింది" అన్నారు. |
https://www.telugupost.com/movie-news/ntr-role-in-rrr-movie-123915/ | రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో #RRR మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి గాయాలవడంతో… షూటింగ్ కి కాస్త బ్రేకిచ్చిన రాజమౌళి ఇప్పుడు మళ్ళీ #RRR షూటింగ్ ని పట్టాలెక్కిన్చాబోతున్నాడు. ప్రస్తుతం ఎటువంటి హంగామా లేకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి… ఆ షూటింగ్ లో కొమరం భీం పాత్రధారి పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సన్నివేశాల్లో కొమరం భీంకు బ్రిటిష్ సైనికులకు మధ్య ఫైట్ సీన్ ను ఉందట. అయితే ఆ సీన్స్ అన్ని రాత్రివేళలల్లో చిత్రీకరణ జరపాలట. ప్రస్తుతం ఆ నైట్ సీన్ కి సంబంధించే షూట్ జరిగినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ సైన్యంతో తలపడే సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ సరసన ఇంకా హీరోయిన్ ని రాజమౌళి ఫైనల్ చెయ్యలేదు. నిత్యా మీనన్ ఒక హీరోయిన్ గా ఎన్టీఆర్ కి సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి కానీ.. ఎక్కడా కంఫార్మేషన్ లేదు. ఇక మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు కేరెక్టర్ లో అలియా భట్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు.ఇంకా ఈ సినిమా లో అజయ్ దేవగణ్, సముద్రఖని కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు |
https://www.telugupost.com/crime/sons-brutally-murder-their-father-for-property-in-suryapet-district-1369290 | సూర్యాపేట : మానవత్వం మంటగలిసిపోతుంది. రోజురోజుకూ మానవ బంధాలు, అనుబంధాలు విలువ లేకుండా పోతోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు.. వారిపాలిట యమపాశాలుగా మారుతున్నారు. ఆస్తులు పంచివ్వకపోతే.. తల్లిదండ్రులను సైతం మట్టుబెట్టేందుకు వెనకాడటం లేదు. అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఆత్మకూరు(ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది.తమకు భూమిని పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కన్నతండ్రిని దారుణంగా నరికి చంపారు. ఎరగాని శ్రీను గౌడ్ (50)కి సంతు, రాజశేఖర్ ఇద్దరు కొడుకులు, భార్య, కూతురు ఉన్నారు. శ్రీను కి కొంత వ్యవసాయభూమి ఉంది. ఆ భూమిని ఇద్దరికీ పంచివ్వాలని తరచూ తండ్రితో గొడవలు పడేవారు. ఎన్నిసార్లు అడిగినా భూమిని పంచివ్వకపోవడంతో.. తమలోని రాక్షసత్వాన్ని చూపించారు. కని, పెంచి, పెద్దచేసిన తండ్రిని గురువారం ఉదయం గొడ్డలి, కత్తితో దారుణంగా నరికి చంపారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. గ్రామానికి చేరుకొని,సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. |
https://www.telugupost.com/top-stories/one-party-is-criticizing-one-party-for-moving-people-to-public-meetings-in-whose-media-they-are-promoting-1453404 | నిజమే.. కొన్ని వార్తలు చదువుతుంటే నవ్వు తెప్పిస్తాయి. ప్రత్యక్షంగా చూసిన వారయితే పడీ పడీ మరీ నవ్వుకోవాల్సి వస్తుంది. "జగన్ సభలకు వెళ్లిపోతున్న జనం" చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న ప్రజలు" ఇవి ఒక వర్గం మీడియాలో. మరొక వర్గం మీడియాలో దీనికి భిన్నంగా వార్తలు దర్శనమిస్తాయి. అసలు ఈ కాలంలో స్వచ్ఛందంగా సభలకు వచ్చి నేతల మాటలు వింటారా? అన్నది పెద్ద సందేహం. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్, ఇందిరాగాంధీలను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సభలకు తరలి వచ్చేవారు. ఎప్పుడూ పెద్దగా రాష్ట్రానికి రారు కాబట్టి ఇందిరాగాంధీని చూసేందుకు, సినిమాల్లో చూసిన ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా చూసేందుకు జనం స్వచ్ఛందంగానే తరలి వచ్చేవారు. వారి రాకకోసం ఎదురు చూసేవారు.నాడు అలా కాదు...అంతేకాదు ఆ ఇద్దరు నేతలు మంచి వక్తలు. ఇందిర హిందీలో మాట్లాడినా, ఎన్టీఆర్ తెలుగులో మాట్లాడిన అలవోకగా ప్రసంగాలు సాగేవి. వారి ప్రసంగం వినడానికి కూడా ఎంతో మంది తరలి వచ్చేవారు. ఆరోజు ఇంత మీడియా లేదు. టీవీలు ఉన్నా ఇంతమందికి అందుబాటులో లేదు. ఇన్ని న్యూస్ ఛానెళ్లు లేవు. అందుకే ప్రత్యక్షంగా వారిని చూసి ప్రసంగాలు చూసేందుకు జనం ఎగబడేవారు. ఎవరికి వారే తరలి వచ్చారు. ఎన్టీఆర్ ను చూసేందుకు అయితే చద్ది మూటలు కట్టుకుని, ఎడ్లబండలపైన వచ్చి రోజంతా ఆయన కోసం ఎదురు చూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.పసలేని ప్రసంగాలే...కానీ ఇప్పుడలా కాదు. ఇప్పటి రాజకీయ నేతల ప్రసంగాలు ఎప్పటికప్పుడు లైవ్ లో టీవీలో వస్తున్నాయి. నేరుగా అక్కడకు వెళ్లకపోయినా ఇంట్లో కూర్చోనో.. మొబైల్ లోనో ఎక్కడి నుంచైనా చూసే వీలుంది. దీంతో పాటు ఇప్పటి నేతల ప్రసంగాలు వినేటంత గొప్పవేమీ కావు. చంద్రబాబు కాని.. జగన్ కాని.. పవన్ కాని.. చేసేవి పసలేని ప్రసంగాలే. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మినహా పెద్దగా సబ్జెక్ట్ లేని ప్రసంగాలు ఎక్కువగా వినిపిస్తాయి. పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. దీంతో వారి సభలకు స్వచ్ఛందంగా వచ్చే వారు ఎవరూ ఉండరు. జనసమీకరణ చేయకుంటే...ఏ పార్టీ అయినా అందరూ తరలించనిదే జనం వీళ్ల సభలకు రారన్న సంగతి అందరికీ తెలుసు. కాకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి కొంత కసితో నేతలు జనసమీకరణ చేస్తారు. అధికారంలో ఉన్న వైసీపీకి మాత్రం ప్రభుత్వ అధికారులే డ్వాక్రా మహిళలనో, మరొకరినో తెచ్చి ప్రాంగణాన్ని నింపుతారు. పవన్ కల్యాణ్ విషయానికి వస్తే కొంత మినహాయింపు ఇవ్వొచ్చు. ఆయన సినీ హీరో కావడంతో ఒకసారి చూసి వెళదామని వచ్చే వారు ఎక్కువగా ఉంటారు. అంతే తప్ప జనసేన నేతలు కూడా జనసమీకరణ చేయనిది ఎక్కువ సంఖ్యలో రారన్నది కూడా అంతే నిజం. మొత్తం మీద ఏ పార్టీకి అనుకూలమైన మీడియా ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం తప్ప జనం వీరి సభలకు వచ్చేది అనడం ట్రాష్. అందరూ జనసమీకరణ చేయాల్సిందే. వాహనాలను పెట్టి తోలాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/another-tragedy-happened-in-the-film-industry-noted-writer-balamurugan-passed-away-1457682 | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత బాలమురుగన్ మరణించారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి బాలమురుగన్. ఆయన వయసు 86 సంవత్సరాలు. తన తండ్రి మరణించినట్లు భూపతి రాజా వెల్లడించారు.తెలుగు, తమిళం...బాలమురుగున్ తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలకు కధలను అందించారు. జీవనతరంగాలు, సావాసగాళ్లు, సోగ్గాడు, ఆలుమగలు, ధర్మదాత వంటి చిత్రాలకు కధలు రాసింది బాలమురుగన్. తమిళంలో శివాజీ గణేశన్ సినిమాలకు ఎక్కువగా కథలను అందించారు బాలమురుగన్. ఆయన మృతి పట్ల తమిళ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. |
https://www.telugupost.com/movie-news/ఘాజి-మూవీ-రివ్యూ-రేటింగ్-3-23151/ | నటీనటులు: రానా దగ్గుబాటి, తాప్సీ, నాజర్, ఓంపురిసంగీతం: కెనిర్మాతలు: పివిపిదర్శకత్వం: సంకల్ప్దగ్గుబాటి రానా 'లీడర్' చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక హీరోగా రానా మరికొన్ని చిత్రాలు చేసినప్పటికీ అతనికి అనుకున్నంత పేరు రాలేదు. అయితే 'బాహుబలి'తో భల్లాల దేవగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. తన పేరు అందరికి తెలిసేలా రానా తన నటనతో అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఒక కొత్త కథతో 'ఘాజి' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో తాప్సి ఒక ప్రధానపాత్రలో నటించింది. ఇప్పటివరకు ఇలాంటి డిఫరెంట్ స్టోరీ తో నాగార్జున 'గగనం' వంటి చిత్రంలో కనబడ్డాడు. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా మంచి పేరైతే తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు రానా కూడా అలాంటి ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతూ... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ అందరిలో హైప్ క్రియేట్ చేయాడు. 70 ల్లో భారత్ - పాకిస్తాన్ కు మధ్యజరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ 'ఘాజి' చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకుంటుందో సమీక్షలో తెలుసుకుందా.కథ: ఎప్పుడూ పాకిస్తాన్, భారత్ పై తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతుంటుంది. ఎలాగైనా భారత్ ని మట్టుబెట్టాలని చూస్తుంటుంది. పశ్చిమ పాకిస్తాన్ కి, తూర్పు పాకిస్తాన్ కి మధ్యన యుద్ధం జరుగుతుంటుంది. అయితే పశ్చిమ పాకిస్తాన్లో యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు సహాయం చేసేందుకు కరాచీ నుండి ఘాజి అనే సుబ మెరైన్ ని పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ఘాజి ఇండియా సముద్ర మార్గం నుండి ప్రయాణించవలసి ఉంటుంది. సముద్రం మధ్యలో ఇండియాకి చెందిన ఎస్సెస్ విక్రాంత్ యుద్ధ నౌకొకటి కాపలా ఉంటుంది. ఆ నౌకాని పేల్చేసి ఘాజి తన గమ్యం చేరాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న భారత్ తమ కమాండోలను రంగంలోకి దించుతుంది . వారిలో అర్జున్ వర్మ( రానా) రణ్వీర్ సింగ్ ( కె కె మీనన్) లు వుంటారు. వీరంతా ఘాజి పై యుద్ధం చేస్తారు. మరి ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు? అర్జున్ వర్మ తన టీమ్ తో ఘాజీపై గెలిచాడా? ఇవన్నీ తెలియాలంటే తెర మీద ఘాజీని వీక్షించాల్సిందే..నటీనటులు: రానా అర్జున్ వర్మ పాత్రలో చక్కటి నటన ప్రదర్శించాడు. అసలు రానా ఇలాంటి పాత్ర చేయగలడా అని అనుకున్నవాళ్ళ నోరుమూసుకునేలా చేసాడు. అంతటి హావభావాలను పలికించాడు. పవర్ ఫుల్ రోల్ లో పవర్ ఫుల్ గా నటించి మెప్పించాడు. రానా ఈ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలుస్తాడు. కెకె మీనన్ కూడా డైలాగ్స్, నటనతో చక్కటి నటన కనబర్చాడు. ఓం పూరి, నాజర్ లు నటనతో మెప్పించారు. ఇక తాప్సి కి అందరూ ఎక్సపెక్ట్ చేసిన రోల్ దక్కకలేదు. పేద ప్రాముఖ్యత లేని పాత్రలో తాప్సి కనబడింది. ఇక ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ చిరంజీవి వాయిస్ ఓవర్. సినిమా ని ఎక్కడికో తీసుకెళ్లడానికి చిరు వాయిస్ ఓవర్ ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.సాంకేతిక వర్గం: దర్శకుడు సంకల్ప్ సినిమాని ఎలా ప్రెజెంట్ చెయ్యాలనుకున్నాడో అలాగే తెరకెక్కించాడు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీసి మెప్పించాడు. ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ సినిమా తీయాలనుకుని పెద్ద సాహసమే చేసాడు. ఒక యుద్ధ నేపధ్య కథతో సినిమాని తెరకెక్కించాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక ఈ సినిమాకి మరో బలమైన పాత్ర బ్యాగ్రౌండ్ స్కోర్ ది. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ చాలాబావుంది. మంచి నిర్మాణ విలువలు ఈ చిత్రంలోకనబడ్డాయి.ప్లస్ పాయింట్స్: కథ, దర్శకత్వం, రానా, చిరు వాయిస్ ఓవర్, క్లైమాక్స్, సినిమాటోగ్రఫీమైనస్ పాయింట్స్: కామెడీ, కమర్షియల్ ఎలెవెంట్స్ లేకపోవడంరేటింగ్: 3 .0 /5 |
https://www.telugupost.com/movie-news/సై-రా-లో-విజయ్-పాత్ర-ఏమిటం-53834/ | చిరంజీవి సై రా నరసింహారెడ్డి సినిమా సెట్స్ మీదకెళ్ళిపోయి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా ఓపెనింగ్ జరుపుకున్న దాదాపు మూడు నెలలకు సెట్స్ మీద కెళ్లిన ఈ సినిమాలో అమితాబచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి వారు నటిస్తున్నారు. అలాగే హీరోయిన్స్ లో మెయిన్ లీడ్ లో నయనతార నటిస్తుండగా... ప్రగ్యా జైస్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే సై రా కోసంమరో హీరోయిన్ ఎంపిక బ్యాలెన్స్ ఉంది. ఇక టాప్ టెక్నీకల్ టీమ్ ఈ సై రా నరసింహారెడ్డి కోసం పనిచేస్తున్నారు.అయితే ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా.. రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సై రా నరసింహారెడ్డిగా చిరు నటిస్తుండగా.. మిగతా టాప్ స్టార్స్ ఏ ఏ పాత్రల్లో నటిస్తున్నారణే విషయం క్లారిటీ లేదు. ఇకపోతే తమిళంలో ప్రస్తుతం స్టార్ హీరో హోదాలో కొనసాగుతున్న విజయ్ సేతుపతి సై రా లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలియసిందే. అసలు సై రా లో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్నప్పటికీ ఎలాంటి రోల్ అనేది క్లారిటీ లేదు.కానీ ఇప్పుడు విజయ్ సై రా లో ఎలాంటి పాత్ర చేస్తున్నాడో అనేది బయటికి వచ్చింది. నిజ జీవితంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అత్యంత నమ్మకమైన అనుయాయుల్లో ఓబయ్య ఒకడు. ఎప్పుడూ ఉయ్యాలవాడ వెన్నంటే ఉంటాడు. ఉయ్యాలవాడ పోరాటంలో తనూ పాలుపంచుకున్నాడు.అయితే ఈ పాత్ర సై రా సినిమాలో చాలా కీలకమట. దాదాపుగా సినిమా అంత ఈ పాత్ర ఉంటుందని సమాచారం. కచ్చితంగా ఈ పాత్ర సై రా నరసింహారెడ్డి సినిమాలో మేజర్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఇలాంటి పవర్ఫుల్ రోల్ లో విజయ్ సేతుపతి ని చూడబోతున్నమాట. |
https://www.telugupost.com/movie-news/anushka-15-years-industry-celebrations-150701/ | అనుష్క ఎప్పుడెప్పుడు కనబడుతుంది అనే ఆశతో చాలామంది అభిమానులే ఉన్నారు. సైజు జీరో దెబ్బకి మాయమైన అనుష్క మల్లి నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకూ రాబోతుంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ..ఫేస్ లో ఉన్న క్యూట్ నెస్ తో అనుష్క స్టార్ హీరోలతో చాన్సు కొట్టేసింది. అనుష్క స్ట్రెక్సర్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ అనుష్క మాత్రం టాలీవడ్ హీరోలందరి సినిమాల్లో నటించింది. అయితే సైజు జీరో తో బొద్దుగా మారిన అనుష్క మునపటి ముద్దుగుమ్మ కాలేకపోయింది. చాలా ప్రయత్నాలు చేసి బరువు తగ్గించించిన అనుష్క మునుపటి గ్లో మిస్ అయ్యింది. తాజాగా జరిగిన నిశ్శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుష్క 15 ఇయర్స్ జర్నీ లో చక్కగా ట్రెడిషనల్ గా తయారయింది కానీ.. ఫేస్ లో గ్లో కనబడలేదు. అయితే నిశ్శబ్దం ఈవెంట్ లోనే అనుష్క 15 ఇయర్స్ జర్నీ ఈవెంట్ కూడా జరగడం దానికి అనుష్క నటించిన సినిమాల దర్శకుల్లో చాలామంది హాజరవడం జరిగింది. రాజమౌళి, పూరి, రాఘవేంద్ర రావు, శ్యాం ప్రసాద్ రెడ్డి, పివిపి ఇలా చాలామంది దర్శనిర్మాతలు హాజరై అనుష్క 15 ఇయర్స్ జర్నీ గురించి గొప్పగా మట్లాడారు. అనుష్క ఇండస్ట్రీ లో అడుగుపెట్టి.. 15 ఏళ్ళు అయినా సందర్భంగా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే ఈ ఈవెంట్ లో అనుష్క తో కలిసి నటించిన హీరోలెవరు హాజరవలేదు. అంటే కేవలం దర్శకనిర్మాతలతోనే అనుష్క సరిపెట్టేసింది కానీ.. హీరోలకు మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. లేదంటే ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, చిరు, నాగ్ ఇలా అందరూ ఆనుష్క ఈవెంట్ లో వాలిపోయారు. అనుష్క పిలవలేదు కానీ.. పిలిస్తే ఆ ఈవెంట్ మరింత సందడిగా మారి.. అనుష్క గొప్పదనం మరికాస్త తెలిసేది అంటున్నారు అభిమానులు |
https://www.telugupost.com/movie-news/pawan-comments-on-sathyagrahi-102025/ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో అప్పట్లో “సత్యాగ్రహి” సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యహరించారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాకు మొదట్లోనే బ్రేక్ పడింది. దాదాపు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యి సెట్స్ మీదకు వెళ్తున్న టైంలో ఈ సినిమాను పవన్ కల్యాణే ఆపేసారు. దానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియలేదు. ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న రత్నం కూడా సినిమాలకు దూరంగా జరిగి చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. ఈ నేపధ్యంలో చాలాకాలం తరువాత 'సత్యాగ్రహి' ప్రసక్తి వచ్చింది.నిజజీవితంలో చూపించడానికే...ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా టూర్ లో ఉన్నాడు. జనసేన తరుపు ప్రవాస గర్జన పేరుతో ప్రవాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 'సత్యాగ్రహి' సినిమా టాపిక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ...'సత్యాగ్రహి' అనే సినిమా ఆపేసింది.. దాన్ని నిజ జీవితంలో చేసి చూపించడానికేనన్నారు. అప్పట్లో పొలిటిక్స్ లోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ఆపేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ సినిమాను నిజ జీవితంలో నిజం చేయడానికి ట్రై చేస్తున్నా అని పవన్ అనడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. దీంతో ఇప్పుడు “సత్యాగ్రహి” సినిమా ఆపేసారు అనే బాధ ఫ్యాన్స్ లో లేదు. |
https://www.telugupost.com/movie-news/allu-arjun-new-film-71790/ | డీజే సినిమా హిట్ టాక్ రాకపోయినా తనకున్న క్రేజ్ తో అదిరిపోయే కలక్షన్స్ రాబట్టాడు అల్లు అర్జున్. ఇక వక్కంతం వంశీకి అవకాశమిచ్చి నా పేరు సూర్య తో చేతులు కాల్చుకున్నాడు. నా పేరు సూర్య కనీసం లేడి ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన మహానటి పోటీని కూడా తట్టుకోలేక చేతులెత్తేసింది. ఇక నా పేరు సూర్య సినిమా పోవడంతో కాస్త చికాకుగా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ డైరెక్టర్ కి అవకాశం ఇస్తాడో గాని, అందరూ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నా పేరు సూర్య బిజినెస్ క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. అందుకే ఈసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.కథ ఓకే కానీ దర్శకుడెలా..?అల్లు అర్జున్ కి కొరటాల శివ తో సినిమా చెయ్యాలని ఉంటె కొరటాల మాత్రం బన్నీ కి అవకాశం ఇవ్వకుండా చిరంజీవి వైపు మొగ్గు చూపాడు. దీంతో అల్లు అర్జున్ చివరికి ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కి కమిట్ అవుతున్నాడని న్యూస్ హల్చల్ చేసింది. అయితే విక్రమ్ కుమార్ తో కథ సెట్ కాకపోవడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ - విక్రమ్ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే పరిస్థితి లేదు. అయితే అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య, రన్ సినిమాల దర్శకుడు అనీ కన్నెగంటి బన్నీకి ఒక కథ వినిపించాడట. అయితే అనీ కన్నెగంటి చెప్పిన కథ బాగా నచ్చడంతో బన్నీ ఆ కథతో సినిమా చేస్తా కానీ దర్శకుడిగా అనీ కన్నెగంటి ని కాదని వేరే దర్శకుడి కోసం వేట మొదలెట్టాడట.బిజీబిజీగా దర్శకులు..అనీ కన్నెగంటి చేసిన సినిమాలేవీ మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ అతను చెప్పిన కథని భారీ రేటుకి కొనేసి, ఆ కథతో మరో దర్శకుడితో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. మరి కథ ఒకే గాని దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే సుకుమార్ మహేష్ కి, బోయపాటి రామ్ చరణ్ కి... ఇలా అందరు దర్శకులూ బిజీగా ఉండడంతో బన్నీ కి దర్శకుడు దొరికే ఛాన్స్ ప్రస్తుతానికి లేదు. అలాగే కొత్త దర్శకుడికి అవకాశం ఇద్దాం అంటే వక్కంతం తో చేసిన ప్రయోగం విఫలమవడంతో ప్రస్తుతానికి కొత్త దర్శకుడు అనే పదం అల్లు అర్జున్ నోటి నుండి వినబడదు. మొత్తానికి బన్నీ మొదటిసారిగా బాగా ఇరుకున పడినట్లే అనిపిస్తుంది. |
https://www.telugupost.com/movie-news/nikhil-doesnt-want-to-remake-the-films-from-languages-141454/ | స్ట్రయిట్ కథలతో సినిమాలు చేసినప్పుడు యావరేజ్ హిట్స్ అయినా కొట్టిన నిఖిల్ కి రీమేక్స్ కలిసి రావడం లేదు. కిర్రాక్ పార్టీ అంటూ కన్నడ రీమేక్ చేసిన నిఖిల్ ఆ సినిమా ఘోరమైన ఫలితాన్ని ఇచ్చింది. అయితే కిర్రాక్ పార్టీ పోయాక కూడా నిఖిల్ మల్లి తమిళ హిట్ రీమేక్ నే నమ్ముకుని ముద్ర అంటూ సినిమా చెయ్యడం అది కాస్తా అర్జున్ సురవరం గా ప్రేక్షకులముందు కు రావడానికి నానా కష్టాలు పడింది. సినిమా విడుదలకు బోలెడంత సమయం తీసుకోవడంతో.. నిర్మాతలకు తలకు మించిన భారం అవడంతో నిఖిల్ కూడా ఆసినిమా వలన ఇబ్బందులు పడ్డాడు. పోనీ విడుదలయ్యాక ప్లాప్ టాక్ పడింది. రీసెంట్ గా విదూడలైన అర్జున్ సురవరం సినిమాకి ప్లాప్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం వరకు కలెక్షన్స్ పరంగా ఓకే.. కానీ చివరిగా అర్జున్ సురవరం కలెక్షన్స్ తో నిర్మాతలు సేఫ్ అవుతారో.. లేదో తెలియాల్సి ఉంది. అయితే వరసగా రెండు రీమేక్స్ చేసి దెబ్బతిన్న నిఖిల్ మాత్రం ఈసారి రీమేక్స్ జోలికి పోను అంటున్నాడు. ఎందుకంటే తాను బేసిక్ గా రీమేక్స్ కి వ్యతిరేకమని చెబుతున్నాడు. అందుకే ఇకనుండి తన పాలసీకి వ్యతిరేఖంగా రీమేక్ చెయ్యనని చెప్పేస్తున్నాడు. |
https://www.telugupost.com/movie-news/salar-release-date-2-184020/ | ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ 'సలార్'. సౌత్ ఇండియా సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తూ భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2022, ఏప్రిల్ 14న సలార్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ – “ప్రభాస్తో సినిమా అంటే ఆయన అభిమానులు, ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో, సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ను ఆయన అభిమానులు ఎలా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ అంచనాలను మించేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 2022, ఏప్రిల్14న మీ అందరితో కలిసి సలార్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను“ అన్నారు. |
https://www.telugupost.com/crime/once-again-there-is-a-riot-in-america-13-people-died-in-the-shooting-at-wal-mart-1449464 | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాల్ మార్ట్ లో జరిగిన కాల్పుల్లో 13 మంది మరణఇంచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియాలోని వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులు జరిగాయి. కాల్పులను స్టోర్ మేనేజర్ జరిపినట్లు పోలీసు అధికారులు గుర్తించారు.వాల్మార్ట్ మేనేజర్ ....గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రాత్రి స్టోర్ మేనేజర్ బ్రేక్ రూంలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు అరగంట సేపు ఈ కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. అయితే కాల్పులు జరిపిన మేనేజర్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని అక్కడకు చేరుకున్న పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/crime/news-1550673 | ఒక వ్యక్తి తన భార్య, నవజాత శిశువును ఆసుపత్రిలో డబ్బులు కట్టి బయటకు తీసుకుని రావడానికి ఊహించని పని చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తన మూడేళ్ల కుమారుడిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు వేగంగా స్పందించారు. శిశువును తీసుకెళ్లిన జంటతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.బర్వా పట్టి నివాసి హరీష్ పటేల్ తన భార్య ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ప్రకారం, రోజువారీ కూలీ అయిన పటేల్కు ఇది ఆరవ సంతానం. ఈసారి ఆసుపత్రిలో డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది తల్లి, నవజాత శిశువును బయటకు వెళ్లనివ్వలేదు. హరీష్ పటేల్ తన మూడేళ్ల కొడుకును కొన్ని వేల రూపాయలకు ఓ జంటకు విక్రయించడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నేరంలో భాగమైన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు భోలా యాదవ్, అతని భార్య కళావతి లను అదుపులోకి తీసుకున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ కేసులో చర్య తీసుకోవడంలో పోలీసు కానిస్టేబుల్ నిర్లక్ష్యం వహించడంతో యాక్టివ్ డ్యూటీ నుండి తొలగించి, ఎస్పీ ద్వారా పోలీసు లైన్లకు పంపారు. పిల్లవాడు సురక్షితంగా ఉన్నాడని, అతని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/naa-peru-surya-collections-68866/ | ఈ సమ్మర్ కి వచ్చిన 'రంగస్థలం'.. 'భరత్ అనే నేను' రెండు సినిమాలు కమెర్షియల్ గా మంచి హిట్ అందుకున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ రెండు సినిమాలు వండర్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సమ్మర్ లో పెద్ద సినిమాల్లో రిలీజ్ అయ్యే చివరి సినిమా అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ప్రస్తుత బన్నీ మార్కెట్ 70 కోట్లు ఉంది కానీ ఈసారి బన్నీ టార్గెట్ ఎనభై కోట్లు. 80 కోట్లు షేర్ వస్తే సక్సెస్ కింద లెక్క. మరి బన్నీ ఈ సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించగలడా? కొత్త దర్శకుడుతో తాను అనుకున్న గోల్ రీచ్ అవ్వగలడా? అని సోషల్ మీడియాలో బన్నీ పై కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్స్ చూస్తే మినిమం గ్యారెంటీలానే అనిపిస్తున్నా కానీ ఒక సినిమా విజయానికి చాలా ఫ్యాక్టర్లు ఉంటాయి.మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు 'రంగస్థలం'..'భరత్ అనే నేను' తో పాటు నా సినిమా హ్యాట్రిక్ కొడుతుంది అని చెప్పాడు. వరుసగా రెండు భారీ విజయాలు రావడం వల్ల మార్కెట్లో కాస్త స్తబ్ధత వచ్చే అవకాశముంది. మంచి టాక్ వస్తే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం 80 కోట్లు టార్గెట్ అంత కష్టమైనది ఏమి కాదు. కానీ సినిమాకు డివైడ్ టాక్ వస్తే మాత్రం టార్గెట్ క్లిష్టతరమవుతుంది. ఆల్రెడీ రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్పై ఈసారి ఒత్తిడి కాస్త ఎక్కువగానే వుంటుంది. అసలు భరత్ అనే నేను కలెక్షన్స్, రంగస్థలం కలెక్షన్స్ ముందు అల్లు అర్జున్ నా పేరు సూర్య 80 కోట్ల టార్గెట్ పెద్దదేమీ అనిపించడం లేదు. చూద్దాం మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది సినిమాలో ఎంత దమ్ము ఉందొ అనేది. |
https://www.telugupost.com/movie-news/actress-varalakshmi-sarathkumar-is-going-to-get-married-1523503 | ప్రముఖ నటుడు శరత్కుమార్ కుమార్తె, నటి 'వరలక్ష్మి శరత్కుమార్' పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఎంతో ప్రైవేట్ గా వరలక్ష్మి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆర్ట్ గ్యాలరీ యజమాని 'నికోలాయ్ సచ్దేవ్'ను ఆమె వివాహం చేసుకోనుంది. పద్నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉందని తెలుస్తోంది. సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ మార్చి 1న జరిగింది. ముంబైలోని ఒక హోటల్లో సమీప కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కు హాజరయ్యారు.వరలక్ష్మి 2012లో "పోడా పోడి" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. మొదట హీరోయిన్ గా వరలక్ష్మి అంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం దుమ్ము దులుపుతోంది. వీర సింహా రెడ్డి, హనుమాన్ సినిమాల్లో వరలక్ష్మి మంచి క్యారెక్టర్లు చేసింది. ధనుష్ కొత్త సినిమా "రాయాన్"లో కూడా ఆమె కనిపిస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి వరలక్ష్మి వివాహం జరగబోతోంది. |
https://www.telugupost.com/telangana/assembly-elections-in-telangana-will-be-commensed-before-december-1482206 | ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అంతకన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సాధారణంగా డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈసారి అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలిపింది.ఎన్నికల విషయమై ఇటీవలే ఎలక్షన్ కమిషన్ బృందం తెలంగాణలో మూడురోజులు పర్యటించి, ఉన్నత అధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. రాష్ట్రంలో పర్యటించిన బృందంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, ఆర్ కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ అవినాశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిర్దేశ్ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, కలెక్టర్లు, ఐటీ, పోలీసు ఉన్నత అధికారులతో రెండురోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించింది. సమయం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 7 లోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని ఈసీ పరోక్షంగా సంకేతాలిచ్చింది. అధికారులు కూడా అదే జరగవచ్చని చెబుతున్నారు.ఈసీ కొత్తగా తీసుకు వచ్చిన సాంకేతికత, కొత్త అప్లికేషన్ల వాడకంపై అవగాహనతో పాటు.. ఓటర్ జాబితా, నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలు, పోలీస్ చెకింగ్ పాయింట్ల ఏర్పాటు, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో ఈసీ బృందం చర్చించింది. ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను త్వరగా బదిలీ చేయాలని కూడా ఈసీ బృందం ఆదేశించినట్లు సమాచారం. |
https://www.telugupost.com/movie-news/balakrishna-ntr-biopic-review-105165/ | బాలకృష్ణ డ్రీం ప్రోజెక్ట్ ఎన్టీఆర్ జీవిత కథ వచ్చేసింది. నిన్న ఈసినిమా యొక్క మొదటి పార్టు ‘కథానాయకుడు’ రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా మంచిగా వచ్చాయి. అయితే మొదటి నుండి ఎన్టీఆర్ పాత్ర లో బాలకృష్ణ ఎలా నటిస్తాడో అనేది ఆసక్తి కరంగా మారింది. ఎన్టీఆర్ లా హావభావాల్ని పలికించడంలో బాలకృష్ణ ప్రయత్నం సంపూర్ణ ఫలితం ఇవ్వలేదన్న కామెంట్స్ వినిపించాయి. అలానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా జరిగింది. మొదటినుండి బాలకృష్ణ ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చింది. స్టార్టింగ్ లో డైరెక్టర్ తేజ తప్పుకోడం..రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని కౌంటర్ ప్రోజెక్ట్ ని స్టార్ట్ చేయడం…నాగబాబు బాలకృష్ణ పైన నెగటివ్ కామెంట్స్ చేయడం…విడుదలైన రోజు ధియేటర్ల వద్ద టిక్కెట్లు ఉచితంగా పంచిపెడ్తున్నారంటూ ప్రచారం జరగడం ఇలా చాలానే జరిగాయి. అంతే కాదు ఈసినిమాకి థియేటర్స్ సమస్య కూడా వచ్చింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ..’కథానాయకుడు’ మంచి సక్సెస్ ని అందుకుంది. కమర్షియల్ గా కాకపోవచ్చు కానీ ఒక సామాజికపరమైన చిత్రంగా ఇది గుర్తు ఉండిపోతుంది. సంక్రాంతి సెలవులకు మంచి సినిమా అని అంటున్నారు ప్రేక్షకులు. |
https://www.telugupost.com/movie-news/ఆ-ఫ్యామిలీతో-ఆటాడుకుంటున-35738/ | మెగాఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి వైరం ఇప్పటిది కాదు.. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక పవన్కి మోహన్బాబు అంటే అసలు పడదు. చిరంజీవైనా పట్టువిడుపులు ప్రదర్శిస్తాడు...కానీ పవన్ అలా కాదు.. ఎవ్వరి మీదా కోపం రాదు.. వచ్చిందంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడని అతడిని తెలిసిన వారు చెబుతుంటారు. ఇక మోహన్బాబు పలు వేదికలపై మెగాకాంపౌండ్ హీరోల మీద వ్యంగ్యబాణాలు వదులుతుంటాడు. పోనీ పవనేమైనా తక్కువ తిన్నాడా? అంటే లేదు. 'తమ్ముడు' మోహన్బాబుపై తనదైన వ్యంగ్య శైలిలో తన సినిమాలలో ఇమిటేట్చేయడం చేస్తుంటాడు. 'సన్నాఫ్సత్యమూర్తి'లో 'చా..లా..బా...గో..దు' అంటూ పదే పదే డైలాగ్ చెప్పి మంచు అక్కకు మంచి షాకిచ్చాడు. అయినా బన్నీకి మోహన్బాబు అండ్ బ్యాచ్ మీద కసిపోలేదు. తాజాగా మంచు మోహన్బాబును అనుకరిస్తూ ఆయన తన 'పెదరాయుడు' చిత్రంలో చెప్పిన ఫేమస్ డైలాగ్ను ఓఆటాడుకున్నాడు. 'ది రిలేషన్ షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హజ్బెండ్' అంటూ కేకపుట్టించాడు. అసలు బన్నీ కొన్ని డైలాగ్స్ను తనదైనశైలిలో చెప్పడంలో ఇప్పుడిప్పుడే ఆరితేరుతున్నాడు. 'రేసుగుర్రం'లో చెప్పిన 'ద్యా..వుడా' అనేది ఎంతగా పాపులర్అయిందో తెలుసు. తాజాగా 'డిజె'లో బ్రాహ్మణ వేషధారణ, వారి మాటతీరుతో పాటు ఈ పాపులర్ డైలాగ్లో ఆయన మోహన్బాబును కాపీ కొడుతూ ఆ డైలాగ్కు థియేటర్లు దద్దరిల్లేలా చేశాడు.మరి మంచు ఫ్యామిలీ దీనికి కౌంటర్ని ఏదైనా వేడుకలో ఇవ్వనున్నారా? తమ సినిమాల ద్వారా ఇవ్వనున్నారా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. |
https://www.telugupost.com/andhra-pradesh/10th-class-telugu-question-paper-leak-case-12-arrested-in-nandyala-district-in-ap-1367176 | నంద్యాల : ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్లో నిన్న టెన్త్ తెలుగు పరీక్ష పేపర్ లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. పేపర్ లీకవడానికి సూత్రధారి అయిన రాజేష్ తో పాటు మరో 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల డ్యూటీకి హాజరై మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ప్రధాన వ్యక్తి రాజేశ్ గా గుర్తించామన్నారు.తెలుగు ప్రశ్నాపత్రం లీకైందని తెలిసిన వెంటనే డీఈఓ, పోలీస్ అధికారులు విచారణ చేశారని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన వెంటనే తన మొబైల్ తో పరీక్షపత్రాన్ని ఫొటోలు తీసి, బయట వేచి ఉన్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేశాడని జిల్లా కలెక్టర్ చెప్పారు. అరెస్టైన వారిలో టీచర్లు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్ట, రంగనాయకులు ఉన్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్టుమెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్ కు చెందిన నలుగురిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. మరోవైపు అరెస్ట్ చేసిన వారిని గురువారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు. |
https://www.telugupost.com/movie-news/అర్జున్-రెడ్డి-కోసం-పోటీ-45817/ | తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకుడిగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యి పెద్ద సంచలనం సాధించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా హక్కులను ఇతర బాషల నిర్మాతలు చేజిక్కించేసుకున్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ లో హీరోగా ఎవరు చేస్తారు అనే సస్పెన్స్ కి తెర దించుతూ తమిళ అర్జున్ రెడ్డి సినిమాలో విక్రం తన కొడుకు అయిన ధ్రువ్ ని హీరో గా పరిచయం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేసాడు. అలాగే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ని తమిళంలో ప్రముఖ డైరెక్టర్ అయిన బాల డైరెక్ట్ చేయబోతున్నారు అనేది కూడా అనౌన్స్ చేసాడు విక్రమ్.ఇక బాల దర్శకత్వంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడిపోయిది. అయితే అర్జున్ రెడ్డి చిత్రం కేవలం కుర్రకారుకి కనెక్ట్ అయ్యిందిగాని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంటే.. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసే సినిమాగా లేదనేది తెలిసిన విషయమే. మరి ఇలాంటి సినిమాలో విక్రమ్ తన కొడుకు ధృవ్ ని పరిచయం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అని వాదించేవాళ్లు ఉన్నారు. ఏదిఏమైనా అన్ని కుదురుకుని ఇలా ఈ రీమేక్ సినిమా కి హీరో ఇంకా దర్శకుడు ఇద్దరూ సెట్టైపోవడంతో.... ఇప్పుడు హీరోయిన్ ఎవరనే ప్రశ్న కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్ లో విజయ్ దేవరకొండ సరసన షాలిని పాండే నటించింది. మరి తమిళంలో ధృవ్ పక్కన నటించబోయే ఆ భామ ఎవరు అంటే ఇద్దరి పేర్లు గట్టిగా విబడుతున్నాయి. ధ్రువ్ సరసన కమల్ హాసన్ రెండో కుమార్తె అయిన అక్షర హాసన్ నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి గాని విక్రం నుంచి గాని ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్షర హాసన్ బదులు నిర్మల కాన్వెంట్ ఫేమ్ శ్రియ శర్మ ని తీసుకుందాం అనే ఆలోచనల్లో ఉన్నారట చిత్ర బృందం. మరి అక్షర హాసన్, శ్రియ శర్మలలో ఎవరు అర్జున్ రెడ్డి రీమేక్ లో ధృవ్ పక్కన నటించే అవకాశం కొట్టేస్తారో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/hero-balakrishna-undergoes-a-minor-knee-surgery-1366778 | హైదరాబాద్ : గతేడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో యాక్షన్ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇటీవలే ఆయన కుడిభుజానికి శస్త్ర చికిత్స జరిగింది. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం విధితమే. తాజాగా బాలకృష్ణకు మరో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు.కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోన్న బాలకృష్ణకు వైద్యులు.. మైనర్ సర్జరీ నిర్వహించారు. బాలకృష్ణ మోకాలికి జరిగింది చిన్న ఆపరేషనే అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. కొద్దిరోజులపాటు బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందని తెలిపారు. సర్జరీ అనంతరం బాలకృష్ణ వైద్యులతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆ ఫొటో కింద కామెంట్స్ చేస్తున్నారు. |
https://www.telugupost.com/politics/brs-chief-kcr-is-coming-to-public-for-the-first-time-after-a-gap-of-almost-two-months-he-will-come-before-the-people-1520341 | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తొలిసారి ప్రజల్లోకి వస్తున్నారు. దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత ఆయన జనం ముందుకు రానున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనంలోకి రాలేకపోయారు. కాలికి గాయం కావడంతో విశ్రాంతిలోనే ఉన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తొలి బహిరంగ సభ నల్లగొండలో నిర్వహిస్తున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులపై పెత్తనాన్ని కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్దపడిందని ఆరోపిస్తూ ఆయన ఈ సభను పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు.తనదే అధికారమని...నిజానికి కేసీఆర్ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటమిని ఊహించలేదు. తనదే మూడోసారి కూడా అధికారమని భావించారు. కానీ పదేళ్ల కాలంలో ఆయన వ్యవహార శైలితో పాటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఆయన ఊహించని ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ వ్యూహాలు దెబ్బతిన్నాయి. అంచనాలు అందని రిజల్ట్ రావడంతో ఆయన తట్టుకోలేక ఫలితాలు వస్తున్న వేళ కాన్వాయ్ లేకుండానే ఫాం హౌస్ కు వెళ్లారంటే ఎంత ఫ్రస్టేషన్ కు గురయ్యారో వేరే చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు నెలల తర్వాత ఆయన ఓటమి నుంచి తేరుకుని తొలిసారి బయటకు వస్తున్నారు. భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.పలు అంశాలపై...ఇప్పటి వరకూ ఎన్నికల ఫలితాలపైనా, ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలపైన ఆయన ఎక్కడా స్పందించలేదు. ఈరోజు నల్లగొండ వేదికగా అన్నింటికీ సమాధానమిచ్చే అవకాశముందని అంటున్నారు. ముఖ్యంగా తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు విద్యుత్తు, నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు రైతు బంధు వంటి కార్యక్రమాలపై కూడా ఆయన ప్రసంగం కొనసాగే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపైనా, పార్టీపైనే చేసే ఆరోపణలకు ఆయన సూటిగా ఈ వేదిక పైనుంచే సమాధానం చెప్పనున్నారని తెలిసింది. అసెంబ్లీలో తమకు సమయం ఇవ్వకపోవడం, పదే పదే తమ పార్టీ నేతల ప్రసంగాన్ని అడ్డుతగలడం వంటి వాటిని కూడా ప్రస్తావించనున్నారు.నేతలు, క్యాడర్ లో...మరోవైపు బీఆర్ఎస్ నుంచి నేతలు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. కాంగ్రెస్ మరింత బలపడితే తమకు పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురువుతాయని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే ఆయన రెండు నెలల తర్వాత తొలిసారి జనంలోకి వస్తున్నారు. క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి మాత్రమే కాదు. లీడర్లు కూడా కారు దిగకుండా ఉండేందుకు ఈ సభను కేసీఆర్ ఉపయోగించుకోనున్నారు. అందుకే రాష్ట్రమంతా కేసీఆర్ ప్రసంగంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఆయన సహజంగా మాటకారి. వాగ్బాణాలు సంధించడంలో మేటి. అలాంటి కేసీఆర్ ఎలాంటి పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడతారన్నది ఆసక్తికరంగా మారింది. |
https://www.telugupost.com/crime/it-was-clear-who-the-body-was-in-the-resalagadda-water-tank-police-identified-the-deceased-as-kishore-of-musheerabad-1342880 | రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. మృతుడు ముషీరాబాద్ కు చెందిన కిషోర్ గా పోలీసులు గుర్తించారు. కిషోర్ సోదరి మృతదేహాన్ని చూసి గుర్తించారు. దీంతో రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో ఉన్న మృతదేహం మిస్టరీ వీడిపోయింది. కిషోర్ గత కొంతకాలం క్రితం ఇంట్లో గొడవ పెట్టుకుని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.హత్య కేసుగా దర్యాప్తు....మరి కిషోర్ ను హత్య చేసి వాటర్ ట్యాంకులో పడేశారా? ఎవరు వారు? హత్యకు కారణాలేంటి? అన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం కలకలం రేపింది. హత్య చేసి వాటర్ ట్యాంకులో పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిషోర్ స్నేహితులు, సన్నిహితులను, బంధువులను విచారించే అవకాశముంది. |
https://www.telugupost.com/movie-news/the-entire-of-the-kadhanam-is-that-anusuya-is-a-key-character-129780/ | అనసూయ బుల్లితెర హాట్ యాంకర్. పెళ్ళైనా ఇప్పటికీ అనసూయని ఆరాధించే వారు కోకొల్లలు. మరి హీరోయిన్స్ చాలామంది మడికట్టుకుని… అందాల ఆరబోతలో ఆలోచిస్తారు కానీ.. పెళ్ళై పిల్లలున్న అనుసయ మాత్రం అందాల ఆరబోతకు ఆలోచనే చెయ్యదు. ఎలా కావాలంటే అలా చూపించేస్తుంది. ఇక బుల్లితెర మీద హాట్ హాట్ యాంగిల్స్ లో చంపేసే అనసూయ సోషల్ మీడియాలోనూ ఏ మాత్రం తగ్గదు. ఇక వెండితెర మీద మాత్రం కాస్త స్కోప్ ఉన్న పాత్రలు, డి గ్లామర్ పాత్రలే దొరుకుతున్నాయి అనసూయకి . ఓ క్షణం, ఓ రంగస్థలం, తాజగా కథనం సినిమా. కథనం సినిమా లో అనసూయ లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. ప్రమోషన్స్ లో…. అయితే సినిమామొత్తం అనసూయ కీలక పాత్ర కాబట్టి ప్రమోషన్స్ లో అనసూయ తప్ప కథనం డైరెక్టర్ గాని, అందులో నటించిన ధనరాజ్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ లు కనిపించని లేదు. కేవలం అనసూయ కథనం కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా ప్రమోషన్స్ లో హాట్ హాట్ అందాలతో చెలరేగిపోయింది. ఇక అనసూయ ప్రమోషన్స్ మాత్రమే చాలనుకున్నట్లుగా ఉన్నారు. అనసూయ 12 కథలను రిజెక్ట్ చేసి మరీ కథనాన్ని చేసానని చెబుతుంది. మరి నాగార్జున మన్మధుడు 2 తో పోటీపడుతున్న కథనం టాక్ మరికాసేపట్లో తెలిసిపోతుంది. ఇక సినిమా హిట్ అయితే మళ్ళి అనసూయ తన ప్రమోషన్స్ తో సినిమాని ఇంకా ప్రమోట్ చేస్తుంది. లేదు సినిమా టాక్ తేడా కొడితే అనసూయ అందరిమీద తోసేసి సైలెంట్ అవుతోందో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/kiara-advani-tollywood-bollywood-movie-80366/ | బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కి ఈమధ్య బాగా కలిసొస్తుందని అర్ధం అవుతుంది. బాలీవుడ్ లో అంతంత మాత్రాన సినిమాలు చేస్తున్న టైంలో ఆమెకు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె సీఎం గర్ల్ ఫ్రెండ్ గా బాగానే మెప్పించింది. ఆ సినిమా అవ్వగానే ఆమెకు నెట్ ఫ్లిక్స్ లో 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ మూవీ చేసే ఛాన్స్ వచ్చింది.ఆ వెబ్ మూవీలో ఆమె ఎంతలా బోల్డ్ గా నటించిందో మనకి తెలిసిందే. బాగా హాట్ గా యాక్ట్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. దాంతో ఆమెకు టాలీవుడ్ లో తెగ ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దింతో పాటు మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తుందంట.అయితే ఆ రెండు మూవీస్ కు సంబంధించి పూర్తి వివరాలు ఆఫిషల్ గా అనౌన్స్ చేయాల్సివుంది. బాలీవుడ్ లో ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చిన టాలీవుడ్ లో సినిమాలు మాత్రం వదలటం లేదు. అటు బాలీవుడ్ లోను.. ఇటు టాలీవుడ్ లోను సమానంగా సినిమాలు చేసుకొస్తానంటోంది. ఒకప్పుడు ఇలానే ఇలియనా తెలుగులో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ లో ఆఫర్స్ రాగానే అటు వెళ్ళిపోయింది. అక్కడ రెండు మూడు సినిమా చేయగానే ఆమెను పట్టించుకునే వారు లేకపోయారు. కానీ ఈ విషయంలో కియారా మాత్రం ఇలియానా కన్నా తెలివిగానే ఆలోచిస్తోంది. |
https://www.telugupost.com/movie-news/why-ntr-is-silent-159395/ | ప్రస్తుతం కరోనా కన్నా పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది ఎన్టీఆర్ ఫాన్స్ కి నటి మీరా చోప్రా కి మధ్యన జరుగుతున్నా సోషల్ మీడియా యుద్ధం. మాజీ హీరోయిన్ మీరా చోప్రా ఎన్టీఆర్ అంటే నాకిష్టం లేదు.. నేను ఆయన అభిమానిని కాదు అన్నందుకు గాను.. ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది మీరా చోప్రా కి సోషల్ మీడియాలోనే చుక్కలు చూపెడుతున్నారు. మీరా చోప్రా పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యడమే కాదు… తెలంగాణ మంత్రి కేటీఆర్ కి కూడా ట్విట్టర్ నుండి మెస్సేజ్ పెట్టింది. అయితే మీరా చోప్రా కి వ్యతిరేఖంగా ఎన్టీఆర్ అభిమానులకు తమిళ నటి ఖుష్బూ మద్దతు పలకడం… తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మీరా కి కౌంటర్ వేయ్యడం,.. ఇలా సోషల్ మీడియా వ్యాప్తంగా రాద్ధాంతం జరుగుతుంది. ఇంతజరుగుతున్నా ఎన్టీఆర్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. కానీ అభిమానులకు ఓ సందేశం ఇవ్వడం లేదు. అభిమానులే తన బలం, వారికీ సదా రుణపడి ఉంటా అంటూ ఎప్పుడు చెప్పే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా మౌనం గా ఉండడం చూస్తే మాత్రం.. ఎందుకు ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడనిపిస్తుంది. మరోపక్క మీరా చోప్రా ఎన్టీఆర్ ని టాగ్ చేస్తూ ఎన్టీఆర్ స్పందించాలని, అభిమానులను కంట్రోల్ లో పెట్టుకోవాలంటూ ట్వీట్ చేసింది. అయినా ఎన్టీఆర్ సైలెన్స్ నే మైంటైన్ చేస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ తన అభిమానుల విషయంలో మనస్తాపానికి లోనయ్యాడని.. ఇంత హాట్ గా ఉన్న టైం లో ఎన్టీఆర్ చెప్పినా అభిమానులు వినరనే ఉద్దేశ్యంతోనే మౌనంగా ఉన్నాడని చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/pawan-fans-pressure-on-dil-raju-180771/ | రెండు రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ జాతర హంగామా గంట గంటకి అందరిలో టెంక్షన్, క్యూరియాసిటీని పెంచేసింది. ఏ డేట్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో? ఎవరి సినిమాతో ఎవరి సినిమా డేట్ క్లాష్ అవుతుందో? సినిమా సినిమాకి గ్యాప్ ఎంతుందో? అంటూ కేవలం దర్శకనిర్మాతలు కాదు ప్రేక్షకుల్లోనూ పిచ్చ టెంక్షన్ క్రియేట్ అయ్యింది. జనవరి 28 , 29 డేట్స్ టాలీవుడ్ లో ఎప్పటికి గుర్తుండిపోయే తేదీల మాదిరి రిలీజ్ డేట్స్ హంగామా జరిగింది. అయితే పాన్ ఇండియా ఫిలిం దగ్గరనుండి మీడియం బడ్జెట్ మూవీ అలాగే చిన్న సినిమాల డేట్స్ కూడా వదిలారు. కానీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ లు ఈ రిలీజ్ డేట్స్ రేసులో వెనుకంజలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్దమయినా దిల్ రాజు వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా టెంక్షన్ పెంచేస్తున్నాడు. పవన్ కూడా పెద్దగా పని లేదు మనకెందుకు అన్నట్టుగా ఏకే రీమేక్ షూటింగ్ కి వెళ్ళిపోయాడు. ఇది ఎలాగూ రీమేక్ కనీసం శేఖర్ కే చంద్ర అయినా ఏకే రీమేక్ సినిమా రిలీజ్ డేట్ ఇస్తాడనుకుంటే.. పవన్ తో షూటింగ్ ఇప్పుడే డేట్ ఇవ్వడం కుదరదు అన్నట్టుగా ఉండిపోయాడు. మరోపక్క వకీల్ సాబ్ డేట్ కోసం పవన్ ఫాన్స్ దిల్ రాజు మీద దండెత్తినా పని జరగలేదు. దిల్ రాజు ఏదో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీకి స్టిక్ అవడం వలనే డేట్ ఇవ్వలేదని అంటున్నారు. మరి ఇప్పడు పవన్ ఫాన్స్ పవన్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. వకీల్ సాబ్ కోసం ఏడాదిగా ఎదురు చేసూతున్నాం కనీసం ఇప్పటికైనా డేట్ ప్రకటించి మమ్మల్ని సంతోష పెట్టండి అంటూ పవన్ కే రిక్వెస్ట్ లు పెడుతున్నారట ఫాన్స్. |
https://www.telugupost.com/crime/conman-arrested-he-posed-as-doctor-on-matrimonial-websites-married-over-15-women-1484228 | మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్నాయి. మంచి అమ్మాయి భార్యగా రావాలని వెతుకుతున్నానంటూ.. మ్యాట్రిమోనీల ద్వారా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని.. అవసరం తీరాక వారిని వదిలేయడం ఈ నిత్యపెళ్లికొడుకు ప్లాన్. అలా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 మందిని మోసం చేశాడు. ఇప్పటివరకూ నిత్యపెళ్లికొడుకు అవతారమెత్తిన ప్రబుద్ధులు ఉన్నారు కానీ.. వారంతా నాలుగైదు పెళ్లిళ్లకే దొరికిపోయారు. మనోడు మాత్రం 15 వరకూ వచ్చాడు. కొందరిని పెళ్లి చేసుకుని, మరికొందరితో నిశ్చితార్థం చేసుకుని డబ్బు అందగానే పరార్. వదిలేస్తే.. ఇంకా చేసుకుంటాడు కూడా. ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు మహేశ్ (35) ను కువెంపు నగర పోలీసులు అరెస్ట్ చేసి, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బనశంకరికి చెందిన మహేశ్.. తాను డాక్టర్ ని అంటూ షాదీ డాట్ కామ్ లో హేమలత (30) అనే యువతికి పరిచయమయ్యాడు. మైసూరు విజయనగరలో అద్దెకు తీసుకున్న ఇంటిని చూపించి.. సొంత ఇల్లు అని నమ్మించాడు. జనవరి 1వ తేదీన ఇద్దరూ విశాఖపట్నంలో పెళ్లి చేసుకుని.. మైసూరుకు వెళ్లి కాపురం పెట్టారు. తాను డాక్టర్ ని అని ముందే నమ్మించిన అతడు.. క్లినిక్ పెట్టేందుకు రూ.70 లక్షల నగదు అవసరం అవుతుందని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో చంపేస్తానని బెదిరించాడు. సందుచూసి బీరువాలో ఉన్న రూ.15 లక్షల విలువైన నగలు దొంగిలించి పరారయ్యాడు. భర్త తిరిగొస్తాడని ఎంత ఎదురుచూసిన అతని జాడ లేదు.ఇంతలో హేమలతను దివ్య అనే మరో మహిళ కలిసి.. మహేశ్ బాగోతాన్ని బయటపెట్టింది. అతడో వంచకుడని, తనను కూడా ఇలాగే పెళ్లిచేసుకుని మోసం చేశాడని చెప్పడంతో.. మహేశ్ పై కువెంపునగర పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆదివారం నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.2 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు, నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మహేశ్ ఇప్పటి వరకూ 15 మంది మహిళలను ఇదే తరహాలో మోసం చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/rakul-preet-singh-in-nagarjuna-manmadhudu-2-movie-129881/ | రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో ఉన్న ఏకైన సినిమా మన్మధుడు 2. ఇప్పుడు మన్మధుడు 2 కూడా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన మన్మధుడు 2 కి ప్రేక్షకులు యావరేజ్ టాక్ ఇచ్చారు. రాహుల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ నాగ్ సరసన టీనేజ్ అమ్మాయిలా నటించింది. మన్మధుడు 2 లో రకుల్ ప్రీత్ నాగార్జున కి అద్దెకొచ్చిన లవర్ అవంతిక పాత్రలో నటించింది. ఏజెడ్ హీరో నాగ్ సరసన రకుల్ టీనేజ్ అమ్మాయిగా బాగానే సెట్ అయ్యింది. అయితే సినిమాకొచ్చిన టాక్ వలన రకుల్ కి ఏం వరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఈ సినిమాలో నటన పరంగా నాగార్జున కన్నా రకుల్ ప్రీత్ సింగ్ కే ఎక్కువ మార్కులు పడతాయి. తొలిసగంలో అందాలు ఆరబోసినా.. టీనేజ్ అమ్మాయిగా కవ్వించే చూపులు విసిరినా…. క్లయిమాక్స్ లో ఎమోషన్ బాగా పండించింది. రకుల్ బోల్డ్ లుక్స్.. యాక్టింగ్ తో ఓకే అనిపించింది. గత సినిమాలతో పోలిస్తే రకుల్ భిన్నంగా కనిపించిందీ సినిమాలో. అయితే అవంతిక పాత్ర తేలిపోవడంతో రకుల్ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ పర్వాలేదనిపించింది. ఇక సినిమాలో నాగార్జున తో రకుల్ కెమిస్ట్రీ కూడా పరవాలేదనిపిస్తుంది. మరి ప్రస్తుతం తెలుగులో ఏం సినిమాలు కూడా రకుల్ చేతిలో లేవు. తమిళనాట మాత్రం రెండు సినిమాల్లో రకుల్ నటిస్తుంది. ఇక మన్మధుడు 2 కూడా హిట్ కాకపోయేసరికి ఇపుడు రకుల్ పరిస్థితి ఏమిటా అని అందరూ తెగ చర్చించేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ramcharan-next-movie-159635/ | RRR లో నటిస్తున్న రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు తమ నెక్స్ట్ సినిమాల విషయంలో ఎన్టీఆర్ ఒక్కడే ఫుల్ క్లారిటీగా ఉన్నాడు…. త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టేసాడు. కానీ రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ఓ పాత్ర చెయ్యాలి కనక తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం, లేదు. రామ్ చరణ్ RRR, ఆచార్య తర్వాత ఏ డైరెక్టర్ తో చెయ్యబోతున్నాడో అనేది కనీసం చిన్న లీక్ కూడా లేదు. తన వద్దకు వచ్చే డైరెక్టర్స్ ని రామ్ చరణ్ తన తండ్రికి తగిలిస్తున్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ విషయం ఇంకా సస్పెన్స్ లోనే ఉండగా.. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కథ పై సోషల్ మీడియాలో ఓ పుకారు మొదలైంది. రామ్ చరణ్ RRR లో అల్లూరి పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే తన నెక్స్ట్ మూవీ లో రామ్ చరణ్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ పాత్రే చేయబోతున్నాడని… ఆస్థి కోసం ఓ పాపను వెంటాడే గ్యాంగ్ నుండి కాపాడే పోలీస్ గా రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి ఏ డైరెక్టర్ ఈ కథ చరణ్ కి చెప్పాడో తెలియదు కానీ… ఈ కథలోనే రామ్ చరణ్ నటించబోతున్నాడని న్యూస్ మాత్రం కరెక్ట్ అంటారా.. ఏమో చూడాలి ఇందులో నిజమెంతుందో అనేది. ఇక ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర అద్భుతంగా ఉంటుంది అని… ఆచార్య కె రామ్ చరణ్ పాత్ర హైలెట్ అంటున్నారు. |
https://www.telugupost.com/crime/anger-on-his-wife-father-took-shocking-decision-on-children-khammam-district-1484388 | ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో ఉన్న విబేధాల నేపథ్యంలో ఓ తండ్రి కన్న బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన పార్షపు శివరామ గోపాల్, మార్తమ్మ దంపతులు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తరచుగా ఈ దంపతుల మధ్య గొడవలే. ఇటీవల శివరామగోపాల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందటే విడుదలై వచ్చాడు. భార్య మార్తమ్మ రాయపట్నం గ్రామంలోనే ఉన్న పుట్టింట్లో ఉంటుంది. జైలు నుండి వచ్చిన తర్వాత మళ్లీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. కోపం పెంచుకున్న శివరామ గోపాల్ తన బిడ్డలైన రామకృష్ణ (8), ఆరాధ్య (6)లను చంపేశాడు.రామకృష్ణ , ఆరాధ్య లు రాయపట్నం ప్రభుత్వ పాఠశాలలో 3, 1 తరగతులు చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాలకు వెళ్లిన శివరామగోపాల్ పిల్లల్ని తనతో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోనే వారి గొంతు నులిమి చంపేసి, శవాలను దుప్పట్లో మూటకట్టి పరారయ్యాడు. పిల్లలను తీసుకొచ్చేందుకు మార్తమ్మ పాఠశాలకు వెళ్లగా వాళ్ల నాన్న వచ్చి తీసుకెళ్లాడని సిబ్బంది తెలిపారు. మార్తమ్మ ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానం వచ్చిన మార్తమ్మ చుట్టుపక్కల వారి సహాయంతో ఇంటి తాళం పగలగొట్టింది. లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు పిల్లలు దుప్పట్లో చుట్టేసి ఉండడాన్ని గుర్తించారు. వైద్యులను సంప్రదించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు. పిల్లల మృతదేహాలని మధిర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివరామ గోపాల్ కోసం గాలిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ఓం-కార్-ఆ-స్టార్-ని-పటాయిస-46171/ | జీనియస్ సినిమాతో దర్శకుడిగా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓం కార్ ఆ సినిమా ప్లాప్ తో.. మరొక సినిమా చెయ్యడానికి బాగా గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా పెట్టి రాజుగారి గదిని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఆ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా.... అదిరిపోయే కామెడీ ఉండడంతో భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక హర్రర్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు మొహం మొత్తడం మొదలయ్యాక చిన్న స్టార్స్ తో సినిమా తీస్తే లాభం లేదని గుర్తించిన ఓం కార్ ఏకంగా సీనియర్ హీరో నాగార్జునని... టాప్ హీరోయిన్ సమంతని ఒప్పించి మరీ ఓంకార్ రాజు గారి గది 2 ని తెరకెక్కించాడు. మరి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఓం కార్ ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్ సాధించేసాడు. రాజుగారి గది 2 సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. నాగార్జున, సమంత లతో ఓం కార్ మంచి హిట్ కొట్టేసాడనే టాక్ బయలుదేరింది. మరి ఓం కార్ నెక్స్ట్ సినిమా ఏంటంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. ఈ సినిమా హిట్ తో ఇప్పుడు ఓం కార్... మెగా ఫ్యామిలీ హీరో అయిన రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడని... ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధం చేసుకున్నాడని... ఈ సినిమాతో తన ట్యాలెంట్ ని మరింతగా చూపించడానికి ఓం కార్ రెడీ అవుతున్నట్టుగా వార్తలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి.మరి రామ్ చరణ్ కూడా యంగ్ డైరెక్టర్స్ ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటాడు. అందుకే చరణ్ ఇప్పుడు ఓం కార్ ని కలిసి స్టోరీ డిస్కషన్ కి కూడా ఒకే చెప్పసాడనే టాక్ వినబడుతుంది. మరి రాజుగారి గది 2 సినిమా అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ.. భారీగా పెట్టిన బడ్జెట్ తెస్తుందా అనే అనుమానంలో చాలామందే ఉన్నారు. నాగార్జున, సమంత ల ఎంట్రీతో ఈ సినిమాకి భారీగానే బడ్జెట్ ఎక్కింది. దాదాపు ఈ సినిమాకి 25 కోట్లు బడ్జెట్ ఎక్కినట్టుగా సమాచారం. మరి సినిమా గనక పెట్టిన బడ్జెట్ తెచ్చేసి.. లాభాల పంట పండిస్తే మాత్రం ఖచ్చితంగా ఓం కార్ కి రామ్ చరణ్ అవకాశమిస్తాడంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/director-tatineni-ramarao-passes-away-1365745 | హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ 'యమగోల' సినిమాకు తాతినేని దర్శకత్వం వహించారు.ఆయన వయసు 84 సంవత్సరాలు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు 'నవరాత్రి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరిచయమయ్యారు. తాతినేని 70కిపైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. రాజేంద్రప్రసాద్తో గోల్మాల్ గోవిందం, సూపర్స్టార్ కృష్ణతో అగ్నికెరటాలు వంటి సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో నవరాత్రి, బ్రహ్మచారి, సుపుత్రుడు, రైతు కుటుంబం, దొరబాబు, ఆలుమగలు, శ్రీరామరక్ష, యమగోల, ఆటగాడు, అనురాగ దేవత, జీవనతరంగాలు, ఇల్లాలు, తల్లదండ్రులు, ప్రెసిడెంట్గారి అబ్బాయి వంటి విజయవంతమైన సినిమాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. వీటితోపాటు హిందీలో లోక్-పరలోక్, అంధా కానూన్, ఇంక్విలాబ్, బేటీ నవంబర్ వన్ వంటి సినిమాలను రూపొందించారు. తాతినేని మృతికి టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. |
https://www.telugupost.com/crime/even-if-she-doesnt-like-it-wife-was-angry-with-her-husband-who-tried-to-have-sex-by-force-1343800 | తనకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించిన భర్తపై భార్య(24) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపం పట్టలేక అతని మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని టీకంగఢ్ జిల్లాలోని రామ్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ నెల 7వ తేదీ జరిగిన ఈ ఘటన భర్త ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులొకిచ్చింది. జాతర పోలీస్ స్టేషన్ అధికారి తివేంద్ర త్రివేదీ తెలిపిన వివరాల మేరకు రామ్ నగర్ లో బాధిత భర్త (26) భార్యతో కలిసి ఉంటున్నాడు.ఇష్టం లేకుండా...ఆదివారం అతను ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. " నా భార్యకు ఇష్టం లేనప్పటికీ శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించా. దీంతో ఆమె ఈ ఘోరానికి పాల్పడింది" అని బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2019లో వారికి వివాహం జరగ్గా.. కొన్ని గొడవల కారణంగా విడిపోయారు. పెద్దలు సర్దిచెప్పడంతో ఇటీవలే ఈ జంట మళ్లీ కలిశారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆయన వివరించారు. కాగా.. ఘటనానంతరం భర్త శస్త్ర చికిత్స చేయించుకుని ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా తెలిసిందని త్రివేదీ వివరించారు. |
https://www.telugupost.com/politics/ycp-chief-ys-jagan-will-release-the-manifesto-at-a-public-meeting-in-raptadu-on-18th-of-this-month-1520389 | మ్యానిఫేస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే వైసీపీ అధినేత జగన్ దానిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీన మ్యానిఫేస్టోను విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. రాయలసీమలో జరగనున్న సిద్ధం సభలో ఈ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. 18వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే జగన్ మ్యానిఫేస్టోను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఆయనతో పాటు ఒక టీం మ్యానిఫేస్టో రూపకల్పనలో కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే టీడీపీ తొలి విడత మ్యానిఫేస్టో విడుదల చేయడంతో జగన్ మ్యానిఫేస్టోలో ఏ అంశాలుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.రాప్తాడు సభలో...సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు తన తొలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఆరు గ్యారంటీలను ప్రజల ముందు ఉంచారు. మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా చంద్రబాబు తొలి విడత మ్యానిఫేస్టో విడుదలయింది. దీనికి సూపర్ సిక్స్ గా నామకరణం చేశారు. మలి విడత మ్యానిఫేస్టో ప్రకటన కూడా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. పొత్తులతో ఉన్న భాగస్వామ్య పార్టీలతో కలసి చంద్రబాబు రెండో విడత మ్యానిఫేస్టోను అతి త్వరలోనే విడుదల చేయనున్న నేపథ్యంలో జగన్ ఈ నెల 18వ తేదీన రాప్తాడులో జరిగే సిద్దం సభలో విడుదల చేయనున్న మ్యానిఫేస్టోలో ఏ ఏ అంశాలుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.రైతు రుణమాఫీ....గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశామని చెప్పుకునే జగన్ ఈసారి ఎన్ని హామీలను ప్రజలకు ఇస్తారన్నది అందరిలోనూ ఆసక్తిరేపుతుంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2.50 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారులకు అందచేశామని చెబుతున్న జగన్ సర్కార్ ఈసారి రైతులు, ఉద్యోగులు, మహిళలు లక్ష్యంగా మ్యానిఫేస్టోను రూపొందిస్తున్నట్లు తెలిసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉండే అవకాశముందని తెలిసింది. అలాగే రెండు లక్షల వరకూ రైతు రుణ మాఫీని జగన్ ప్రకటిస్తారని అంటున్నారు. ఉద్యోగులకు కూడా వరాలను ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.సామాజికవర్గాల వారీగా...సామాజికవర్గాల వారీగా ఆకట్టుకునే విధంగా ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న వైఎస్సార్ పార్టీ ఈ మ్యానిఫేస్టోలో కూడా వారికే అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు మైనారిటీలు, ఎస్సీల సంక్షేమంతో పాటు ప్రాంతాల వారీగా కొన్ని హామీలను వైసీపీ మ్యానిఫేస్టోలో చోటు కల్పించాలని నిర్ణయించారు. మ్యానిఫేస్టో ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకూడదని మాత్రం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఒక టీం మాత్రం దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మ్యానిఫేస్టో రూపకల్పనకు జగన్ నడుంబిగించారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మ్యానిఫేస్టో కోసం ఇటు రాజకీయ పార్టీలేకాదు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/తెలుగు-అమ్మాయి-తమిళ-ఇంటి-27900/ | తెలుగు అమ్మాయి అంజలిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన తమిళ చిత్రం జర్నీ. ఆ చిత్రంలో అంజలికి జంటగా నటించిన తమిళ యువ కథానాయకుడు జై తో అంజలి వ్యక్తిగతంగా బాగా చనువుగా ఉంటోందని గత కొద్ది నెలలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ కోలీవుడ్ పెయిర్ గురించి ప్రస్తావించని తమిళ మీడియా ఛానల్ ఉండదేమో. అంతలా పబ్లిసిటీ పొందిన ఈ ప్రేమ జంట మాత్రం తమ మధ్య వున్న బంధానికి ఎటువంటి పేరుని ఆపాదించుకోకుండా ఏ ఇంటర్వ్యూ లో ఈ విషయమై ప్రశ్న ఎదురైనా సమాధానం చెప్పకుండా దాట వేస్తూ వస్తున్నారు. ఆ మధ్య జై ఇంట్లో వంట చేస్తూ దొరికిన అంజలి వీడియోస్ ని చూసి వీరిద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా వచ్చింది.అయితే కొద్ది రోజుల క్రిందట ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అంజలి ఈ విషయమై స్పందిస్తూ తనకి జై కి మధ్యన వున్న అనుబంధంపై వస్తున్న వార్తలన్నీ ఖండించింది. మీడియాలో వచ్చే వార్తలనే నమ్మితే ఇప్పటికే తనకి ఒక నిర్మాతతో వివాహం పూర్తయిపోయింది అని కూడా నమ్మాలి కదా అని ఎదురు ప్రశ్నించింది. ఆ మధ్య అంజలి సినీ పరిశ్రమకి చెందిన ఓ నిర్మాతని వివాహమాడిందనే పుకార్లు హల్చల్ చేసిన సంగతి విదితమే. అప్పటికి చిత్రంగధ ప్రమోషన్ కోసం ఒకింత ఘాటుగా ఈ ప్రశ్నని మలుచుకున్నప్పటికీ అంజలికి ఇదేమి కలిసిరాలేదు. అయితే ఇప్పుడు అంజలి సన్నిహితులు మాత్రం ఇప్పటికే వీరి ప్రేమాయణం పెద్దల వరకు చేరిందని, వారందరి సమ్మతితోనే వచ్చే ఏడాది ఆఖరు లోపు అంజలికి జై తో వివాహం జరుగుతుందని చెప్తున్నారు. మరి అంజలి ఈ విషయమై ముహుర్తాలు ఖరారు అయ్యే వరకు వాస్తవాలు వెల్లడించదేమో. |
https://www.telugupost.com/movie-news/kadambari-kiran-helped-senior-actress-pavala-syamala-through-manam-saitham-1513485 | Pavala Shyamala : ఒకప్పటి తెలుగు చిత్రాల్లో లేడీ కమెడియన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అనేక సినిమాలు చేసిన నటి పావలా శ్యామల.. గత కొంతకాలం అనారోగ్యం, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయసు సహకరించక సినిమాలకు దూరమైన శ్యామల.. ఇటు తన అనారోగ్యంతో, అటు కూతురు అనారోగ్యం సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధాశ్రమంలో దీనస్థితిలో జీవనం సాగిస్తూ వస్తున్నారు.ఇక ప్రస్తుతం శ్యామల పరిస్థితిని ఒక మీడియా ద్వారా తెలుసుకున్న నటుడు కాదంబరి కిరణ్.. ఆమెకు ఆర్ధిక సాయం అందించారు. తెలుగు నటుడు కాదంబరి కిరణ్ ‘మనం సైతం' అనే ఫౌండేషన్ ద్వారా గత 10 ఏళ్ళ పై నుంచి.. సినీ పేద కార్మికులకు, కష్టాల్లో పేదలకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు శ్యామల పరిస్థితి తెలుసుకున్న కాదంబరి కిరణ్.. ఆమెను వెతుకుంటూ వెళ్లి సహాయం చేశారు.హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న పావలా శ్యామలని కలుసుకొని ఆమె రూ.25,000 నగదుని చెక్ రూపంలో అందించి సహాయం చేశారు. ఆమెకు కావాల్సిన కనీస అవసరాలు, మెరుగైన వైద్యం కలిగేలా చేయూతని అందించారు. ఇక ఒకప్పుడు అందర్నీ నవ్వించిన నటి శ్యామలని ఈ పరిస్థితిలో చూసిన ఆడియన్స్ తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. అలాగే సహాయం అందించిన కాదంబరి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. |
https://www.telugupost.com/politics/why-is-congress-interested-in-sending-ys-sharmila-to-andhra-pradesh-1482497 | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఆమె పార్టీ హైకమాండ్తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ వారంలో చర్చల కోసం ఆమె న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని దాదాపు నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే, షర్మిల తెలంగాణపై మాత్రమే ఆసక్తి చూపుతుండగా, తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో క్రియాశీల పాత్ర పోషించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తనను ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా చేయాలనే ప్రతిపాదన ఉందని, కర్ణాటక నుంచి తనకు కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్టు ఆఫర్ చేశారంటూ వచ్చిన వార్తలను ఆమె బహిరంగంగానే కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడం కోసం తానెప్పుడూ కట్టుబడి ఉన్నానని, ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని ఆమె పునరుద్ఘాటించారు. తన భవిష్యత్తు తెలంగాణా ప్రజలతోనే ఉంది అని ఆమె అన్నారు. షర్మిల తెలంగాణ కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అధిష్టానం ధీమాగా ఉన్నట్లు సమాచారం. భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) చంద్రబాబు నాయుడుని ఆంధ్రా నాయకుడిగా చూపి తెలంగాణ సెంటిమెంట్ను పూర్తిగా ఉపయోగించుకుని మళ్లీ అధికారంలోకి వచ్చింది. షర్మిల తెలంగాణా కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ మళ్లీ అదే సెంటిమెంట్ను ప్లే చేసే అవకాశం ఉంది, ఎందుకంటే షర్మిలను ఆంధ్రాలో ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి అని. అందుకే షర్మిల ఆంధ్రాకు వెళ్లి వైఎస్ఆర్ సెంటిమెంట్ను పుణికి పుచ్చుకుని పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ ప్రయత్నంలో విజయం సాధించకున్నా, ఆమె రాజకీయ ప్రయోజనాలను పార్టీ కాపాడుతుందని హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే షర్మిల దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. |
https://www.telugupost.com/movie-news/ఏడాది-తరువాత-అమ్మడి-చూపు-22327/ | 2016 జనవరి నెలలో విడుదలైన జై గంగాజల్ చిత్రం తరువాత బాలీవుడ్ ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్ర ఇతర ఇండియన్ ఫిలిమ్స్ కి సంతకం చేయలేదు. గత ఏడాది నుంచి హాలీవుడ్ టెలి సిరీస్ క్వాన్టికో లో నటిస్తూ బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా తన మకాం కూడా బొంబాయి నుంచి న్యూయార్క్ కి మార్చేసి అక్కడే నివాసం ఉంటోంది. ఈ ఏడాది కాలంలోనే బేవాచే అనే ఆంగ్ల చిత్రంలోనూ ప్రియాంక చోప్రా నటించింది. ఈ చిత్రం ఇదే ఏడాది మే నెలలో విడుదల కాబోతోంది. 2016 లో జై గంగాజల్ అనంతరం న్యూయార్క్ వెళ్లిపోయిన ప్రియాంక ఈ ఏడాది కాలంలో అస్సాం రాష్ట్ర పర్యాటక శాఖతో బ్రాండ్ అంబాసడర్ గా కుదుర్చుకున్న ఒప్పొందం కారణంగా ఆ ప్రకటనలలో నటించటానికి మాత్రమే ప్రియాంక ఇండియా విచ్చేసింది తప్ప గత ఏడాది జనవరి నుంచి నేటి వరకు ప్రియాంక చోప్రా ఒక్క బాలీవుడ్ వేడుకకి కూడా హాజరు కాలేదు.2015 లో విడుదలైన చారిత్రాత్మక చిత్రం బాజీరావు మస్తానీ చిత్రంతో దర్శకుడు సంజయ్ లీల బన్సాలి తో తొలిసారి పనిచేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మరోసారి బన్సాలి దర్శకత్వంలో పనిచేయటానికి తిరిగి బాలీవుడ్ రానుంది. ప్రస్తుతం దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తున్న పద్మావతి చిత్రీకరణలో నిమగ్నమైన సంజయ్ లీల బన్సాలి తన తదుపరి చిత్రంగా తాను చదివిన ఒక పుస్తకం ఆధారంగా సినిమా చేయనున్నారట. ఆ చిత్రంలో కథానాయిక పాత్రని ప్రియాంక చోప్రాతోనే నటింపచేయాలని నిశ్చయించుకున్న బన్సాలి తన చిత్రానికి కథ తయారు కానప్పటికీ, ప్రియాంక కి ఆ పుస్తకాన్ని నేరేట్ చేసాడట. బన్సాలి నేరేషన్ కి పూర్తిగా కన్విన్స్ అయిపోయిన ప్రియాంక ఆయన పై వున్న నమ్మకంతో కథ తో రానప్పటికీ బన్సాలి తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. పద్మావతి చిత్రం నుంచి ఫ్రీ ఐన అనంతరం బన్సాలి ప్రియాంక చోప్రా ప్రధాన కథానాయికగా తెరకెక్కించబోయే చిత్రం స్క్రిప్ట్ పై పని చేయనున్నారట. |
https://www.telugupost.com/movie-news/జాగ్వార్-పై-పంపిణీదారులక-4799/ | సినిమా పరిశ్రమలో పలుకుబడి ఉన్న వాళ్ళు, రాజకీయ పరపతి ఉన్న వాళ్ళు వారి వారి వారసులని పరిచయం చేసే సినిమాలకు పరిమితికి మించి ఖర్చు చేయటం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ప్రముఖ చలన చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయ చిత్రానికి తన సొంత డబ్బుని భారీగా ఖర్చు చేసి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నటి తమన్నా భాటియా చేత ప్రేత్యేక గీతం చేపించారు. పరిమితికి మించిన వ్యయం కారణంగా ఆ చిత్రం ఆర్ధిక నష్టాలూ చెవి చూసింది. అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం అఖిల్ కూడా వినాయక్ దర్శకత్వంలో పరిచయ నటుడి మార్కెట్ పరిధికి మించిన వ్యయంతో తెరకెక్కి ఘోర పరాజయం చెందింది.ఈ విజయ దశమి పండుగకు విడుదల కానున్న జాగ్వార్ చిత్ర కథానాయకుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి మనువడు అని తెలిసిన విషయమే. నిఖిల్ పరిచయ చిత్రం ఐన జాగ్వార్ 75 కోట్ల భారీ వ్యయంతో నిర్మితం కావటం, పైగా తమన్నా ప్రత్యేక గీతం కూడా ఉండటం ఈ చిత్ర పంపిణీదారులకు దడ పుట్టిస్తుంది. ఈ నెల 6 వ తారీకున విడుదల కానుంది ఈ చిత్రం. మరుసటి రోజున నాగ చైతన్య నటించిన ప్రేమమ్, సునీల్ నటించిన ఈడు గోల్డ్ ఎహె, ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన మన ఊరి రామాయణం, ప్రభు దేవా తమన్నాల అభినేత్రి విడుదల కానున్నాయి.నాలుగు చిత్రాల పోటీ ని తట్టుకుని జాగ్వార్ ఏ మేరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి. జాగ్వార్ చిత్ర దర్శకుడు మహాదేవ్ గతం లో తన తొలి చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన మిత్రుడు చిత్రానికి దర్శకత్వం వహించారు. జాగ్వార్ దర్శకుడిగా ఆయనకు రెండవ చిత్రం. |
https://www.telugupost.com/movie-news/అక్కడ-పూర్తయిపోయింది-మర-35960/ | బాలీవుడ్ లో ఫేమస్ అయిన బిగ్ బాస్ షోని కోలీవుడ్, టాలీవుడ్ లలోకి దించుతున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కానీ తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా ఈ షో అప్పుడే గ్రాండ్ గా లాంచ్ చేసుకుని పార్టిసిపేట్స్ ఇంట్రడక్షన్స్ కూడా పూర్తి చేసుకుంది. ఇంకా తెలుగులో అయితే పార్టిసిపేట్స్ ఎంపిక పూర్తికాలేదుగాని తమిళంలో ఎప్పుడో పూర్తైపోయిందని కోలీవుడ్ పార్టిసిపేట్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో లో మొత్తం 15 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే బాలీవడ్ లో ఫెమస్ మోడల్స్ గట్రా ఈ షో లో పార్టిసిపేట్ చేసారు గాని సౌత్ లో అలాంటి వారెవరు కనబడంలేదు. అందుకే కోలీవుడ్ బిగ్ బాస్ పార్టిసిపేట్స్ ని చూస్తుంటే అబ్బో అనే రీతిలో ఎవరూ లేరు. ఇక కోలీవుడ్ బిగ్ బాస్ పార్టిసిపేట్స్ వివరాలు ఇలా వున్నాయి. శ్రీ, అనుయ, వైయాపురి,గాయత్రి రఘురాం, భరణి, రైజా,స్నేహన్, ఒవియా, హారతీ గణేష్,ఆరర్, గంజా కరుప్పు,జులియానా, గణేష్ వెంకట్రామ్, శక్తి , నమితలు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇక వీరందరిలో ముఖ్యంగా మనం నమిత గురించే చెప్పుకోవాలి. కోలీవుడ్ తోబాటు టాలీవుడ్ కి పరిచయమైన నమితకు ఇప్పుడు తెలుగులోకాని, తమిళంలోకాని అవకాశాలు లేక పాపంఖాళీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ షో తమిళంలోనే గనక నమిత ఈ షోతో మరింత పాపులర్ అయిపోదామని ఈ షోలో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఎలాగూ తమిళులకు నమిత అంటే ఇష్టం కాబట్టి ఈ షోలో సెలెక్ట్ చేశారన్నమాట. ఇక ఇందులో వీరంతా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొని అక్కడిఅందరిని ఓడించి ప్రైజ్ మెనీ కొట్టేయాలని చూస్తున్నారు. |
https://www.telugupost.com/crime/tragedy-took-place-in-gujarat-incident-of-seven-deaths-in-the-same-family-was-filled-with-tragedy-1535677 | గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి ఏడుగురు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఈతకు వెళ్లి వీళ్లంతా మరణించారు. మృతుల్లో పెద్దల నుంచి చిన్నారుల వరకూ ఉన్నారు. నర్మదానదిలో దిగిన ఏడుగురు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారు. బాధితులు సూరత్ నంచి నర్మదా పోయిచా వద్దకు పర్యాటక బృందంలో సభ్యులుగా పోలీసులు గుర్తించారు.నదిలోకి దిగి...ఏడుగురు ఈతకొట్టేందుకు నదిలో దిగి ప్రవాహానికి కొట్టుకుపోయారని తెలిపారు. సమ్మర్ లో పిక్నిక్ కోసం ఈ ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. అందులో భాగంగా వచ్చి ఇక్కడ వాళ్లు నదిలో ఈత కొట్టడానికి దిగి కొట్టుకుని పోయారని, మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టానమి పోలీసులు తెలిపారు. |
https://www.telugupost.com/crime/bus-going-from-andhra-pradesh-to-sabarimala-fell-into-the-valley-some-people-got-serious-injuries-in-this-accident-1448863 | ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల వెళుతున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళుతున్న బస్సు పతనంతిట్ట వద్ద లోయలో పడిందని అధికారులు తెలిపారు.ముగ్గురి పరిస్థితి విషమం...ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి బస్సు లోయలో పడినట్లు తెలిసింది. బస్సు ఎక్కడి నుంచి బయలుదేరింది? అన్న సమాచారం తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/naa-peru-surya-allu-arjun-2-68933/ | ఇప్పుడు ఏ ఒక్క సినిమా విడుదలైన ఆ సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేస్తున్నారు. తమ సినిమా మీద ప్రేక్షకులకు బాగా ఆసక్తి కలిగించాలి అంటే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చెయ్యాలని దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఫిక్స్ అవడం.. ఒక రేంజ్ లో తమ సినిమాలను ప్రమోట్ చెయ్యడం వంటివి ఇప్పుడు కామన్ అయ్యింది. కేవలం బడా సినిమాలే ఇలా చెయ్యడం లేదు. చిన్న సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేందుకు పబ్లిసిటీకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రింట్ మీడియా కి, ఛానల్స్ కి, వెబ్ మీడియా కి ఆయా సినిమాల యాడ్స్ ని ఇవ్వడమే కాదు... తమ సినిమాల మీద పాజిటివ్ గా న్యూస్ లు రాపిస్తూ... తమ సినిమా యాడ్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.యాడ్స్ ఇవ్వకుండా....ఇలా సినిమాలు భారీ రేంజ్ లో హిట్ అవుతున్నాయి అంటే... అందులో మెయిన్ గా పబ్లిసిటీనే కారణమవుతున్నాయి. అయితే రామ్ చరణ్ రంగస్థలం, మహేష్ భరత్ అనే నేను సినిమాలకు ఈ పబ్లిసిటీ చాలా ఉపయోగపడింది. సినిమాకి ఎంతగా పాజిటివ్ టాక్ వచ్చినా మౌత్ టాక్ కూడా చాల అవసరం. అయితే ఇప్పుడు నా పేరు సూర్య విషయం లో ఈ పబ్లిసిటీ విషయంలో నిర్మాతలు నాగబాబు , శ్రీధర్ లు మాత్రం నా పేరు సూర్య పబ్లిసిటి విషయంలో ఎందుకో సఫర్ అవుతున్నారు. అదేమిటంటే ప్రస్తుతం శ్రీరెడ్డి, పవన్ ఇష్యుతో సినిమా ప్రముఖులు ఎడతెగని చర్చలు జరిపి కొన్ని ఛానల్స్ ని బ్యాన్ చేస్తున్నారనే టాక్ రావడమే కాదు.. ఆయా ఛానల్స్ కి ముఖ్యమైన యాడ్స్ ని ఆపేసారు కూడా. ప్రముఖ ఛానల్స్ కి ఈసారి నా పేరు సూర్య యాడ్స్ ఇవ్వలేదు. ఛానల్స్ లో తమ సినిమాకి పబ్లిసిటీ చేస్తే చాలనుకుని లెవల్లో ఉన్న నిర్మాతలు ఇప్పుడు సినీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవడానికి రెడీ అయ్యారు.తప్పుచేశారా?మరి ఇలాంటి టైం లో నా పేరు సూర్య యాడ్స్ ఇవ్వకుండా ఆపి సూర్య నిర్మాతలు ఏదన్నా తప్పు చేసారా అనిపిస్తుంది. ఎందుకంటే రోజూ ప్రజలు తిలకించే ఛానల్స్ లో నా పేరు సూర్య గురించిన యాడ్స్ గాని.. సినిమాకి సంబందించిన పబ్లిసిటి కానీ ఎక్కడా కనబడడం లేదు. మరి ఈ లెక్కన నాగబాబు, శ్రీధర్ లు కావాలనే ఆయా ఛానల్స్ వారిని అవాయిడ్ చేసినట్లుగా అనిపిస్తుంది. మరి ఇలా ఇప్పుడు అవాయిడ్ చెయ్యడం వలన నా పేరు సూర్య కి ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ బడా ఛానల్స్ కి కూడా ఆయా సినిమాల యాడ్స్ తగ్గితే అది పెద్ద దెబ్బె అని చెప్పాలి. |
https://www.telugupost.com/movie-news/bigg-boss-5-season-goes-juicy-202966/ | బిగ్ బాస్ 5 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం ఎలమిలనేషన్ లో ప్రియాంక, శ్రీరామచంద్ర, ప్రియ, మానస్, లహరి ఉన్నారు. వీరిలో శనివారం ప్రియాంక, శ్రీరామచంద్రలు సేవ్ అయ్యారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ కానున్నారు. అందులో మానస్, లహరి స్ట్రాంగ్ గా కన్పిస్తున్నారు. గత వారం వివాదం కావడం ప్రియకు మైనస్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈవారం హౌస్ నుంచి బయటకు వచ్చేది ప్రియ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. |
https://www.telugupost.com/movie-news/బాలయ్య-జై-సింహ-టీజర్-ఎలా-వ-53525/ | బాలకృష్ణ - కె ఎస్ రవికుమర్ కాంబినేషన్ లో వస్తున్న.. జై సింహ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సినిమాని జనవరి 12 న విడుదల చేస్తామని మూవీ యూనిట్ ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు పాటల చిత్రీకరణలోనే బిజీగా వుంది. తాజాగా జై సింహ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టిన మూవీ యూనిట్ ఇప్పుడు గత రెండు రోజుల నుండి బాలకృష్ణ తో కూడిన జై సింహ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు జై సింహ టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి,హరిప్రియ లు నటిస్తున్న ఈ మూవీ టీజర్ లో బాలకృష్ణ ఉగ్ర రూపాన్ని చూపించేసాడు. డైలాగ్ తో ఇరగదీసాడు. అసలు బాలయ్య బాబు సినిమా అంటేనే.. యాక్షన్ సీన్స్ కి, పవర్ ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. మరి జై సింహ లో కూడా అలాంటి యాక్షన్ సీన్స్ ని, పవర్ ఫుల్ డైలాగ్స్ తోనే నింపేశారు. యాక్షన్ సీన్స్ లో రౌడీలను ఎడా పెడా బాదేస్తూ బాలయ్య బాబు విశ్వ రూపాన్ని చూపించడమే కాదు.. హీరోయిన్ నయనతార, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా అలా వచ్చి ఇలా మాయమయ్యారు. మరి బాలకృష్ణ సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు... సైలెంట్ గా ఉంది కదా అని కెలికితే తలకొరికేస్తుంది.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో అలరించేసాడు. మరి నందమూరి అభిమానులు బాలయ్య సినిమా అంటే ఎలా ఉండాలి అని కోరుకుంటారో ఈ జై సింహ కూడా అలానే ఉండబోతుందనేది ఈ టీజర్ లో తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన చిత్తరంజన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరింది. ఇక జై సింహ ఆడియో వేడుక ఈ నెల 24 న విజయవాడలో జరగనుంది |
https://www.telugupost.com/movie-news/rajinikanth-petta-collections-104784/ | ప్రస్తుతం రజినీకాంత్ మార్కెట్ కి ఓ అన్నంత క్రేజ్ లేదు. ఎందుకంటే ఆయన.. గత ఏడెనిమిదేళ్ళుగా హిట్ కొట్టిన సందర్భమే లేదు. రోబో సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ రజినీకాంత్ కొట్టలేకపోయాడు. కనీసం మొన్న విడుదలై 2.0 సినిమాని కొన్న బయయ్ర్లు కూడా బాగా లాస్ అయ్యారు. ఇక లింగా, కబాలి, కాల ఇలా వరసగా సినిమాలు పోవడంతో రజినీకాంత్ కి మార్కెట్ అనూహ్యంగా పడిపోయింది. రజిని చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ… సినిమా టాక్ తో కలక్షన్స్ మాత్రం అమాంతం పడిపోతాయి. తాజాగా రజిని – కార్తీక్ సుబ్బరాజుల పేట చిత్రం వరల్డ్ వైడ్ గా జనవరి 10 న విడుదలకాబోతుంది. అయితే తెలుగులో ఓ మాదిరి బిజినెస్ ని జరుపుకున్న పెటా సినిమ తమిళనాట మాత్రం భారీ బిజినెస్ జరుపుకుంది. తెలుగులో గతంలో రజినీకాంత్ సినిమాలకు భీభత్సమైన పోటీ ఉండేది. కానీ గత కొంతకాలంగా రజిని నుండి వస్తున్నా సినిమాల్తో బయ్యర్లు బెంబేలెత్తుతున్నప్పుడు.. ఇక నిర్మాతలెవరూ రజినీకాంత్ సినిమాలు ఏ ధైర్యంతో కొంటారు. అయితే తెలుగులో వల్లభనేని అశోక్ పేట తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకోగా… ఓవర్సీస్ లో తెలుగు, తమిళ హక్కులను కలిపి 10 కోట్లకు అమ్మారు. అయితే ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు జోరెక్కువ. మరి ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు ఎన్టీఆర్, వినయ విధేయరామ, ఎఫ్ టు లను తట్టుకుని పెటా లాభాలను తేవాలంటే కాస్త కష్టమైనా పనే. మరి అక్కడ పేట బ్రేక్ ఈవెన్ రావాలంటే ఎలా లేదన్నా.. 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. కానీ తెలుగు సినిమాల హడావిడిలో పెటా 2.5 మిలియన్ డాలర్లు వసూలు చెయ్యడం సామాన్యమైన విషయం కాదు. అందులోను రజిని సినిమాలకు క్రేజ్ బాగా పడిపోయింది. మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి ఓవర్సీస్ లో తెలుగు సినిమాల హడావిడిలో పేట పరిస్థితి ఏమిటో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/హైపర్-ట్రైలర్-ఇవాళే-2483/ | రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హైపర్ చిత్రం ట్రైలర్ విడుదల శుక్రవారం హైదరాబాదులో జరగబోతోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలుగా తయారవుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు. ట్రైలర్ మరియు జూక్ బాక్స్ ఆడియో విడుదల హైదరాబాద్ లోని జెఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతోంది. |
https://www.telugupost.com/crime/road-accident-happened-in-andhra-pradesh-private-travel-bus-overturned-1538282 | ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట లింగంగుంట్ల వద్ద అదుపుతప్పి బస్సు ప్రమాదానికి గురయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులున్నారు. హైదరాబాద్ నుంచి...హైదరాబాదు నుంచి కామాక్షి ట్రావెల్ బస్సు చిలకలూరిపేట మీదుగా కందుకూరు వెళ్లే క్రమంలో చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. అందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని,108 అంబులెన్సుల ద్వారా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. |
https://www.telugupost.com/movie-news/ntr-new-film-title-71155/ | ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈ రోజు సాయంత్రం 4.30 కి ఎన్టీఆర్ న్యూ లుక్ బయటికొస్తుంది. అయితే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాపై ట్రేడ్ లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి, కాదు భారీ అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ గత సినిమా పెద్ద డిజాస్టర్ అయినా అయన దర్శకత్వానికి భారీ క్రేజ్ ఉంది. అయితే ఎన్టీఆర్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ని కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేసే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది.టైటిల్ అదేనా...?ఇప్పటికే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ గా 'అసామాన్యుడు' వాడుకలో ఉండగా నిన్నటికి నిన్న 'రా రా కుమారా' అనే టైటిల్ వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ టైటిల్ ని, ఈ సినిమా లో ఎన్టీఆర్ పేరు కు లింక్ చేస్తూ 'అరవింద సమేత సిద్దార్ద్' అయినా, లేదంటే 'అరవింద సమేత రాఘవ' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని చిత్ర బృందం ఫైనల్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫ్యామిలీ బాయ్ అండ్ లవర్ బాయ్ లా కనబడతాడని అలాగే ఎన్టీఆర్ పాత్ర పేరుతోనే ఈ సినిమా టైటిల్ ఉంటుందంటూ వార్తలొస్తున్నాయి.సీనియర్ హీరోయిన్ కోసం పోటాపోటీ...పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ రంభ నటిస్తుందనే టాక్ కూడా ఉంది. మరి ఫైనల్ గా సీనియర్ హీరోయిన్ గా త్రివిక్రమ్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడేమో గాని ఆ పాత్రకి మీనా, లయ, రంభ పేర్లు వినబడుతున్నాయి. ఇకపోతే హారిక అండ్ హాసిని బ్యానర్ మీద రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తుండగా ఈ సినిమా ని దసరాకి విడుదల చెయ్యాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు. |
Subsets and Splits