link
stringlengths 41
231
| text
stringlengths 28
5k
|
---|---|
https://www.telugupost.com/movie-news/చిరు-కి-అక్కడేం-పని-25381/ | మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకొని జూన్ లో విడుదలకు సిద్దమవుతున్నా కూడా ఆ చిత్రానికి సంబందించిన టీజర్ గాని మహేష్ బాబు లుక్ గాని ఇంతవరకు బయటికి రాలేదు. మరి మహేష్ - మురుగదాస్ మనసులో ఏముందో తెలియదు గాని ఆ చిత్ర విశేషాలు మాత్రం మీడియాకి పొక్కకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు కొత్త చిత్ర లుక్ కోసం మొహం వాచిపోయారు. ఇక ఈ సినిమాకి టైటిల్ అంటూ కూడా ఏది ఫైనల్ చెయ్యలేదు. ఏదో 'సంభవామి' అనే టైటిల్ ని మాత్రం మహేష్ బాబు చిత్ర టైటిల్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే మహేష్ చిత్రం సాంగ్ షూటింగ్ ఒకటి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. స్పెషల్ గా వేసిన ఒక సెట్ లో మహేష్ సాంగ్ షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతుండగా అక్కడ మెగా స్టార్ చిరు ప్రత్యక్షమవడంతో సెట్ అంతా సందడిగా మారిపోయింది. ఇక చిరు డైరెక్టర్ మురగదాస్, మహేష్ బాబు తో కలిసి ఆ సాంగ్ రషెస్ ని తిలకించారట. అయితే సడన్ గా అక్కడికి చిరంజీవి వచ్చేసరికి ముందు యూనిట్ సభ్యులతో పాటు మహేష్ బాబు ఆశర్యపోయినప్పటికీ... చిరంజీవి తో కలిసి మహేష్ కూడా కలిసిపోయి సందడి చేశారట . అయితే చిరు అక్కడ ప్రత్యక్షమవడానికి కారణం మాత్రం చిరంజీవి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్లగా.... మహేష్ చిత్రం కూడా అక్కడే షూటింగ్ జరుపుకోవడంతో చిరు సర్ప్రైజింగ్ గ మహేష్ బాబు చిత్ర సెట్స్ కి వెళ్ళాడట.మరి మెగా స్టార్, సూపర్ స్టార్ ఒకే చోట ఇలా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇక చిరు, మురుగదాస్, మహేష్ కలిసి మహేష్ చిత్ర రషెస్ చూస్తున్న పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లా పాకిపోయింది మీరు ఒకసారి ఆ పిక్ ని తిలకించండి. |
https://www.telugupost.com/movie-news/tollywood-hero-naga-shourya-is-set-to-tie-the-knot-with-anusha-1447532 | 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో వచ్చి.. అమ్మాయిల మదిని దోచుకున్న ఆరడుగుల అందగాడు, హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడట. తెలుగు తెరపై హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దాదాపు పుష్కరకాలం.. అంటే పన్నెండేళ్లు కావొస్తోంది. 12 ఏళ్లలో 24 సినిమాలు చేశాడు. 24వ సినిమా అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. త్వరలోనే మరో రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. రొమాంటిక్ హీరోగా ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసిన నాగశౌర్య.. విభిన్న కథలపై దృష్టిపెడుతుంటాడు.తాజాగా.. నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ వార్త బయటికొచ్చింది. ఇండస్ట్రీలో పీఆర్ గా ఉన్న వంశీ కాక ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాగశౌర్య పెళ్లి కొడుకు అవుతున్నాడనే విషయాన్ని ట్వీట్ చేశారు. అనూష అనే అమ్మాయితో శౌర్య వివాహం జరగనుందని.. ఈ నెల 19, 20 బెంగుళూరులో ఘనంగా వివాహ వేడుకలు జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా.. ఇంతకీ నాగశౌర్యని చేసుకోబోయే ఆ లక్కీ అమ్మాయి అనూష ఎవరు? ఆమె ఫ్యామిలీ నేపథ్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది.Charming Hero @IamNagashaurya is set to tie the knot with #AnushaGrand wedding celebrations are to be held on 19th & 20th NOV in Bengaluru ❤️Best wishes to the new couple ✨ pic.twitter.com/H7BLXqQnQ7— Vamsi Kaka (@vamsikaka) November 10, 2022 |
https://www.telugupost.com/andhra-pradesh/jana-sena-chief-and-deputy-chief-minister-pawan-kalyan-has-a-big-task-ahead-of-him-many-janasena-leaders-are-waiting-for-his-decision-1547164 | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు పెద్దటాస్క్ ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎంతో మంది జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో పవన్ కల్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. పవన్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. అలా అని పవన్ కల్యాణ్ తొలి నుంచి చెబుతున్నట్లుగానే ఒక వ్యూహం ప్రకారం గత ఎన్నికల సమయంలో ముందుకు వెళ్లారు. కూటమి ఏర్పాటుతో పాటు ఇబ్బందులు లేకుండా సీట్ల పంపిణీలో కూడా ఆయన కీలక భూమిక వహించారు. జగన్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఒకింత తగ్గడం మంచిదని ఆయన నిర్ణయించుకుని 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేశారు.పర్సెంట్ స్ట్రయిక్ రేటు...దీంతో మొన్నటి ఎన్నికల్లో జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటు వచ్చింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు. అంటే పవన్ ఆలోచన మేరకు తీసుకున్న నియోజకవర్గాల్లో ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ క్యాడర్ కూడా పనిచేశాయి. అదే సమయంలో టీడీపీ, బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ జనసేన కార్యకర్తలు ఎన్నిక తమది అని భావించి పోలింగ్ కు సహకరించారు. ఓట్ల బదిలీ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలకు గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఎందుకంటే టీడీపీకి ఎన్నడూ రాని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే ఇందుకు కారణం.ఓట్ల బదిలీ...కులాలు, అభిమానులు అందరూ గంపగుత్తగా టీడీపీకి ఓటు వేశారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబును, మోదీని కాపు సామాజికవర్గం ప్రజలు, పవన్ అభిమానులు చూడలేదు. కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే చూసి ఓటు వేశారు. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇప్పటికే దీనిపై పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చర్చించారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వారితో పాటు పార్టీ కోసం కష్టపడిన వారు తమకు ఏదో ఒక పదవిని పవన్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఆ దిశగా అనేక మంది ఇప్పటికే పార్టీ నేతలకు తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలిసింది. బాబు నిర్ణయం...కానీ నామినేటెడ్ పోస్టుల్లో 65 శాతం టీడీపీ తీసుకోవాలనుకుంటుందని సమాచారం. 25 శాతం పోస్టులు జనసేనకు ఇవ్వాలని భావిస్తుంది. పది శాతం పదవులను బీజేపీకి ఇవ్వాలన్న నిర్ణయానికి చంద్రబాబు దాదాపుగా వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. టీడీపీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో సహజంగా ఆ పార్టీ ఎక్కువ పదవులు తీసుకునే అవకాశముంది. అయితే జనసేన నేతలు మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకున్నా నామినేటెడ్ పదవుల విషయంలో పవన్ కల్యాణ్ రాజీ పడతారా? లేక చంద్రబాబును ఒప్పించి ఎన్నికల్లో కష్టపడ్డ నేతలను మంచి, కీలకమైన పోస్టులను తెచ్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. |
https://www.telugupost.com/crime/encounter-took-place-in-pulwama-in-jammu-and-kashmir-aterrorist-was-killed-in-the-encounter-1359086 | జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది మరణించాడు. మరో ఉగ్రవాదులను భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. పుల్వామాలోని నైనా బట్పోరాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందింది. దీంతో వారు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. ఉగ్రవాదులు ఒకచోట దాక్కుని ఉండగా భద్రతాదళాలు లొంగిపోవాలని హెచ్చరించాయి.ఇద్దరిని అదుపులోకి.....అయినా లెక్క చేయకుండా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాదళలాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. ఇద్దరిని భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఒక ఉగ్రవాది హత మయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మృతి చెందిన ఉగ్రవాది జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాడిగా గుర్తించారు. |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-watch-guntur-kaaram-at-sudarshan-theatre-with-family-1514895 | Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మాస్ మసాలా చిత్రం 'గుంటూరు కారం' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ నుంచి రిలీజైన మహేష్ మాస్ లుక్స్, సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో వరల్డ్ వైడ్ గా చిత్రం రికార్డు స్థాయిలో రిలీజ్ అయ్యింది. అయితే థియేటర్స్ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.మహేష్ అభిమానులు సైతం ఈ సినిమా పై, త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తున్నారు. సినిమా కోసం మహేష్ ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ పై కనిపిస్తుందని, కానీ త్రివిక్రమ్ మాత్రం తన కథ, మాటల్లో ఎటువంటి ఎమోషన్ లేకుండా తెరకెక్కించారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ అందించిన థమన్ పై అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మూవీని చూసేందుకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ కి వచ్చారు. అయితే థియేటర్ లో మహేష్ చాలా డల్ గా నిరాశలో కనిపించారు. మహేష్ మొహంలో ఎప్పుడు నవ్వు కనిపించేది. కానీ నేడు థియేటర్ లో మహేష్ డల్ గా ఉండడంతో.. అభిమానులు సైతం తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ని ఇలా చూడలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.One man show doesn't work everytime Correct gaa vadukondi raa babu villa ni I can’t see them sad 🥺#MaheshBabu - #VijayDeverakonda pic.twitter.com/Uj79Hu7ZTq— THE prashanth (@prashanthmacha1) January 12, 2024 Actor Mahesh Babu reached Sudharshan theatre at RTC 'X' road in Hyderabad, along with his family members for watching his movie 'Guntur Kaaram' with fans.#MaheshBabu #MaheshBabu𓃵#GunturuKaaram #GunturKaaram #GunturKaaramOnJan12th #Hyderabad #Sudarshan35MM #MaheshBabuFans pic.twitter.com/deMA8QWdcn— Surya Reddy (@jsuryareddy) January 12, 2024 ఇక గుంటూరు కారం కథ విషయానికి వస్తే.. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో కథలని మళ్ళీ రీమేక్ చేసి చూపించారని అంటున్నారు. అమ్మ కోసం కొడుకు చేసే ఫైట్ గుంటూరు కారం. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక్కటే సినిమాకి ప్లస్ పాయింట్ అంటూ చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/bb3-title-update-189233/ | బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న BB3 సినిమా ముచ్చట్లు సోషల్ మీడియాలో చాలా తక్కువగా వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. అటు చూస్తే మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లో హడావిడి చేస్తున్నాయి. మరోపక్క సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ రచ్చ చూసిన నందమూరి ఫాన్స్ చాలా డల్ అయ్యారు. బాలయ్య BB3 నుండి అప్ డేట్ ఇవ్వాలంటూ బోయపాటిని అడుగుతున్నారు. చాలా సీరియస్ గా షూటింగ్ చిత్రీకరణలో ఉన్న బోయపాటి BB3 షూటింగ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ముందుకురావడం లేదు. ఇంతవరకు టైటిల్ ఎనౌన్సమెంట్ లేదు.. సినిమా చూస్తే మే 28 న రిలీజ్ డేట్ ఇచ్చేశారనే కన్ఫ్యూజన్ లో ఫాన్స్ ఉన్నారు.అయితే ఈ ఉగాదికి BB3 టైటిల్ ఇవ్వొచ్చని టాక్ నడుస్తున్న టైం లో ఉగాది రోజున అంటే ఏప్రిల్ 13 మద్యాన్నం 12.33 గంటలకి బాలయ్య – బోయపాటి BB3 టైటిల్ ఇవ్వబోతుననట్టుగా అనౌన్స్ చేసింది టీం. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న BB3 పై మంచి అంచనాలున్నాయి. అలా వైకుంఠపురములో, రీసెంట్ గా వకీల్ సాబ్ హిట్ జోష్ లో ఉన్న థమన్ మ్యూజిక్ BB3 కి ప్లస్ అవుతుంది అని ఫాన్స్ నమ్ముతున్నారు. ఇక ఉగాదికి టైటిల్ ఎనౌన్సమెంట్ చేస్తే.. అప్పటినుండి అధికారికంగా BB3 ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తుందట టీం. అన్నట్టు #BB3 టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఉగాది రోజున BB3 టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ నే టీం అనౌన్సమెంట్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అప్ డేట్ తో బాలయ్య ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-meeku-matrame-chepta-collections-139311/ | విజయ్ దేవరకొండ హీరోగా సినిమా వస్తే… దానికి యావరేజ్ టాక్ వచ్చినా ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. ప్లాప్ టాక్ వచ్చినా.. మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. కానీ నిర్మాతగా మారి సినిమా తీసి దాన్ని తనకున్న క్రేజ్ తో అమ్మేసి చేతులు దులుపుకోకుండా…. ఆ సినిమాని బాగా ప్రమోట్ చేసినా.. సినిమాకి ప్లాప్ టాక్ పడితే.. దాన్ని ఆడించడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సినిమాలో విజయ్ హీరో కాదు, కేవలం నిర్మాత మాత్రమే గనక. తాజాగా విజయ్ దేవరకొండ నిర్మాతగా వచ్చిన మీకు మాత్రమే చెప్తా సినిమాకి ప్లాప్ టాక్ పడింది. కామెడీ బావున్నప్పటికీ.. సినిమాలో ఉన్న నెగెటివ్ పాయింట్స్ తో సినిమాకి ప్లాప్ టాక్ పడింది. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కూడా సినిమాని నిలిబెట్టలేకపోయాయి. ఫస్ట్ డే కాస్త పర్వాలేదనిపించిన మీకు మాత్రమే చెప్తా సినిమా ఫస్ట్ వీకెండ్ లో కాస్త పుంజుకుంటుంది అనుకుంటే… అదేం లేదు… వీకెండ్ లో మీకు మాత్రమే చెప్తా థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడాల్సింది పోయి బోసిపోయాయి. మరి వీకెండ్ లోనే సత్తా చాటని సినిమా వీక్ డేస్ లో మరింత వీక్ అవడం ఖాయం. అయితే తక్కువ మొత్తానికే థియేట్రికల్ రైట్స్ అమ్మినప్పటికీ… ఇప్పుడు బయ్యర్లు బాగా నష్టపోయేలా కనబడుతున్నారు. 40 లక్షలకు కొంటే ఇప్పటికి 10 లక్షలు కూడా రాని బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారని టాక్. కొన్ని ఏరియాస్ లో బయ్యర్లకు మినిమమ్ ఖర్చులు కూడా రావని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/charan-next-movie-74721/ | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా తెరకెక్కిన చిత్రం 'తేజ్ ఐ లవ్ యూ'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అథితిగా వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడారు. క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు గారి కోసమే నేను ఇక్కడకి వచ్చాను కానీ తేజు గురించి కాదు అని ఆయన అన్నారు.ఆయనతో చిరంజీవి కి అనుబంధం గుర్తు పెట్టుకుని, కెఎస్ రామారావు గురించి తన కొడుకు రామ్ చరణ్ తనంతట తాను ప్రస్తావించి, ఓ సినిమా చేస్తానని చెప్పాడని చిరు ప్రకటించారు. రాజమౌళి సినిమా తర్వాత చరణ్.. కెఎస్ రామారావు గారితో ఓ సినిమా చేస్తాడని స్పష్టం చేశారు. చరణ్ తో మాట్లాడాకే నేను ఇక్కడ ప్రకటన చేస్తున్న అని చిరంజీవి తెలిపారు.అంతేకాకుండా నిన్న చిరంజీవి.. పవన్ కళ్యాణ్ - కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన 'తొలిప్రేమ' సినిమా గురించి ప్రస్తావిస్తూ... నా తమ్ముడు అంటూ ఆ సినిమా ముచ్చట్లు, వైట్ అండ్ వైట్ లో పవన్ గెటప్ ను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. మా ఫామిలీలో ఎవరైనా తప్పు చేస్తే ముందుగా నేనే మందలిస్తానని కానీ.. తేజు ఇప్పటివరకు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. ఇకపై ఇవ్వడు కూడా అని చిరంజీవి తెలిపారు |
https://www.telugupost.com/movie-news/రంగస్థలం-సినిమా-అందుకే-ల-54273/ | రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో వస్తున్న చిత్రం రంగస్థలం. ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సి వుంది కానీ.. ఈ సినిమా షూటింగ్ బాగా లేట్ అవుతూ వచ్చింది. అందుకే సంక్రాంతికి రావాల్సిన రంగస్థలం మార్చ్ కి వెళ్ళిపోయింది. అయితే సమంత, రామ్ చరణ్ ఈ చిత్రానికి సరిగా డేట్స్ కేటాయించక పోవడం వలెనే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమైనదని ప్రచారం జరుగుతోంది. మొదటి నుండి ఈ సినిమాపై ఏదొ ఒక పుకారు వచ్చి పడుతుంది.అయితే లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా షూట్ కి సంబందించిన హార్డ్ డిస్క్ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కొన్ని సన్నివేశాలు డిలీట్ అయినట్లు తెలుస్తోంది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం షాక్ లో ఉందట. ఇంకా చేసేది ఏమి లేక డిలీట్ అయిన సీన్స్ ని దర్శకుడు సుకుమార్ మళ్ళీ రీషూట్ చేస్తున్నారట అందుకే సినిమా లేట్ అవుతుందని ఇప్పుడు తాజా టాక్ |
https://www.telugupost.com/movie-news/gst-notices-to-mahesh-babu-103580/ | మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాదు వివిధ ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ కు ఊహించని షాక్ తగిలింది. మహేష్ కు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ షాకిచ్చింది. గత 9 ఏళ్లుగా మహేష్ ఎగవేస్తున్న పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుతూ ఆయనకు నోటీసులు పంపింది. స్టార్ ఇమేజ్ ను సంపాందించిన మహేష్ కు ఇటువంటి నోటీసులు రావడం షాకింగే. ప్రమోషన్ కార్యక్రమాలు, బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన ప్రకటనలకు గాను లభించిన మొత్తంపై చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదని పేర్కొంది. వెంటనే చెల్లించాలని నోటీసులు అంతే కాదు మహేష్ బ్యాంకు అకౌంట్స్ సీజ్ చేసింది. 2007-2008 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని తెలిపింది. వడ్డీలు, పన్ను, జరిమానా రూపంలో మొత్తంగా 73.5 లక్షలు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొంది. మరి మహేష్ బాబు లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవుతాడో చూడాలి. ఫ్యాన్స్ కి ఇటువంటి న్యూస్ కొంచం ఇబ్బంది కలగొచ్చు. మహేష్ ఎందుకని టాక్స్ కట్టకుండా ఉన్నాడు అనేది తెలియాలి. తప్పు ఎక్కడ జరిగిందో మహేష్ కే తెలియాలి. |
https://www.telugupost.com/movie-news/ram-charan-pooja-hegde-acharya-look-189509/ | చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మే 13 న విడుదలకు సిద్దమవుతుంది. కరోనా కారణంగా షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే అనుకున్న టైం కే ఆచార్య వచ్చేస్తుంది. ఇకపోతే ఆచార్య సినిమాలో చిరు తో పాటుగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తండ్రి కొడుకుల మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ద గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా చరణ్ పుట్టిన రోజున ఆచార్య నుండి సిద్ద లుక్ ని రివీల్ చేసిన టీం ఉగాది రోజున సిద్ద ని తన ప్రేమికురాలితో రొమాంటిక్ గా రివీల్ చేసింది. ఆచార్య లో రామ్ చరణ్ సిద్ద పాత్రకి జోడిగా టాప్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుంది. సిద్ద – నీలాంబరి పాత్రధారి పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ ని ఉగాది కానుకగా రిలీజ్ చేసింది ఆచార్య టీం. రామ్ చరణ్ మెడలో రుద్రాక్ష మాలతో వైట్ టి షర్ట్ తో పూజ హెగ్డే ని అలా రొమాంటిక్ గా పట్టుకుని ఉన్న పోస్టర్ క్యూట్ గా రొమాంటిక్ గా ఉంది. పూజ హెగ్డే కూడా కాస్త డీ గ్లామర్ గా అనిపిస్తూ ఓల్డ్ లుక్ లో కనిపిస్తుంది. సారీ లో పూజ హెగ్డే నీలాంబరిగా చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. రామ్ చరణ్ తో ఫస్ట్ టైం ఇంత రొమాంటిక్ గా పూజ హెగ్డే నటించడం. గతంలో చరణ్ తో రంగస్థలం లో ఓ ఐటెం సాంగ్ లో పూజ హెగ్డే స్టెప్స్ వేసినా.. ఆచార్య లో వీళ్లది ఫ్రెష్ జోడిగా కనిపిస్తుంది. ఆచార్యలో చరణ్ – పూజ కాంబో పై ఫాన్స్ లో మంచి అంచనాలున్నాయి. |
https://www.telugupost.com/movie-news/pantham-teaser-review-73853/ | ప్రస్తుతం హీరో గోపీచంద్ కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్ లో 'పంతం' అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గోపీచంద్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేసింది టీం.పవర్ ఫుల్ డైలాగ్ లతో...గోపీచంద్ సరికొత్త లుక్ తో కనిపించిన ఈ టీజర్ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి కూడా ప్రాధ్యానత ఇచ్చారని అర్ధం అవుతుంది. టీజర్ లో గోపీచంద్ కోర్ట్ లో చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్ అయ్యే అవకాశం ఉంది. "ఫ్రీగా ఇళ్లిస్తాం .. కరెంట్ ఇస్తాం .. రుణాలు మాఫీ చేస్తాం .. ఓటుకు ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక .. మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి .. అవినీతిలేని సమాజం కావాలి .. కరెప్షన్ లేని కంట్రీ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయ్" అంటూ పవర్ ఫుల్ గా చెప్పాడు హీరో గోపీచంద్. టీజర్ మొత్తానికి ఆ సీన్ హైలైట్ గా నిలిచింది. టీజర్ చూస్తుంటే ఈసారి గోపి కచ్చితంగా హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఈ సినిమాకు ప్లస్ అవ్వనుంది. ఇక హీరోయిన్ మెహ్రీన్ ఎప్పటిలానే చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. |
https://www.telugupost.com/movie-news/chirajeevi-sye-raa-narasimha-reddy-collections-139072/ | ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 32.76 సీడెడ్ 19.35 నెల్లూరు 4.62 కృష్ణ 7.53 గుంటూరు 9.69 వైజాగ్ 16.62 ఈస్ట్ గోదావరి 9.21 వెస్ట్ గోదావరి 6.61 టోటల్ ఏపీ & టీస్ షేర్ 106.39 కర్ణాటక 16.85 తమిళనాడు 2.70 కేరళ 0.90 ఇతర ప్రాంతాలు 6.70 నార్త్ అమెరికా 9.28 గల్ఫ్ 1.66 ఆస్ట్రేలియా 0.95 మలేషియా 0.36 టోటల్ వరల్డ్ వైడ్ 145.79 |
https://www.telugupost.com/crime/cbi-conducts-searches-across-the-country-searches-are-conducted-in-many-parts-of-the-country-1441100 | దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది. ఆపరేషన్ గరుడ పేరుతో ఈ తనిఖీలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. ఇంటర్ పోల్ సహకారంతో ఈ సీబీఐ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. ఈ దాడుడ్లోల 150 మంది డ్రగ్ ప్లెడర్స్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నేరుగా దేశంలోకి ఉగ్రవాద సంస్థలు డ్రగ్స్ ను డంప్ చేస్తున్నాయి. తీర ప్రాంతాల నుంచి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.ఇంటర్పోల్ సహకారంతో...వీరి నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ పోల్, సీబీఐ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోతో కలసి ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ దాడులు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశముంది. ఈ దాడుల్లో రాష్ట్ర పోలీసులు కూడా పాల్గొంటున్నారు. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకునే లక్ష్యంగా ఈ దాడులు చేస్తుంది. |
https://www.telugupost.com/movie-news/ఒకే-ఫ్యామిలిలో-మూడు-నిర్-53955/ | స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత.... హీరో నాగ చైతన్య తో పెళ్లి తరువాత పూర్తి స్థాయి అక్కినేని కోడలిగా మారిపోయింది. అయితే అక్కినేని ఫ్యామిలీ లోకి వెళ్ళాక సమంత ఒక కొత్త అవతారం ఎత్తబోతుంది. అది కూడా ప్రొడ్యూసర్ గా.... అవును సమంత త్వరలో నాగ చైతన్య తో కలిసి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయబోతుంది అని ఫిలిం నగర్ టాక్. కన్నడలో హిట్ మూవీ అయిన 'యూటర్న్'ని తెలుగులో సమంతా రీమేక్ చేస్తుంది. చైతుతో కలిసి ఓ కొత్త బ్యానర్ స్థాపించి.... ఆ బ్యానర్ లో మొదటి సినిమా గా ఈ మూవీ ని నిర్మించాలని అనుకుంటుంది సమంతా. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ పై మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్న నాగార్జున…. కొత్తగా 'మనం' అనే పేరు వచ్చేలా మనం ఎంటర్ ప్రైజెస్ అని స్థాపించి 'హలో' మూవీ ని ప్రొడ్యూస్ చేసాడు నాగార్జున. ఈ మనం ఎంటర్ ప్రైజెస్ పై నాగ చైతన్య ఇంకా అఖిల్ తో కలిసి మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తాడట నాగార్జున. ఇప్పుడు ఈ బ్యానర్ కాకుండా ఆ కుటుంబం నుంచి మరో బ్యానర్ ని సమంతా ఏర్పాటు చేస్తుండటంతో అక్కినేని ఫాన్స్ ఫుల్ హ్యాపి గా ఉన్నారు.ఈ లెక్కన అక్కినేని ఫ్యామిలీ నుండి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, మనం ఎంటర్ ప్రైజెస్, ఇపుడు కొత్తగా నాగ చైతన్య - సమంత ల నిర్మాణ సంస్థ తో కలిపి 3 నిర్మాణ బ్యానర్స్ అవుతాయన్నమాట. |
https://www.telugupost.com/movie-news/vijay-and-yash-success-103302/ | కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై సంచలన విజయాన్ని మూట గట్టుకుంది. సినిమాకి తెలుగు, తమిళంలో మిక్స్డ్ రివ్యూస్ పడినప్పటికీ… తొలి 3 రోజుల్లో 58 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన కెజిఎఫ్ గ్రాస్ పరంగా మొదటి వారంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా చెబుతున్నారు. తొలిరోజు టాక్ చూసి.. తెలుగు, తమిళంలో కెజిఎఫ్ కి థియేటర్స్ పెంచడంతో ఇక్కడ కూడా నెట్ వసూళ్లు పెరిగాయనేది తెలుగు, తమిళంలో కొన్న నిర్మాతల మాట. కన్నడలో తొలి 100 కోట్ల క్లబ్ చిత్రంగానూ కెజిఎఫ్ సంచలనం సృష్టిస్తోంది. విజయ్ తో పోలిక… భారీ మాఫియా బ్యాక్డ్రాప్, కోలార్ బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్, క్లాస్ అనే తేడా లేకుండా మైమరిపిస్తోంది. అయితే, కన్నడలో ఈ యంగ్ హీరో కెజిఎఫ్ తో 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం… తెలుగులో మరో యంగ్ హీరో కూడా ఈ ఏడాది స్టార్ హీరోల రేంజ్ లో 100 కోట్లు సాధించడంతో ఇద్దరినీ పోలుస్తున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ గీత గోవిందం ఈ ఏడాది రిలీజై 100 కోట్ల క్లబ్ లో చేరింది. అలాగే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక డ్రైవర్ కొడుకైన యశ్ 100 కోట్ల క్లబ్ సినిమాని అందించడం ఓ సెన్సేషన్ అంటూ యశ్ ని క్రిటిక్స్ తో సహా కన్నడ సినీప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/raviteja-gopichand-168014/ | రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న క్రాక్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణలో క్రాక్ ఉన్నట్లుగా ప్రకటించడం కరోనా తర్వాత షూటింగ్ కి రవితేజ వెళ్లిన విషయాన్నీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అయితే రవితేజ క్రాక్ తో పాటుగా వరసగా సినిమాలు చేస్తున్నాడు. క్రాక్ తర్వాత రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో రవితేజ ఖిలాడీ సినిమా చెయ్యబోతున్నాడు. అయితే ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడనే టాక్ ఉంది. తాజాగా రవితేజ డ్యూల్ రోల్ కాకుండా మరో హీరో కూడా ఖిలాడీలో నటించబోతున్నాడని… అయితే ఈ మధ్యన సినిమాల్తో క్రేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ కానీ, లేదంటే హీరో శ్రీ విష్ణు కానీ.. రవితేజ ఖిలాడీ లో ఆ పాత్రకి సెట్ అవుతారని… అందుకే రమేష్ వర్మ అటు శ్రీ విష్ణు, ఇటు సత్యదేవ్ లను సంప్రదిస్తున్నదని అంటున్నారు. అలా హీరోలే కాకుండా ఈ సినిమాలో ముగ్గురు మెయిన్ విలన్స్ కూడా ఉండబోతున్నారట. అందులో ఒక విలన్ గా సోను సూద్ ని తీసుకునే యోచనలో ఉన్నారట. ఎలాగూ సోను సూద్ ఈమధ్యన బాగా పాపులర్ అవడం తో విపరీతమైన క్రేజ్ వచ్చింది కాబట్టే.. సోను సూద్ నే మెయిన్ విలన్ గా తీసుకుంటారని వినికిడి. |
https://www.telugupost.com/movie-news/విజయ్-తన-మనుసులో-మాట-బయటప-51727/ | పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు మనవాడు. అయితే విజయ్ ఎంచుకునే కథ ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు గని... ఆ సినిమాపై కొంచెం భారీ అంచనాలు ఉంటాయని చెప్పవచ్చు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ లో తెరకెక్కుతోన్న ఆ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా ఏదైనా కొత్తదనం ఉన్న కథలనే ఒకే చేస్తానని ఇంతకుముందు విజయ్ చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన ఒక కన్నడ సినిమా ఆడియో వేడుకలో తన మనసులోని కోరికను చెప్పాడు.రష్మిక మందాన్నా - గణేష్ కాంబినేషన్ లో చమక్ ఆడియో లాంచ్ కి వెళ్లిన విజయ్.. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఫ్తీ ట్రైలర్ ని చూసి నాకు కూడా ఇలాంటి గ్యాంగ్ స్టార్ సినిమా చేయాలనుంది అని తన మనసులో మాట చెప్పాడు. ఇంతే కాదు కన్నడ ఇండస్ట్రీపై ప్రశంసల జల్లును కురిపించారు. మరి మనవాడు బాడీ లాంగ్వేజ్ తగట్టు ఎవరన్నా దర్శకులు గ్యాంగ్ స్టార్ కథ రాసి విజయ్ ని డైరెక్ట్ చేస్తారో లేదో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/hero-vishwak-sen-said-that-he-was-disrespected-on-the-set-and-thats-why-he-was-absent-from-the-shoot-1446816 | తనకు సెట్ లో గౌరవం లేకుండా పోయిందని, అందుకనే తాను షూటింగ్ కు గైర్హాజరయ్యానని హీరో విశ్వక్ సేన్ తెలిపారు. చిన్న చిన్న సూచనలను తాను చేసినా అర్జున్ పట్టించుకోలేదని తెలిపారు. అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని అర్జున్ చెప్పడంతోనే తాను హర్ట్ అయ్యానని విశ్వక్ సేన్ చెప్పారు.నచ్చని పని చేయలేకనే...తన మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి తాను బయటకు వచ్చానని విశ్వక్ సేన్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్, చెక్ లు, డాక్యుమెంట్లు, నిర్మాత మండలికి పంపినట్లు ఆయన తెలిపారు. చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ పట్టించుకోకపోవడంపై తాను కలత చెందానని తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/సుచి-లీక్స్-గుండెల్లో-రై-25218/ | ఇప్పుడు సుచి లీక్స్ తమిళ ఇండస్ట్రీనే కాక తెలుగు ఇండస్ట్రీ ని తాకింది. ఒకప్పుడు నల్లధన కుబేరుల గుండెల్లో పనామా లీక్స్ ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో... ఇప్పుడు కోలీవుడ్ ని సుచి లీక్స్ అంతటి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఈ సుచి లీక్స్ ఏమిటా అనుకుంటున్నారా ? గత కొన్ని రోజుల నుండి సింగర్ సుచిత్ర తనని ధనుష్ చిత్ర బృందం వేధించిందని... ఈ విషయంలో హీరో ధనుష్ కూడా తనకి సపోర్ట్ చెయ్యలేదని ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయింది. ఇక తనని ఎలా వేధించారో కూడా కొన్ని ఫోటో లు తీసి మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫొటోస్ లో తన ముఖాన్ని మాత్రం దాచేసి చేతులని మాత్రమే హైలెట్ చేసింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సుచిత్ర భర్త కార్తీక్ లైన్ లోకొచ్చి తన భార్య అటువంటి ట్వీట్స్ ఏం చెయ్యలేదని... తన భార్య ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో స్పందించాడు. మరి ఆ హీరో ఫ్యాన్స్ నుండి సుచిత్రకి బెదిరింపులు రావడం మూలంగానే సుచిత్ర భర్త అలా ఆమె ఏమి చెయ్యలేదని చెప్పాడా? అనే అనుమానం మొదలైంది. అయితే ధనుష్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను ధనుష్ అంతటి హీరో మీద నింద మోపేంతటి గొప్పదానివా అంటూ ఆమెను నానారకాల ఇబ్బందులకు గురిచేస్తూ రచ్చ చేస్తున్నారు.ఇక ఆ రచ్చ ముగియకముందే సుచిత్ర మళ్ళీ ధనుష్ పర్సనల్ ఆల్బమ్ తోపాటు ఇంకొందరి తమిళ హీరోల బండారం బయటపెట్టింది. ఇక ధనుష్, త్రిషతో క్లోజ్ గా వున్న ఫొటోస్ తో పాటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పర్సనల్ ఫొటోస్ ని లీక్ చేసి పడేసింది. అనిరుధ్ తమిళ హీరోయిన్ ఆండ్రియాతో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా సింగర్ సుచిత్ర, శింబు, హన్సిక రొమాన్స్ ఫొటోలతో పాటు పనిలోపనిగా టాలీవుడ్ హీరో రానా మీద కూడా తన ప్రతీకారం తీర్చుకుంది. రానా ఒక పార్టీలో హీరోయిన్ త్రిషని గట్టిగా హాగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో పోస్ట్ చేసి అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ కి పెద్ద షాక్ ఇచ్చింది.అసలు ఇంతకుముందే రానా కి త్రిష కి ఎఫ్ఫైర్ ఉందని మీడియా కోడై కూసింది. కానీ అది నిజమని ఎక్కడా రుజువు కాలేదు. కానీ ఎప్పుడు సుచి లీక్స్ అది నిజమని నమ్మేలా చేసింది. మరి ఒక్క ధనుష్ మీద ఉన్న పగతో సుచిత్ర ఆయన రిలేటివ్ అనిరుధ్ తో పాటే శింబు, రానాల పరువు కూడా తీసిపారేసింది. అసలు సుచిత్రే ఈ పర్సనల్ ఫొటోస్ ని లీక్ చేసిందా? లేక ఇంకెవరన్నా ఇలా చేస్తున్నారా అని అందరూ అనుకుంటున్నారు. ధనుష్ ఫ్యాన్స్ చేసిన పనికి సుచిత్ర ఇలా పగ తీర్చుకుందని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరోపక్క ఈ లీక్స్ ని ఆపాలని కోలీవుడ్, టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగినట్టు వార్తలొస్తున్నాయి. |
https://www.telugupost.com/movie-news/akkineni-samantha-new-post-109959/ | టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లికి ముందు వేరు.. పెళ్లి తరువాత వేరు అన్నట్టు మారిపోయింది. పెళ్లి తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్ అక్కినేని ఫ్యాన్స్ నుండి ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. హనీమూన్ సమయంలో చైతుతో కలిసి దిగిన ఫొటోస్ విషయంలో.. పెళ్లి తరువాత రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం సినిమాలో చెర్రీకి లిప్లాక్ ఇచ్చినప్పుడు సమంత మీద తీవ్ర విమర్శలొచ్చాయి. నాగార్జున నుంచి చివాట్లు పడ్డట్లు కూడా వార్తలొచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా ‘డోంట్ కేర్’ ధోరణితోనే దూసుకెళ్తోంది సామ్. తెలుగమ్మాయిలా… ఇక తాజాగా ‘నేను మారిపోయానోచ్’ అంటూ ఇన్స్టాగ్రామ్లో కొన్ని ‘చీరకట్టు’ ఫోటోలు పెట్టి దండోరా వేసుకుంది. ఎన్నడూ లేని విధంగా చూడముచ్చటగా, పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించిన సమంత మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం ఈమెకు ఫాలోయర్స్ సంఖ్య కూడా 60 లక్షలకు చేరుతున్న సందర్భంగా ఖుషీగా ఉందంటూ ‘దిసీజ్ మీ’ అంటూ కన్నుగీటుతోంది. |
https://www.telugupost.com/crime/police-have-found-that-two-persons-were-behind-the-bodhan-riots-gopi-of-shiv-sena-was-found-to-be-involved-1360682 | బోధన్ అల్లర్ల వెనక ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. శివసేన కు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్లు గుర్తించారు. నెలరోజుల క్రితం బోధన్ మున్సిపాలిటీలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అయితే ఎప్పుడు విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న దానిపై కౌన్సిల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే శివసేనకు చెందిన గోపి, టీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ శరత్ తో కలసి శివాజీ విగ్రహ ప్రతిష్టకు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.ఆ ఇద్దరి వల్లనే.....ఎవరికీ తెలియకుండా గుప్పు చప్పుడు కాకుండా గోపి, శరత్ లు శివాజీ విగ్రహ ప్రతష్టాపన చేశారని పోలీసులు చెబుతున్నారు. అందువల్లనే అల్లర్లు చోటు చేసుకున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరి వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియవచ్చింది. పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-trivikram-guntur-kaaram-second-day-collections-report-1515177 | Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తి మాస్ రోల్ లో కనిపిస్తూ చేసిన సినిమా 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం జనవరి 12న రిలీజయింది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై భారీ హైప్ నెలకుండడంతో సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి ఓ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజైన ఈ చిత్రం.. 94 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనంగా మారింది.ఈమధ్య కాలంలో తెలుగు రీజినల్ సినిమాలు పెద్దగా సత్తా చాట లేకపోయాయి. ఈ సమయంలో గుంటూరు కారం టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. మొదటి రోజు 100 కోట్లకు చేరుకున్న కలెక్షన్స్ కౌంట్.. రెండో రోజు హనుమాన్, సైంధవ్ చిత్రాలతో పోటీపడి 33 కోట్ల గ్రాస్ ని నమోదు చేసింది. దీంతో రెండు రోజుల్లో ఈ చిత్రం మొత్తం మీద 127 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రూ.130 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సుమారు 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాలి. అంటే 135 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. ప్రస్తుతం పండుగ సమయం కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా గుంటూరు కారం పై ఆదరణ పెరగడంతో.. ఈ మూవీ 270 కోట్ల మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు.రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 💥#GunturKaaram grosses over 𝟏𝟐𝟕 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 in 2 Days Worldwide 🔥ఈ భోగికి మీలో ఉన్న Egos & Haterd కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికి భోగి శుభాకాంక్షలు ✨Watch the #BlockbusterGunturKaaram at cinemas… pic.twitter.com/hh05ln6Qzj— Guntur Kaaram (@GunturKaaram) January 14, 2024 |
https://www.telugupost.com/movie-news/చిరు-సై-రా-త్వరలోనే-44328/ | ఈ ఏడాది ఖైదీ తో హిట్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టడానికి ఆచి తూచి అడుగు వేస్తున్నాడు. చిరు 151 వ ప్రాజెక్ట్ 'సై రా' చిత్రం ఆఫీషియల్ గా మొదలైనప్పటికీ ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాలుగు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో నాలుగు భాషల నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారనే విషయాన్ని కూడా సై రా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే ఈచిత్రం నుండి ఇద్దరు టాప్ టెక్నీషియన్స్ తప్పుకున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్, సినిమాతో గ్రాఫర్ రవి వర్మన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడం కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని రకాలుగా సంసిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ పనుల కోసం సురేందర్ రెడ్డి లండన్ కి వెళ్లినట్లుగా చెబుతున్నారు. అక్కడ సురేందర్ రెడ్డి ఒక ప్రముఖ VFX స్టూడియోస్ తో ఒప్పందం కుదుర్చుకొని త్వరలోనే షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఇక హీరో చిరు కూడా 'సైరా నరసింహారెడ్డి' లుక్ కోసం బాగా శ్రమిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మరి చిరు సై రా నరసింహ రెడ్డి గా ఎలా కనిపిస్తాడా అనే క్యూరియాసిటీతో మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సైరా కోసం బ్రిటిష్ కాలంనాటి సెట్టింగ్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియో లో భారీ సెట్ ను వేసాడట. ఇక ఆ సెట్ అలనాటి బ్రిటిష్ సామ్రాజ్యం మరియు రాజుల కోటలతో ఆ సెట్ ఉండనుందనే విషయం తెలిసిందే. ఇక దీన్ని బట్టి సై రా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందన్నమాట. |
https://www.telugupost.com/movie-news/రిలీజ్-సాహసం-వెనుక-సీక్ర-13631/ | ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా రేపు నవంబర్ 18 న విడుదలకు సిద్ధమైంది. మోడీ పెద్ద నోట్ల రద్దు కి ఏమాత్రం భయపడకుండా ఈ సినిమాని విడుదల చెయ్యడానికి నిఖిల్ సిద్ధమయ్యాడు. ఇంతకుముందు నాగ చైతన్య కూడా మోడీ దెబ్బకి భయపడకుండా సాహసం శ్వాసగా సాగిపో సినిమాని విడుదల చేసి దమ్ము చూపించాడు. నాగ చైతన్యలాగే నిఖిల్ కూడా తన సినిమాని ధైర్యంగా విడుదల చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రయిలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మొదటి లుక్ నుండే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా... ఈ ట్రైలర్ తో తన సత్తా చాటిందనే చెప్పాలి. అందుకే ఈ సినిమాని ధైర్యం గా విడుదల చెయ్యడానికిసిద్ధపడ్డారని ఈ ట్రైలర్ చూసిన వాళ్లకి అర్ధమవుతుంది.అసలు ఆత్మలంటేనే నమ్మకం లేని కుర్రాడుని ఒక ఆత్మ వెంటాడడం... ఆత్మ నుండి తప్పించుకునేందుకు మహిషాసుర మర్ధిని గుడికి వెళ్లమని ఆతనికి ఓ మాంత్రికుడు చెప్పడం.... ఆత్మనుండి తప్పించుకుని ప్రాణాల కోసం పరిగెత్తడం... తాను అందరిలాంటి అమ్మాయిని కానని .. ఆత్మననే అర్థంలో ఓ హీరోయిన్ చెప్పడం వంటి విషయాలు ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమా విడుదలై థెటర్స్ లో ప్రభంజనం సృష్టించడమే మిగిలింది. ఇక ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా హేబా పటేల్, నందిత నటిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/bheemla-nayak-pre-release-event-wont-be-happening-today-announced-sithara-entertainments-1355694 | పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఈనెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు సాయంత్రం (ఫిబ్రవరి 21) భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కావాల్సి ఉంది. ఈ ఈవెంట్ లోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Also Read : ఏపీలో రెండ్రోజులు సంతాప దినాలు.. ఎల్లుండి నెల్లూరులో మంత్రి అంత్యక్రియలుకానీ.. ఈరోజు ఉదయం ఏపీమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో.. సంతాపం ప్రకటిస్తూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. తమ నిర్మాణ సంస్థ తరపున గౌతమ్ రెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించింది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేయడంపై పవన్ అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won't be happening today!— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022 |
https://www.telugupost.com/crime/gang-rape-attempt-on-georgia-woman-in-nellore-district-1358491 | నెల్లూరు : జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చిన విదేశీ యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సైదాపురానికి సమీపంలో జరిగింది. సైదాపురం పరిధిలోని రావూరు రోడ్డులో జార్జియాకు చెందిన మహిళపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెప్పిన వివరాల మేరకు ఘటనా ప్రాంతాన్ని గుర్తించి, పరిశీలించారు.జార్జియాకు చెందిన యువతి కృష్ణపట్నం పోర్టును చూసేందుకు రాగా.. క్యాబ్ డ్రైవర్ సైదాపురంలో ఉన్న మైనింగ్ క్వారీ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ తో పాటు.. పలువురు అక్కడికి చేరుకుని యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడగా.. ఆమె వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/ismart-shaker-day-one-collections-127645/ | పూరి జగన్నాధ్ – రామ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా మంచి అంచనాలతో విడుదలైంది. మొదటి షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఇస్మార్ట్ శంకర్ కి భారీ ఓపెనింగ్స్ పడ్డాయి. రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ బెస్ట్ ఓపెనింగ్స్ గా కనబడుతున్నాయి. రామ్ మార్కెట్ డల్ అయినా.. పూరి మార్కెట్ జీరో అయినా.. ఇస్మార్ట్ మీద ఆయా ఆఛాయలేమి కనబడలేదు. ఇక ఇస్మార్ట్ మొదలైనప్పుడు జీరో అంచనాలున్నా… ఇస్మార్ట్ మీద విడుదలయ్యే సరికి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాలతోనే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రామ్ ఎనర్జటిక్ నటన, హీరోయిన్స్ గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ అండ్ నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఇస్మార్ట్ ప్లస్ పాయింట్స్ గా మారడంతో.. ఈ వీకెండ్ ఇస్మార్ట్ శంకర్ జోరు పెరిగేలా కనబడుతుంది. ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చినా.. ఇస్మార్ట్ కలెక్షన్స్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో ఉన్నాయి. మరి ఇస్మార్ట్ శనకర్ మొదటి రోజు కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా మీ కోసం…. ఏరియా: షేర్ (కోట్లలో ) నైజాం 3.43 సీడెడ్ 1.20 నెల్లూరు 0.30 కృష్ణ 0.53 గుంటూరు 0.57 వైజాగ్ 0.86 ఈస్ట్ గోదావరి 0.50 వెస్ట్ గోదావరి 0.40 టోటల్ ఏపీ & టీస్ షేర్: 7.79 |
https://www.telugupost.com/movie-news/telugu-biggboss-season-7-new-wild-card-entry-contestants-details-1498644 | తెలుగు బిగ్బాస్ సీజన్ 7 ఐదో వారం కూడా పూర్తి చేసేసుకుంది. ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్నే ఎలిమినేషన్ చేశారు. నాలుగు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక హౌస్ నుంచి బయటకి వచ్చేయగా.. ఈ వారాం శుభశ్రీ ఎలిమినేట్ అయ్యింది. బిగ్బాస్ హిస్టరీలో ఇలా వరుస లేడీ కంటెస్టెంట్స్ అంతా బయటకి వచ్చేయడం ఇదే మొదటిసారి.ఇక ఈ వారం వైల్డ్ కార్డుతో ఇంటిలోకి కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ఆ కంటెస్టెంట్స్ ని నాగార్జున ఆడియన్స్ కి పరిచయం చేశాడు. వైల్డ్ కార్డుతో మొత్తం అయిదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి వాళ్ళు ఎవరు..? అంతకుముందు ఆడియన్స్ కి పరిచయం ఉన్నారా..? అనేది ఒక లుక్ వేసేయండి.ఫస్ట్ వైల్డ్ ఎంట్రీగా 'అంబటి అర్జున్' ఎంట్రీ ఇచ్చాడు. పలు టీవీ సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. విజయవాడలో పుట్టి పెరిగిన అర్జున్.. సాఫ్ట్వేర్ డెవలపర్గా రెండేళ్లపాటు పని చేశాడు. ఆ తరువాత మోడల్ గా ప్రయాణం మొదలుపెట్టి నటన పై టర్నింగ్ తీసుకోని కొన్ని సినిమాల్లో నటించిన రాని ఫేమ్ సీరియల్స్ తో వచ్చింది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) సెకండ్ వైల్డ్ కార్డు ఎంట్రీతో 'అశ్విని శ్రీ' ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఆసక్తి ఉన్న అశ్విని శ్రీ.. తన తల్లిదండ్రులు మాట ప్రకారం ముందుగా చదువు పూర్తి చేసి యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులు వేస్తూ వస్తుంది. ఇప్పుడు బిగ్బాస్ తో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) మూడో వైల్డ్ కార్డు ఎంట్రీగా 'భోలె షావళి' వచ్చాడు. 'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్లో పడ్డ' అనే సాంగ్ తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న భోలె షావళి.. కెరీర్ ప్రారంభంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి దగ్గర అసిస్టెంట్గా పని చేశాడు. అక్కడ సంగీతం పై పట్టు సాధించిన భోలె షావళి.. సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఫోక్ సాంగ్స్, బతుకమ్మ, బోనాల పండగల టైములో పాటలు చేస్తూ మంచి ఫేమ్నే సంపాదించుకున్నాడు. ఇప్పుడు మూవీ డైరెక్టర్స్ ని ఆకర్షించడానికి బిగ్ బాస్ ని ఎంచుకున్నాడు. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) గుండమ్మ కథ సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన 'పూజా మూర్తి'.. నాలుగో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చింది. ఈమె ఈ సీజన్ ప్రారంభంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ షో ప్రారంభం అయ్యే కొన్ని రోజులు ముందు ఆమె తండ్రి మరణించారు. దీంతో ఆమె అప్పుడు ఎంట్రీ ఇవ్వలేకపోయింది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) చివరి వైల్డ్ కార్డు ఎంట్రీగా 'నయని పావని' పరిచయం అయ్యింది. టిక్టాక్ వీడియోలతో ఫేమ్ సంపాదించుకున్న పావని.. షార్ట్ ఫిలిమ్స్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో పలు టీవీ షోలు, సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమ్ ని అవకాశాలు అందుకోవాలని చూస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) |
https://www.telugupost.com/movie-news/ఏమిటి-వెంకీని-కాపీ-కొట్ట-48729/ | దర్శకుడు త్రివిక్రమ్ ఈ మధ్యన తానూ తెరకెక్కించే సినిమాలను కాపీ కంటెంట్ తోనే తీస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మొన్నటికి మొన్న నితిన్, సమంత తో తెరకెక్కించిన అ..ఆ సినిమాని మీనా అనే నవల నుండి కాపీ కొట్టి తీసినట్టుగా త్రివిక్రమ్ మీడియా ముందు ఒప్పేసుకున్నాడు. కానీ మీనా నవల రచయిత పేరు అ...ఆ సినిమా టైటిల్ కార్డులో ఎందుకు వెయ్యలేదంటూ నానా రచ్చ జరిగి.... బోలెడు విమర్శలు అందుకున్నాడు త్రివిక్రం. ఇక ఇప్పుడు కూడా ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమా కోసం డిటెక్టీవ్ అనే నవల హక్కులను త్రివిక్రమ్ కొన్నట్టుగా వార్తలొచ్చాయి. ఆ వార్తలు మరుగున పడకముందే... ఇప్పుడు త్రివిక్రమ్ తాజా చిత్రంపై కూడా అనుమానపు కథనాలు మొదలయ్యాయిఅదేమిటంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, అను ఇమ్మాన్యువల్, కీర్తి సురేష్ లు నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా కూడా మరో సినిమాకి కాపీ అంటూ వార్తలొస్తున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ వెంకటేష్ పాత సినిమా ని స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ PSPK 25 ని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది. గతంలో వెంకటేష్ నటించిన ఒంటరి పోరాటం చిత్రం మాదిరిగానే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కథ ఉంటుందట. అజ్ఞాతవాసి కూడా రివెంజ్ డ్రామానే అని.. వెంకటేష్ ఒంటరి పోరాటంలో జయసుధ కథని నడిపిస్తే.... అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూ కథ నడిపిస్తుందంటున్నారు.ఖుష్బూ తన పగను తీర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ మార్చి ఖుష్బూ గేమ్ ప్లాన్ ఆడుతుందట. ఇక కామెడీ విషయంలో మాత్రం పవన్ ఈ సారి కాస్త నెమ్మదిస్తాడని.. కానీ పవన్ చుట్టూ ఉన్న పాత్రలు బోలెడంత కామెడీ ని పండిస్తాయంటున్నారు. ఆ పాత్రల్లో హీరోయిన్ కీర్తి సురేష్ చేసే కామెడీ సినిమాకే హైలెట్ అంటున్నారు |
https://www.telugupost.com/movie-news/jd-chakravarthy-re-entry-with-crime-thrilling-webseries-dayaa-1485234 | థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు ఏ మాత్రం తీసిపోవట్లేదు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు. ముఖ్యంగా క్రైం థ్రిల్లింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీల్లో విశేష ప్రేక్షక ఆదరణ దక్కుతోంది. ఓటీటీల్లో విడుదలయ్యే కంటెంట్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకునే.. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా డిజిటల్ వైపు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్ టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి.. ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు. అదే "దయా".ఈషా రెబ్బా, పృథ్వీ రాజ్, జోష్ రవి, కమల్ కామరాజు, రమ్య నంబీసన్, యాంకర్ విష్ణుప్రియ తదితరులు కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. అత్యాచార సీన్లతో మొదలైన ఈ ట్రైలర్ లో.. ఒక లేడీ రిపోర్టర్ మిస్సింగ్, వ్యాన్ డ్రైవర్ గా జేడీ ఎంట్రీ, పృథ్విరాజ్ చెప్పే డైలాగ్ లు చూస్తుంటే.. ఓటీటీ ప్రేక్షకులకు పక్కా థ్రిల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చే వెబ్ సిరీస్ గా కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.A family man? A simple van driver? An innocent bystander? Or is there more to Dayaa. #WhoisDayaa?Find out in #HotstarSpecials #Dayaa - streaming from 4th August. #DayaaOnHotstar #JDChakravarthy @YoursEesha @nambessan_ramya @pavansadineni @mayankparakh19 @paruchuri6969 pic.twitter.com/1Piz6U6EiZ— Disney+ Hotstar (@DisneyPlusHS) July 16, 2023 |
https://www.telugupost.com/movie-news/కొడుకు-సినిమాల-కోసమే-తమ్-20838/ | తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్న నాటి నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ గా ఖ్యాతి గడించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం చాలా అరుదుగా సినిమా నిర్మాణాలు చేపడుతుంది. ఏడాదికి ఒక చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో విడుదల కానీ పరిస్థితిని చూస్తున్నాం. అయితే బాలీవుడ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన సాల ఖడూస్ చిత్ర రీమేక్ రైట్స్ దక్కించుకుని విక్టరీ వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో గురు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం నేడు(26 జనవరి) విడుదల చేయాల్సి ఉండగా కొన్ని రోజుల కిందట ఎటువంటి కారణాలు తెలుపకుండానే నిర్మాత సురేష్ బాబు గురు చిత్రాన్ని ఏకంగా మూడు నెలల పాటు వెనక్కి నెడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.రానున్న ఫిబ్రవరి నెలలో దగ్గుబాటి రానా నటించిన ఘాజీ చిత్రం విడుదల కానుండటంతో ఫెబ్రవరి నెల లో కూడా గురు విడుదల ప్లాన్ చేయకుండా ఏకంగా రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తున్న బాహుబలి 2 విడుదలైన అనంతరం మే నెలలో గురు చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట సురేష్ బాబు. తన కొడుకు రానా దగ్గుబాటి నటించిన ఈ రెండు సినిమాలను కొన్ని ప్రాంతాలలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేయనుండటం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సురేష్ బాబు చేతులలో ఒక పెద్ద కథానాయకుడి చిత్రాన్ని గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించే విధంగా రిలీజ్ చేయటానికి కావలసినన్ని థియేటర్లు ఉన్నప్పటికీ వెంకటేష్ సినిమాని ఇలా వాయిదా వేయటం వెంకీ అభిమానులకు మింగుడు పడటం లేదు. బాహుబలి అనంతరం గురు ని విడుదల చేయాలనుకుంటున్న సురేష్ బాబు కి బాహుబలి టీం నుంచే ముప్పు కూడా ఎదురవ్వొచ్చు. బాహుబలి ది బిగినింగ్ కూడా అనుకున్న సమయానికి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తవ్వక సినిమా విడుదల వాయిదా వేసుకున్న ఆర్కా మీడియా వారు ఈ సారి ఏప్రిల్ కి కచ్చితంగా బాహుబలి 2 విడుదల చేయగలరా అనేదాని పై సురేష్ బాబు కే కాదు ఎవరికీ స్పష్టత లేదు. కాబట్టి గురు చిత్రం మే నెలలో విడుదలవటం కూడా కష్టంగానే కనపడుతుంది. |
https://www.telugupost.com/movie-news/rajamouli-rrr-66565/ | రాజమౌళి గారు బాహుబలి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాను తియ్యబోతున్నాని ఒకే ఒక్క పిక్ ద్వారా ప్రకటించాడు. ఆదిపట్టుకుని అందరూ ఎవరికి తోచిన విధంగా వారు కథలు అల్లేశారు. ఇక దానయ్య కూడా ఆఫీసియల్ గా #RRR అంటూ ఒక మోషన్ పోస్టర్ ద్వారా రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అంటూ ప్రకటించాడు. అంతేకాని రాజమౌళి మాత్రం ఈ మల్టీస్టారర్ విషయమై ఎక్కడా పెదవి విప్పలేదు. కానీ చరణ్, ఎన్టీఆర్ అయితే మాకేం తెలియదు అంతా రాజమౌళినే అంటున్నారు.అయితే ఈ సినిమాపై కొన్ని షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు దర్శనమిస్తున్నాయి. అందులో మచ్చుకు కొన్ని. రాజమౌళి తియ్యబోయే ఈ బడా మల్టీస్టారర్ ని భారీ అంటే అతి భారీ గా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే అసలే భారీ బడ్జెట్ అంటుంటే... అందులో రాజమౌళి, రామ్ చరణ్, రామారావు లకే చాలా మొత్తం పారితోషకాల కింద పోతుందట. అయితే ఆ ముగ్గురు పారితోషకాలే ఈ 250 కోట్లలో 75 కోట్లు ఉండబోతున్నట్టుగా వీర లెవల్లో సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.అలాగే రాజమౌళి ఎలాంటి కథతో సినిమాని డిజైన్ చేస్తున్నాడో అనేది కూడా ఎవ్వరికి క్లారిటీ లేదు... కానీ ఇప్పుడు రెండు మూడు కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కథ అని కొందరు చెబుతున్నారు. 1980 నేపథ్యంలో సాగే కథ అని మరి కొందరు చెబుతున్నారు. అలాగే ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ మల్ల యోధుడుగాను, రామ్ చరణ్ హార్స్ రైడర్ గాను కనిపించబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇవన్నీ నిజమా కాదా అనేది మాత్రం రాజమౌళి స్పందనను బట్టి ఉంటుంది మరి. |
https://www.telugupost.com/movie-news/dev-first-look-94381/ | కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. కాగా ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చేతిలో హెల్మెట్ తో, వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా, ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/sai-palpavi-rejected-bellamkonda-srinivas-movie-85076/ | తెలుగులో ఫిదా తో ఫిదా చేసిన ఫిదా పోరి సాయి పల్లవి పై బోలెడన్ని హాట్ న్యూస్ లు మీడియాలో హల్చల్ చేసాయి. ఆమెకి పొగరెక్కువని, సహా నటులను గౌరవించదని, అందరితో గొడవలు పడుతుందని, అలాగే కాస్త ఈగో పర్సెంట్ కూడా ఎక్కువనే న్యూస్ లు సాయి పల్లవి పై తరుచూ వినిపించడం, అలాగే.. ఆమెకి ఒక సినిమాలో తన పాత్ర నచ్చకపోతే కోట్లు కుమ్మరించినా సినిమా ఒప్పుకోదనే టాక్ ఉంది. అందుకే శ్రీనివాస కళ్యాణం సినిమా లో తన పాత్ర నచ్చకే సాయి పల్లవి ఆ సినిమాని రిజెక్ట్ చేసిందని.. దిల్ రాజు బ్రతిమాలినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదన్నారు. ఇక ఆ ఆసినిమాకి రాశి ఖన్నా చెయ్యడం.. విడుదలవడం.. ప్లాప్ అవడం జరిగిపోయాయి.అలాగే సాయి పల్లవి తాజాగా రెండు కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిందనే న్యూస్ మీడియాలో నడిచింది. అది కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన చెయ్యనని సాయి పల్లవి ఆ ఆఫర్ ని వదిలేసిందని అన్నారు. అయితే బెల్లంకొండ కొత్త దర్శకుడి డైరెక్షన్ లో కాజల్ హీరోయిన్ గా సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అయితే కాజల్ మెయిన్ కాగా.. రెండో హీరోయిన్ గా సాయి పల్లవి కోసం బెల్లంకొండ ట్రై చేసాడట. అందులోను మనోడు ఎప్పుడూ టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యడం అలవాటాయే. అందుకే ఒకేసారి కాజల్ తోనూ, సాయి పల్లవితోను రొమాన్స్ చెయ్యాలనుకున్నాడు.మరి తన పాత్ర సెకండ్ హీరోయిన్ పాత్ర అనేసరికి సాయి పల్లవి ఆ అవకాశాన్ని వదులుకుంది. మరి ఇప్పుడు సాయి పల్లవి ప్లేస్ లోకి మెహ్రీన్ కౌర్ వచ్చి చేరింది. మెహెరీన్ కాస్త వెనకబడిన వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటుంది. మరి ఇప్పటివరకు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే వంటి హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన శ్రీనివాస్ ఇప్పుడు కాజల్ తో పాటుగా మెహ్రీన్ కౌర్ తో ఆడి పాడనుంది. సాయి పల్లవితో రామన్స్ చేద్దామనుకుంటే ఆమె నో చెప్పడంతో బెల్లంకొండ కాస్త డల్ అయినా అతనికి కాస్త ఫామ్ లో ఉన్న మెహ్రీన్ దొరికింది. మరి సాయి పల్లవికి 2 కోట్లు ఆఫర్ చేసిన బెల్లంకొండ ఇప్పుడు మెహ్రీన్ కి ఎంతటితో సరిపెడుతున్నాడో చూద్దాం |
https://www.telugupost.com/movie-news/puja-hegde-glammour-heroien-in-tollywood-143128/ | ఒక్క హిట్… ఒకే ఒక్క హిట్ అంటూ హీరోయిన్స్ అందరూ అవకాశాలు కోసం ఎదురు చూస్తుంటే.. లక్కమ్మ.. లక్కుంటే చాలు హిట్ అవసరం లేదంటూ అవకాశాలు మీదే అవకాశాలు పడుతుంది పూజ హెగ్డే. పూజ హెగ్డే స్టయిల్ కో.. గ్లామర్ కో స్టార్ హీరోలు పడిపోతున్నారు. స్టయిల్ అని కాదు గాని, క్రేజ్ ఉంది కనుకనే పూజ హెగ్డే వెంట పడుతున్నారు స్టార్ హీరోలు. ఒక్క స్టార్ హీరో పూజ కి ఛాన్స్ ఇచ్చాడు. అంతే అమ్మడు దశ అల అలా తిరిగింది. ఇక పూజ హెగ్డే బన్నీ చిత్రం డీజే నుండి ఇప్పటివరకు అంటే అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న సినిమా వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక బాలీవుడ్ లో హిట్ లేకపోయినా.. అమ్మడు గ్లామర్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఎందుకంటే పూజ హెగ్డే గ్లామరస్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. అందాలు ఆరబోస్తూ….. బాలీవుడ్ బడా మ్యాగజైన్స్ కోసం పూజ హెగ్డే ఆరబోస్తున్న అందాలు మాములుగా లేవు. క్యూట్ అండ్ హాట్ కాదు కాదు… క్లివేజ్ షో తో పూజ హెగ్డే పిచ్చెక్కిస్తుంది. బేబి పింక్ ఫ్రాక్ లో పూజ హెగ్డే చూపిస్తున్న లైట్ హాట్ అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే. అలా ఫ్రాక్ లో ఉన్న పూజ హెగ్డే అందాలను జారవిడుస్తూ పైకి చూస్తూ ఫోటో దిగింది. మరా హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చగా వైరల్ అయ్యింది. ఇంతకుముందు వెడ్డింగ్ వావ్ మ్యాగజైన్ కోసం పూజ హెగ్డే చేయించుకున్న ఫోటో షూట్ చూస్తే.. అమ్మ పూజ ఇంతందాలను ఎక్కడ దాచవమ్మా… అసలు పూజమ్మ స్టయిల్ వేరయా అన్నట్టుగా ఉన్నాయి ఆ హాటెస్ట్ ఫొటోస్. |
https://www.telugupost.com/movie-news/director-krish-jagarlamudi-commnets-on-pawan-kalyan-177515/ | అసలు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ని క్యాచ్ చెయ్యడం ఒక్క త్రివిక్రమ్ లాంటివాడికే సాధ్యమేమో. ఎందుకంటే త్రివిక్రమ్ తో తప్ప మరెవ్వరితోను స్నేహంగా ఉండడు. పవన్ ఎవ్వరిని పెద్దగా దగ్గరకి రానియ్యడు. అలాంటి పవన్ తో సినిమా మొదలు పెట్టి.. ఖాళీగా ఉన్నా కదా అని మరో సినిమా తీస్తే పవన్ ఊరుకుంటాడా? పవన్ మాత్రమేనా తనతో సినిమా మొదలు పెట్టి గ్యాప్ వచ్చింది కదా అని మరో హీరోతో సినిమా చేస్తే ఏ హీరో ఊరుకోడు. కానీ పవన్ ఊరుకున్నాడు. అదే కదా పవన్ ఏ టైం లో ఎలా ఉంటాడో అనేది. అసలు మేటర్ లోకి వెళితే పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ ఫిబ్రవరిలోనే ఓ పిరియాడికల్ మూవీ స్టార్ట్ చేసి ఓ షెడ్యూల్ చిత్రకరణ కూడా చేసాడు. మధ్యలో వకీల్ సాబ్, కరోనా తో క్రిష్ – పవన్ మూవీకి బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా, దీక్షల కారణంగా పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా షూటింగ్స్ కోసం తయారవలేదు కదా అని తాను ఇష్టపడ్డ కొండనవల ని సినిమా చేద్దామని పవన్ పర్మిషన్ అడిగితే చేసుకోమన్నాడట. కొండనవల చదివాకా నిద్రపట్టలేదని.. పవన్ పర్మిషన్ అడిగి ఒక 45 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసి మళ్ళీ మన సినిమా కోసం సిద్దమవుతానని పవన్ ని అడగ్గానే ఒప్పుకున్నాడట. కొండనవల ఆధారంగానే పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్ – రకుల్ కాంబోలో సినిమాని 45 రోజుల్లో ముగించేశాడు క్రిష్. మరి ఇలా పవన్ మాత్రమే ఒప్పుకున్నాడు కానీ.. మరో హీరో అయితే మరో సినిమా చేస్తే ఒప్పుకోరంటూ క్రిష్ ఓ టాక్ షోలో చెప్పుకొచ్చాడు. |
https://www.telugupost.com/movie-news/jayalalitha-biopic-75746/ | ఇప్పడు అన్ని భాషల్లోనూ బయోపిక్స్ జోరు మాములుగా లేదు. బాలీవుడ్ లో బయోపిక్స్ ఎప్పుడో ఆదరణకు నోచుకున్నాయి. ఇక టాలీవుడ్ లోనూ మహానటి తో ఈ బయోపిక్స్ క్రేజ్ స్టార్ట్ అయ్యింది. మహానటి చలవతో అనేక బయోపిక్స్ తెర మీదకి తెచ్చే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక తమిళనాట కూడా ఈ రకమైన బయోపిక్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు మొదలైపోయాయి. గతంలో జయలలిత చనిపోయినప్పుడు అమ్మ బయోపిక్ అంటూ అనేకమంది హడావిడి చేసిన సంగతి తెలిసిందే. కానీ జయలలిత బయోపిక్ మాత్రం పట్టాలెక్కలేదు. అయితే మహానటి మూవీ విడుదలయ్యాక సావిత్రిగా మెప్పించిన కీర్తి సురేష్ జయలలిత కేరెక్టర్ లో అమ్మ బయోపిక్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.ఎన్టీఆర్ బయోపిక్ బ్యానర్ పైనే...అయితే తాజాగా జయలలిత బయోపిక్ నిర్మించడానికి ఏర్పాట్లు మొదలైనట్లుగా తెలుస్తుంది. నటిగా, రాజకీయ వేత్తగా జయలలిత జీవితంలో తెలిసిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు అనేకానేకం ఉన్నాయి. ప్రస్తుతం జయలలిత బయోపిక్ ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని... విష్ణు ఇందూరి (సిసిఎల్ సూత్రధారి) స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే విష్ణు ఇందూరి ఎన్టీఆర్ బయోపిక్ ని తన బ్యానర్ లో చేస్తున్నాడు. ఇక ఇపుడు జయలలిత బయోపిక్ కూడా తన బ్యానర్లో చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసాడు. అయితే జయలలిత బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయినదని.. ఇంకా జయలలిత పాత్రకు బాలీవుడ్ నటి డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ ని సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి.జయలలితగా విద్యాబాలన్...మరి సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ లో విద్య బాలన్ కి విమర్శకుల సైతం బ్రహ్మరథం పట్టారు . మరి సిల్క్ స్మితగా అలరించిన విద్యాబాలన్ ఇపుడు జయలలితగా అటు నటిగా ఇటు పొలిటీషియన్ గా అంటే అమ్మగా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలయ్యింది. అయితే విద్య బాలన్ ని జయలలిత పాత్రకు ఎంపిక చేసినట్టుగా అధికారిక సమాచారం అయితే లేదు. కానీ ఫైనల్ గా విద్యా బాలన్ జయలలిత బయోపిక్ లో చేస్తుందనేది నిజమంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/pooja-in-telugu-does-not-have-a-single-hit-but-her-remuneration-is-more-134776/ | అల్లు అర్జున్ తో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో తెలుగు తెరకు పరిచయం అయినా పూజా హెగ్డే చాలా తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం కొట్టేసింది. మహర్షి తో మహేష్ బాబు తో నటించిన పూజా ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ లతో నటిస్తుంది. తెలుగు లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ తన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తుంది. ఇలా కలిసోస్తుంది….. ఆమెకు తెలుగులో చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు కానీ ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ మాత్రం రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకూ ఉందట. ఈ రెమ్యూనరేషన్ ఎక్కువ అని ఇండస్ట్రీ జనాలు కామెంట్స్ చేస్తున్నా ప్రొడ్యూసర్స్ కి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆమె చెప్పినంత ఇచ్చేస్తున్నారు. కాజల్, తమన్నా, రకుల్ వంటి స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ తో చేయడంతో పూజాకి ప్లస్ అయింది. ఇంకా సామ్ ఏమో పెళ్లి చేసుకుని సెలెక్టెడ్ సినిమాలే చేయడంతో ఈ బ్యూటీకి ప్లస్సుగా మారింది. అలా ఈ అమ్మడుకి అన్ని విధాలుగా కలిసొస్తుంది. |
https://www.telugupost.com/crime/hyderabad-youth-killed-while-protecting-sister-from-assault-1493000 | హైదరాబాద్ ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పట్టపగలు ప్రియురాలి ఇంట్లోకి చొరబడిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిని పొడిచాడు. కేకలు విన్న స్థానికులు నిందితుడిని ఓ గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. యువతి తమ్ముడు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఉస్మానియాకు తరలించారు.షాద్నగర్ కొందుర్గులో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహించే సురేందర్ గౌడ్, ఇందిర దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె సంఘవి (25) ఉప్పల్ రామాంతపూర్లో చదువుతోంది. ఆమె తమ్ముడు పృథ్వీ (24) అలియాస్ చింటూ బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మరో తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. సంఘవి, పృథ్వీ ఇద్దరూ చదువుల కోసం ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ రోడ్ నెం.5లో గల భవనం మొదటి అంతస్తులో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 సమయంలో సంఘవి ఉంటున్న పోర్షన్ నుంచి అరుపులు కేకలు వినిపించడంతో పక్క వాటాలో ఉంటున్న ఝాన్సీ అనే మహిళ పరుగున బయటకొచ్చి చూసింది. ఛాతీ నుంచి రక్తం కారుతూ పృథ్వీ కనిపించాడు. అక్కా, తమ్ముడి ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చిన యువకుడు వారిద్దరిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన యువతి తమ్ముడు చింటు(20) మృతి చెందాడు. యువతి తీవ్రంగా గాయపడగా ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి శివకుమార్ కత్తితో రావడంతో యువతి, ఆమె తమ్ముడు గట్టిగా కేకలు వేశారు. దీంతో స్థానికులు దాడికి పాల్పడిన యువకుడిని ఓ గదిలో బంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు.సంఘవి, పృథ్వీలపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఫరూక్ నగర్ మండలానికి నిందితుడు శివకుమార్ (26) రామాంతపూర్లో ఉంటూ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. అతను, సంఘవి కొందుర్గులో పదో తరగతి కలిసి చదువుకున్నారు. దీంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత మనస్ఫర్థలు రావడంతో సంఘవి శివకుమార్తో మాట్లాడడం మానేసింది. దాంతో అతను ఆమెపై పగపెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. |
https://www.telugupost.com/movie-news/savyasachi-teaser-review-91010/ | నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి టీజర్ విడుదలైంది. టీజర్ చాలా స్టైలిష్ గా.. కొత్తగా యాక్షన్ ప్రధానంగా సాగింది. ఇందులో చైతూ పాత్ర భారతంలో అర్జునుడి స్పూర్తితో తీసుకున్నాడు దర్శకుడు చందూ మొండేటి. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనగా.. గర్భంలోనే ఇద్దరు కవలలు ఒకరిగా కలిసిపోతే ఏమవుతుంది అనేది సినిమా కాన్సెప్ట్. ఈ టీజర్ చాలా రి ఫ్రెషింగ్ గా అలాగే సృజనాత్మకంగా ఉంది. మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నాదమ్ములు అంటారు.. అదే ఒకే రక్తం.. ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని.. కడదాకా ఉండే కవచాన్ని.. ఈ సవ్యసాచిలో సగాన్ని అంటూ చైతూ టీజర్ లో చెప్పిన డైలాగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.వైవిధ్యమైన పాత్రలో మాధవన్...ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఎప్పుడూ రాని ఓ కాస్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ ను చాలా బాగా చూపించారు. సవ్యసాచి కొన్ని కళ్లు చెదిరిపోయే లొకేషన్స్ లో చిత్రీకరించారు. అవన్నీ టీజర్ లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. మాధవన్, భూమికా చావ్లా ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారని కూడా టీజర్ లో చిన్న క్లూ ఇచ్చారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో విడుదలకానుంది. |
https://www.telugupost.com/movie-news/saipallavi-not-doing-that-role-162805/ | సాయి పల్లవి ఏ సినిమా అయినా తన పాత్రకి ప్రాధాన్యత ఉండడం ఒకటి, కథ లో బలం ఉంటేనే సినిమా ఒప్పుకుంటుంది. తాజాగా సాయి పల్లవి టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. నాగ చైతన్య తో లవ్ స్టోరీ, వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం సినిమాలు చేస్తుంది. రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలోనే ఉన్నాయి. విరాట పర్వం అయితే కేవలం పది రోజుల షూటింగ్ మాత్రం మిగిలి ఉండగా కరోనా అడ్డం పడింది అయితే ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపిస్తుంది అని.. సాయి పల్లవి విరాట పర్వం ఫస్ట్ లుక్ బయటికి వచ్చాక ఆమె పాత్రపై మరింత క్యూరియాసిటీ, ఊహాగానాలు పెరిగిపోయాయి. అయితే నక్సలైట్ గా సాయి పల్లవి విప్లవ గాయని బెల్లి లలిత పాత్రలో కనిపించనుందనే ప్రచారానికి ఆ సినిమా దర్శకుడు వేణు ఉడుగుల ఫుల్ స్టాప్ పెట్టాడు. సాయి పల్లవి నక్సలైట్, విప్లవ గాయని బెల్లి లలిత పాత్ర చెయ్యడం లేదని.. నేను పుట్టి పెరిగిన వరంగల్లో సమాజంలో మార్పు కోసం ఎలాంటి భయం లేకుండా ఉద్యమాలను లేవదీసినవాళ్లను నేను చూశాను. అవన్నీ ఇప్పుడు విరాటపర్వంలో చూపిస్తున్నాను అని చెబుతున్నాడు వేణు ఉడుగుల. బెల్లి లలిత పాత్రను సాయి పల్లవి పోషించడం లేదు. అయితే విరాట పర్వంలో ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకు ఎంతో కీలకం ఆ పాత్ర. అలాంటి రోల్లో సాయి పల్లవి అద్భుతంగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటన కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది అంటూ విరాట పర్వంలో సాయి పల్లవి రోల్ పై స్పష్టతనిచ్చాడు వేణు ఉడుగుల |
https://www.telugupost.com/movie-news/mohan-raja-choice-174565/ | చిరంజీవి లూసిఫెర్ రీమేక్స్ రైట్స్ కొన్నప్పటినుండి ఆ రీమేక్ ని పక్కాగా తెరకెక్కించే డైరెక్టర్ కనిపించడం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముందు సాహో డైరెక్టర్ సుజిత్ ని అనుకుని తర్వాత ఆ రీమేక్ నుండి ఆయన్ని తప్పించి వినాయక్ ని రంగంలోకి దించితే.. వినాయక్ కూడా చిరు ని మెప్పించేలేక చేతులెత్తేశాడు. దానితో తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ మోహన్ రాజా ఇప్పడు లూసిఫర్ రీమేక్ దర్శకుల లిస్ట్ లోకి చేరడమే కాదు… లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ పనులను కూడా స్టార్ట్ చేసాడట. లూసిఫర్ స్క్రిప్ట్ తో చిరుని శాటిస్ఫాయ్ చేస్తే మోహన్ రాజన్ లూసిఫర్ దర్శకుడిగా ఫిక్స్ అవుతాడు. మరి చిరు లూసిఫెర్ కన్నా ముందే మోహన్ రాజా టాలీవుడ్ హీరోలైన రామ్ చరణ్, అఖిల్ తో సినిమాలు చేసేందుకు వస్తే చరణ్ ఏమో చిరు కి తగిలించాడు. అయితే మోహన్ రాజాకి అఖిల్ తో సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యేలా ఉందట. ఇప్పటికే మోహన్ రాజా అఖిల్ తో కథా చర్చలు జరిపినట్టుగా టాక్ ఉంది. అయితే అఖిల్ తో కూడా మూవీ సెట్ అయితే.. మోహన్ రాజా చిరుతో ఫస్ట్ మొదలు పెడతాడా? లేదంటే అఖిల్ తోనా అనేది క్లారిటీ రావాలి. మరి చిరుకి ఆచార్య ఫినిష్ అవ్వగానే వేదలమ్ రీమేక్ పూర్తి చెయ్యాలి. మరోపక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ ఫినిష్ చేస్తున్న అఖిల్ సురేందర్ రెడ్డితో సినిమా చెయ్యాలి. మరి చిరు – అఖిల్ ఒకేసారి మోహన్ రాజా ఫిలిం కోసం రేడి అయితే మోహన్ రాజా ఎవరితో ముందు సినిమా చేస్తాడనేది ప్రస్తుతం సస్పెన్స్.మోహన్ రాజా ఫస్ట్ చాయిస్ అఖిల్ లేదా చిరు ఇద్దరిలో ఎవరవుతారో.. |
https://www.telugupost.com/telangana-assembly-elections-2023/decision-taken-by-ysrtp-chief-ys-sharmila-is-right-it-is-also-right-to-support-congress-1502726 | అవును వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆమె చెబుతున్న కారణాలు ఏవైనా ఇప్పుడు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల పోటీ చేయకపోవడమే మంచింది. ఒకరకంగా తన సోదరుడు జగన్ కు కూడా మేలు చేసినట్లే. ఇప్పుడు తెలంగాణలో స్ట్రయిట్ ఫైట్ మాత్రమే ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోరు ఉంది. మరో పార్టీకి అవకాశం లేదు. బీజేపీ తాము ఉన్నామంటూ ఉన్న కనీస స్థానాలకే పరిమితమవుతుంది. అదే వైఎస్సార్టీపీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపు కూడా కష్టమే.భిన్నమైన ఎన్నికలు...ఈ ఎన్నికలు కొంత భిన్నంగా కనిపిస్తుంది. అధికార పార్టీపై వచ్చిన వ్యతిరేకత కావచ్చు. తొమ్మిదేళ్ల పాలన చూసి విసుగు చెంది ఉండవచ్చు. ఒకింత కాంగ్రెస్ కు కూడా గెలుపు అవకాశాలున్నాయంటున్నారు. చివరకు కాంగ్రెస్ గెలుస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ కు మాత్రం గట్టి పోటీ ఇస్తుందన్నది మాత్రం వాస్తవం. 119 నియోజకవర్గాల్లో దాదాపు వంద నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరుగుతుంది. కాంగ్రెస్ కూడా ఈ సారి సర్వేలు చేయించి మరీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆచితూచి అభ్యర్థులను బరిలోకి దించింది. వైఎస్ షర్మిల కూడా దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసింది. పాలేరులో ముగించాలనుకున్నా కుదరలేదు కానీ, ఆమె ప్రభావం చూపే నేతగానే చూడాలి. నష్టమే తప్ప...ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ పోటీ చేయడం వల్ల ఆ పార్టీకి నష్టమే కాని పెద్దగా ప్రయోజనం ఉండదు. కేవలం షర్మిల పోటీ చేసే స్థానంలో గెలవచ్చు. అదీ వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తే అదీ చెప్పలేని పరిస్థితి. పాలేరు నియోజకవర్గంలో హేమాహేమీలు తలపడుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి, మరొక వైపు బలమైన నేతగా కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరిని తట్టుకుని గెలవడం అంత ఆషామాషీ కాదు. అందుకే హుందాగా వైఎస్ షర్మిల బరి నుంచి తప్పుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.హుందాగా...వైఎస్ అభిమానులతో పాటు రెడ్డి సామాజికవర్గం కూడా ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పోటీకి దిగి సాహసం చేయడం తప్ప మరొకటి కాదు. అయితే బేషరతుగా మద్దతిస్తున్నామని ప్రకటించడం కూడా ఒకరకంగా షర్మిలకు హుందాతనాన్ని తెచ్చి పెట్టే విధంగా ఉంది. పదవుల కోసం కాకుండా కేవలం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నానని ప్రకటించి షర్మిల ఎన్నికల బరి నుంచి తప్పుకోవడాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. దీంతో పాటు జగన్ కు కూడా కొంత కలసి వచ్చే అంశమే. ఏపీ ఎన్నికలకు ముందు తెలంగాణ షర్మిల ఓటమి పాలయితే అది కొంత ప్రభావం చూపుతుందని కూడా పలువురు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతివ్వడం కొంత నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. మొత్తం మీద వైఎస్ షర్మిల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని మాత్రం చెప్పాలి. |
https://www.telugupost.com/movie-news/bheemla-nayak-effect-on-gani-and-adavallu-miku-joharlu-movies-1355271 | పవన్ కల్యాణ్ - రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారయింది. ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో విడుదలయ్యేందుకు భీమ్లా నాయక్ రెడీ అవుతున్నాడు. అయితే.. అదే రోజున మరో రెండు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి వరుణ్ తేజ్ నటించిన "గని". మరొకటి శర్వానంద్ - రష్మికలు జంటగా వస్తోన్న "ఆడవాళ్లు మీకు జోహార్లు". అయితే.. ఇప్పుడు ఈ రెండు సినిమాలు అదే రోజు విడుదలవుతాయా ? లేదా ? అన్న సందేహం ఉంది అభిమానుల్లో.Also Read : బర్డ్ ఫ్లూ కలకలం.. 25 వేల కోళ్లను చంపేయాలని అధికారుల ఆదేశంమొదట భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25, లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చెప్పింది చిత్ర బృందం. దాంతో శర్వానంద్ నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు" మేకర్స్.. సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు, ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్ "గని" సినిమాను కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి 25ను లాక్ చేసిన తర్వాత.. భీమ్లా నాయక్ మేకర్స్ ఫిబ్రవరి 25నే సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. Also Read : ఇద్దరూ ఒక కులపోళ్లే.... కలవడం గొప్పేముంది? పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హడావిడి చేస్తారో చెప్పనక్కర్లేదు. పవన్ సినిమా కాబట్టి ఆ ఎఫెక్ట్ గని, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలపై పడే అవకాశం ఉంది. దాంతో గని సినిమాను మేకర్స్ మార్చి 4వ తేదీన విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆడవాళ్లు మీకు జోహార్లు టీమ్ కూడా సినిమాను వాయిదా వేయొచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పోస్టర్లను ఫిబ్రవరి 25 తేదీతోనే విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/పేలవంగా-వున్న-కాజల్-పాట-13912/ | తెలుగులో టాప్ హీరోయిన్స్ జాబితాలో గత దశాబ్ద కాలంగా పోటీలో వుంటూ నెగ్గుకొస్తుంది కాజల్ అగర్వాల్. 2007 లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రం నుంచి కాజల్ అగర్వాల్ తార స్థాయికి చేరిపోయింది. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, ప్రభాస్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, నితిన్ వంటి యంగ్ స్టార్స్ అందరితో ఇప్పటికే నటించేయగా ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ కమ్ బ్యాక్ చిత్రం ఖైదీ నెం. 150 లో చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తుంది.ఇదంతా కాజల్ అగర్వాల్ హైప్ వైపు భాగం. కానీ హిందీ మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో కాజల్ అగ్ర శ్రేణి కథానాయికలకు ధీటుగా పోటీ ఇవ్వలేకపోయింది. తమిళంలో తుపాకీ మినహా భారీ విజయాలు ఏమి అమ్మడి ఖాతాలో లేవు. ప్రస్తుతం చిత్రాల సంఖ్య తగ్గటంతో తమిళంలో ఎప్పటి నుంచో విడుదల వాయిదా పడుతూ వస్తున్న జీవ చిత్రం కావలై వేందాం విడుదల తేదీ ప్రకటన రావటంతో ఆ చిత్రంపై ఆశలు పెంచుకుంది కాజల్. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాలకు అధిక సమయమే కేటాయిస్తుంది.ఇటీవల ఆ చిత్రంలో ని ఎం పల్స్ తీతు పూరీయే అనే పాట వీడియో సాంగ్ విడుదల కాగా ఈ పాట సంగీతం కానీ, కాజల్ చూపించిన అందాలు కానీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. జీవా కాజల్ మధ్య కెమిస్ట్రీ కూడా పేలవంగా ఉండటంతో చిత్ర విజయం పై అంచనాలు తగ్గిపోయాయి. ఈ వీడియో సాంగ్ విడుదల చేసి చిత్ర బృందం తప్పు చేసింది అనే సానుభూతి పరులు ఎక్కువ అయ్యారు ఈ చిత్రానికి. |
https://www.telugupost.com/movie-news/నాకు-సినిమా-లైఫ్-ఇచ్చిన-హ-16985/ | సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరి చూపు సక్సెస్ పైనే ఉంటుంది. సక్సెస్ వస్తేనే పరిశ్రమలో మనుగడ సాధ్యం. అందుకే ఒక సక్సెస్ ఇచ్చిన టీం నుంచి పదే పదే చిత్రాలు వస్తుంటాయి. అదే తొలి ఎటెంప్ట్ లోనే ఒక కాంబినేషన్ ఫెయిల్ అయిందంటే బలమైన కథ నిర్ధేశిస్తే తప్ప మళ్లీ ఆ కాంబినేషన్ మెటీరియలైజ్ అవటం జరగదు. దానితో ఆ వైఫల్యం చెందిన చిత్రం ఆ చిత్ర బృందంలో తగాదాలకు దారి తీసింది అని ప్రచారం జోరుగా సాగిపోతుంటుంది. అయితే ఇటువంటి ప్రచారాలలో నిజాలు అడుగున ఎక్కడో ఉంటాయి అని దాన్ని తోడి పైకి తీసి పరిశీలించే ఓపిక ఎవరికీ ఉండదు అని, అందుకే అందరూ పైకి తేలే కల్పితాలనే నమ్ముతుంటారు అని వాపోతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.కిక్ 2 చిత్రంతో ఘోర పరాజయాన్ని చూసిన సురేందర్ రెడ్డి, సమయం తీసుకుని రీమేక్ కథకి తనదైన ముద్రతో ధ్రువ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. ధ్రువ సక్సెస్ ఆస్వాదిస్తూనే కిక్ 2 మిగిల్చిన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కళ్యాణ్ రామ్ తో విభేదాలు ఏర్పడ్డాయి అనే వార్తలను తీవ్రంగా ఖండించారు. "నాకు దర్శకుడిగా తొలి అవకాశం కలిపించిన నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ గారే. మళ్లీ ఆయన నిర్మాణంలో దర్శకత్వం చేసే అవకాశాన్ని ఆయన కిక్ 2 చిత్రం ద్వారా కల్పించారు. అతనొక్కడే విజయం పొందింది. కిక్ 2 వైఫల్యం చెందింది. ఆ రెండు చిత్రాలకి వ్యత్యాసం కేవలం ఫలితం లో మాత్రమే కనపడుతుంది. మేము పడ్డ కష్టం, పెట్టుకున్న ఆశలు, మా మధ్య వున్న అనుబంధం, ఒకరి పనితీరు పై మరొకరికి వుండే విశ్వాసం వీటిల్లో ఏవి కూడా అతనొక్కడే సమయం నుంచి కిక్ 2 వరకు చెదరలేదు. రాబోయే కాలంలో నేను మళ్లీ కళ్యాణ్ రామ్ గారి నిర్మాణంలో పనిచేసినా, లేక ఆయన కథానాయకుడిగా నా దర్శకత్వంలో చిత్రం చేసినా మా అంకితభావంలో మార్పు ఉండదు. విజయాపజయాలు సహజం. వాటి ప్రభావం మానవ సంబంధాల మీద ఉండదు అనేది నా ప్రగాఢ నమ్మకం. పైగా కళ్యాణ్ రామ్ గారి లాంటి నిర్మాతల దగ్గర అటువంటి విభేదాలకు తావే ఉండదు." అని ఆయనను దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత కళ్యాణ్ రామ్ కు తనకు మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు తలెత్తలేదు అని దుష్ప్రచారాలు వలన తలెత్తే అవకాశం కూడా లేదు అని స్పష్టం చేశారు సురేందర్ రెడ్డి. |
https://www.telugupost.com/movie-news/tollywood-senior-actor-naresh-tweeted-that-why-people-are-not-coming-to-theatres-to-watch-hit-movie-also-1435965 | ఇటీవల కాలంలో జనాలు సినిమాలు చూసేందుకు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ తగ్గింది. బాక్సాఫీస్ వద్ద హిట్టైన సినిమాలకు కలెక్షన్లు లేకపోవడం.. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ మధ్యే నిర్మాతలు, ఫిలింఛాంబర్ పెద్దలు మీటింగులు పెట్టి జనాల్ని థియేటర్లకు ఎలా తీసుకురావాలని చర్చలు జరిపారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇచ్చారు. జనాలు థియేటర్ కు రాకపోవడంపై వినిపించిన ప్రధాన కారణం ఓటీటీ. సినిమాలు విడుదలైన 15-20 రోజులకే ఓటీటీలోకి రావడంతో థియేటర్లో చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయిందన్నారు.అందుకు నిరసనగా షూటింగులు ఆపేసి సమ్మె కు పిలుపునిచ్చారు. ఓటీటీ సంస్థలతో చర్చలు అనంతరం సినిమాలు విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు ఒప్పుకున్నారు. కాగా.. తాజాగా ఇండస్ట్రీ సీనియర్ నటుడు నరేష్ జనాలు థియేటర్లకు రాకపోవడానికి అసలు కారణం ఇది అంటూ వరుస ట్వీట్లు చేశారు."టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్కు రావట్లేదు అనేది నిజమే కావొచ్చు. కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్కార్న్ రూ.20, రూ.30కే థియేటర్స్ క్యాంటిన్ లలో దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300 అయింది. ఒక కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడాలంటే దాదాపు రూ.2500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా రేట్లు ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు. వాళ్లకి కావాల్సింది మంచి సినిమా మాత్రమే కాదు, మంచి అనుభవం కూడా" అని ఓ ట్వీట్లో రాశారు.Y are people not coming to theatres? Simple. a middle class family needs about rs 2500 avg for the experience . Not just the tickets rates . If pepsi or pop corn which cost rs 20 or 30 costs about rs 300 . So people don't want just a good film but. A good experience. Think!!!— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022 మరో ట్వీట్ లో "ఒకప్పుడు సినిమాలు వారం రోజులపైనే ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్ ఖాళీ అయిపోతుంది. థియేటర్స్లో ఖర్చు తగ్గిస్తే ప్రేక్షకులు ఎక్కువసార్లు సినిమా చూడటానికి వస్తారు" అని తన అభిప్రాయాన్ని తెలిపారు నరేష్. నటుడు నరేష్ చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పింది నిజమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోసారి దర్శక, నిర్మాతలు, ఫిలించాంబర్ పెద్దలు కలిసి చర్చించి.. థియేటర్లలో తినుబండారాలు రేట్లను తగ్గించే దిశగా ఏవైనా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.What i mean to say is even an average film used to have collections for a week but now it needs to be a great film to fill the theatres the 2nd day. How many Extrodinary films can we make . So reduction of costs in the theatres can bring more people to many more films— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022 |
https://www.telugupost.com/movie-news/ఆయనికి-కరెక్ట్-మొగుడు-ఈయ-33921/ | ఇండస్ట్రీలో ఎన్టీఆర్ - మంచు మనోజ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఫ్రెండ్షిప్ లో భాగంగానే మనోజ్ ఈ మధ్యన ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాడట. అయితే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లగా అక్కడ ఎన్టీఆర్ కొడుకు బుల్లి అభయ్ రామ్, మంచు మనోజ్ కి అతిధి సత్కారాలు చేసి మరీ మంచి నీళ్లు అందించాడంట. మంచి నీళ్లు మనోజ్ కి అందించడమే కాకుండా ఆ నీళ్ళని మనోజ్ తో తాగించిమరీ వదిలిపెట్టాడు. ఇక ఈ పరిణామానికి అబ్బురపడ్డ మనోజ్, తారక్ కి కరెక్ట్ మొగుడు అభయ్ అంటూ... సరదాగా కామెంట్ చెయ్యడమే కాకుండా అభయ్ రామ్ మంచి నీళ్లు మనోజ్ కి తాగిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి క్యాప్షన్ కూడా పెట్టాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనర్జీ కి కి పెట్టింది పేరు. అలాంటి ఎన్టీఆర్ కడుపున అంతే ఎనర్జీ ఉన్న అభయ రామ్ పుట్టాడంటూ మనోజ్ చమత్కరిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎనేర్జి కంటే అభయ్ రామ్ ఎనేర్జి లెవెల్స్ 100 రేట్లు ఎక్కువ అని అంటున్నాడు మనోజ్. మరి అంత ముద్దు ముద్దు పనులు చేసుంటే చూసేవాళ్ళు ఇలానే అంటారు కదా. అలా మనోజ్ కి అభయ్ మంచి నీళ్లు తాగిస్తున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.మరి సినిమా హీరోలంతా ఇలా స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంటే బయట అభిమానులు మాత్రం మా హీరోలు గొప్ప అంటే మా హీరోలు గొప్ప అంటూ తన్నుకు చస్తుంటారు. అభిమానులు కూడా ఇలా స్నేహ భావంతో మెలిగితే దానికన్నా మంచి పరిణామం ఏముంటుంది. |
https://www.telugupost.com/movie-news/charmee-proposal-to-trisha-120482/ | టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన త్రిష, ఛార్మీ మధ్య మంచి స్నేహం ఉంది. పలు సందర్భాల్లో వీరు తమ స్నేహాన్ని సోషల్ మీడియా వేదికగా, పలు ఈవెంట్లలో బయటపెట్టుకుంటారు. తాజాగా త్రిష పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ఛార్మీ ఓ సరదా ట్వీట్ చేసింది. ‘‘బేబీ.. ఇవాళే కాదు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను. మోకాళ్లపై కూర్చొని కోరుతున్నా.. నా ప్రతిపాదనను అంగీకరించు. మనం పెళ్లి చేసుకుందాం.(ఇప్పుడు ఇది చట్టబద్ధం కూడా)’’ అంటూ ట్వీట్ చేసింది. గతంలోనూ ఛార్మీ ఇటువంటి ట్వీట్ ఒకటి చేయగా త్రిష కూడా రిప్లై ఇచ్చింది. http:// Baby I love u today n forever 😘 Am on my knees waiting for u to accept my proposal 💍 let’s get married😛😛 ( now toh it’s legally allowed also 😛 ) #happybirthday @trishtrashers 😘😘😘😘 pic.twitter.com/e2F3Zn3Dp3 — Charmme Kaur (@Charmmeofficial) May 4, 2019 https://platform.twitter.com/widgets.js |
https://www.telugupost.com/politics/jana-sena-prepares-for-elections-after-announcing-his-alliance-with-the-tdp-pawan-picked-up-some-speed-1500082 | జనసేన ఎన్నికలకు సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించిన తర్వాత పవన్ కొంత స్పీడ్ పెంచారు. నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను నియమించడమే కాకుండా కమిటీలో కొత్తవారికి చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తాము ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తామన్న దానిపై పవన్ కల్యాణ్కు ఒక స్పష్టత ఉందని తెలుస్తోంది. అందులో భాగంగానే అక్కడ ఇన్ఛార్జులను నియమిస్తూ పార్టీ బలోపేతానికి పనిచేయాలని నేతలను ఆదేశిస్తున్నట్లు తెలిసింది.సీట్ల పంపకాలపై...చాలా రోజుల తర్వాత మంగళగిరి వచ్చిన పవన్ కల్యాణ్ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు. త్వరలోనే టీడీపీ, జనసేన పొత్తుల మధ్య చర్చ జరగనున్న నేపథ్యంలో సీట్ల పంపకంపై కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. సీట్లు తాము వదిలేసుకున్న నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముందుగానే పిలిచి పవన్ మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని హామీ ఇస్తున్నారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గం టీడీపీకే వదిలేస్తున్నట్లు అక్కడి నేతకు ముందుగానే చెప్పడం అంటే మూడు నెలల ముందే పవన్ పొత్తుపై ఒక స్పష్టత ఉన్నట్లు అర్థమవుతుంది. రెండు నియోజకవర్గాలకు...తాజాగా ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను నియమించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకునట్లు స్పష్టమవుతుంది. అందుకే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జులను నియమించారు. పొత్తులో భాగంగా ఈ రెండు స్థానాలను జనసేన దక్కించుకునే అవకాశముంది. ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు ఈసారి జనసేన నుంచి ముప్పు పొంచి ఉన్నట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. ఈసారి ఇక్కడి నుంచి జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లుంది. ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పత్సమట్ల ధర్మరాజును నియమించారు.ఇన్ఛార్జులను నియమించి...ఇక అదే జిల్లాలోని మరో నియోజకవర్గంలోని ఉండి పైన కూడా జనసేన కన్నేసినట్లే కనపడుతుంది. ప్రస్తుతం ఉండిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మంతెన రామరాజు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉండిలో జనసేనకు పట్టుంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని కూడా తాము పొత్తులో భాగంగా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. ఇక్కడ ఇన్ఛార్జిగా జుత్తిగ నాగరాజును పవన్ నియమించారు. జనసేన ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే పోటీకి ఉత్సాహం చూపుతుంది. అందుకే ముందుగానే ఇన్ఛార్జులను నియమిస్తూ పవన్ ఒకింత స్పీడ్ పెంచారంటున్నారు జనసేన పార్టీ నేతలు. మరో వైపు సిట్టింగ్లందరికీ టీడీపీ టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి పొత్తులో ఈ సీట్లను జనసేన ఎలా దక్కించుకుంటుందన్నది చూడాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/pushpa-2-movie-release-date-december-6th-no-change-in-that-1549714 | అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప-2. ఈ సినిమా మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప-2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. పుష్ప-2 లో ఏ క్యారెక్టర్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక ఇటీవల 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' సినిమా ప్రమోషన్స్ లో నటుడు రావు రమేష్ కూడా పుష్ప-3 గురించి హింట్స్ అయితే ఇచ్చారు. తాను కాల్షీట్స్ ఇచ్చానని వాటిని పుష్ప, పుష్ప-2 కోసం వాడుకున్నారని, మిగిలినవి తర్వాత కోసం అంటూ పుష్ప-3 గురించి హింట్ ఇచ్చారు. అయితే పుష్ప-2 ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆగస్టు 15న పుష్ప-2 విడుదల అవ్వాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇక సినిమా వాయిదా పడే అవకాశాలు లేవని.. చెప్పిన డేట్ కు తప్పకుండా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేయబోతోందనే అంచనాలు భారీగా ఉన్నాయి. |
https://www.telugupost.com/politics/ravela-kishore-babu-resigned-to-bjp-1369909 | ఏపీలో ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలని చూస్తున్న బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు కిశోర్ బాబు తెలిపారు.కాగా.. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి.. తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే కదా అని చంద్రబాబు ఆయనను పక్కన పెట్టలేదు. మంత్రి పదవిని కట్టబెట్టి.. సముచిత స్థానాన్ని కల్పించారు. ఆ తర్వాత పలు కారణాలతో మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు టిడిపిని వీడి.. జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి మరోసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు కానీ.. ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే రావెల కిశోర్ మళ్లీ టిడిపిలో చేరుతారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. |
https://www.telugupost.com/crime/tragedy-took-place-in-gadchiroli-district-six-women-went-missing-after-the-boat-overturned-in-the-wainganga-river-1516754 | గడ్చిరోలి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైనగంగా నదిలో పడవ బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు మహిళలు గల్లంతుయినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో ఎంత మంది పడవలో ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.కారణమేంటి?గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎందుకు ప్రమాదం జరిగింది? సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు ఎక్కించుకోవడం వల్లనే పడవ బోల్తా కొట్టిందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/crime/hyderabad-conspiracy-case-cracked-by-task-force-police-jahed-from-musarambagh-was-detained-1441598 | హైదరాబాద్ కుట్ర కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ముసారాంబాగ్ కు చెందిన జాహెద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై దాడులకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై జావేద్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఉగ్రవాద కార్యక్రమాల కోసం యువతను రిక్రూట్ మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలు జావేద్ పై ఉన్నాయి. ఆరుగురు యువకులను ఇందుకోసం జావేద్ రిక్రూట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ జావెద్ ను పోలీసులు విచారించి వదిలేశారు.ఎక్కడికి తీసుకెళ్లారో?ఉగ్రవాద సంస్థలతో జావేద్ కు లింకులున్నాయన్నది పోలీసుల అభియోగం. మక్కామసీదు పేలుళ్ల కేసులోనూ జావెద్ పై ఆరోపణలు గతంలో వచ్చాయి. అయితే తమ కుమారుడిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తీసుకెల్లారని, ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని జావేద్ తల్లి హఫీజున్నీసా కోరుతున్నారు. తమ కుమారుడి ఆచూకి చెప్పాలంటూ ఆమె పోలీసులను కోరుతున్నారు. పోలీసులు తీసుకెళ్లారా? మరెవరైనా కిడ్నాప్ చేశారా? అన్న అనుమానం ఆమె వ్యక్తం చేస్తుంది. |
https://www.telugupost.com/movie-news/అల్లు-అర్జున్-రేంజ్-మరి-ఇ-54045/ | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కలయికలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొదటిసారి అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక ఆర్మీ అధికారి పాత్ర ని పోషిస్తున్నాడు. లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ బాబు సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది.మాములుగా అల్లు అర్జున్ సినిమాలకి శాటిలైట్ మంచి బిజినెస్ జరుగుతుంది. అలాగే సరైనోడు, డీజే సినిమాల్తో అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగింది. ఇప్పుడు కూడా నా పేరు సూర్య సినిమా విషయంలో కూడా భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఏకంగా 25 కోట్లకి అమ్ముడుపోయాయి అని తెలుస్తుంది. టీవీలో ప్రసారం చేసుకునే హక్కులతో పాటు డిజిటల్ మీడియా ప్రసార హక్కులను కూడా ఒకే సంస్థ ఇంత భారీ అమౌంట్ కి నా పేరు సూర్య హక్కులను కొనేసిందని సమాచారం. సుమారు 25 కోట్లు ఈ రైట్స్ తోనే రావడం తో సినిమా బడ్జెట్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనే రికవర్ అయ్యాయని అంటున్నారు.మరి అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యువల్ నటిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ ని జనవరి 1 న్యూ ఇయర్ సందర్బంగా రిలీజ్ చేస్తారని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించాడు. |
https://www.telugupost.com/crime/national-investigation-agency-will-continue-to-investigate-the-popular-front-of-india-case-1439564 | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతుంది. ఎన్ఐఏ ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది. బోధన్ కు చెందిన సమీర్, ఆదిలాబాద్ కు చెందిన ఫిరోజ్, జగిత్యాల కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన ఇలాయాజ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.వివిధ అల్లర్లకు సంబంధించి...వీరిని ఎన్ఐఏ న్యాయస్థానానికి తరలించారు. ఎన్ఐఏ నోటీసులు తొమ్మిది మంది విచారణకు హాజరయ్యారు. పీఎఫ్ఐ కు సంబంధించిన లావాదేవీలపై కూడా విచారణ జరుపుతుంది. భైంసా కుట్ర అల్లర్లతో పాటు ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ లో జరిగిన గొడవలపై కూడా ఎన్ఐఏ ఆరాతీస్తుంది. నిషేధిత సిమి సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించింది. కొన్ని ల్యాప్ట్యాప్ లను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వాటిని లోతుగా పరిశీలిస్తున్నారు. |
https://www.telugupost.com/crime/telugu-students-died-in-america-nikesh-from-srikakulam-and-dinesh-from-vanaparthi-district-died-1515346 | అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శ్రీకాకుళానికి చెందిన నీకేష్, వనపర్తి జిల్లాకు చెందిన దినేష్ మృతి చెందినట్లు గుర్తించారు. వీరిద్దరి మృతి విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. వీరిద్దరూ ఇటీవలే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్ లో ఉంటున్నారు. దినేష్ అమెరికాలోని హార్డ్ ఫోర్డ్ లో చేరారు. నికేష్ మాత్రం అక్కడకు వెళ్లిన తర్వాత దినేష్ రూమ్ లోనే ఉంటున్నాడు.ఒకే రూమ్ లో...అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. ఇద్దరూ ఒకే రూములో చనిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం వారిని ఎవరైనా హతమార్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఇక్కడకు తీసుకు వచ్చేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేసి వారి మరణానికి కారణాలను తెలియజేయాలని కోరుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/sudigali-sudheer-and-anasuya-are-back-to-etv--1435483 | జబర్దస్త్ లో కమెడియన్ గా చేరి.. అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కనిపించట్లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లలో తన యాంకరింగ్, కామెడీతో అభిమానులను సంపాదించుకున్న సుధీర్.. ఉన్నట్లుండి ఆ షో ల నుంచి తప్పుకున్నాడు. ఇందుకు ప్రధాన కారణం సుధీర్ కు పారితోషికాన్ని పెంచకపోవడమే అని అభిమానులు అనుకున్నారు. మళ్లీ ఎప్పటికీ సుధీర్ ఆయా షో లలో కనిపించబోడని అందరూ అనుకున్నారు.తాజాగా ఈటీవీ 27వ వార్షికోత్సవం కొత్త ప్రోమోను విడుదల చేయగా.. అందులో అనసూయ, సుధీర్ సహా పలువురు కమెడియన్లు కూడా రానున్నారు. సుధీర్, చంద్ర, అనసూయ లు గెస్ట్ లుగా వస్తున్న ప్రోమో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. సుధీర్ మళ్లీ ఈటీవీలో ఉండాలని కోరుతూ.. అభిమానులు కామెంట్లు చేస్తున్నారు కానీ.. సుధీర్ కేవలం గెస్ట్ గా మాత్రమే వస్తున్నాడట. ఫుల్ ఎంటర్టైన్ మెంట్ తో నిర్వహించిన ఈటీవీ 27వ వార్షికోత్సవ ఫంక్షన్ ఈ ఆదివారం (ఆగస్టు 29)న టెలీకాస్ట్ కానుంది. ఈటీవీ మల్లెమాల నుంచి వెళ్లిపోయిన వారిలో చాలా మంది ఈ షో లో కనిపించనుండటంతో ఈ ఎపిసోడ్ కు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. |
https://www.telugupost.com/movie-news/పదేళ్లయినా-చేవ-చావలేదంటు-34044/ | ఒకప్పుడు ఛమ్మాఛమ్మా అంటూ ఆడి పాడిన భామ.... రంగీలా తో కుర్రకారుకి పిచ్చెక్కించిన ఊర్మిళ గుర్తుందా..? రామ్ గోపాల్ వర్మ సినిమాలతో బాగా పాపులర్ అయిన ఊర్మిళ బాలీవుడ్ లో దాదాపు దశాబ్ద కాలం హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె అంద చందాలతో యువతను ఉర్రుతలూగించిన ఊర్మిళ బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. ఇక ఊర్మిళకు బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాక చాలా కాలం వెండి తెరకు దూరమైంది. అయితే దాదాపు పదేళ్ల క్రితం వెండితెరకు దూరంగా ఉన్న ఊర్మిళ మళ్ళీ ఇన్నాళ్లకు వెండితెరమీద రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఏ తల్లిగానో, అక్కగానో ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదండోయ్... ఏకంగా ఐటెం సాంగ్ లో నర్తించడానికి ఊర్మిళ రెడీ అవుతుంది. వెండితెరకు బై బై చెప్పి పదేళ్లయినా తనలోని ఊపు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించడానికి ఊర్మిళ తయారవుతుంది. ఇప్పటివరకు ఇలా రీఎంట్రీ ఇచ్చిన చాలా మంది భామలు ఏ తల్లి కేరెక్టర్స్ కో లేకపోతె సపోర్టింగ్ కేరెక్టర్స్ కో మాత్రమే తీసుకునేవారు. మరి 10 ఏళ్ళ గ్యాప్ లోనూ ఊర్మిళ ఇలా ఐటెం లో నర్తిస్తుంది అంటే అది మామూలు విషయం కాదు. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా వస్తున్న హిందీ ఫిలింలో ఊర్మిళ తన అందచందాలతో మరోసారి విందు చేయడానికి సిద్ధమైంది. |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-maharshi-movie-strength-120183/ | మహర్షి మీద ఇప్పటివరకు రాని అంచనాలు ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక వచ్చాయి. మహర్షి ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో ప్రేమ, స్నేహం, ఎమోషన్, యాక్షన్, పగ అన్నీ కనిపించేసరికి అందరూ మహర్షి మీద హోప్స్ పెట్టుకోవడం మొదలు పెట్టేసారు. నిన్నమొన్నటి వరకు మహర్షి సినిమా మీద ప్రేక్షకుల్లోనే కాదు కనీసం ట్రేడ్ లో కూడా ఓ అన్నంత ఆసక్తి కనిపించలేదు. కానీ మహర్షి ఈవెంట్ తో పాటు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మహర్షి మీద అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ మీద మహర్షి టీం గంపెడాశలు పెట్టుకుందని నిర్మాత దిల్ రాజు చెప్పిన దాన్నిబట్టి అర్ధమవుతుంది. ట్రైలర్ తో పెరిగిన అంచనాలు నిన్నమొన్నటివరకు శ్రీమంతుడు సినిమాతో మహర్షికి పోలిక పెడుతూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు చెప్పినదాన్ని బట్టి.. మహర్షి క్లైమాక్స్ కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అవడం ఖాయంగా కనబడుతుంది. ట్రైలర్ లో స్టోరీని రివీల్ చెయ్యకుండా చాలా జాగ్రత్తగా ట్రైలర్ కట్ చేసిన మహర్షి టీం… ప్రేక్షకుల్లో సస్పెన్స్ నింపింది. ఇక ఈ సినిమా కోసం ఎమోషనల్ క్లైమాక్స్ డిజైన్ చేశాడు వంశీ పైడిపల్లి. అది చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు ఆగవట. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా చెప్పాడు. మరి దిల్ రాజు చెప్పినదాన్నిబట్టి మహర్షి ప్రాణం అంతా ఆ క్లైమాక్స్ దగ్గరే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మొదటి నుండి చెప్పినట్టుగా అల్లరి నరేష్ పాత్ర సినిమాకి కీలకమవుతుందని మహర్షి టీం భావిస్తుందట. అందుకే అల్లరి నరేష్ పాత్రని ఎక్కడా రివీల్ చెయ్యకుండా జాగ్రత్త పడుతుంది. ట్రైలర్ మొత్తం మహర్షి చుట్టూనే తిప్పారు కానీ ఎక్కడా అల్లరిని హైప్ చెయ్యలేదు. బలమంతా క్లైమాక్స్ లోనే… అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం అల్లరి నరేష్ ని స్క్రీన్ పై చూసి షాక్ అవ్వాలన్నది వాళ్ల ఉద్దేశమట. అలాగే అల్లరి నరేష్ పాత్రకు యాంటీ క్లైమాక్స్ డిజైన్ చేశారని, అక్కడే రిషి పాత్రలో మార్పు మొదలవుతుందని అంటున్నారు. మరి దీన్నిబట్టి మహర్షి బలం.. నరేష్, క్లైమాక్స్ సీన్స్ అని తెలుస్తుంది. |
https://www.telugupost.com/telangana-assembly-elections-2023/bjp-central-leadership-has-kept-komatireddy-rajagopal-reddys-ticket-pending-1500886 | భారతీయ జనతా పార్టీ తొలి జాబితా విడుదలయింది. తొలి జాబితాలో 52 మంది పేర్లను అధినాయకత్వం ప్రకటించింది. అయితే ముఖ్యనేతలందరి పేర్లను ప్రకటించిన కేంద్ర నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టిక్కెట్ మాత్రం పెండింగ్లో పెట్టింది. ఆయన మీద కొన్ని అనుమానాలు ఉండటమే పెండింగ్లో పెట్టడానికి కారణమని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఇటీవల పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో పాటు ఆయన పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకనే ఆయన పేరును తొలి జాబితాలో ప్రకటించలేదు.రాజీనామా చేసి...కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉండి బీజేపీలో చేరిపోయారు. ఆయన 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయనతో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ కమలం పార్టీలో చేరిపోయారు. దీంతో ఉప ఎన్నికలు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. వ్యక్తిగతంగా మునుగోడులో ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ బీజేపీలో చేరిక ఆయనకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు.సోదరుడు సిఫార్సుతో...కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ఆయన తమ్ముడు పార్టీని వీడినా కాంగ్రెస్ ను వీడకుండా అంటిపెట్టుకునే ఉన్నారు. పార్టీలో కీలకంగా మారారు. అయితే బీజేపీ గ్రాఫ్ పడిపోవడం, కాంగ్రెస్ ఇమేజ్ కొంత పెరగడంతో తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సోదరుడు వెంకటరెడ్డి సహకారం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టాన్ని ఒప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకువస్తారన్న ప్రచారం జరుగుతుంది.ఈసారి ఇక్కడి నుంచే....అయితే ఈసారి ఆయన మునుగోడు నుంచి పోటీ చేయకుండా ఎల్.బి.నగర్ నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్.బి.నగర్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఒకపక్క స్థానిక నాయకత్వంతో పాటు మధుయాష్కి గౌడ్ కూడా ఎల్.బి.నగర్ నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో ఎల్.బి.నగర్ నియోజకవర్గం అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసమే రిజర్వ్ చేశారన్న టాక్ పార్టీలో బలంగా నడుస్తుంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరతారంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/varun-tej-comments-on-nagababu-speech-in-operation-valentine-pre-release-event-1522767 | Varun in OperationValentine:టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చ్ 1న విడుదల కానుంది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ నేపధ్యంలో ఈ సినిమా వచ్చింది. ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ పొట్టిగా ఉన్న వాళ్లు పోలీసు అధికారులుగా నటిస్తే సెట్ అవ్వదన్నట్లు చెప్పారు. వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి రిస్క్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాడని నాగబాబు అన్నారు. వరుణ్ ఎత్తు, బాడీ లాంగ్వేజ్ ఇండియన్ ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు కచ్చితంగా ఉంటుందన్నాడు. 5.3 అంగుళాల ఎత్తుండే వ్యక్తి కూడా పోలీసు పాత్రలు చేస్తే చూడటానికి బాగుండదన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. టాలీవుడ్లోని కొందరు హీరోల్ని నాగబాబు టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 5.3 అంగుళాల ఎత్తంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లోని ఓ అగ్రహీరోను ఉద్దేశించి చేసినవేనని కామెంట్లు పెడుతున్నారు.ఈ వివాదంపై వరుణ్ తేజ్ స్పందించారు. ఆ కామెంట్స్ ను కావాలనే ఒక హీరోకు ఆపాదిస్తున్నారని, దీనివల్ల నెగెటివిటీ పెరిగే అవకాశం ఉందని అన్నారు. తాను 6.3 అడుగుల హైట్ ఉంటానని, కాబట్టి 5.3 అడుగులు ఎత్తు ఉండే వారు పోలీస్ పాత్రలకు సెట్ కారని ఫ్లోలో నాన్న అన్నారని తెలిపాడు. అయినా టాలీవుడ్ లో 5.3 అడుగుల ఎత్తున్న హీరో ఎవరున్నారని తిరిగి ప్రశ్నించారు. నాన్న చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం మార్చి 01న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. |
https://www.telugupost.com/movie-news/ఈసారి-నటనకే-ఇంపార్టెన్స్-38196/ | టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో గ్లామర్ షో చెయ్యకుండా చుడీదార్స్ లోనే కనబడిన రకుల్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నిటికి కేవలం గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే కేవలం అందచందాలతోనే రకుల్ ఇంతవరకు రాగలిగింది కానీ ఆమెకు నటనలో ఏ మాత్రం ప్రావిణ్యం లేదంటున్నారు కొందరు. కానీ రకుల్ మాత్రం టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడి కట్టింది. కేవలం ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో మాత్రమే రకుల్ నటించలేదు. ఇక ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ - పవన్ కాంబోలో రాబోయే చిత్రానికి రకుల్ పేరు గట్టిగా వినబడుతుంది. ఒకవేళ ఫైనల్ అయితే రకుల్ కోరిక తీరిపోతుంది.మరి ఎప్పుడూ గ్లామర్ షో చేసే రకుల్, నాగ చైతన్య తో నటించిన ,రారండోయ్ వేడుక చూద్దాం, లో మాత్రం కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న భ్రమరాంబ పాత్రలో ఇరగదీసింది. అయితే ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చెయ్యడానికి సిద్దమయ్యింది. డీ గ్లామర్గా ఉండే పాత్రని రకుల్ ఎంపిక చేసుకుందట. గ్లామర్ కి ఏమాత్రం స్కోప్ లేని విడో పాత్రలో రకుల్ కనిపించబోతోందట. పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం వుండడంతో విడో క్యారెక్టర్కు రకుల్ ఓకే చెప్పిందన్నది ఇన్నర్ టాక్.మరి ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రకుల్ ఇలా డీ గ్లామర్ రోల్ చెయ్యడానికి ఎలా ఒప్పుకుందో అంటున్నారు. మరోపక్క ఎప్పుడూ గ్లామర్ డాల్ గా మాత్రమే ఏం చేస్తాం.... ఈసారి నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసి తన మీద వస్తున్న వార్తలకు చెక్ పెడదామని రకుల్ భావిస్తుందని అంటున్నారు రకుల్ సన్నిహితులు. |
https://www.telugupost.com/movie-news/pawan-kalyan-and-saidharam-tejs-bro-movie-teaser-out-now-1482783 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. మరీ ఇద్దరు మెగా హీరోల కాంబినేషన్లో సినిమా అంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మామ-అల్లుడు కలిసి.. చేస్తున్న మెగా మల్టీస్టారర్ సినిమా ‘బ్రో’. తమిళంలో వచ్చిన వినోదయ సిత్తంకు ఇది రీమేక్. ఆ సినిమాను తీసిన సముద్రఖనే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. జులై 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 29 రోజుల సమయమే ఉండటంతో.. మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేసింది. అందులో భాగంగా.. ఇప్పటికే పవన్ అండ్ తేజ్ ల పోస్టర్లను విడుదల చేశారు.తాజాగా.. గురువారం సాయంత్రం ‘బ్రో’ టీజర్ ను విడుదల చేశారు. టీజర్లో మామ-అల్లుడు అదరగొట్టేశారు. ఏంటిది ఇంత చీకటిగా ఉంది.. ఏవండి ఎవరైనా ఉన్నారా..హలో మాస్టారూ.. గురువుగారూ.. తమ్ముడూ.. అన్న కనిపించని పవన్ కల్యాణ్.. బ్రో అనగానే ఎంట్రీ ఇస్తాడు. ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’, సినిమాలెక్కువ చూస్తావేంట్రా నువ్వు అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. టీజర్ కు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుండగా.. ఖజరారే ఖజరారే పాట తరహాలో ఈ పాట ఉంటుందని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘బ్రో’ జులై 28న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. |
https://www.telugupost.com/telangana-assembly-elections-2023/telangana-election-polling-is-over-counting-will-be-done-tomorrow-but-all-exit-polls-came-in-favour-of-congress-1507135 | తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రేపు కౌంటింగ్ జరగనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగానే వచ్చాయి. ఏవో రెండు మూడు తప్పించి దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు హస్తం పార్టీదే అధికారమని తేల్చాయి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే... అధికార పార్టీ గుంభనంగా ఉంది. కేటీఆర్ తప్ప ఎవరూ మీడియా ముందుకు రాలేదు. ఆరోజు ఇంకా పోలింగ్ జరుగుతున్న సమయంలోనే మీడియా సమావేశం పెట్టి పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎలా ఎగ్జిట్ పోల్స్ కు అవకాశమిస్తారని కేంద్ర ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. తాము 70 స్థానాలతో అధికారంలోకి వస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు. మరుసటి రోజు మాత్రం తాను హ్యాపీగా నిద్రపోయానని, 3వ తేదీన శుభవార్త వింటున్నామని తెలిపారు.కేబినెట్ భేటీ అంటూ...మరోవైపు నాలుగో తేదీన కేసీఆర్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరు మంత్రులు గెలుస్తారో? లేదో? నమ్మకం లేనప్పుడు కేబినెట్ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అయితే తామే అధికారంలోకి వస్తామన్న పూర్తి విశ్వాసంతో కేసీఆర్ మంత్రి వర్గ సమావేశం తేదీని ముందుగానే ప్రకటించారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాదు.. కాదు.. కౌంటింగ్ సమయంలో క్యాడర్ నిరుత్సాహపడకుండా ఉండేందేకే ఈ మంత్రి వర్గ సమావేశాన్ని ముందుకు తెచ్చారని విపక్షాలు అంటున్నాయి. పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే కేబినెట్ సమావేశం ఎలా పెడతారని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రమాణ స్వీకారం డిసెంబరు 9న...కానీ జనవరి పదహారో తేదీ వరకూ కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని అధికార పార్టీ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఫుల్లు కాన్ఫిడెన్స్ తో ఉంది. తాము అధికారంలోకి వచ్చినట్లే భావిస్తుంది. అన్ని ఏజెన్సీలు అనుకూలంగా సర్వేలు చెప్పడంతో పాటు వస్తున్న ఫీడ్ బ్యాక్ కూడా తమదే విజయమని చెబుతుండటంతో విజయోత్సవాలు మినహా దాదాపుగా ప్రభుత్వంలోకి వచ్చినట్లే భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల బలగాలను పెంచడం కూడా ఇందుకు నిదర్శనమని అంటున్నారు. రేవంత్ రెడ్డి నుంచి కింది స్థాయి నేత వరకూ మీడియా ముందుకు వచ్చి తమదే అధికారమని పదే పదే ప్రకటిస్తున్నారు. నియంత పాలనకు కాలం చెల్లిందని ప్రకటనలు చేస్తున్నారు. డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు...ఇలా కేబినెట్ డేట్ ఫిక్స్ కావడం..... అటు కాంగ్రెస్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఫిక్స్ కావడంతో ఏమీ అర్ధం కానిది ప్రజలకే. ఎగ్జిట్ పోల్స్ ను తప్పుగా అంచనా వేయలేం. అలాగని ఖచ్చితత్వాన్ని కూడా కాదనలేం. ప్రజల మూడ్ ను బట్టి అవి అంచనాలు వేసి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇస్తాయి. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పవచ్చు. ఒక్కోసారి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ లో ప్రతి నేత ఉత్సాహంతో కనిపిస్తుండగా, బీఆర్ఎస్ నేతల్లో మాత్రం పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదన్నది మాట వాస్తవం. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60. ఆ ఫిగర్ దాటేంత వరకూ అందరికీ టెన్షన్ తప్పదు. కానీ కాంగ్రెస్ ఒకలా.. బీఆర్ఎస్ మరొలా..ఎందుకలా? |
https://www.telugupost.com/movie-news/senior-actress-jayaprada-mother-neelaveni-passed-away-in-hyderabad-continental-hospital-1352286 | ప్రముఖ సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రదకు మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి నీలవేణి తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. తల్లి మరణవార్తతో.. ఢిల్లీలో ఉన్న జయప్రద హుటాహుటిన బయల్దేరి హైదరాబాద్ కు చేరుకున్నారు. తల్లి నీలవేణి మరణంతో జయప్రద తీవ్ర విషాదంలో ఉన్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.Also Read : గుడ్ న్యూస్ : వచ్చే నాలుగు వారాల్లో కరోనా ఉద్ధృతి తగ్గుతుంది !జయప్రద తల్లి నీలవేణి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు.. సంతాపం తెలుపుతున్నారు. కాగా.. తన అందం, అభినయంతో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయప్రద.. భూమికోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠి భాషల్లో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. అక్కడ కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆమె బీజేపీ లో సభ్యురాలిగా ఉన్నారు. |
https://www.telugupost.com/movie-news/ధ్రువ-వరల్డ్-వైడ్-ఫస్ట్-వ-17066/ | ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 7 .21సీడెడ్ 3 .67వైజాగ్ 2 .82ఈస్ట్ గోదావరి 1 .58వెస్ట్ గోదావరి 1 .55క్రిష్ణ 1 .54గుంటూరు 1 .85నెల్లూరు 0 .73కర్ణాటక 4 .55ఓవర్ సీస్ 4 .55రెస్ట్ ఆఫ్ ఇండియా 0 .80ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 30 .85 |
https://www.telugupost.com/crime/nimmakayala-chinna-demise-in-yaanam-his-girlfriend-mounika-took-shocking-decision-1490843 | ప్రేమించిన వాళ్లు లోకంలో లేకపోతే తాము కూడా ఈ లోకంలో ఉండమని చెప్పి కఠోర నిర్ణయాలు తీసుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఘటనే ఒకటి యానాంలో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు వదిలాడని ఆ అమ్మాయి కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన యానాంలో చోటు చేసుకుంది.మీసాల మౌనిక అనే అమ్మాయి రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలో ఉంది. చిన్నా గంజాయికి బానిసయ్యాడు. రెండు నెలల క్రితం అతడు తన సోదరుడిని గంజాయి కోసం రూ.500 అడగ్గా అతడు నిరాకరించాడు. క్షణికావేశానికి లోనైన చిన్నా ఒంటికి నిప్పంటించుకున్నాడు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రియుడు దూరమవడంతో మౌనిక తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కాలేజీకి వెళ్లడం కూడా మానేసింది. తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె అతడి లోకంలో లేనంటూ.. సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యానాంలోని యూకేవీనగర్కు చెందిన మౌనిక తన మేనమామ త్రిమూర్తులు వద్ద ఉంటూ నర్సింగ్ విద్య చదువుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. అక్క, చెల్లెళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. ఈమె చిన్నాను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇంతలో ఇద్దరి జీవితంలో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. త్రిమూర్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్మార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ntr-biopic-new-title-91380/ | నందమూరి తారక రామారావు అనే పేరు నటనకే ఆణిముత్యం. నట జీవితంలో అనేక రకాల పాత్రలతో మెప్పించిన నందమూరి తారకరామారావు బయోపిక్ ని ఆయన తనయుడు బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే నట, రాజకీయ జీవితంలో సంచలనాల ఎన్టీఆర్ జీవితాన్ని ఒకే ఒక భాగంలో చూపించడం అనేది అసాధ్యం. అయితే సినిమా మొదలు పెట్టినప్పుడు ఒకే భాగంగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ అనుకున్నాడు. కానీ అది అసాధ్యం అని తేలడంతో క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ పూర్తి నట జీవితం ఒక భాగంగా, ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మరో భాగంగా తీర్చి దిద్దుతున్నారు. గత రెండు రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం జరుగుతుండగా... తాజాగా ఎన్టీఆర్ చిత్ర బృందం నుండి కూడా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది.రెండు పార్ట్ ల మధ్య రెండు వారాలు...ఎన్టీఆర్ నట జీవితాన్ని మొదటి భాగంగా ఎన్టీఆర్ - కథానాయకుడు గా, ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంగా ఎన్టీఆర్ - ప్రజానాయకుడు గా విడుదల చెయ్యాలని క్రిష్ తో పాటుగా బాలకృష్ణ కూడా భావించి ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నామని బిగ్ బ్రేకింగ్ న్యూస్ లా ప్రకటించేశారు. మరి నటజీవితంలో కథానాయకుడిగా ఎన్టీఆర్ చేసిన పౌరాణిక పాత్రలు, హీరోయిజాన్ని పండించే పాత్రలు, ఆత్మీయతలు, అనుబంధాలకు అల్లుకుపోయే పాత్రలు ఎన్టీఆర్ కి పెట్టింది పేరు. ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, ఇంకా చాలా రకాల పాత్రలు అలవోకగా వేసి అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ఇక ఏఎన్నార్, కృష్ణ, ఎస్వీఆర్, సావిత్రి, శ్రీదేవి, జయప్రద, జయసుధ ఇలా మేటి నటీనటులతో ఎన్టీఆర్ తన నట జీవితంలో జీవించారు. ఎన్టీఆర్ నట జీవితాన్ని అందుకే క్రిష్ కథానాయకుడిగా చూపించబోతున్నాడు. ఇక మిగిలిన ప్రజానాయకుడు గా అంటే ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కూలంకషంగా చూపించబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ - కథానాయకుడు పార్ట్ ని జనవరి 9 న సంక్రాతి కానుకగా విడుదల చేసేటున్నారని అధికారిక ప్రకటన ఇవ్వగా... ఎన్టీఆర్ - ప్రజానాయకుడు పార్ట్ ని దీనికి రెండు వారాల గ్యాప్ తో జనవరి 26 న విడుదల చేసే ప్లాన్ లో ఎన్టీఆర్ చిత్ర బృందం ఉంది కానీ.. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ కి సంబంధించిన ఎన్టీఆర్ - కథానాయకుడు పోస్టర్ ని విడుదల తేదీతో పాటుగా విడుదల చేశారు. |
https://www.telugupost.com/movie-news/big-boss-4-insurance-163941/ | గత ఏడాది ఈపాటికి బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ త్రీ సందడి మాములుగా లేదు. కేవలం శని ఆది వారాలే కాదు.. వర్కింగ్ డేస్ లోను బిగ్ బాస్ మంచి రేటింగ్ తో స్టార్ మా కి కిక్కిచ్చింది. నాగార్జున హోస్ట్ గా 100 రోజులకి పైగా బిగ్ బాస్ సీజన్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కాగా.. ఇప్పుడు సీజన 4 కోసం స్టార్ మా బాగా వెయిట్ చేస్తుంది. కానీ కరోనా వలన బిగ్ బాస్ యాజమాన్యానికి చుక్కలు కనబడుతున్నాయి. 100 రోజులు జరగాల్సిన షో కాస్త కేవలం 50 రోజులకే కుదించారని, నాగార్జున కండిషన్స్ కి తలొగ్గడమే కాదు.. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలోనూ బిగ్ బాస్ కి సినిమా కష్టాలు కనబడుతున్నాయట. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే వారు కరోనా టెస్ట్ లే కాకుండా 14 రోజులు బిగ్ బాస్ యాజమాన్యం ఏర్పాటు చేసే క్వారంటైన్ లో ఉండాలి. అలాగే కంటెస్టెంట్స్ కి ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయించాలనే కొత్త రూల్ ఒకటి బిగ్ బాస్ కి తగిలింది. కేవలం కంటెస్టెంట్స్ కి మాత్రమేనా షో కోసం పనిచేసే వారందరికీ అంటే దాదాపు 250 నుండి 275 మందికి ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం ఇన్సూరెన్స్ చేయించాలట. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పారితోషకాల్లో కోత పెట్టినా…. నాగ్ పారితోషకం, సెట్ ఖర్చు మామూలుగానే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్స్ కి టెక్నీకల్ సిబ్బందికి కొత్తగా ఇన్సూరెన్స్ ఒకటి బిగ్ బాస్ యాజమాన్యానికి తలా బొప్పికడుతుందట. గతంలో కన్నా ఖర్చు తగ్గిద్దామని డిసైడ్ అయితే.. ఇప్పడు ఈ ఇన్సూరెన్స్ గోలతో మరో 20 శాతం ఖర్చు ఎక్కువ అవుతుందట. ఏదో టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోదామని, కోట్లు కొల్లగొడదామని చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యానికి కె బిగ్ బాస్ షో చుక్కలు చూపెడుతుంది అని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/monal-bigboss-174721/ | బిగ్ బాస్ సీజన్ 4 లో అర్హతలేని కంటెస్టెంట్ ని బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నాడు, ఆ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ కాపాడుతున్నాడు అంటూ.. మోనాల్ గజ్జర్ విషయంలో సోషల్ మీడియాలో బిగ్ బాస్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కానీ గత రెండు వారాలుగా మోనాల్ ఆటలో చాలా తేడా.. ఇప్పుడు ఈ రెండు వారాలుగా మోనాల్ స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అట మొదలైనప్పటినుండి మోనాల్ కోసం అఖిల్, అఖిల్ కోసం మోనాల్ స్టాండ్ తీసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ గత వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో అఖిల్ మోనాల్ ఫై కోపం తెచ్చుకోవడం, మమ్మి చెప్పిందని మోనాల్ తో దూరంగా ఉండడం చేస్తున్నాడు. ఆ విషయంలో మోనాల్ గట్టిగానె హార్ట్ అయ్యింది. అయితే ఈ సోమవారం నామినేషన్స్ లో మోనాల్ అఖిల్ కి మరిచిపోలేని షాకిచ్చింది. ఈ వారం నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ తెలీకుండా పెట్టుకున్న ఎర్ర టోపీతో ఎలిమినేషన్స్ లోకి వెళ్లగా.. అందులో అఖిల్, అభిజిత్, అరియనా, అవినాష్ లు ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఆ నలుగురిని మీరు హౌసులో ఎందుకు ఉండాలనుకుంటున్నారో చెప్పి మీరు వేరే వాళ్ళుతో స్వాప్ చేసుకోవచ్చని అనగానే అవినాష్ మోనాల్ ని రిక్వెస్ట్ చెయ్యగా.. మోనాల్ అవినాష్ కి మీరు హౌస్ లో ఉండి గట్టిగా ఆడండి అంటూ గట్టిగానే చెప్పింది. ఇక అఖిల్ కూడా మోనాల్ ని రిక్వెస్ట్ చేసి..అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నావ్ అంటున్నారు.. కానీ ఎక్కడ? అని మోనాల్ ని తనతో స్వాప్ చేసుకోమని అడిగాడు . కానీ మోనాల్ అఖిల్ కాదని అభిజిత్ ని స్వాప్ చేసుకుంది. దానితో అఖిల్ ఫేస్ ఎర్రగా దోశలా మాడిపోయింది. |
https://www.telugupost.com/movie-news/మూర్తిగారేమిటండి-రెచ్చి-38642/ | ఇప్పుడు టీవీ ఛానల్స్, సోషల్ మీడియా, వెబ్సైట్స్ ఎక్కడ చూసినా ఒకటే రగడ. సినిమా ఇండస్ట్రీనే సిట్ అధికారులు ఎందుకు డ్రగ్స్ కేసులో టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు పొలిటికల్ సైడ్ నుండి గాని, స్కూల్స్, కాలేజెస్ సైడ్ నుండి గాని ఎటువంటి కదలికలు లేని డ్రగ్స్ కేసు ముందుగా సినిమా ఇండస్ట్రీ పైనే పడడం కాస్త ఆశ్చర్యంగా వున్నా... మరొకవైపు మాత్రం ఎక్కడినుండో అక్కడినుండి ఈ కేసు ఖచ్చితంగా మొదలయ్యెదనే చెబుతున్నారు. అలాగే మొదట మీరు...మొదట మీరు అని నిందించుకుంటూ కూర్చోంటే అసలు తొలి అడుగు ఎక్కడ పడాలి? ఎవరికి వారు, ముందు రాజకీయ నాయకులని విచారించండి అని సినిమావారు, సినిమావారు బాగా పాపులర్ కాబట్టి వారి సంగతి మొదట చూడండి అని, ఎవరికి వారు మరొకరి మీదకు నెడుతూ ఉంటే మొదటి అడుగు ఎక్కడ నుంచి వేయాలి? మరికొందరు మీ అధికారులు, వారి పిల్లలే వాడుతున్నారు. మొదట మీ సంగతి మీరే చేసుకోండి.........అంటున్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం ముందుగా స్కూల్స్, కాలేజెస్ ని టార్గెట్ చేసినా కూడా యాక్షన్ తీసుకుంటున్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ నే. అయితే కేవలం ఇండస్ట్రీ మీదే ఎందుకింతగా ఫోకస్ చేశారని మొన్నటికి మొన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీడియా సాక్షిగా వాదించాడు. ఇక ఇప్పుడు తాజాగా సామాన్యంగా ఎవ్వరినీ విమర్శించని ఆర్.నారాయణమూర్తి కూడా మా సినిమా వారే కనిపిస్తారా? అని ప్రశ్నించడం ఓ బాధ్యతాయుతమైన ఆర్.నారాయణమూర్తి గారికి తగదు. స్కూళ్లకు వెళ్లే టీనేజ్ పిల్లలకి కూడా డ్రగ్స్ అందుతున్నాయంటే పరిస్థితిని తీవ్ర రూపాన్ని ఇది చూపిస్తోంది. మీకు మీ సినిమా వారి మీద అంత నమ్మకం ఉంటే.. వారందరినీ విచారించకండి....... వారు డ్రగ్స్ వాడినట్లు, లేదా సప్లై చేసినట్లు తెలిస్తే వారి తరపున నేను శిక్ష అనుభవించడానికి రెడీ అని ఆర్.నారాయణమూర్తి వంటి వారు సినిమా పరిశ్రమ తరపునవకాల్తా పుచ్చుకోవడం కరెక్ట్ కాదనే వాదన వినబడుతుంది.మరి నారాయణ మూర్తి గారు కేవలం సినిమా వాళ్లనే ఇలా సిట్ ఆఫీసర్స్ ఎందుకు టార్గెట్ చేసి ఇండస్ట్రీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారంటూ..... మీడియా, సిట్ అధికారులు కలిసి సినిమాలు తీసే వాళ్లకే సినిమాలు చూపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ డ్రగ్స్ వ్యవహారంలో సినిమా వాళ్లు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నట్లుగా భ్రమలు కల్పిస్తున్నారని.. పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు.. రాజకీయ నేతలు.. వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ వాడుతున్నారన్నారు. వాళ్లందరిని వదిలేసి.. సినిమా వాళ్ల మీదనే ఫోకస్ చేయటం సరికాదన్నారు. మరి నారాయణ మూర్తి డ్రగ్స్ వ్యవహారంలో అనవసరంగా స్పందించారేమో అనిపిస్తుంది కదూ. |
https://www.telugupost.com/movie-news/naga-shourya-srinivas-avasarala-movie-title-113574/ | నాగశౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘నర్తనశాల’ డిజాస్టర్ తరువాత ఇప్పుడిప్పుడే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు శౌర్య. ప్రస్తుతం అతను వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. నందినీరెడ్డితో ‘బేబీ’ అనే సినిమా పూర్తయిపోయింది. మరో రెండు సినిమాలతో పాటు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం ఓ డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పటికే రెండు హిట్ సినిమాలు ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. అవసరాల తనదైన స్టయిల్ లోనే అందించబోతున్నారని డిసైడ్ కావచ్చు. అవసరాలతో నాగశౌర్య ఇప్పటికే రెండు సినిమాలు చేసిన అనుభవం ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ రెండు సినిమాలూ డీసెంట్ హిట్స్ అయ్యాయి. ఇక మూడు సినిమా అయిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే అధికారంగా ప్రకటన రానుంది. |
https://www.telugupost.com/movie-news/ఇప్పటితరం-హీరోలకు-అసలు-బ-14042/ | ఈ మాటన్నది ఎవరో కాదు సీనియర్ నటుడు చంద్రమోహన్. ఇప్పటి తరం హీరోలకు అసలు ఏం తెలియదని అన్నారు. వీరంతా ఎంతో గొప్పనటులమని ఫీలవుతారని కానీ వారికి అస్సలేం తెలియదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పటివరకు 800 లు పైగా సినిమాల్లో నటించానని... . తన 50 ఏళ్ళ సినీజీవితం తనకు సంతృప్తినిచ్చిందని నిన్నఆదివారం ఏలూరులో జరిగిన వనమోహోత్సవ కార్యక్రమం లో ఆయన మీడియా తో మాట్లాడారు. రంగులరాట్నం, సువర్ణనంది చిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయని అప్పటి తియ్యని జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేనని అన్నారు. ఇక ఆయన ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ... ఇప్పుడు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని.... ఈ తరం హీరోలు ఎన్టీఆర్, అమితాబచ్చన్ల మాదిరి తెగ ఫీల్ అయిపోతూ తామేదో సాధించేశామనే ధోరణిలో ఉన్నారని అన్నారు. అసలు సీనియర్ నటుల్ని ఏమాత్రం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇప్పుడు వస్తున్న సినిమాలు అశ్లీలత, ఫైట్స్, కామెడీ అంటూ రొటీన్ కథలుగానే ఉంటున్నాయని.... కామెడీ కి పెద్దగా చోటు లేకుండా పోయిందన్నారు. అసలు ఈ రోజుల్లో సినిమాలు 100 రోజులు ఆడడమే గగనం అయిపోయాయని.... కనీసం రెండు వారాలు కూడా థియేటర్స్ లో నిలబడలేకపోతున్నాయని అన్నారు. ఇక ఆర్టిస్టుగా క్యారెక్టర్లు కూడా దొరకడం లేదన్నారు. ఇప్పుడొస్తున్న కేరెక్టర్స్ తనకసలు తృప్తినివ్వడం లేదన్నారు. చంద్ర మోహన్ మాదిరిగానే ఆ మధ్యన ప్రస్తుత సినిమా పరిశ్రమ పరిస్థితులపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఆవేదనను వెళ్లగక్కిన విషయం తెలిసిందే |
https://www.telugupost.com/movie-news/tollywood-director-kisses-heroine-in-public-video-goes-viral-on-the-internet-1492139 | సినిమాను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలంటే చాలానే చేయాలి. అందుకు సంబంధించి హెల్తీ పబ్లిసిటీ దారిలో నడిచే వాళ్లు కొందరు ఉంటారు. ఇంకొందరు సినిమాను చీప్ గా రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి ప్రమోషన్స్ వల్ల మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువ ఉంటుంది. అందుకే స్టేజీల మీద, మీడియా సమావేశాల్లో కాస్త పద్దతిగా ప్రవర్తించాలి. అయితే కొందరు మాత్రం అతి చేస్తూ అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ AS రవి కుమార్ చౌదరి ఒక పబ్లిక్ ఈవెంట్లో నటి మన్నారా చోప్రాను ముద్దుపెట్టుకున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ‘తిరగబడరా సామి’. సినిమాలో హింసను వ్యతిరేకించే అమాయకపు కుర్రాడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తాడు. కానీ అతను ప్రేమించిన అమ్మాయి హింసను ఇష్టపడుతుంది. మన్నారా చోప్రా కూడా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్ ముందు మన్నారా భుజంపై చేయివేసి, ఫొటోలకు పోజులిచ్చిన రవి కుమార్ చౌదరి ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. ఆ సమయంలో మన్నారా చోప్రా నవ్వుతూ సైలెంట్ అయిపోయింది. ఈ ముద్దు సమయంలో ఆమె కాస్త అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయిందని మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. 2013లో రాజ్ తరుణ్ నటించిన ‘ఉయ్యాలా జంపాలా’ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ ‘సినిమా చూపిస్తా మావా’, ‘కుమారి 21ఎఫ్’ చిత్రాలు వరుస విజయాలను అందుకున్నాయి. కానీ విజయాలను కొనసాగించడంలో విఫలమయ్యాడు. మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. కొన్ని సినిమాలలో రాజ్ తరుణ్ ఎందుకు చేశాడో.. అసలు ఆ సినిమాలో రాజ్ తరుణ్ ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు. ఈసారి రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. |
https://www.telugupost.com/movie-news/allu-aravind-producing-ramayanam-in-telugutamil-and-hindi-127029/ | మనకి ‘రామాయణం’ గురించి తెలిసినప్పటికీ దాన్ని సినిమాగా ఇప్పటికి థియేటర్స్ కి వెళ్లే జనాలు ఉన్నారు. ‘రామాయణం’ మీద ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి వెండితెర పైకి ‘రామాయణం’ రానుంది. కాకపోతే ఈసారి భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ .. మధు మంతెన .. నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ పేరుతో మూడు భాగాలుగా మూడు భాషల్లో నిర్మించనున్నారు. తెలుగు తో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. దాదాపు 1500 కోట్లు బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కనుంది. ఇందులో సీత పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా సమాచారం. సీత పాత్రలో నయన్ గతంలో ‘శ్రీరామరాజ్యం’ లో నటించింది. ఆ పాత్రకు ఆమె జీవం పోసిందనే చెప్పాలి. అందుకే మరోసారి ఈ పెద్ద ప్రాజెక్ట్ లో ఆమెను సీత గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ సీత పాత్ర చేసేందుకు నయన్ ఓకే చెబితే ఆమె పంట పండినట్టే. రాముడు పాత్రలో ఎవరు నటిస్తారు అనేది పెద్ద సస్పెన్స్. |
https://www.telugupost.com/movie-news/sai-dharam-tej-rashi-khanna-prati-roju-panduge-collections-143310/ | ప్రతి రోజు పండగే సినిమా హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో సాయి తేజ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయేలా కనబడుతుంది. మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ కళ్లగొట్టిన ప్రతిరోజూ పండగే సినిమా సోమవారం కూడా నిలకడగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. వీక్ డేస్ లో వీకవ్వకుండా ప్రతి రోజు సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. 70 నుండి 80 శాతం ప్రేక్షకులు థియేటర్స్ లో సందడి చేయడంతో.. ప్రతి రోజు కలెక్షన్స్ సోమవారంనాటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.41 కొల్లగొట్టింది. ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 4.46 సీడెడ్ 1.35 నెల్లూరు 0.38 కృష్ణ 0.74 గుంటూరు 0.76 వైజాగ్ 1.30 ఈస్ట్ గోదావరి 0.82 వెస్ట్ గోదావరి 0.60 టోటల్ ఏపీ & టీస్ షేర్: 10.41 |
https://www.telugupost.com/movie-news/trivikram-srinivas-aravinda-2-91106/ | డైరెక్టర్ అనేవాడు సినిమాకి కెప్టెన్ అఫ్ ది షిప్ అంటారు. ఇది ఎవరు ఏమి అనుకున్నా ఒప్పుకుని తీరరాల్సిందే. అన్ని పనులు అతని కనుసన్నల్లోనే జరగాలి ఎందుకంటే సినిమా ప్లాప్, హిట్ అతని చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. కొంతమంది డైరెక్టర్స్ తన చుట్టుపక్కల వాళ్లు చెప్పే సలహాలు తీసుకుంటారు. స్టార్ హోదాని అనుభవిస్తున్న కొంతమంది స్టార్ డైరెక్టర్స్ మాత్రం ఇందుకు వ్యతిరేకం. ఎవరు ఎన్ని సలహాలు, సూచనలు ఇచ్చినా పటించుకోరు. అందులో త్రివిక్రమ్ కూడా ఒక్కరు.వారి మాట కూడా వింటున్నాడా..?ప్రొమోషన్స్ విషయంలో కూడా త్రివిక్రమ్ ఎవరి మాట వినరు. ‘అజ్ఞాతవాసి’ టైంలో ఎవరి మాట వినకపోవడంతో అది డిజాస్టర్ అయిందని అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అరవింద సమేత విషయంలో ఎన్టీఆర్, నిర్మాత రాధాకృష్ణ నిర్ణయాలూ పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్, ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా రిలీజ్ లాంటి విషయాల్లో వారి మాటే చెల్లుబాటు అయ్యిందని సమాచారం.ఇద్దరికీ నచ్చిన సీన్లు మాత్రమే...అంతేకాదు త్రివిక్రమ్ ఎన్నడూ లేని విధంగా అరవింద సమేత స్క్రిప్ట్ విషయంలో చాలామంది సలహాలు తీసుకున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ నో చెప్పిన ఏ సీన్స్ ఇందులో లేవని..త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లకు నచ్చే సీన్స్ మాత్రమే ఇందులో ఉన్నాయని... ఎన్టీఆర్ ఈ స్క్రిప్ట్ విషయంలో చాలానే జోక్యం చేసుకున్నాడని తెలుస్తుంది. ఇదంతా సినిమాకి ప్లస్ అవ్వాలని.. అంతే కానీ వేరే విధంగా కాదని.. చెబుతున్నారు ఎన్టీఆర్ దగ్గర ఫ్రెండ్స్. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. |
https://www.telugupost.com/movie-news/filimnagar-talk-is-about-to-give-anusuya-another-good-role-134728/ | బుల్లితెర మీద వెలుగుతున్న అనసూయ కి దర్శకుడు సుకుమార్ రంగస్థలం లో రంగమ్మత్త పాత్ర నిచ్చి బాగా హైలెట్ చేశాడు. ఆ రంగమ్మత్త పాత్రలో అనసూయ వెండితెర మీద సెటిల్ అయ్యింది. రంగస్థలం కన్నా ముందు క్షణం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలు చేసిన అనసూయ తర్వాత విన్నర్ లో ఐటెం సాంగ్ తో అదరగొట్టేసింది. హీరోయిన్స్ తో పోటీపడి మరీ హాట్ ఫోటో షూట్స్ చేయించుకునే అనసూయ కి చిరు – కొరటాల సినిమాలోనూ ఓ భారీ అవకాశం వచ్చింది. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. ఆమె కోసం ఫుల్ లెన్త్ క్యారెక్టర్….. తాజాగా అనసూయ కి సుకుమార్ మరో మంచి పాత్ర ఇవ్వబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో అనసూయకి ఓ మంచి పాత్ర ని సుకుమార్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ దశలోనే క్యారెక్టర్స్కు ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసుకునే సుకుమార్… అనసూయ కోసం ఓ మంచి ఫుల్ లెన్త్ క్యారెక్టర్ను ఫిక్స్ చేశాడని టాక్. ఇప్పటికే వెండితెర మీద అవకాశాల మీద అవకాశాలతో ఉన్న అనసూయ ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం డేట్స్ ని అడ్జెస్ట్ చేసుకునే పనిలో పడిందనే టాక్ వినబడుతుంది. |
https://www.telugupost.com/movie-news/aravinda-sameta-veera-raghava-93585/ | దసరా కానుకగా రిలీజ్ అయినా 'అరవింద సమేత' మొదటి రోజు టాక్ బట్టి చూస్తే ఇది నాన్ 'బాహుబలి' పై ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తుందని అందరు అనుకున్నారు. అలానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వీకెండ్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అనూహ్య స్థాయిలో వచ్చింది. అయితే ఆ తర్వాత ఈచిత్రం అనుకున్న స్థాయిలో పెర్ ఫామ్ చేయలేకపోయింది. ముఖ్యంగా తొలి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ బాగా డల్ అయ్యాయి.తొలి వారం మాత్రం.....తొలివారం ఈచిత్రం 70 కోట్లు దాకా వసూల్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితిల్లో ఈసినిమా 100 కోట్లు క్లబ్ లోకి వెళ్ళటం కష్టం అని అంటున్నారు ట్రేడ్ వారు. అసలు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా కష్టమే అని అంటున్నారు. దానికి తోడు ఈవారం అంటే నిన్న 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా విడుదల అయింది. దీనిపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు కానీ అనుకున్న స్థాయిలో ఈసినిమా లేదు.వాటికి నెగిటివ్ టాక్ రావడంతో.....ఏదో అలా టైంపాస్ అయిపోయే సినిమానే తప్ప.. అంత ప్రత్యేకమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. ఈసినిమాతో పాటు విశాల్ ‘పందెంకోడి-2’ రిలీజ్ అయింది. ఇది తెలుగులో డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. ఇలా ఈరెండు సినిమాలకి నెగటివ్ టాక్ రావడంతో ‘అరవింద సమేత’కు కలిసొచ్చే అవకాశముంది. ఈ వీకెండ్ లో ఈచిత్రాన్ని ఆక్యుపెన్సీ రేట్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు ట్రేడ్. దాంతో 100 కోట్లు వసూలు చేయకపోయినా కనీసం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. |
https://www.telugupost.com/crime/people-beaten-girlfriend-who-came-to-meet-her-bf-1432415 | ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ప్రియుడిని కలవడానికి వెళ్లిన ప్రియురాలికి గ్రామస్తులు పట్టుకుని కొట్టారు. తాలిబానీ తరహాలో కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. చాలా మంది మహిళలు ఆ మహిళను పట్టుకుని, తాడుతో కట్టేసి కొట్టడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.స్థానికులు ఆమెను కర్రలు, రాడ్లతో కొట్టడమే కాకుండా తిట్టడం కూడా మొదలుపెట్టారు. యువతిని కొట్టడం చూసి ఆమె ప్రియుడు అక్కడి నుండి పారిపోయాడు. ప్రస్తుతం ఆ ప్రేమికుడి కోసం గ్రామానికి చెందిన కొందరు వెతుకుతున్నట్లు సమాచారం. ప్రియురాలు మరియు ఆమె ప్రియుడు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వివాహేతర సంబంధంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇలా శిక్ష విధించారు. షోహ్రత్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధ్వాపూర్లోని పురానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. |
https://www.telugupost.com/top-stories/komatireddy-rajagopal-reddy-will-resign-from-his-mla-post-on-8th-of-this-month-1432355 | మునుగోడు ఉప ఎన్నిక దాదాపు ఖారరయింది. ఈ నెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఆరు నెలల్లో ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కోమటిరెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయనే అభ్యర్థి కానున్నారు. ఉప ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రిస్క్ తీసుకున్నారా? అన్న సందేహం కూడా ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతుంది. రాజకీయాల్లో రిస్క్ సాధారణమే కాని, ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉన్న పదవిని అనవసరంగా వదులుకుంటారా? అన్న చర్చ జరుగుతుంది.బీజేపీకి ఇక్కడ...మునుగోడు రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ తొలి నుంచి కాంగ్రెస్, కమ్యునిస్టుల బలంగా ఉన్నాయి. బీజేపీకి ఇక్కడ చోటే లేదు. కులాల పరంగా చూసినా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఇబ్బందేనని చెప్పాలి. మునుగోడులో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ. మొత్తం ఓటర్లలో కేవలం 3.49 శాతం మంది మాత్రమే రెడ్డి సామాజికవర్గం ఉంది. ఇక్కడ ఎక్కువగా బీసీలు ఉన్నారు. దాదాపు నలభై శాతం మందికి పైగా బీసీలున్నారు. బీసీ సామాజికవర్గం ఏ పార్టీకి మద్దతిస్తే వారిదే గెలుపు అవుతుంది. అయితే బీసీలలో ఐక్యత ఎంత వరకూ సాధ్యమవుతుందన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.ట్రయాంగల్ ఫైట్...ఇక మునుగోడులో ఈసారి ట్రయాంగల్ ఫైట్ తప్పదు. టీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ కు స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో సాలిడ్ గా ఓటు బ్యాంకు అంతా బీజేపీ వైపు మళ్లుతుందని చెప్పలేం. కొంతమంది నేతలు వెళ్లొచ్చు. నేతలు వెళ్లినంత మాత్రాన ఓటర్లు గంపగుత్తగా వారి వెంట వెళతారన్నది ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అంతా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పైనే ఆధారపడి రంగంలోకి దిగుతున్నట్లు కనపడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రిస్క్ లో పడక తప్పదు అన్నది విశ్లేషకుల అంచనా.ఎక్కువ ఓట్లు చీలిస్తే....కాంగ్రెస్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. సరైన అభ్యర్థిని రంగంలోకి దించితే కాంగ్రెస్ గెలవలేక పోయినా మరొకరిరిన ఓడించే స్థాయిలో ఓట్లను చీల్చుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తాను గెలవలేకపోయినా కోమటిరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నట్లే కనిపిస్తుంది. అదే జరిగితే టీఆర్ఎస్ కు ఇక్కడ లాభం చేకూరుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న ఓట్లు సయితం కాంగ్రెస్ దక్కించుకునే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి రిస్క్ తీసుకున్నారని, హుజూరాబాద్ లా ఇది వన్ సైడ్ లా ఉండదని, ఫలితం వెలువడే వరకూ టెన్షన్ తప్పదన్న కామెంట్లు వినపడుతున్నాయి. |
https://www.telugupost.com/movie-news/చిరు-మాదిరిగానే-ప్రత్యక్-57135/ | మెగా స్టార్ చిరంజీవి స్క్రీన్ ప్రెజన్స్ కి వున్న క్రేజ్ ఏంటో ఎన్ని తరాలు మారినా ప్రతి తరం వారికి పరిచయం చేస్తూనే వున్నాయి ఆయన నటిస్తున్న చిత్రాలు. గ్యాంగ్ లీడర్ వంటి మాస్ సినిమా తోనైనా, రుద్రవీణ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రమైనా, హిట్లర్ వంటి సెంటిమెంట్ సినిమా అయినా, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి కామెడీ చిత్రమైనా, ఠాగూర్ వంటి సామాజిక సందేశమున్న చిత్రాలైనా ఎలాంటి పాత్రలైనా ప్రేక్షకులకి గుర్తిండిపోయేలా అభినయం ప్రదర్శించకలిగిన నటుడు మెగా స్టార్ చిరంజీవి. ఆయన చరిష్మా ఆయన కుటుంబంలో కూడా మరెవరికి రాలేదు. అయితే వెండితెరపై ఇంత క్రెడిబిలిటీ వున్న హీరో కి సైతం శంకర్ దాదా జిందాబాద్ వంటి ఫెయిల్యూర్ రాజకీయ ప్రవేశం పై ఎఫెక్ట్ కొట్టింది.సినిమా విజయాపజయాలు రాజకీయ పరమైన ఓట్లుగా మారటం అసంభవం అయినప్పటికీ మెగా అభిమానులని ఒక సెంటిమెంట్ బాగా కలవరపెడుతుంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన చిరు ముఖ్య మంత్రి అవుతారని ఆశించిన అభిమానులకి నిరాశ మాత్రమే మిగిలింది. ఇక ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అజ్ఞ్యాతవాసి వంటి ఘోర పరాజయం అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం సెంటిమెంట్ పరంగా కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్న అభిమానులని భయపెడుతుంది. పైగా ఇప్పట్లో సినిమా ఆలోచనలేవీ లేవని స్పష్టం చేశారు కళ్యాణ్. మరి జనసేన సిద్ధాంతాలతో వారి కుటుంబానికి వున్న బాడ్ సెంటిమెంట్ ని ఎలా తిరగరాస్తారో 2019 ఎన్నికలు తేల్చనున్నాయి |
https://www.telugupost.com/movie-news/mahanati-ashwinidutt-72282/ | మార్చ్, ఏప్రిల్ లలో రెండు బడా సినిమాలు బాక్సాఫీసుని దున్నేయ్యగా మే లో వచ్చిన పెద్ద సినిమా నా పేరు సూర్యని తలదన్నేలా మీడియం బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి మూవీ మే హిట్ గా నిలిచిపోయింది. మీడియం బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. నిర్మాత అశ్వినీదత్ ని మళ్ళీ నిర్మతగా నిలబెట్టిన ఘనత మహానటికే దక్కుతుంది. సావిత్రి జీవిత కథను మహానటిగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. కేవలం 20 నుండి 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహానటి మూవీ ఇప్పుడు 35 కోట్ల షేర్ దాటేసింది.అశ్వినీదత్ కోలుకున్నట్లే...ఇంకో 10 కోట్ల షేర్ తేవడం ఖాయమంటున్నారు. అలాగే మహానటి సినిమా శాటిలైట్స్ హక్కులు ఇంకా తెగలేదు. ఇక శాటిలైట్స్ హక్కులు, డిజిటల్, డబ్బింగ్ హక్కులు అన్ని కలిపి మహానటి కి 60 కోట్ల షేర్ తెచ్చే దమ్ముందని ట్రేడ్ ఆర్గాల భావన. మరి పెట్టిన పెట్టుబడికి ఇలా మూడింతల ఆదాయం మహానటి తేవడం అనేది మామూలు మాటలు కాదు. మరి ఈ సినిమాతో అశ్వినీదత్ మళ్ళీకొలుకుని పెద్ద స్టార్స్ తో సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో శక్తి, కంత్రి వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా బాగా చితికి పోయిన అశ్వినీదత్ మహానటి తో మళ్ళీ పైకి లేచాడు.అంచనాలు లేకపోవడమే కలిసొచ్చింది..మహానటి కి విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేక సరిగ్గా బిజినెస్ జరక్కపోవడం అశ్వినీదత్ కి కలిసొచ్చిన అంశమే. అందుకే మహానటి సినిమాని అనేక చోట్ల అశ్వినీదత్ వాళ్ళు ఓన్ గా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏరియాల్లో నామమాత్రపు రేటుకు సినిమాను అమ్మారు. ఇప్పుడు చూస్తే ఈ చిత్రం పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. |
https://www.telugupost.com/movie-news/ఒక్కో-చిత్రంతో-ఉనికి-కోల-54645/ | ఒక దశాబ్ద కాలంగా విదేశాలలో భారతీయ చిత్రాలు అంటే తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ వంటి భాషా చిత్రాలకి గుర్తింపు దక్కుతుంది కాని అనాదిగా భారతీయ చిత్రాలు అంటే విదేశీయులకి కేవలం బాలీవుడ్ మాత్రమే పరిచయం. అందుకే దక్షిణాది నటులలో ఒక్క సూపర్ స్టార్ రజని కాంత్ కి మినహాయిస్తే మరే ఇతర ప్రముఖ కథానాయకులకు కూడా బాలీవుడ్ కథానాయకులకు వున్న అంత గుర్తింపు ఉండేది కాదు. మరీ ముఖ్యంగా ఖాన్ త్రయం కి విదేశీ మార్కెట్ లో స్వదేశీ మార్కెట్ కి ధీటుగా వసూళ్ల వర్షం కురుస్తుండేది. అయితే ఆ క్రెడిబిలిటీ ని సుస్థిరపరచుకుంటూ ఆమిర్ ఖాన్ వినూత్న ప్రయోగాలతో, సల్మాన్ ఖాన్ వాణిజ్య చిత్రాలతో దూసుకుపోతుంటే మరో వైపు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పరిస్థితి మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా మారింది.హ్యాపీ న్యూ ఇయర్, డియర్ జిందగీ, దిల్ వాలే, ఫ్యాన్ వంటి వరుస పరాజయాల నుంచి రాయిస్ చిత్రం కొంత ఊరట కలిపించినప్పటికీ స్వదేశీ, విదేశీ మార్కెట్లలో షారుఖ్ ఖాన్ హిట్ చిత్రాల స్థాయికి సరితూగే వసూల్లని సాధించలేకపోయింది. రాయిస్ తరువాతి చిత్రం జబ హ్యారీ మేట సేజల్ ని విపరీతంగా ప్రమోట్ చేసినప్పటికీ కనీసం మల్టీప్లెక్స్ లలో కూడా పూర్తిగా పాజిటివ్ టాక్ కి నోచుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది ఆ చిత్రం. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో పాటు జాలీ ఎల్.ఎల్.బి, టాయిలెట్ ఏ ప్రేమకథ వంటి చిత్రాలతో అక్షయ్ కుమార్, గోల్మాల్ సిరీస్ తో అజయ్ దేవగన్ వంటి సీనియర్ హీరోస్ అంతా భారీ వసూళ్లతో సత్తా చాటుతుంటే బాద్షా షారుఖ్ ఖాన్ మాత్రం అభిమానులని నిరాశపరుస్తూనే వున్నాడు. ఇప్పటికైనా స్టార్ స్టేటస్ మోజులో కథలని ఎంచుకునే ప్రక్రియ మానుకుని తన సమకాలీన హీరోల పంథాలోకి వెళ్లి ప్రయత్నిస్తే షారుఖ్ విజయావకాశాలు మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు. |
https://www.telugupost.com/movie-news/అవి-నెత్తుటిమరకల-శాంతివచ-4303/ | 'ఓం శాంతిః' అనే అత్యంత సింపుల్ పదాన్ని పలకడం ద్వారా కూడా దాన్ని విన్న వారి దృష్టిలో వెటకారపు భావనను కలిగించగల వెరైటీ తెలివితేటలు ఎవరికి ఉంటాయి. నిస్సందేహంగా అలాంటి తెలివితేటలు రాంగోపాల్ వర్మకు మాత్రమే ఉంటాయి. తెలుగు పరిశ్రమ గర్వంగా చెప్పుకోగలిగిన స్థాయి దర్శకుడు అయిన రాంగోపాల్ వర్మ.. 'సినిమా' అనే ఫార్మాట్ మీద తన ప్యాషన్ ను కోల్పోయిన తర్వాత.. చిల్లర సినిమాలు తీసే క్రమంలో మరో సినిమా వంగవీటి అనే పేరుతో ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది.విజయవాడ రాజకీయాలు, రౌడీయిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ చేస్తున్నారు. వంగవీటి రంగా జీవితం, హత్య నేపథ్యంలోనే చిత్రం తయారవుతున్న మాట వాస్తవం. అయితే కేవలం రౌడీయిజం, రక్తపాతపు క్రేజ్ మాత్రమే కాకుండా, రామూ.. ఈ చిత్రానికి 'కాపు కాసే శక్తి' అనే ట్యాగ్లైన్ తగిలించడం ద్వారా.. కులంరంగు కూడా పులిమి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కులంగొడవ హాట్గా నడుస్తూ ఉన్న నేపథ్యంలో.. కాపు ఉద్యమానికి ఉన్న ఆకర్షణ సినిమాకు ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారేమో తెలియదు.అయితే వర్మ స్టయిల్ ట్విస్టు ఏంటంటే.. శాంతి, అహింస లకు ప్రతీక అయిన మహాత్మాగాంధీ జయంతి రోజున.. ఆయన వంగవీటి సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్విటర్ లో ఎంచక్కా.. వంగవీటి టీజర్ను విడుదల చేసి.. ఓం శాంతిః అంటూ వర్మ ముగించారు. అయినా.. ఆ స్టయిల్లో రక్తపు మరకలు పూసిన శాంతి వచనాలను పలకడం ఆయనకు మాత్రమే సాధ్యం అని జనం జోకులేసుకుంటే తప్పేముంది. |
https://www.telugupost.com/movie-news/చిరు-ఫస్ట్-పవన్-సెకండ్-మహ-51168/ | ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలోని పాటలను డైరెక్ట్ గా మర్కెట్ లోకి వదలడమో... లేకుంటే.. ఆడియో వేడుకని కానిచ్చేసి యూట్యూబ్ లో వదిలేయ్యడమో జరుగుతుంది. కానీ తాజాగా బాహుబలి సినిమా ఆడియో స్థాయి అని చెప్పలేం గాని పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో ఆవస్తున్న అజ్ఞాతవాసి సినిమా పూర్తయ్యి ఆడియో వేడుక దగ్గరపడే సమయానికి మళ్ళీ కొన్ని ప్రముఖ సంస్థలు అజ్ఞాతవాసి ఆడియో రైట్స్ కోసం పోటీపడడం అది కాస్తా రికార్డు స్థాయిలో 2 కోట్లదాకా పలకడం.. అది చూసి సై రా సినిమా మొదలు కాకముందే ఆదిత్య మ్యూజిక్, లహరి మ్యూజిక్ లు నువ్వా నేనా అని పోటీ పడడం ... అందులో లహరి మ్యూజిక్ వెళ్లి చిరంజీవి సై రా నరసింహారెడ్డి ఆడియో హక్కులను దాదాపు 2.9 కోట్లకు దక్కించుకున్నారనడం.. చూస్తుంటే మళ్ళీ ఆడియో హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడలాగే కనబడుతుంది.కేవలం అజ్ఞాతవాసి, సై రా నరసింహారెడ్డి మాత్రమే కాకూండా ఇప్పుడు మహేష్ - కొరటాల శివ కలయికలో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులు కూడా మంచి ధర పలికిందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక భారత్ అనే నేను సినిమా ఆడియో హక్కులను కూడా ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి వారే చేజిక్కించుకున్నారని చెబుతున్నారు. అలాగే భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులు 1.9 కోట్లకు అమ్ముడు పోయాయంటున్నారు. మరి అజ్ఞాతవాసి కన్నా ఒక లక్ష తక్కువే అయినప్పటికీ ఆడియో హక్కులకు మంచి ధర రావడం అనేది సామాన్యమైన విషయం కాదు.మరి ఇప్పటికే కొరటాల - మహేష్ - దేవిశ్రీ ప్రసాద్ లు శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ ను ఇచ్చి ఉండడంతో ఇప్పుడు మరోసారి అదే హిట్ కాంబినేషన్ రిపీట్ అవడంతో భరత్ అనే నేను సినిమా ఆడియో కి కూడా ఈ రేంజ్ లో ఆఫర్ తగిలిందంటున్నారు. ఏదిఏమైనా ఈమధ్య కాలంలో ఆడియో హక్కుల పరంగా చిరు సై రా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. పవన్ అజ్ఞాతవాసి సెకండ్ ప్లేస్ లో ఉండగా.. ఇప్పుడు మహేష్ భరత్ అనే నేను మూడో స్థానాన్ని ఆక్రమించింది. |
https://www.telugupost.com/movie-news/shraddha-srinath-jersey-movie-119735/ | గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన గౌతమ్ తిన్నసూరి – నాని జెర్సీ సినిమా అనుకోని బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ హిట్ ని నాని, దర్శకుడు తిన్నసూరి కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. మొదటి షోకే జెర్సీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నానికి ఎంతగా పేరొచ్చిందో… డైరెక్టర్ గౌతమ్ కి అంతే పేరొచ్చింది. ఇక హీరోయిన్ గా నటించిన శ్రద్ధ శ్రీనాధ్ పేరు కూడా నిన్నమొన్నటి వరకు మీడియాలో మార్మోగడమే కాదు.. అనేకమంది హీరోల కొత్త ప్రోజెక్టులలో శ్రద్ద ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారనే టాక్ నడుస్తుంది. అయితే జెర్సీ సినిమాతో శ్రద్ధ శ్రీనాధ్ సుడి ఆలా తిరగడానికి కారణం.. ముందుగా ఈ సినిమాలో శ్రద్ధ పేరుని దర్శకుడు, హీరో నాని పరిశీలించలేదట. వేరే హిరోయిన్స్ బయటపడ్డాక… జెర్సీ సినిమా కోసం గౌతమ్ తిన్నసూరి మరో హీరోయిన్ ని అనుకున్నాడట. అంతేకాకుండా కాస్త పేరున్న హీరోయిన్స్ అయితే సినిమాకి క్రేజొస్తుందని.. అందుకే ఆ టాప్ హీరోయిన్ ని జెర్సీ కోసం సంప్రదించగా.. వారు జెర్సీలో సారా పాత్ర చెయ్యడానికి భయపడ్డారట. మరి ఒకే ఎమోషన్, ఎక్స్ ప్రెషన్ ని మెయింటైన్ చేస్తుండాలి, అలాగే కాస్త ట్రెడిషనల్ గా నటించాలని వెనకడుగు వేశారో లేదా సినిమా మీద నమ్మకం లేకనో కానీ ఆ హీరోయిన్స్ నో చెప్పారట. అయితే ఆ హీరోయిన్స్ కాదని చెప్పాకే.. దర్శకుడు గౌతమ్ శ్రద్ధ శ్రీనాధ్ ని సంప్రదించాడట. మరి సారా పాత్ర చెయ్యడానికి శ్రద్ధ శ్రీనాధ్ ధైర్యంగా ఒప్పుకుని నటించింది. ఆ ధైర్యానికి తగిన ఫలితం దక్కింది. జెర్సీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నానితో పాటు సారా పాత్ర చేసిన శ్రద్ధకి అంతే పేరొచ్చింది. తాజాగా శ్రద్ధ శ్రీనాద్ మరో తెలుగు మూవీని ఓకె చేసిందనే టాక్ ఉంది. |
https://www.telugupost.com/movie-news/నారి-నారి-నడుమ-మురారి-199/ | తాను చేసిన కొద్ది చిత్రాలతోనే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకొని తనకంటూ ఓ స్టైల్ను క్రియేట్ చేసుకున్న మెగాహీరో వరుణ్తేజ్. కాగా ఆయన త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్స్తో రొమాన్స్ చేయని వరుణ్ తన తాజా చిత్రంలో ఇద్దరు భామలతో కలిసి నటిస్తున్నాడు. ఈ ఇద్దరు లావణ్యత్రిపాఠి, రెజీనా. మరి ఈ చిత్రంలో రొమాన్స్పరంగా వరుణ్తేజ్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటాడో చూడాలి...! ఏప్రిల్ నుండి అఫీషియల్గా లాంఛ్ కానున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి 'ఫీల్ మై లవ్' అనే టైటిల్ను అనుకొంటున్నారు. చాలాకాలం తర్వాత శ్రీనువైట్ల చేస్తున్న అచ్చమైన ప్రేమకథా చిత్రం ఇదేనని సమాచారం. కాగా ఈ చిత్రానికి మిక్కీజెమేయర్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటివరకు కమర్షియల్గా సక్సెస్లేని వరుణ్తేజ్కు, 'ఆగడు, బ్రూస్లీ' వంటి డిజాస్టర్స్ తర్వాత చేస్తున్న శ్రీనువైట్లకు ఇరువురికి కీలకంగా మారనుంది. |
https://www.telugupost.com/politics/in-the-south-the-bharatiya-janata-party-is-facing-a-difficult-situation-bjp-ready-for-alliance-with-tdp-in-ap-1497558 | దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కర్ణాటకలో వచ్చే లోక్సభ ఎన్నికల కోసం జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నా ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. దక్షిణాదిన మరో కీలక రాష్ట్రమైన తమిళనాడులో అన్నాడీఎంకే కమలం కౌగిలి నుంచి బయటకు వచ్చేసింది. తాము పొత్తు నుంచి తప్పుకుంటున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో జనసేన, కర్ణాటకలో జేడీఎస్ రెండే బీజీపీకి మిత్రపక్షాలుగా ఉన్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిన సీట్ల సంఖ్య మరింత పెంచుకోవాలంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు దిగక తప్పని పరిస్థిితి భారతీయ జనతా పార్టీది.అదే కలసి వచ్చేదిగా...అదే ఇప్పుడు ఏపీలో చంద్రబాబుకు కలసి వచ్చేదిగా కనిపిస్తుంది. తెలంగాణలో ముందు ఎన్నికలు జరుగుతున్నా అక్కడ పొత్తు ప్రస్తావన లేకుండానే ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. గెలిచిన తర్వాత మద్దతు కోసం చూసుకోవచ్చులే అన్న ఆలోచన కావచ్చు. కేసీఆర్కు కాంగ్రెస్ బద్ధశత్రువు కాబట్టి ఆ పార్టీకి మద్దతు ప్రకటించరన్న విశ్వాసమూ అవ్వొచ్చు. అందుకే ఇక్కడ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. గత ఎన్నికలంటే నాలుగైదు లోక్సభ స్థానాలను గెలుచుకుంటే చాలని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా పరవాలేదన్న ధోరణిలో ఆ పార్టీ నేతలు కనిపిస్తున్నారు. పైకి మోదీ నుంచి నేతలందరూ బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నా లోపల మాత్రం ఇద్దరికీ మంచి రిలేషన్ ఉందన్న విషయాన్ని విమర్శకులు సయితం అంగీకరిస్తున్నారు.ఏదో ఒక పార్టీతో...ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అది కాదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏపీలో అస్సలు ఓటు బ్యాంకు లేదు. జగన్ తో నేరుగా పొత్తు సాధ్యపడదు. కలసి పోటీ చేయాలంటే అది టీడీపీతోనే సాధ్యం. తమకంటూ కొన్ని స్థానాలు వస్తాయి. పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాలుంటాయి. అంతేకాకుండా దక్షిణాదిన పళనిస్వామి హ్యాండ్ ఇవ్వడంతో చంద్రబాబుతో చేయికలపడమే బెటర్ అన్న అభిప్రాయంలో కేంద్ర నాయాకత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విషయంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశముందన్నది హస్తిన వర్గాల ద్వారా తెలుస్తోంది.రాష్ట్ర నేతలు కూడా...బీజేపీకి కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. తమ వెంట బలమైన మిత్రులున్నారని చెప్పుకోవడం కోసమైనా సైకిల్ ఎక్కక తప్పదన్నది అంచనాలు వినపడుతున్నాయి. అంతేకాదు... సోము వీర్రాజును మార్చి పురంద్రీశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. ఎక్కువ మంది రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉండటంతో త్వరలోనే హస్తిన నుంచి పొత్తు ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్లి పరిస్థితిని వివరిస్తే కమలనాధుల నుంచి సానుకూల స్పందన వస్తుందని చెబుతున్నారు. అయితే దీనికి కొంత సమయం పట్టవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేయడం ఖాయమన్న విశ్లేషణలు మాత్రం నిజం కాబోతున్నాయి. |
https://www.telugupost.com/movie-news/అభిమానులు-పండగ-చేసుకోండయ-51628/ | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో తమ అభిమాన హీరోను చూడాలని అనుకున్న అభిమానులకు ‘సై-రా నరసింహ రెడ్డి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి అలరించబోతున్నాడు. ఈ సంవత్సరం ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో వెండితెరకు రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ‘సై-రా నరసింహ రెడ్డి’గా చేస్తున్న సంగతి తెలిసిందే… స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ జీవిత కథపై ఈ చిత్రం తెరకెక్కనుంది.చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమై, టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న చిత్రం. మెగాస్టార్ సహా నటీనటులు అందరికీ టెస్ట్ షూట్ లు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. ఇవాళ ఉదయం తొలి షాట్ పిక్చరైజేషన్ చేసేశారు. ఉదయం 7.30 గంటలకు చిరంజీవి.. కేరక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీలపై తొలి షాట్ చిత్రీకరణ చేపట్టారు. హైద్రాబాద్ పరిసరాల్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ లో ఈ షాట్ చిత్రీకరణ జరిగింది. తొలి షెడ్యూల్ మొత్తం ఇక్కడే షూట్ జరగనుండగా.. చిత్రంలో పలువురు నటీనటులతో పాటు.. ఇంగ్లీష్ యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు.ఇప్పటికే ఈ చిత్రం ప్రీ- ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. సెట్లు నిర్మాణం , మాటలు తదితర విభాగాలు పనిచేస్తున్నాయి.. ఈరోజు ఉదయం ఈ చిత్రం చిత్రీకరణ మొదలుకానుండడంతో చిరు అభిమానులకు ఇది శుభవార్తే.. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ , కిచ్చ సుదీప్ , విజయ్ సేతుపతి , నయనతార , జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. |
https://www.telugupost.com/top-stories/chandrababu-was-the-chief-minister-for-five-years-he-created-a-record-as-the-first-cm-after-the-formation-of-new-state-1431303 | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. అయితే రెండో దఫా జరిగిన ఎన్నికల్లోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఒంటరిగా బరిలోకి దిగి ఆయన చేయి కాల్చుకున్నారు. దారుణ ఓటమిని చవి చూశారు. ఈసారి ఆయన గెలుపు కోసం అన్ని రకాలుగా కసరత్తులు మొదలు పెట్టారు. మరో వైపు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యం ఆయనకు ఉన్నా అది సాధ్యపడటం కష్టమే. అక్కడ పార్టీ పూర్తిగా పడకేసింది.అసెంబ్లీలో ప్రాతినిధ్యం...కానీ ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కనీసం అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నట్లుంది. పార్టీకి తెలంగాణలో కొంత గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని స్థానాల్లోనైనా గెలవాల్సిన అవసరం ఉంది. అందుకు ఆయన ఖమ్మం జిల్లాను ఎంచుకున్నట్లు కనపడుతుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ఖమ్మం జిల్లాలో అయితేనే కొన్ని సీట్లయినా సాధించవచ్చన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. ఎక్కువగా అక్కడ ఏపీ నుంచి వలస వెళ్లి సెటిల్ అయిన వారు ఎక్కువ మంది ఉండటం కూడా కలిసి వచ్చే అంశమే.గత ఎన్నికలలోనూ...2018 ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా నుంచి రెండు స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఆ తర్వాత వారిద్దరూ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారనుకోండి అది వేరే విషయం. అయినా చంద్రబాబుకు ఆశంతా ఖమ్మం జిల్లాపైనే పెట్టుకున్నారు. ఇక్కడ అయితేనే ఒకటి, రెండు స్థానాల్లో విజయం సాధించవచ్చని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన భద్రాచలం పర్యటనకు కూడా కొంత స్పందన రావడంతో చంద్రబాబు డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా సభ వరకే ఆయన పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతకు మించి ఆయన తెలంగాణలో పార్టీకి పెద్ద సమయం కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు. పొత్తుల కోసమేనా?సెప్టంబరు నెలలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది సక్సెస్ చేసుకుంటే కొన్ని పార్టీలైనా తమ పార్టీతో పొత్తులకు ముందుకు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. బీజేపీ తోనే ఆయన కలసి తెలంగాణలో వెళ్లాలని భావిస్తున్నారు. తెలంగాణలో మొదలు పెడితే ఏపీలో కూడా కంటిన్యూ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఖమ్మం సభకు కేవలం తెలంగాణ నుంచి కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేసి సభను గ్రాండ్ సక్సెస్ చేయించే ఆలోచనలో ఆయన ఉన్నారు. అప్పుడే తెలంగాణలో పార్టీకి ఒక విలువ, గౌరవం లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో ఆయన అంచనా ఏమేరకు సఫలం అవుతుందో చూడాలి. |
https://www.telugupost.com/crime/there-was-an-incident-where-the-young-woman-was-hit-by-a-car-for-not-loving-her-1431658 | అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని యువతిని కారు తో ఢీకొట్టిన సంఘటన జరిగింది. కంబదూరు మండలం బోయలపల్లిలో ఈ ఘటనల చోటు చేసుకుంది. నిందితుడు భాస్కర్ గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే చికిత్స పొందుతున్న యువతి అసలు విషయం చెప్పడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.కారుతో ఢీకొట్టి...అయితే భాస్కర్ తనకు అన్న వరస కావడంతో ప్రేమకు నిరాకరించింది. అయితే అందుకు ఒప్పుకోని భాస్కర్ కారుతో యువతి వెళుతున్న స్కూటీతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/srinu-vaitla-raviteja-72859/ | ఒక్కప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒక్కడిగా ఉండేవాడు శ్రీను వైట్ల. అతనితో సినిమా చేయడానికి చాలా మంది పెద్ద స్టార్స్ తహతహలాడేవాళ్లు. కానీ గత కొన్నేళ్ల నుండి వరసబెట్టి ఒకే ఫార్ములా సినిమాలు తీయడంతో తన కెరీర్ను పాడు చేసుకున్నాడు వైట్ల. కేవలం మూడే మూడు సినిమాలు అతని కెరీర్ను నాశనం చేసాయి.ఉన్న కష్టాలు చాలవన్నట్లు...'మిస్టర్' సినిమా తర్వాత అతనితో ఏ హీరో చేయడానికి ముందుకు రాలేదు. లాస్ట్ కి అతని స్నేహితుడు రవితేజ కరుణించి సినిమా ఇప్పించాడు. అది కూడా మైత్రి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ లో. దీంతో ఎలాగైనా ఈసారి కచ్చితంగా హిట్ కొట్టి తను ఏంటో నిరూపించుకోవాలని ట్రై చేస్తుంటే వైట్లకు ఉన్న కష్టాలు చాలవని, ఈ సినిమా మొదలయ్యే ముందు వరకు పర్వాలేదనిపించే స్థితిలో ఉన్న రవితేజ సైతం ఇప్పుడు దారుణమైన ట్రాక్ రికార్డుతో తయారయ్యాడు.ఈసారైనా మారేనా..?రవితేజ గత రెండు చిత్రాలు 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు' సినిమాలు జనాలలో నెగటివ్ మార్క్ పడిపోయింది. రవితేజ ఇప్పుడు చేసే శ్రీను వైట్ల సినిమా కూడా ఇలానే రొటీన్ గా ఉంటె ఇంకా అతని సినిమాలు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో ‘అమర్ ఆంటోనీ అక్బర్’ సినిమాతో ఏమన్నా కొత్తగా చూపిస్తే తప్ప ఆ మార్క్ తొలిగే అవకాశం లేదు. కానీ శ్రీను వైట్ల మీద నమ్మకం లేదు. 'ఆగడు', 'బ్రూస్ లీ' లాంటి పెద్ద డిజాస్టర్లు ఎదురైనప్పటికీ మళ్లీ ‘మిస్టర్’ లాంటి రొటీన్ సినిమానే చేశాడు. చూద్దాం ఏమన్నా మిరాకిల్ జరిగి సినిమా హిట్ అవచ్చేమో? |
https://www.telugupost.com/movie-news/అజ్ఞాతవాసి-లో-ఇద్దరు-ఊ-54672/ | పవర్స్టార్ పవన్కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న అజ్ఞాతవాసి సినిమా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్కు రెడీ అవుతోంది. సోమవారం న్యూ ఇయర్ రోజు సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 9వ తేదీ రాత్రి నుంచే అజ్ఞాతవాసి ప్రీమియర్లు స్టార్ట్ కానున్నాయి.సెన్సార్ బోర్డు నుంచి సినిమాకు హిట్ టాక్ రావడంతో ఇక పవన్ ఫ్యాన్స్ సంబరాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్లు కూడా స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే పవన్ పాడిన కొడకా కోటేశ్వరరావా పాట అయితే యూ ట్యూబ్లో దుమ్ము లేపుతోంది. చాలా తక్కువ టైంలోనే రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.ఇక ఈ సినిమాలో ఇప్పటికే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తుండగా మరో సెలబ్రిటీ సైతం ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన అనిరుధ్. అనిరుధ్ గతంలో కూడా తాను మ్యూజిక్ ఇచ్చిన కొన్ని తమిళ సినిమాల్లో తెరపై తళుక్కుమన్నాడు. ఇప్పుడు తాను తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన తొలి సినిమాలోనే గెస్ట్ రోల్ చేస్తూ తెరపై తళుక్కుమన్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 5న రిలీజ్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై చినబాబు నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించనున్నారు. |
https://www.telugupost.com/movie-news/janvi-kapoor-comments-on-vijay-devarakonda-143464/ | బాలీవుడ్ భామలంతా రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టయిల్ ని పొగిడే పనిలో ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవడ్ భామల మనసులను అలా అలా దోచేశాడు. అలియా భట్, జాన్వీ కపూర్, కియారా అద్వానీల కలల రౌడీగా విజయ్ స్టయిల్ బాలీవుడ్ కి పాకేసింది. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో మొదటిసారిగా తనకి విజయ్ దేవరకొండ ఆంటే ఇష్టమని చెప్పిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రౌడీ పక్కన ఫైటర్ లో ఆఫర్ అందుకుందనే న్యూస్ ఉంది. అయితే జాన్వీ – విజయ్ దేవరకొండ కాంబో అని ఎక్కడా అధికారిక ప్రకటన రాకపోయినా.. విజయ్ సరసన జాన్వీ కపూర్ అంటూ అందరూ ఫిక్స్ అయినా టైం లో మరోసారి విజయ్ దేవరకొండ తనకున్న క్రష్ ని బయటపెట్టింది. మరోసారి చెప్పి…. తాజాగా నేహా దుపియా షోలో జాన్వీ కపూర్ విజయ్ మీదున్న ఇష్టం మరోసారి బయటపెట్టింది. అయితే తన ఇష్టం వన్ సైడ్ మాత్రమే అని.. నేను విజయ్ దేవరకొండ ఇష్టమని చెప్పినా… విజయ్ నుండి నో రియాక్షన్ అంటూ తెగ బాధపడుతుంది. నేనే విజయ్ అంటే ఇష్టమని ఎక్కువ ఫీలైపోయి మాట్లేడుస్తున్నా కానీ విజయ్ నుండి రియాక్షన్ లేదని చెబుతున్న జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ చాలా ఇష్టమని, ఆయన అంటే ఆరాధన అని, కానీ కేవలం ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది అంటూ విజయ్ దేవరకొండపై ఇష్టాన్ని జాన్వీ కపూర్ మరోసారి బయట పెట్టి… విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో మరింత పెంచేసింది ఈ చిన్నది. |
https://www.telugupost.com/crime/17-killed-as-under-construction-railway-bridge-collapses-in-mizoram-1491086 | మిజోరంలో బుధవారం నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మరణించారు. శిథిలాల్లో చాలా మంది చిక్కుకున్నారని.. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వంతెన కూలిపోయిన సమయంలో దాదాపు 35 నుంచి 40 మంది నిర్మాణ కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఐజ్వాల్కు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరాంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి ₹ 2 లక్షలు, గాయపడిన వారికి ₹ 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు. "ఐజ్వాల్ సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈరోజు కూలిపోయింది. 17 మంది కార్మికులు మరణించారు: రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మరణించిన కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/gaddala-konda-ganesh-4-days-collections-134652/ | వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ నాలుగు రోజల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఏరియా షేర్ (కోట్లలో) నైజాం 5.23 సీడెడ్ 2.35 నెల్లూరు 0.62 కృష్ణ 1.16 గుంటూరు 1.35 వైజాగ్ 1.85 ఈస్ట్ గోదావరి 1.15 వెస్ట్ గోదావరి 1.06 టోటల్ ఏపీ & టీస్ షేర్ 14.77 |
https://www.telugupost.com/movie-news/biopics-in-tollywood-93002/ | బయోపిక్స్ ట్రెండ్ అనేది బాలీవుడ్ వాళ్లే కనిపెట్టారని చెప్పుకుంటున్నారు. కానీ అసలు బయోపిక్ ను మొదట కనిపెట్టింది మాత్రం మణిరత్నం. ఇతని డైరెక్షన్ లో 'ఇద్దరు' అనే సినిమా వచ్చింది. ఇందులో ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల్ని చూపించాడు మణి. ఆ తర్వాత ఇటువంటి జోనర్ లో సినిమా ఒక్కటి కూడా రాలేదు. చాలాకాలం తర్వాత మణిరత్నం మళ్లీ 'గురు' అనే సినిమాతో ముందుకు వచ్చాడు. బిజినెస్ టైకూన్ ధీరుబాయి అంబానీ ప్రయాణమే 'గురు' సినిమా. ఇలా ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు రావడం స్టార్ట్ అయింది.మహానటి సక్సెస్ తో...మణిరత్నం తీసిన 'ఇద్దరు', 'గురు' సినిమాలు తెలుగులో విడుదల అయినప్పటికీ సరైన రుచిని చూపించింది మాత్రం నాగ్ అశ్విన్ కి దక్కుతుంది. అతని దర్శకత్వంలో 'మహానటి' సావిత్రి జీవితకథ వచ్చింది. ఈ సినిమాలో మహానటి జీవితాన్ని ఒక అద్భుతమైన దృశ్యంగా మలచాడు. ఇది సూపర్ హిట్ అవ్వడంతో బయోపిక్స్ తీయొచ్చు అనే నమ్మకం ఏర్పడింది మన డైరెక్టర్స్ కి. దాంతో వరసగా బయోపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్, లక్ష్మి పార్వతి బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటశాల, కత్తి కాంతారావు, శోబన్ బాబు, కే విశ్వనాద్, పుల్లెల గోపీచంద్ బయోపిక్స్ మన ముందుకు రానున్నాయి.ప్రకటించినవి తీస్తారా..?అయితే ఇందులో ఎన్టీఆర్, వైఎస్ బయోపిక్స్ తప్ప మిగతావన్నీ ప్రకటనలే అని అర్ధం అవుతున్నాయి. ఒకవేళ వచ్చినా అవి సక్సెస్ అవుతాయో లేదో చూడాలి. సక్సెస్ అవ్వకపోతే మాత్రం మిగతావాటికి ఆదరణ దగ్గిపోయే ఛాన్స్ వుంది. ఒకవేళ బయోపిక్స్ హిట్ అయితే మాత్రం జాతీయ స్థాయిలో పేరు వస్తుంది. ఉదాహరణకు దంగల్, ధోని, బాగ్ మీల్కా, డర్టీ పిక్చర్ సినిమాలు. మరి ఎంతవరకు మన బయోపిక్స్ సక్సెస్ అవుతాయో చూడాలి. |
Subsets and Splits