link
stringlengths
41
231
text
stringlengths
29
5k
https://www.telugupost.com/movie-news/అతి-త్వరలో-కళ్యాణ్-పూరీల-4324/
నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ చిత్ర ఘన విజయం తర్వాత రెండు ఘోర వైఫల్యాలు పొంది నిరాశ చెందారు. ఒకటి ఆయన నిర్మించి మాస్ మాహారాజా రవి తేజ నటించిన కిక్ 2 కాగా మరొక చిత్రం ఆయన నటించిన షేర్. ఈ వైఫల్యాల నుంచి బైట పడేందుకు ఆయన తన పంథా మార్చుకుని దర్శకుడు పూరి జగన్నాథ్ దారిలోకి వెళ్లారు. పూరి జగన్నాథ్ చిత్ర కథానాయకుల్లానే తన వేషభాషలు మార్చుకున్నారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని కళ్యాణ్ రామ్ ని చూపించబోతున్నారు దర్శకుడు పూరి. జర్నలిజం నేపథ్యంలో ఒక సామాజిక అంశం చుట్టూ ఇజం కథ తిరుగుతుంది అని సమాచారం.దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా టెంపర్ విజయం తర్వాత చేసిన జ్యోతి లక్ష్మి, లోఫర్ చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. అందువల్ల ఇజం చిత్ర విజయం అటు దర్శకుడిగా పూరికి, నటుడు నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ కి కీలకం గా మారింది. ముందు నుంచి ఈ చిత్రాన్ని దసరా బరిలో ఉంచాలని అనుకున్న చిత్ర వర్గం కాల పరిమితి వల్ల సినిమా నాణ్యతలో రాజి పడకూడదు అని చిత్ర విడుదలను వాయిదా వేశారు.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఇజం ఆడియోను ఈ నెల 5 వ తారీకున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నందమూరి తారక రామ ఆర్ట్స్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.
https://www.telugupost.com/movie-news/మురుగదాస్-తో-ప్రభాస్-నిజ-42410/
ప్రభాస్ బాహుబలి విజయ దరహాసంతో ఇపుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రధానంగా నాలుగు భాషల్లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని సాహో చిత్రాన్ని దేశం మొత్తం దింపడానికి రెడీ అయ్యింది. అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో చేస్తున్నాడు. మరి సాహో తర్వాత ప్రభాస్ చిత్రం ఏమిటనే దాని మీద ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. అదేమిటంటే తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ కి తమిళంలో ఎంత క్రేజ్ ఉందొ ఇక్కడ తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. మురుగదాస్ కేవలం తమిళంలోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన దర్శకుడు. మరి నేషనల్ వైడ్ గా సినిమాలు చెయ్యడంలో సిద్ధహస్తుడైన మురుగదాస్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడని తెలియగానే ఆ న్యూస్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చేసింది.అయితే మురుగదాస్ ఎప్పుడూ ఆయా భాషల్లో క్రేజ్ ఉన్న హీరోలతోనే చేసాడు గాని... నేషనల్ వైడ్ పేరున్న హీరోతో సినిమా చెయ్యలేకపోయాడు. అయితే ఇప్పుడు బాహుబలితో జాతీయ స్థాయిలో పేరు కొట్టేసిన ప్రభాస్, మురుగదాస్ కి బెస్ట్ చాయిస్ గా కనబడడంతోనే ఇపుడు మురుగదాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ... అందుకే ప్రభాస్ తో సినిమా చెయ్యడానికి మురుగదాస్ ఇంట్రస్ట్ చూపుతున్నాడంటున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించడానికి డైరెక్టర్ మురుగదాస్ భారీ ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ మాత్రం ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది.
https://www.telugupost.com/movie-news/హిందీ-రీమేక్-కాదనుకుని-త-31638/
టెలివిషన్ కార్యక్రమాలతో పాపులారిటీ తెచ్చుకుని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి తెరకెక్కించిన డేంజర్ చిత్రంతో కథానాయికగా కూడా ప్రేక్షకులని ఆకట్టుకున్న తెలుగు అమ్మాయి స్వాతి తరువాతి కాలంలో తెలుగు సినిమాలతో కంటే ఎక్కువగా తమిళంలో నటనకి స్కోప్ వున్నా పాత్రలలో ఎక్కువ కనిపిస్తూ హీరోయిన్ గా కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. అడపా దడపా తెలుగులో అష్ట చమ్మా, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గర ఐయ్యింది. అనంతరం స్వామి రారా చిత్రంతో ఊహించని విజయాన్ని అందుకుని కార్తికేయ చిత్రంతో విజయ పరంపరని కొనసాగించింది. ఆ సమయంలోనే హీరోయిన్ ప్రాధాన్యత చిత్రం కావటంతో త్రిపుర సినిమా చేసి కెరీర్ పరంగా చాలానే కోల్పోయింది. పైగా ఆ చిత్రంలో స్వాతి లుక్ కథానాయికకు సరిపడే విధంగా కాక క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే దారుణంగా శరీరాకృతితో ప్రేక్షకులని భయపెట్టింది స్వాతి. త్రిపుర మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి కోలుకోవటానికి స్వాతికి చాలా సమయమే పట్టింది. త్రిపుర అనంతరం స్వాతి కెరీర్ లో బాగా గ్యాప్ తరువాత తాజాగా విడుదలైన బాబు బాగా బిజీ చిత్రంలో మిష్టి చక్రవర్తి పాత్ర ముందుగా స్వాతి వద్దకి వెళ్లగా ఆ పాత్రని స్వాతి తిరస్కరించింది. హిందీ హంటర్ లో రాధికా ఆప్టే పోషించిన పాత్రే స్వాతి తిరస్కరించిన పాత్ర. అందుకు కారణాలు ఏవైనా త్వరలో లండన్ బాబులు అనే తమిళ రీమేక్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకి కథానాయికగా మరొకసారి రాబోతోంది. ఈ చిత్రంలో స్వాతి లుక్స్ గత చిత్రాల తో పోలిస్తే చాలా ఫ్రెష్ గా వున్నాయి. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఫేమ్ దర్శకుడు చిన్ని కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సింహ భాగం షూటింగ్ పూర్తి అయిపోయింది. తమిళ్ లో మంచి విజయం సాధించిన అందవన్ కాత్తలై అనే చిత్ర రీమేక్ గా రూపొందుతున్న లండన్ బాబులు చిత్రాన్ని మారుతీ టాకీస్ బ్యానర్ లో దర్శకుడు మారుతి నిర్మిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/ఉయ్యాలవాడ-కోసం-మరో-హీరో-ద-39730/
చిరంజీవి 151 వ చిత్రాన్ని అతి త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా ఈ ఉయ్యాలవాడని మూడు భాషల్లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఉయ్యాలవాడ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మెగా ఫాన్స్ పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. మొన్నీమధ్యనే ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొదలెడతారని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదుగాని చిరంజీవి పుట్టున రోజు సందర్భంగా ఉయ్యాలవాడ మొదలవ్వొచ్చనే ఊహాగానాలు మాత్రం బాగా ఉన్నాయి.అయితే ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకురావాలంటే బాలీవుడ్ నటులతో పాటే ఇతర భాష నటులకు ఈ ఉయ్యాలవాడ చిత్రంలో చోటివ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉయ్యాలవాడ చిత్రంలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అమితాబ్ కూడా ఉయ్యాలవాడలో నటించడానికి ఉత్సాహం చూస్పిస్తున్నాడంటూ చెప్పారు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కన్నడ స్టార్ హీరో సుదీప్ ఉయ్యాలవాడలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడంటూ ఒక వార్త టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.సుదీప్ ని ఈ చిత్రంలో నటింప చెయ్యాలనే ప్లాన్ లో భాగంగా అతనితో చర్చలు జరుపుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సుదీప్ ఈగ చిత్రంలో స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. మరి ఇప్పుడు ఈ ఉయ్యాలవాడలో వచ్చిన ఛాన్స్ ని ఒప్పుకుంటే ఎలాంటి పాత్రలో కనబడతాడో అనే క్యూరియాసిటీ జనాల్లో క్రియేట్ అయ్యింది. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ విషయం ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ కంటే మహావీర్ టైటిల్ బావుంటుందని చిత్ర యూనిట్ యోచన చేస్తున్నట్లు కూడా వార్తలున్నాయి.
https://www.telugupost.com/uncategorized/tabu-remuneration-to-act-in-telugu-cinemas-127252/
ఒక్కప్పటి హీరోయిన్స్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తే ఎంత తీసుకుంటారో మధుబాల- నదియా- ఇంద్రజ వంటి వాళ్ళని చూస్తే అర్ధం అవుతుంది. వీరు రీఎంట్రీ ఇచ్చి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని అప్పటిలో టాక్ ఉండేది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో సీనియర్ హాట్ హీరోయిన్ చేరింది. టాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న నటి టబు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టబు ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో టబు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిసింది. అలానే రానా – వేణు ఉడుగుల కాంబినేషన్ లో వస్తున్న 'విరాటఫర్వం' చిత్రంలోనూ టబు ఓ కీరోల్ పోషిస్తున్నారట. ఇలా తెలుగు లో సినిమాలతో బిజీ కావడంతో రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ పెంచారని తెలుస్తుంది. ఒక్కో కమిట్ మెంట్ కి రూ.60 లక్షల పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె పాత్ర సినిమాలకు మెయిన్ కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ గా ఉన్నారట. రీసెంట్ గా టబు బాలీవుడ్ లో దేదే ప్యార్ దే- భారత్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు తెలుగులో కి ఎంట్రీ ఇచ్చారు
https://www.telugupost.com/movie-news/big-boss-2-troubles-to-nani-113376/
వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న హీరో నాని… గత ఏడాది బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా మొదట్లో ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత నాని ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్స్ చేసాడు. హౌస్ లోని పార్టిసిపేట్స్ ద్వారా నాని బాగా పాపులర్ అయినా తరువాత కాంటెస్టెంటెంట్స్ నుండి, బయట ప్రేక్షకుల నుండి ట్రోలింగ్ కి గురయ్యాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని అదుపులో పెట్టలేక నాని చాలా సతమతమయ్యాడు. ఇక చివరికి బిగ్ బాస్ తో నానికి తల బొప్పికట్టింది. అప్పట్లో కౌషల్ ఆర్మీకి తలొగ్గి బిగ్ బాస్ యాజమాన్యం నానితో కలిసి కౌశల్ కి బిగ్ బాస్ ట్రోఫీని కట్టబెట్టారని కూడా ట్రోల్ చేసారు. ఇక హౌస్ లో కంటెస్టెంట్ అయిన బాబు గోగినేనితో నాని కాస్త ఘాటుగానే స్పందించాల్సి వచ్చింది. ఆటని ఆటలాగా ఆడండి బాబు సర్ అని సుతిమెత్తగా చెప్పాడు. నానికి మరో తలనొప్పి… ఇక బిగ్ బాస్ సీజన్ 2 అయిపోయి నెలలు గడుస్తున్నా.. ఆ సీజన్ 2 ఇంకా మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంది. కౌశల్ ఆర్మీతో గెలిచిన కౌశల్ ఇప్పుడు ఆ కౌశల్ ఆర్మీ ద్వారానే సమస్యలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కౌశల్ ఆర్మీకి, కౌశల్ కి ప్రత్యక్షంగా టీవీ ఛానల్స్ సాక్షిగా యుద్ధం జరుగుతుండగా… అందులోకి బాబు గోగినేని ఎప్పటిలాగే కౌశల్ ని విమర్శించడం మొదలు పెట్టాడు. ఛానల్స్ కి లైవ్ కాల్స్ లో కనెక్ట్ అవుతూ కౌశల్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కౌశల్ గెలిచిన తర్వాత కౌశల్ ఆర్మీ ఫేక్ అని.. బిగ్ బాస్ యాజమాన్యం ఫేక్ ఓట్స్ తో కౌశల్ కి పట్టం కట్టారని బాబు గోగినేని చిన్న పిల్లాడిలా గెంతుతూనే ఉన్నాడు. అయితే తాజాగా బాబు గోగినేని స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 2 ఓటింగ్ లో అవకతవకలపై ఇప్పుడు కొన్ని రుజువులు బయటికొచ్చినుందన వీటిపై నాని స్పందించాలని అయన అభిపాయపడుతున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 2 ముగిసిపోయినా నానికి ఇంకా ఆ బిగ్ బాస్ తలనొప్పి పోయేలా కనబడడం లేదు.
https://www.telugupost.com/movie-news/tollywood-actress-mounika-reddy-reaction-on-her-marriage-divorce-news-1497891
తెలుగు అమ్మాయి మౌనిక రెడ్డి.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. దీంతో గత ఏడాది 'బీమ్లానాయక్' మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన ఒక ముఖ్య పాత్ర చేసే లక్కీ ఛాన్స్ ని అందుకుంది. ఆ సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ ఫేమ్‌తో సినిమా ఆఫర్లు కూడా రావడం మొదలయ్యాయి. కానీ ఇంతలోనే తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్‌ని స్టార్ట్ అందరికి షాక్ ఇచ్చింది.గత ఏడాది డిసెంబర్‌‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు మధ్య గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు ఆ ఫోటోలు మౌనిక ఇన్‌స్టాలో కనిపించడం లేదు. దీంతో ఆమె ఆ ఫోటోలు డిలీట్ చేసింది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇటీవల కాలంలో విడాకుల తీసుకోని విడిపోయిన సెలబ్రిటీస్ అంతా.. ముందుగా ఇలాగే ఫోటోలు డిలీట్ చేశారు.దీంతో మౌనిక కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే విడాకులు తీసుకుంటున్నారా.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మౌనిక వీటిపై ఒక క్లారిటీ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో విడాకుల వార్తలు పై రియాక్ట్ అవుతూ ఒక స్టోరీ పెట్టింది. తన భర్తతో ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ.. తనకి తన భర్తకి మధ్య జరిగిన ఒక సరదా సంభాషణని రాసుకొచ్చింది.మౌనిక.. 'మనం ట్రేండింగ్‌లో ఉన్నాం' అని విడాకుల వార్త భర్తకి చెప్పగా, అతను రియాక్ట్ అవుతూ.. 'ఏ ఖర్చు లేకుండా మనం ట్రెండ్ అవుతున్నాముగా' అనే అర్ధంతో సరదాగా బదులిచ్చాడు. దీంతో మౌనిక విడాకుల వార్తలో నిజం లేదని తేలిపోయింది. కాగా మౌనిక ప్రస్తుతం ఒక లేడీ ఓరియంటెడ్ పిరియాడికల్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది.
https://www.telugupost.com/movie-news/అదిరింది-ఫస్ట్-వీక్-తెలు-49386/
ఎన్నో అడ్డంకుల మధ్య మెర్సల్ సినిమా రిలీజ్ తమిళనాడులో ప్రకంపలు సృష్టిస్తుందో అందరికి తెలుసు. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఏకంగా రూ. 235 కోట్ల గ్రాస్ కాచ్ చేసి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక తెలుగులో అదిరింది అనే టైటిల్ తో పలుమార్లు వాయిదా పడి చివరికి నవంబర్ 9న రిలీజ్ అయ్యి తెలుగు నాట కూడా పర్లేదు అనిపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.4.51 కోట్లు వసూలు చేసింది. ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మీకోసం..ఏరియా షేర్ ( కోట్లు )నైజాం 1.45సీడెడ్ 0.63ఉత్తరాంధ్ర 0.66గుంటూరు 0.44ఈస్ట్ గోదావరి 0.41వెస్ట్ గోదావరి 0.26కృష్ణ 0.48నెల్లూరు 0.18టోటల్ ఆంధ్ర+తెలంగాణ 4.51
https://www.telugupost.com/movie-news/kajal-aggarwal-glmour-show-at-zee-apsara-awards-66293/
ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి పెద్దగా క్రేజ్ లేదు. కావాలనే కొన్ని అవకాశాలు చేజార్చుకుంటూ ప్రస్తుతంఖాళీగా ఉంటుంది. కుర్ర హీరోలు ఇప్పటికి కాజల్ కోసం ఎదురు చూస్తున్నవారున్నారు. వారు తమ సినిమాల్లో పిలిచి అవకాశం ఇస్తాం అంటే కోట్లు కావాలని డిమాండ్ చేస్తుంది. ఇక సీనియర్ హీరో వెంకటేష్ పక్కన 'ఆట నాదే వేట నాదే' సినిమాలో చెయ్యనని ఖరా ఖండిగా చెప్పేసింది. అలాగే శర్వానంద్ పక్కన కూడా పారితోషకం కారణంగానే సినిమాని వదులుకుందనే టాక్ ఉంది. మరొపక్కన అడిగినంత ఇస్తున్నారు కదా అని బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన వచ్చిన ఛాన్స్ ని పట్టేసింది. ఇక కాజల్ అగర్వాల్ అందాల ఆరబోతకు ఎప్పుడూ సై అనేది. కాకపోతే బాలీవుడ్ లో ఆరబోసినట్టుగా టాలీవుడ్ లో ఆరబోసేది కాదు కానీ... ఇక్కడ కూడా గ్లామర్ డాల్ ల పర్వాలేదనిపించేది. చిరు పక్కన ఖైదీలోను కాజల్ అందాల ఆరబోత మాములుగా రాలేదు. ఇక ఫంక్షన్స్ కి , అవార్డ్స్ ఫంక్షన్స్ కి హాజరయ్యే కాజల్ అగర్వాల్ బొమ్మలాగా అదిరిపోయే దుస్తులతో క్లివేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తుంది. ఒకసారి బాలీవుడ్ లో ఫిలిం ఫర్ అవార్డ్స్ కి హాజరయిన కాజల్ అగర్వాల్ ఆ ఫంక్షన్ కి వేసిన డ్రెస్సు తో తెగ హైలెట్ అయ్యింది. ఆ పింక్ కలర్ గౌన్ లో కాజల్ అందాల విందు మాములుగా లేదు.అయితే తాజాగా కాజల్ టాలీవుడ్ ప్రియులకు కూడా అలాంటి అందాల విందునే ఇచ్చింది. గత రాత్రి జీ తెలుగు ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్వహిస్తున్న అప్సర అవార్డ్స్ కోసం కాజల్ వేసిన డ్రెస్సు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో ఈ ఫంక్షన్ కి అటెండ్ అయిన కాజల్.. తన డ్రెసింగ్ మెరుపులతో... తనలోని మెరుపు ఇంకా తగ్గలేదని... నిరూపించింది. మరి ఆ డ్రెస్సులో కాజల్ అందాల విందు కి చూపరుల మతులు పోయాయి. ఇక కాజల్ తనేమాత్రం తగ్గేది లేదని... అక్కడ ఫోటో గ్రఫేర్స్ కి చేతినిండా పనిచెప్పింది. అందమైన ఫోజులతో అదరగొట్టేసింది టాలీవుడ్ చందమామ.
https://www.telugupost.com/movie-news/venkatesh-narappa-movie-will-be-directed-by-venkymama-director-bobby-146289/
వెంకటేష్ తమిళ అసురన్ రీమేక్ నారప్ప ని అధికారికంగా పట్టాలెక్కించేసాడు. తమిళంలో సూపర్ హిట్ హిట్ అయిన ధనుష్ అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా చేస్తున్నాడు వెంకటేష్. అసురన్ ని యాజిటీజ్ గా దింపేస్తున్నారని వెంకటేష్ నారప్ప లుక్ చూస్తే అర్ధమవుతుంది. ధనుష్ అసురన్ లుక్ కి నారప్ప లుక్ కి పెద్దగా తేడా లేదు. సేమ్ టు సేమ్ ఉంది. దాన్నిబట్టి అసురన్ నేటివిటీ చెడగొట్టే ప్రయత్నాలేమీ జరగడం లేదని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అనగానే వెంకీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. అసలే డిజాస్టర్ డైరెక్టర్ అని. కానీ వెంకటేష్ మాత్రం శ్రీకాంత్ అడ్డలకే కనెక్ట్ అయ్యాడు. అయితే అసురన్ సినిమా మొత్తం దళితుల తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుంది. ఇప్పుడు నారప్ప సినిమా కూడా అదే కథ తో తెరకెక్కుతుంది. కాకపోతే కొంతమేర అనంతపురం కారంచేడు నరమేధ ఘటనను ఆధారంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దళితులకు, అగ్రవర్ణాలకు మధ్యన దళితులూ ఏ విధంగా అన్యాయం అయ్యారో.. అగ్రవర్ణాల చేతిలో దళితుల మరణాలు ఎలా సంభవించాయి అనేది నారప్పలొ చూపించబోతున్నారట. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం మరో దర్శకుడు దిగుతున్నట్టుగ చెబుతున్నారు వెంకిమామ సినిమాని వెంకటేష్ తో చేసిన దర్శకుడు బాబీ నారప్ప సినిమా యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించబోతున్నాడట. సినిమా మొత్తం శ్రీకాంత్ అడ్డాలా, కేవలం ఫైటింగ్ సీన్స్ బాబీ డైరెక్ట్ చేస్తారన్నమాట. అందుకే నారప్ప కోసం ఇద్దరు దిగుతున్నారు అని అన్నది.
https://www.telugupost.com/movie-news/rashmika-green-india-163196/
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు; ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు.ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం జరిగింది.ఈ చాలెంజ్ లోకి నన్ను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్న; కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
https://www.telugupost.com/movie-news/private-jet-for-prabhas-173525/
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ స్టార్ హీరోస్ కి సమానమైన క్రేజ్ ప్రభాస్ సొంతమైంది. బాహుబలి, సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ.. ఇలా ప్రభాస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ కే మొగ్గు చూపుతున్నాడు. అటు సంపాదన పరంగాను, ఇటు రేంజ్ పరంగాను సౌత్ ఇండియా స్టార్ హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యాం షూటింగ్ ముగించుకుని ముంబై లో ఆదిపురుష్ చర్చల్లో పాల్గొంటున్నాడట. అయితే కరోనా కి కంగారు అపడిన ప్రభాస్ ఓ ప్రైవేట్ జెట్ ని మైంటైన్ చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ లో గుసగుసలు వినవస్తున్నాయి. ప్రభాస్ కరోనా కారణముగా ఫ్లైట్స్ లో వెళ్లి రావడం ఎందుకు రిస్క్ అని.. తన ఎన్ఆర్ఐ ఫ్రెండ్ నుండి ఓ ప్రైవేట్ జెట్ తీసుకుని అందులోనే జర్నీ చేస్తున్నాడట. అందరి కన్నా ముందే ధైర్యంగా ఇటలీ వెళ్లి రాధేశ్యాం షూటింగ్ చెయ్యడానికి ప్రభాస్ కి ఆ ప్రైవేట్ జెట్ కారణమట. ఇక జార్జియా లో రాధేశ్యాం షూటింగ్ ముగించుకుని ప్రభాస్ ప్రైవేట్ ఫ్లైట్ లోనే హైదరాబాద్ రావడం, మళ్ళీ ముంబై కి వెళ్లి అక్కడ ఆదిపురుష్ కథ చర్చలో పాల్గొనడం చేస్తున్నాడని టాక్. తన ఫ్రెండ్ ప్రైవేట్ ఫ్లైట్ లోనే ప్రభాస్ ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా త్రిగుతున్నాడని అంటున్నాడు.
https://www.telugupost.com/crime/huge-explosion-occurred-in-the-capital-of-bangladesh-seventeen-people-were-killed-in-the-blast-1465942
బంగ్లాదేశ్ రాజధానిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిహేడు మంది మరణించారు. ఏడు అంతస్థుల భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిహేడు మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. భవనం శిధిలాల కింద మరికొందరు ఉండే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని తెలిసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.మృతుల సంఖ్య....సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిందరినీ ఢాకా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు. అయితే పేలుడు ఎందుకు సంబంధించిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ బిల్డింగ్ లో వ్యాపార సముదాయం ఉంది. ఇక్కడ నిల్వ ఉంచిన రసాయనాల కారణంగానే పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. శిధిలాల తొలగింపు కార్యక్రమం కూడా వేగవంతం చేశారు.
https://www.telugupost.com/movie-news/srinivasa-kalyanam-business-2-84719/
నితిన్ - రాశి ఖన్నా జంటగా.. దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలై వారం కావొస్తుంది. విడుదలైన మొదటి షోకే యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగొచ్చేలా కనబడుతుంది. సినిమాలో అనుకున్నంత కంటెంట్ లేకపోవడం.. సినిమా మొత్తం ఏదో క్లాస్ తీసుకున్నట్టుగా ఉండడం.. పెళ్లి పేరుతొ అన్ని తతంగాలు గుర్తు చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా శ్రీనివాస కళ్యాణం సినిమాని రిజెక్ట్ చేశారు. ఇక వారం రోజుల్లో కేవలం 11 కోట్ల పై మేర షేర్ ని రాబట్టింది ఈ సినిమా. మరి తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమా ముందు శ్రీనివాస కళ్యాణం సినిమా చేతులెయ్యడం ఖాయంగానే కనబడుతుంది. ఇకపోతే శ్రీనివాస కళ్యాణం మొదటి వారం ప్రపంచవ్యాప్త కలెక్షన్స్...ఏరియా షేర్స్ (కోట్లలో)నైజాం 4.75సీడెడ్ 1.42నెల్లూరు 0.32కృష్ణ 0.61గుంటూరు 0.75వైజాగ్ 1.30ఈస్ట్ గోదావరి 0.72వెస్ట్ గోదావరి 0.46టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్ 10.33 కోట్లుఓవర్సీస్ 0.80ఇతర ప్రాంతాలు 0.70మొత్తం ప్రపంచవ్యాప్త షేర్ 11.83 కోట్లు
https://www.telugupost.com/movie-news/pawan-kalyan-and-rana-daggupati-to-work-together-in-ayyappam-koshiyam-177313/
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ తెలుగులో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుపాటి కాంబోలో బడా మల్టీస్టారర్ గా గ్రాండ్ గా మొదలయ్యింది. ఆ పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కూడా కాస్త సందడి చేసాడు. కానీ ఫ్యాన్స్ లో మాత్రం కాస్త గందర గోళం నెలకొంది ఏమిటంటే.. ఈ సినిమాకి త్రివిక్రమే కథ, మాటలు అన్ని అందిస్తున్నారని.. ఆ మధ్యన అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బకి ఇంకా ఆయిట్మెంట్ రాసుకుంటూ ఉన్న పవన్ ఫ్యాన్స్ కి ఇది ఇప్పుడు కొత్త టెన్షన్ లా తయారైంది. దానికి కారణం లేకపోలేదు. గతంలో హిందీ క్లాసిక్.. లవ్ ఆజ్కల్ తీసుకొచ్చి త్రివిక్రమ్ చేతిలో పెడితే.. ఆ సినిమాకి త్రివిక్రమ్ తనదైన శైలిలో కథ, మాటలు రాసాడు. అయితే త్రివిక్రమ్ డైలాగ్స్ ని, స్క్రిప్ట్ ని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు పవన్ అజ్ఞాతవాసి పెద్ద షాక్. అలాగే తీన్మార్ కి త్రివిక్రమ్ కథ అనగానే దానిని యధాతధంగా తెరకెక్కించక తప్పలేదు తీన్మార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జికి. ఆ తీన్మార్ రిజెల్ట్ ఎలా వచ్చిందో అనేది మనందరం చూసిందే. ఇప్పుడు కూడా అయ్యప్పమ్ కోషియమ్ మలయాళం హిట్ సినిమాకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారనగానే తీన్మార్ డేస్ గుర్తొస్తున్నాయి పవన్ ఫ్యాన్స్ కి. అందుకనే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చర్చల లో ఈ తరహా చర్చలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సర్ తీన్మార్ ఆడించొద్దు ప్లీజ్ తట్టుకోలేం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/heroine-and-singer-affair-74644/
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ విదేశీ సింగర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరి స్నేహబంధం గురించి బాలీవుడ్ సర్కిల్స్ లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రియాంక చోప్రా విదేశీ సింగర్ నిక్ జోనస్ తో కలిసి తిరుగుతోందని ప్రచారం చాలా రోజులుగానే జరుగుతోంది. అయితే, వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పరస్పరం చేసుకుంటున్న కామెంట్లు ఈ బంధం నిజమే అనే అనుమానాలు కలిగిస్తోంది.ఒకరి ఫోటోలకు ఒకరు కామెంట్లు....నిక్ జోనస్ ఇటీవల ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ జూ ని సందర్శించాడు. జూ లో ఓ జంతువుతో కలిసి వీడియో తీసుకుని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నాడు. దీనిపై ప్రియాంక చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ‘ఎవరు బాగున్నారు..లోల్..’ అని ఆమె ఈ విడియోకు కామెంట్ చేసింది. ఇంతకుముందు కూడా ప్రయాంక పోస్ట్ చేసిన ఓ ఫోటోకు నిక్కి కామెంట్ చేశాడు. దీంతో పాటు ఇటీవల వారు లాస్ ఏంజిల్స్ లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో వీరి బంధం నిజమేనని, కానీ అది కేవలం స్నేహమేనా..? అంతకంటే గాఢమైందా అనేది తేలాలి. ఇక ఇటీవల ఈ విషయంపై స్పందించిన ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా...విదేశీయుడితో ప్రియాంక పెళ్లిని తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు. ఆమె పెళ్లి చేసుకోకున్నా సరే కానీ, విదేశీయుడిని మాత్రం చేసుకోకూడదు అని తెగేసి చెప్పారు.
https://www.telugupost.com/crime/a-terrible-accident-took-place-in-kedarnath-uttarakhand-six-people-died-in-this-incident-1444020
ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్‌లతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో ఆరుగురు మరణించారు. వాతావరణం అనుకూలించకే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులున్నారు.సహాయక చర్యలు...కుప్ప కూలి పోవడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాయి. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. సహాయక బృందాలు సంఘటన స్థలికి చేరుకుని చర్యలు ప్రారంభించాయి. ఈ విషాద సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.
https://www.telugupost.com/movie-news/nani-allu-arjun-dance-in-bangkok-86696/
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి డాన్సర్ అని మన అందరికి తెలిసిన విషయమే. కానీ మంచి సింగర్ అని మీకు తెలుసా? ఇది పక్కన పెడితే నాని కూడా మంచి సింగర్ అని మీకు తెలుసా? కానీ డాన్సులు చెయ్యాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి. అది బన్నీకి ఉంది. కానీ నాని మాత్రం డాన్సులు విషయంలో అంతంత మాత్రమే అని తెలుసు.అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే చోట డాన్సులు వేసి.. పాటలు పడితే ఎలా ఉంటది? కానీ ఆ అదృష్టం కొంతమందికే దక్కింది. వీరిద్దరూ కలిసి బ్యాంకాక్ లో జరిగిన ఓ సంగీత్ ఈవెంట్ లో పాటలు పాడి డాన్సులు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ లో సింగర్స్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' నుండి ఓ సూపర్ హిట్ సాంగ్ పాడుతుంటే..పక్కన నుండి నాని - తన వైఫ్ అంజన ఇద్దరూ కలిసి కోరస్ పాడారు.ఆ తర్వాత అల్లు అర్జున్ - స్నేహ 'ఆర్య-2' నుండి మరో సూపర్ హిట్ పాటను పాడారు. అయితే వీరు ఇద్దరు కలిసి అంటే అల్లు అర్జున్, నాని కలిసి 'ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమా నుండి సాంగ్ ను కలిసి పాడారు. ఇలా ఇద్దరు హీరోస్ కలిసి ఒకే స్టేజి మీద డాన్సులు..పాటలు పాడుతుంటే ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతుంది. ఇలా ఒకే స్టేజి మీద ఇద్దరు హీరోస్ కనపడటం మంచి వాతావరణమే.
https://www.telugupost.com/movie-news/rajamouli-plan-on-rrr-103628/
దర్శకదీరుడు రాజమౌళి సినిమాలు వేరు, వేరే దర్శకుల సినిమాలు వేరు. టాలీవుడ్ లో రాజమౌళి తీసినంత ఇంపాక్ట్ గా వేరే ఏ దర్శకుడు తీయలేడు. ప్రతి విషయాన్ని చాలా డిటైల్ గా తీసే రాజమౌళి షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందుకే ఈయన సినిమాలు అనుకున్న టైంలో రిలీజ్ అవ్వవు. ప్రస్తుతం #RRR షూటింగ్ చేస్తున్న జక్కన్న రీసెంట్ గా ఒక షెడ్యూల్ ను ఫినిష్ చేసాడు. మరో షెడ్యూల్ ను వచ్చే నెల నుండి స్టార్ట్ చేయనున్నాడు. మరి ఎప్పటివరకూ రామ్ చరణ్, తారక్ లు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇద్దరూ వచ్చే ఏడాది అక్టోబర్ వరకు డేట్స్ ఇచ్చారట. అప్పుటివరకు కావాలని రాజమౌళి అడిగిగారట. సంక్రాంతికి క్లారిటీ వస్తుందా..? దసరా లోపు షూటింగ్ కంప్లీట్ చేసి అప్పటినుండి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ వేసాడట జక్కన్న. అంటే అక్టోబర్ తరువాత నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ వేరే ప్రాజెక్ట్స్ పై పని చేయడం మొదలు పెట్టొచ్చు. జక్కన్న అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇద్దరి ఫస్ట్ లుక్స్ దసరాకు లాంచ్ అవుతాయి. డిలే అయిన పక్షంలో ఇద్దరి కొత్త సినిమాల షూటింగ్ కూడా ఆలస్యం అవుతాయి. ఇప్పటివరకు రాజమౌళి ఇతర నటీనటుల పేర్లు వెల్లడించలేదు. రాజమౌళి ఏది త్వరగా చెప్పాడు కదా. కాబట్టి సంక్రాంతి టైంకి ఇతర నటుల వివరాలను, హీరోయిన్ల పేర్లు అనౌన్స్ చేసి దేశవ్యాప్తంగా ఈ సినిమాపై బజ్ తీసుకుని రావాలని చూస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/మెగా-స్టార్-ఆహ్వానాన్ని-57481/
యంగ్ హీరో నాగ శౌర్య తన తాజా చిత్రం చలో తో వచ్చే శుక్రవారం (2 ఫిబ్రవరి) నాడు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా నిన్న (గురువారం 25 జనవరి) సాయంతరం ప్రీ రిలీజ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా మెగా స్టార్ చిరంజీవి విచ్చేసి చిత్ర బృందాన్ని, ప్రత్యేకంగా హీరో నాగ శౌర్య ని విష్ చేశారు. మెగా స్టార్ తన ప్రసంగంలో భాగంగా అసలు తాను ఈ వేడుకకి ఎందుకు హాజరు అయ్యారో వివరించారు. ఈ వివరణలో నుంచి ఇప్పుడు జవాబు దొరకని ఒక ప్రశ్న ప్రేక్షకులని వెంటాడుతోంది.మెగా స్టార్ చిరంజీవి చలో ప్రీ రిలీజ్ వేడుక వేదిక పై ప్రసంగిస్తూ, నాగ శౌర్య తనని ముఖ్య అతిధిగా ఆహ్వానించటానికి వచ్చినప్పుడు అతడిలో తనని తాను చేసుకున్నానని, తన కెరీర్ తొలి నాళ్ళల్లో తాను నటించిన ఒక చిత్ర శతదినోత్సవ వేడుకకి తాను ఎంతగానో అభిమానించే నటుడిని ప్రత్యేక అతిధిగా ఆహ్వానిస్తే ఆయన బిజీ షెడ్యూల్ కారణాన ఆహ్వానాన్ని తిరస్కరించారని, అప్పటికి ఆ వేడుక జరిగినప్పటికీ తాను ఎంతగానో నిరాశ చెందినట్టు చెప్పారు చిరంజీవి. అలానే హీరోగా మంచి రేంజ్ కి ఎదుగుతున్న శౌర్య తనని ఆహ్వానించినప్పుడు నాకు ఆ సందర్భము గుర్తు వచ్చి తనకి ఎదురైన నిరాశ, నిరుత్సాహం అతనికి ఎదురుకాకూడదనే ఈ వేడుకకి హాజరయ్యానని పేర్కొన్నారు మెగా స్టార్. అయితే తన ఆహ్వానాన్ని తిరస్కరించిన ఆ బడా స్టార్ ఎవరో పేరు మాత్రం రివీల్ చేయలేదు చిరు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ యాక్టర్ ఎవరై వుంటారనేదాని పై అనేక పోల్స్ ప్రారంభమయ్యాయి.
https://www.telugupost.com/movie-news/ntr-atlee-vijayendraprasad-154425/
ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని తెలుగు డైరెక్టర్స్ మాత్రమే కాదు, తమిళ, కన్నడ డైరెక్టర్స్ కూడా తహతహలాడుతున్నారు. RRR సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చెయ్యబోతున్నాడు. ఆ తర్వాత సిఎంమా ఎన్టీఆర్ ఎవరితో చెయ్యబోతున్నాడో అనే దానిమీద అందరిలో పిచ్చ క్యూరియాసిటీ. కరోనా లాక్ డౌన్ టైం లో ఎన్టీఆర్ కథలు వింటున్నాడనే టాక్ ప్రచారంలోకొచ్చింది. ఇక తమిళనాట అట్లీ ఎన్టీఆర్ తో సినిమా కోసం కాచుకుని కూర్చున్నాడు. మరోపక్క కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ఓకె అంటే సై అనేలా ఉన్నాడు. అయితే తమిళ డైరెక్టర్ అట్లీ ని ఎన్టీఆర్ తో కథ వినిపించేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు హెల్ప్ చేసాడనే టాక్ వినబడుతుంది. ఎన్టీఆర్ ని అట్లీ కుమార్ ని కూర్చీబెట్టి కథ చర్చలు చేపట్టాడట. ఆయనెవరో కాదు బాహుబలి కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ మీడియేటర్ గా వ్యవహరించి అట్లీ కి ఎన్టీఆర్ కి మధ్యన ప్యాచప్ చేసాడట. అట్లీ తో విజయేంద్ర ప్రసాద్ కి మెర్సెల్ దగ్గరనుండి అనుబంధం ఉండడంతో.. మెర్సెల్ టైం లోనే ఓ కథ ని విజయేంద్ర ప్రసాద్ కి వినిపించగా.. ఈ కథ ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని ఎన్టీఆర్ దగ్గరికి అట్లీ ని తీసుకెళ్లి కథ వినిపించాడని టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.
https://www.telugupost.com/crime/madhya-pradesh-man-gives-supari-to-daughter-in-law-to-kill-his-wife-1379455
అత్తను చంపడానికి కోడలికి 'సుపారీ' ఇచ్చిన మామ కథ ఇది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఎంపీలోని రేవా జిల్లాలో తన భార్యను చంపినందుకు 51 ఏళ్ల వ్యక్తిని, అతని కోడలును అరెస్టు చేశారు. వాల్మీకి కోల్ అనే వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, తన భార్య సరోజను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. దేంతో ఆమె గొంతు కోసేందుకు తన కోడలు కంచన్ కోల్ (25)కి రూ.4వేలు సుపారీగా ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు.వాల్మీకి ప్రతి నెలా ఆమెకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తూనే ఉంటానని 'డీల్' జరిగింది. సరోజ, కాంచన్‌ల మధ్య సఖ్యత లేదని వాల్మీకి తెలుసు, అందుకే అతను దానిని సద్వినియోగం చేసుకున్నాడని చెబుతున్నారు. సరోజ్ (50) జూలై 12న తన ఇంట్లో శవమై కనిపించింది. హత్య జరిగిన రోజు వాల్మీకి సాత్నాలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. "జూలై 12న ఆమె తన అత్తయ్యను చంపేసింది. కొడవలితో ఆమె గొంతు కోసింది" అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో కోడలిపై అనుమానం రాగా.. తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో మొత్తం విషయం బయటకు వచ్చేసింది. దీంతో కోడలిని, మామను పోలీసులు అరెస్ట్ చేశారు.
https://www.telugupost.com/movie-news/big-announcement-168406/
అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి – అనిల్ సుంకరల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్.యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది . అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రంలో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5 తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
https://www.telugupost.com/movie-news/samantha-yashoda-movie-trailer-out-now-1445403
సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన సినిమా "యశోద". ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై.. అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సమంత గర్భవతిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా "యశోద" ట్రైలర్ ను విజయ్ దేవరకొండ చేతులమీదుగా విడుదల చేయించింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ట్రైలర్ ని బట్టి చూస్తే.. ఈ సినిమా సరోగసి కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.పిల్లల్ని కనలేక, కనే అవకాశం లేక అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకునే కొందరు సెలెబ్రెటీస్ కోసం ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే సమంత కూడా ఒక ప్రముఖ వ్యక్తి కోసం అద్దె గర్భం దాల్చుతుంది. అయితే ఆ సమయంలో అక్కడ జరిగే కొన్ని చట్ట విరుద్ధమైన పనులు సమంత కంట పడతాయి. వాటిని బయటపెట్టే క్రమంలో సమంత ఎదుర్కొన్న సన్నివేశాలను.. యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ట్రైలర్ చివరిలో.. యశోద అంటే ఎవరో తెలుసుగా, కృష్ణ పరమాత్ముడు తల్లి అంటూ సామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సమంత చేసిన ఫైట్స్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. నవంబర్ 11న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్స్ హరి-హరన్ లు దర్శకత్వం వహిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/anushka-in-nagarjuna-movie-110216/
హీరోయిన్ అనుష్కకి నాగార్జున అంటే ఎనలేని అభిమానం. ఎందుకంటే కెరీర్ తొలినాళ్లలో నాగార్జున అనుష్కకి సపోర్ట్ గా నిలిచాడు నాగ్. అందుకే అనుష్కతో నాగ్ చాలా సినిమాలే చేసాడు. అనుష్క కూడా నాగ్ సినిమాలు చాలా వాటిలో గెస్ట్ రోల్స్ కూడా ప్లే చేసిన విషయం తెలిసిందే. అలాగే నాగ్ కుటుంబానికి అనుష్క చాలా క్లోజ్ కూడా. ఇకపోతే గత కొన్నాళ్లుగా అనుష్క అధిక బరువుతో బాధపడుతూ.. లేటెస్ట్ గా స్లిమ్ లుక్ కి మారింది. ఆయుర్వేద వైద్యంతో అనుష్క టోటల్ స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం అనుష్క స్లిమ్ లుక్ తో మన్మధుడికి గాలం వేసిందనే టాక్ నడుస్తుంది. నాగార్జున.. మన్మధుడు సినిమాని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. మన్మధుడు సినిమాలో సోనాలి బింద్రే, అన్షుతో రొమాన్స్ చేసిన నాగార్జున.. మన్మధుడు 2లో ఇప్పటికే పాయల్ రాజపుట్ ని ఎంపిక చేసారని ఇప్పుడు అనుష్కని కూడా సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒప్పేసుకుందట… అయితే నాగార్జున ఆఫర్ చేస్తే అనుష్క కచ్చితంగా ఒప్పుకుంటుంటుందనే టాక్ నడుస్తుంది. అయితే కేవలం సంప్రదింపుల వరకే కాదు… అనుష్కని సంప్రదించడం.. ఆమె ఒకే చెప్పడం జరిగిందని.. అసలు ఇప్పటికే అనుష్క ఫోటో షూట్ కూడా జరిగిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. కాకపోతే నాగ్ – అనుష్క లు కలిసి నటిస్తే మాత్రం మన్మధుడు సినిమాకి క్రేజ్ రావడం పక్కా కాబట్టి అనుష్కకి నాగ్ ఆఫర్ నిజమే అయ్యుంటుందని అంటున్నారు.
https://www.telugupost.com/andhra-pradesh/both-ys-jagan-in-andhra-pradesh-and-kcr-in-telangana-lost-the-elections-1542366
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రభుత్వాలు మారిపోయాయి. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు పవర్ ను అనుభవించి ఓటమిని చవిచూశారు. ఇద్దరికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా జగన్ గెలుస్తారని అనేక సార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారంటే జగన్ పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని అనుకోవాలి. ఇక జగన్ కూడా తన పార్టీ వైసీపీని తెలంగాణలో రద్దు చేసి కేసీఆర్ కు పరోక్షంగా సాయపడటానికేనని చెబుతారు. అయితే అది కాంగ్రెస్ కు ఉపయోగపడింది. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇద్దరూ ఓటమి పాలయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే.. జగన్ బెంగళూరులోని తన ఓన్ హౌస్ లో ఉన్నారు.ఇద్దరికీ పోలికలున్నా...కానీ కేసీఆర్, జగన్‌లకు మధ్య కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ జనంలోకి పెద్దగా రారు. ప్రజలను కలవడానికి ఇష్టపడరు. ఇద్దరూ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారని అందరికీ తెలుసు. అంటే వారు చెప్పిందే వినాలి. అంతే తప్ప ఇతరుల సలహాలు ఏ మాత్రం పట్టించుకోరు. తాము అనుకున్నదే అమలు చేయడంలో ఇద్దరూ ఒకరికి మించిన వారు మరొకరు. అధికారంలో ఉండగా ఇద్దరూ ఎమ్మెల్యేలను కలవరు. మంత్రులకు అపాయింట్‌మెంట్ ఉండదు. ఇలా ఇద్దరి మధ్య పోలికలు అనేకం ఉన్నాయి. ఎన్నికల సమయంలోనూ ప్రజల మధ్యకు వస్తారన్న ఒక విమర్శ కూడా ఇద్దరిపైన ఉంది. కార్యాలయంలోనే ఉండి పాలన సాగిస్తుంటారు ఇద్దరూ. గత ఎన్నికల సందర్భంగా ఇద్దరూ రాజశ్యామల యాగం నిర్వహించినా అధికారానికి మాత్రం ఇద్దరూ దూరమయ్యారు. ఇద్దరూ కలసి...ఇక అభ్యర్థుల ఎంపికలో ఇద్దరిదీ వేర్వేరు పద్ధతులను అవలంబించారు. కేసీఆర్ సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇచ్చి ఓటమి పాలయితే, జగన్ సీట్లు మార్చినా, కొత్త వారికి అవకాశం కల్పించినా పవర్ మాత్రం చేతికి రాలేదు. అయితే కేసీఆర్ కు ఒక సానుకూలత ఉంది. కేసీఆర్ ఓటమి తర్వాత బయటకు రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మేనల్లుడు హరీశ్‌రావు తోడుగా నిలుస్తున్నారు. వీళ్లిద్దరూ పార్టీ పనులను చక్కదిద్దుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొంత క్యాడర్ జారిపోకుండా పార్టీని నిలబెడుతున్నారు. ఓటమి పాలయిన రోజు నుంచే కేటీఆర్, హరీశ్ రావులు జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతున్నారు. నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కొత్త నాయకత్వంతో ఈసారి అధికారం తమదేనన్న భరోసాను కల్పిస్తున్నారు.ఆ స్థాయి నేత...కానీ జగన్ కు ఆ ఆప్షన్ లేదు. జగన్ ఒక్కరే తిరగాలి. ఆయన కుటుంబ సభ్యులు గత ఎన్నికలకు ముందే రాజకీయంగా దూరంగా జరిగారు. తల్లి విజయమ్మ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు. జగన్ తర్వాత నెంబర్ 2 అనే వాళ్లు లేకపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి పార్టీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ క్యాడర్ కొంత నిర్వేదంలో ఉంది. నిరాశలో కూరుకుపోయింది. అయితే ఈ సమయంలో జగన్ మాత్రమే జనంలోకి రావాల్సిన పరిస్థితుల్లో ఆయన వస్తేనే పార్టీ తిరిగి గాడిన పడుతుంది. పార్టీలో ఎవరూ అంతటి స్థాయి నేతలు లేకపోవడంతోనే ఈ సమస్య ఉంది. కేసీఆర్ కు ఉన్న అడ్వాంటేజీ జగన్ కు లేదనడానికి ప్రధానం కుటుంబమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో కేసీఆర్ కు కుటుంబ బలం ఉండగా, జగన్ మాత్రం ఒంటరి అని చెప్పక తప్పదు.
https://www.telugupost.com/movie-news/devara-part-1-movie-trailer-released-shades-of-ntr-1550943
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ 1 ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. తండ్రీకొడుకులకు సంబంధించిన కథలో అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ కూడా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుండగా సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఉత్తరాదిన కూడా మంచి పాపులారిటీని అందుకున్న ఎన్టీఆర్ 'దేవర 1' తో మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ మూవీ వార్ కూడా ఎన్టీఆర్ చేస్తూ ఉండడంతో దేవర 1 మీద అక్కడ కూడా మంచి హైప్ ఉంది. దేవర: మొదటి భాగం ప్రమోషన్స్ లో భాగంగా తారక్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి కపిల్ శర్మ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్‌తో తారక్ ప్రత్యేక చిట్‌చాట్‌లో కూడా పాల్గొన్నాడు.
https://www.telugupost.com/crime/incident-of-rape-of-a-girl-in-prodduturu-in-kadapa-district-is-causing-a-stir-1360178
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. ప్రొద్దుటూరులోని జూనియర్ కళాశాలలో బాలిక ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒక వ్యక్తి బాలికను తన ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.ఆ యువకుడే.....దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు మోడంపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/ఈ-ఉత్కంఠకు-తెర-పడేదెప్పు-34300/
తమిళ రాజకీయాల్లో సినీతారల హడావిడి ఎప్పుడు ఎక్కువే.. ఎంజీయార్ హయాం నుంచి సినిమా గ్లామర్ కీ తమిళ రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఇక తమిళ ప్రజలు కూడా ఎప్పుడూ సినిమా గ్లామర్ కే ఆకర్షితులవుతున్నారు. అందుకే ఎక్కువమంది సినీతారలు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీఅయిపోతున్నారు. అలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా తారలు తమిళనాడు రాజకీయాలను శాసించారు కూడాను. ఇక జయలలిత మరణం తర్వాత తమిళ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. అయితే గతం గతహా అన్నట్టు ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో పాత వాసనలు పోయి కొత్త వాసనలు ముసురుకుంటున్నాయి.తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్న వేళ.... ఒకప్పుడు తమిళనాట అభిమానులతో గుడి కట్టించుకున్న ఖుష్బూ ఎప్పటినుండో రాజకీయాలపట్ల ఆకర్షితురాలై కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార ప్రతినిధి హోదా దక్కించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఖుష్బూ కాంగ్రెస్ ని వదిలి బయటికి వచ్చే ఆలోచన చేస్తుందని అందుకే.... 'కాలా' షూటింగ్ లో బిజీగా వున్నా రజినిని కలిసి రాజకీయాలు చర్చించినట్లు వార్తలొస్తున్నాయి.ఇక రజిని కూడా పార్టీ అంటూ పెడితే నీకు సముచిత స్థానం ఇస్తానని మాటిచ్చినట్లు ప్రచారం మొదలైంది.మరో పక్క తమిళ రాజకీయ పార్టీలు అన్నాడిఎంకె , పన్నీరు సెల్వం వర్గ ఎమ్యెల్యేలు కూడా రజిని పార్టీ పెడితే జంప్ అవడానికి సిద్ధంగా వున్నారు. ఒక్క రజిని కోసం అక్కడ కొన్ని కోట్లమంది ఎదురు చూస్తున్నారుగాని రజిని మాత్రం నిర్ణయం తీసుకోకుండా ఇంకా సస్పెన్సునే మెయింటైన్ చేస్తూ క్షణ క్షణం ఉత్కంఠకు గురిచేస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/ఈ-ద‌స‌రాకి-స్పైడ‌ర్‌తో-ప-43775/
సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక జరగింది. ఈ కార్యక్రమంలో స్పైడర్‌ సినిమాలో పాటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా..సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ - ''నేను చెన్నై వచ్చిన కొత్తలో సినిమాల్లో నటించాలని అనుకుంటున్న సమయంలో ఓసారి కుటుంబరావుగారితో మాట్లాడుతుంటే డైరెక్టర్‌ శ్రీధర్‌గారు వచ్చి తమిళ సినిమాలో నటించే అవకాశం ఉందని అన్నారు. నాకు తమిళం రాదని అన్నా, ఆయనే తమిళం నేర్పిస్తానన్నారు. కానీ నాకు తమిళం రాకపోవడంతో నేను ఆ సినిమాలో చేయలేకపోయాను. ఆ సినిమాయే కాదలిక్క నేరమిల్లై. తర్వాత నాకు ఆదుర్తి సుబ్బారావుగారు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా నన్ను అభిమానులు మూడు వందల యాభై సినిమాల్లో ఆదరించారు. ఇప్పుడు మహేష్‌ను ఆదరిస్తున్నారు. మహేష్‌ ప్రతి సినిమాలోనూ ఇంప్రూవ్‌ మెంట్‌ కనపడుతుంది. స్పైడర్‌ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. తమిళ హీరోలానే డైలాగ్స్‌ చెప్పాడు. ఓ హీరో తమిళంలో ఇంట్రడ్యూస్‌ అయ్యేటప్పుడు ఒక మంచి దర్శకుడుతో ఇంట్రడ్యూస్‌ అయితే బావుంటుందని అనుకునేవాడిని. చాలా గొప్ప దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్‌ కావడం ఆనందంగా ఉంది. అన్నీ పాటలు బావున్నాయి. సినిమా డెఫనెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుందని మనస్ఫూర్తిగా చెబుతుఆన్నను.ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ - ''స్పైడర్‌ ఒక హాలీవుడ్‌ మూవీలా ఉంటుంది. మంచి పాటలు, స్టైల్‌గా ఉంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు'' అన్నారు.కొరటాల శివ మాట్లాడుతూ - ''స్పైడర్‌ ఫస్ట్‌ పోస్టర్‌, టీజర్‌ వచ్చినప్పటి నుండి చాలా క్యూరియస్‌గా చూస్తున్నాను. ప్రతి పోస్టర్‌, టీజర్‌ క్వాలిటీగా ఉంది. ఇండియాలో ఫైనెస్ట్‌ మూవీ అని చెప్పవచ్చు. మురుగదాస్‌గారి గ్రిప్పింగ్‌ నెరేషన్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఇక సంతోష్‌శివన్‌, హరీష్‌జైరాజ్‌ వంటి టీం ఉంటే సినిమా ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ - ''మహేష్‌బాబుది మొదటి బై లింగ్వువల్‌ సినిమా. మహేష్‌ నువ్వు మద్రాస్‌లో పుట్టి పెరిగావ్‌ కాబట్టి, తమిళంలో యాక్ట్‌ చేస్తే బావుంటుందని చెప్పేవాడిని. ఇప్పుడు నిజమైంది. స్టైల్‌, ఇన్‌టెన్సిటీ, ఎమోషన్‌ అనే మూడు లక్షణాలు సూపర్‌స్టార్‌ సినిమాలో ఉండాలి. ట్రైలర్‌ చూస్తుంటే అవన్నీ కనపడుతున్నాయి. నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు, మురుగదాస్‌లకు అభినందనలు'' అన్నారు.వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''మురుగదాస్‌గారి రచనలకు, దర్శకత్వానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఒక సోషల్‌ పాయింట్‌ తీసుకుని, ఎక్కువ మందికి రీచ్‌ చేయడంలో మురుగదాస్‌గారిని మించిన దర్శకుడు ఇండియాలోనే లేడు. ఎక్సలెంట్‌ టీం కుదిరింది. మహేష్‌గారు డైరెక్టర్‌గారికి ఇచ్చే రెస్పెక్ట్‌ గొప్పగా ఉంటుంది. కన్విక్షన్‌ ఉన్న హీరో మహేష్‌'' అన్నారు.మ్యూజిక్‌ డైరెక్టర్‌ హరీష్‌ జైరాజ్‌ మాట్లాడుతూ - ''స్పైడర్‌ ఆడియో వేడుకకు రాకపోవడానికి కారణం నేను బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మ్యూజిక్‌ అందిస్తూ బిజీగా ఉన్నాను. సినిమా కచ్చితంగా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. మురుగదాస్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా నాకు ఒక మంచి అనుభూతినిచ్చింది. అలాగే మహేష్‌గారితో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. రకుల్‌, ఎస్‌.జె.సూర్య సహా యూనిట్‌కు అభినందనలు. ఈ సందర్భంగా ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఇంత ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ను చేస్తానని నేను ఊహించలేదు. ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని సినిమా చేశాం. మన తెలుగు హీరోను తమిళంలో లాంచ్‌ చేయాలని మహేష్‌గారికి చాలా స్క్రిప్ట్స్‌ వినిపించాను. కానీ చివరకు మురుగదాస్‌గారి స్క్రిప్ట్‌ నచ్చింది. స్క్రిప్ట్‌ వినగానే మహేష్‌గారు నాపై నమ్మకంతో ఐదు నిమిషాల్లోనే సినిమాను చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు ముందుగా మహేష్‌గారికి థాంక్స్‌. అందరూ గర్వపడేలా సినిమా చేశానని కచ్చితంగా చెబుతున్నాను. గ్యారంటీగా సినిమా ఇండస్ట్రీ సూపర్‌హిట్‌ చిత్రాల్లో 'స్పైడర్‌' ఒకటిగా నిలిచిపోతుంది. అందరూ ఎంత అతృతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. మహేష్‌, సంతోష్‌ శివన్‌, మురుగదాస్‌, హరీష్‌ జైరాజ్‌ అండ్‌ టీం కృషితో మంచి సినిమా చేశాం. ముఖ్యంగా సంతోష్‌శివన్‌గారు ఫస్ట్‌ కాపీ వచ్చేవరకు మరే చిత్రం చేయకుండా ఈ సినిమా కోసం పనిచేశాను. హరీష్‌ జైరాజ్‌గారి వర్కింగ్‌ స్టయిల్‌ చూసి ఆశ్చర్యపోయాను. అలాగే పీటర్‌ హెయిన్స్‌ ఒక మనిషి వంద మందితో సమానంగా పనిచేశారు. సినిమాలో పీటర్‌ హెయిన్‌గారి యాక్షన్‌ సీన్స్‌ చూసి థ్రిల్‌ అవుతారు. మురుగదాస్‌గారు స్క్రిప్ట్‌ నుండి ఎంతో కష్టపడ్డారు. ఆయన, ఆయన టీం ఎంతో కష్టపడి మంచి సినిమాను అందించారు. అందరి అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. ఆల్‌ టైవమ్‌ రికార్డ్‌ను క్రియేట్‌ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి పండుగ వాతావరణాన్ని తెస్తుంది. ఇంత గ్రేట్‌ ప్రాజెక్ట్‌లో నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.చిత్ర దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ మాట్లాడుతూ - ''ఈరోజు నా లైఫ్‌లో చాలా ముఖ్యమైనరోజు. నేను మహేష్‌గారి సినిమా ఒక్కడుని విజయవాడలో చూశాను. సినిమా విడుదలై మూడు వారాలైన సినిమా హౌస్‌ఫుల్‌గా, పండుగలా అనిపించింది. నేను అప్పటి నుండి మహేష్‌ను కలిసినప్పుడల్లా నేను ఒక ఫ్యాన్‌ని. మీతో సినిమా చేయాలనుంది అని చెప్పాను. ఒక డైరెక్టర్‌కి మంచి బలం అంటే హీరోనే. స్పైడర్‌ ఎలా వచ్చిందని చాలా మంది అడుగారు. వారికి నేను చెప్పేదేంటంటే, స్పైడర్‌..మహేష్‌బాబుగారిలా వచ్చింది. స్టైల్‌గా, హ్యాండ్‌సమ్‌గా, డేడికేషన్‌గా సినిమా ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. ఓ ఏడాది జరిగిన షూటింగ్‌లో ఆరు నెలలు నైట్‌ షూటింగే చేశాను. ఏ రోజు కూడా సార్‌..నేను రేపు ఆలస్యంగా వస్తానని ఒక్కరోజు కూడా చెప్పలేదు. అంత కమిట్‌మెంట్‌ ఉన్న హీరో మహేష్‌. మహేష్‌బాబు ...
https://www.telugupost.com/movie-news/బాలీవుడ్-బ్యూటీతో-అల్లు-25269/
తాజాగా అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథంలో నటించి విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో అటు షూటింగ్, ఇటు ప్రచార కార్యక్రమాల పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా.. దుబాయ్ లో సినిమా ప్రచారానికి శ్రీకారం చుట్టిన చిత్ర యూనిట్ ఏప్రిల్ లో డీజే విడుదల చేసేందుకు మెండుగా అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అయితే డీజే షూటింగ్ పూర్తి కావస్తుండటంతో ప్రస్తుతం బన్నీ తర్వాత చిత్రానికి సంబంధించిన వ్యవహారాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.ఏప్రియల్ 8వ తేదీ బన్నీ పుట్టిన రోజు సందర్భంగా... ఆ రోజు బన్నీ ఓ కొత్త సినిమా ప్రారంభించాలన్నఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకనే ఒక పక్క కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన హీరోయిన్ విషయంలో కూడా అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. బన్నీ కొత్త సినిమాకు సంబంధించి ఫగ్లీ, ఎంఎస్ ధోనీ చిత్రాలలో నటించిన బాలీవుడ్ భామ కైరా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా స్టార్ రైటర్ గా పేరొందిన వక్కంతం వంశీని పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 'నా పేరు సూర్య' అని వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎటువంటి సమాచారం లేకపోయినా ఇదే ఖాయం కావచ్చన్నట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కు ట్యాగ్ లైనుగా నా ఇల్లు ఇండియా పెట్టునున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. కాగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నట్లు తెలుస్తుంది.
https://www.telugupost.com/movie-news/ntr-mahanayakudu-review-110340/
మహానాయకుడు ప్రమోషన్ మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని మహానాయకుడు టీం ఇప్పుడు వేగాన్ని పెంచింది. కథానాయకుడు విడుదలకు ముందున్న క్రేజ్ మహానాయకుడు విడుదల ముందు రావడం లేదు. ప్రమోషన్స్ లో లేట్, ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో.. ఎన్టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. మహానాయకుడు ఫిబ్రవరి 22 న విడుదలవుతుందని.. ఒక రోజంతా సినిమా పోస్టర్స్ తో హంగామా చేసిన మహానాయకుడు టీం… రెండో రోజు మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ అంటూ పోస్టర్స్ తో పాటుగా సాయంత్రానికల్లా మహానాయకుడు ట్రైలర్ ని విడుదల చేసింది. కథానాయకుడు ట్రైలర్ రిలీజ్ అనగానే సోషల్ మీడియా మొత్తం ఎదురు చూడడమే కాదు.. నందమూరి ఫాన్స్ తెగ హడావిడి చేసింది. కానీ మహానాయకుడు ట్రైలర్ వస్తుంది అంటే.. సోషల్ మీడియాలో ఎటువంటి హడావిడి లేదు.. అలాగే నందమూరి ఫాన్స్ హడావిడి కనబడినా అంతగా ఎక్కడా ఫోకస్ అవ్వలేదు. ఇక కథానాయకుడు ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరు కథానాయకుడు విడుదల కోసం వైటింగ్ అన్నవారు.. మహానాయకుడు ట్రైలర్ చూసాక చాలా చప్పగా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. కథానాయకుడు లో బాలకృష్ణ, ఎన్టీఆర్ గా ఆకట్టుకుంటే.. మహానాయకుడిలో రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ లా బాలకృష్ణ అంతగా నప్పలేదంటున్నారు. ఇక మహానాయకుడు ట్రైలర్ మొత్తం రాజకీయాల చుట్టూతానే చూపించాడు. అయితే అక్కడక్కడా ఎమోషన్, బాధ లాంటివి కలిపాడు కానీ… ఎందుకో కథానాయకుడు మీద ఉన్న ఇంట్రెస్ట్ మహానాయకుడు మీద కలగడం లేదు అనేది వాస్తవం. అలాగే మహానాయకుడు విడుదలకు కేవలం ఆరు రోజులే ఉన్నప్పటికీ… ఆ సినిమా మీద ప్రేక్షకుల్లోనూ ఇసుమంత ఇంట్రెస్ట్ కలగడం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడమే మహానాయకుడుపై ఇంట్రెస్ట్ కలగక పోవడానికి మెయిన్ కారణం. అసలే మహానాయకుడు ప్రమోషన్స్ వీక్ గా ఉండి.. సినిమా మీద ఆసక్తి పెరగడం లేదు అంటే.. ఇప్పుడు మహానాయకుడు ట్రైలర్ చూసాక కాస్తో కూస్తో ఉన్న ఆసక్తి సన్నగిల్లిందని… మహానాయకుడు ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ రాజకీయాలతో ఎంతగా సతమత మయ్యాడో చూపించిన క్రిష్… చంద్రబాబు కేరెక్టర్ ని ఎలా మలిచాడో అనేది కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ని కల్గించే అంశం. అయితే చంద్రబాబు పాత్ర కన్నా ఎక్కువగా.. ఈ సినిమాలో నాదెళ్ల కేరెక్టర్ హైలెట్ అయ్యేలా కనబడుతుంది.. మహానాయకుడు ట్రైలర్ చూసాక. మరి సినిమాలో కావాల్సిన పాయింట్స్ మిస్ కాకపోతే సినిమా ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. ఇక మహాకనాయకుడు ప్రమోషన్స్ పీక్స్ లో కి వెళ్ళాలి. లేదంటే కేవలం ఐదు రోజుల్లోనే మహానాయకుడు మీద ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడం కష్టం. అలాగే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే.. మౌత్ టాక్ తో సినిమా హిట్ అవుతుంది.. లేదంటే కష్టం సుమీ…!
https://www.telugupost.com/telangana/chief-minister-revanth-reddy-realizing-that-there-is-a-risk-of-industries-moving-to-ap-took-precautions-in-advance-1546881
పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఐదు పదుల రాజకీయ అనుభవం ఆయనది. అందులోనూ లాబీయింగ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ కు తరలించుకు వెళ్లడంతో చంద్రబాబు ముందుంటారు. చంద్రబాబు ఇంకా పాలనలో కుదురుకోలేదు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని, దాని నుంచి బయట పడే మార్గాల కోసమే అన్వేషిస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణంపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడిప్పుడే ఆయన పరిశ్రమల గురించి ఆలోచించే తీరిక లేదు. అంత ఆలోచన కూడా చేయడానికి ఆయన ముందుకు రారు.ఏపీకి పరిశ్రమలు వెళ్లకుండా...అయితే ఆయన బయలుదేరితే ఏపీకి పరిశ్రమలు తరలి వెళ్లే ప్రమాదముందని గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే జాగ్రత్త పడ్డారు. తెలంగాణలోని హైదరాబాద్ కంటే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారంటే అది తన ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతుంది. విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మధ్య పోలిక పెట్టి ప్రత్యర్థులు తమను, తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశముంది. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే ముందుగానే ఆయన మేల్కొన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఆయన ఒక అడుగు ముందే ఉండాలని నిర్ణయించుకున్నారు.అవగాహన ఒప్పందాలు...ఈ నేపథ్యంలోనే ఆయన హడావిడిగా పది రోజుల పాటు అమెరికా టూర్ పెట్టుకున్నారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ప్రధానంగా కాగ్నిజెంట్ విస్తరణ ఒప్పందం కుదరడం రేవంత్ పర్యటనలో హైలెట్ గా చెప్పుకోవాలి. పదిలక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ హైదరాబాద్ లో కొత్త సెంటర్ ను నెలకొల్పేందుకు అంగీకరించింది. దీనివల్ల పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు మిగిలిన సంస్థల సీఈవోలతోనూ భేటీ అయి ఎంవోయూలను రేవంత్ కుదుర్చుకుంటున్నారు. పారిశ్రామక వేత్తలు, ఎన్ఆర్ఐలతో సమావేశమై తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంపెనీలను తెలంగాణకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.స్కిల్ డెవలెప్‌మెంట్ యూనివర్సిటీని...మరోవైపు స్కిల్ డెవలెప్‌మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి దానికి ఛైర్మన్ గా ఆనంద్ మహీంద్రను నియమించడంతో మంచి సంకేతాలు వెళ్లాయి. నిరుద్యోగుల్లోనూ, పారిశ్రామికవేత్తల్లోనూ ఇది గుడ్ సిగ్నల్స్ వెళ్లడంతో ఒకరకంగా ఏపీ కంటే తెలంగాణ పై చేయి సాధించినట్లే. స్కిల్ డెవలెప్‌మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కూడా రేవంత్ సక్సెస్ కావడానికి ఒక కారణం. నిరుద్యోగ యువతకు అథునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఉపాధి కల్పన కూడా బాగా పెరుగుతుందని ఆశిస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో చంద్రబాబు కంటే రెండడుగులు ముందు ఉన్నారని తెలంగాణవాసులకు రేవంత్ చెప్పకనే చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు ఆలోచనల కంటే ముందుగానే రేవంత్ స్పీడ్ గా వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
https://www.telugupost.com/movie-news/నిర్మాత-జంప్-34386/
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బెల్లంకొండ సురేష్ తన కొడుకు హీరోగా 'ఎక్కడికిపోతావు చిన్నావాడా' చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాసరావు నిర్మాణ సారధ్యంలో శ్రీవాస్ డైరెక్షన్ లో మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలోనూ శ్రీనివాస్ కి జోడిగా 'డీజే' భామ పూజ హెగ్డే ని కోటి రూపాయల రెమ్యునరేషన్ కి హీరోయిన్ గా బుక్ చేసేసారు.అయితే ఈ చిత్ర బడ్జెట్ దాదాపుగా 35 కోట్ల పైమాటే ఉంటుందని అంటున్నారు. మరి 35 కోట్ల పెట్టుబడి అంటే తాను పెట్టలేనని శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు శ్రీవాస్ - శ్రీనివాస్ సినిమా నిర్మాతగా చేసేందుకు అభిషేక్ పిక్చర్స్ వారు ముందుకు వచ్చారట. ఇంతకుముందే బోయపాటి చిత్రానికి వీరు నిర్మాతలుగా చెయ్యాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో కుదరకపోయేసరికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని అభిషేక్ పిక్చర్స్ వారు లైన్ లో పెట్టారని అంటున్నారు. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రానికి వేరే ఎవరు నిర్మాతలైనప్పటికీ సగం బడ్జెట్ బెల్లంకొండ సురేషే సర్ధేస్తుంటాడు. మరి అంత సదుపాయం వున్న ఆ ప్రాజెక్ట్ నుండి 'ఎక్కడికిపోతావు చిన్నావాడా' నిర్మాత శ్రీనివాసరావు ఎందుకు తప్పుకున్నాడో కదా..!
https://www.telugupost.com/movie-news/రాశి-ఆశను-వమ్ము-చేసిన-హీర-44106/
కొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లో దశాబ్దాలుగా పాతుకుపోయి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా తమ కేరెక్టర్ కి తాము డబ్బింగ్ చెప్పుకోలేరు. దర్శకుడు చెప్పినట్టు మొహంలో హావభావాలను ఎంతో చక్కగా పలికించగల ఈ తరం భామలు గొంతు విషయానికి వచ్చేసరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ల మీద ఆధారపడిపోతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం తెలుగులోకి అడుపెడుతూనే తెలుగు నేర్చేసుకుని తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పేసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అలా ఈమధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లు కనబడుతున్నారు. ఆ భామలలాగే రాశి ఖన్నా కూడా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యి తెలుగు నేర్చేసుకుంది. ఇక ఇంతకుముందే తెలుగు సినిమా 'జోరు' లో గొంతుసవరించిన రాశి ఇప్పుడు పూర్తిగా తెలుగు నేర్చుకుని తన పాత్రలకు తానె డబ్బింగ్ చెప్పుకునే లెవల్ కి ఎదిగింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే రాశి ఖన్నా తాజాగా నటించిన ‘జై లవకుశ’లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడిందట. అదే విషయాన్నీ దర్శకుడు బాబీ కి చెప్పడం..... బాబీ తో ఒకే అనిపించుకోవడం చేసిన రాశికి ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడట. రాశి ఖన్నా డబ్బింగ్ కి ఎన్టీఆర్ బ్రేక్ వేసాడంటున్నారు.ఎందుకంటే 'జై లవ కుశ' అనుకున్న టైం కల్లా పూర్తి చేసి విడుదల చెయ్యడానికి చిత్ర బృందం చాలా కష్టపడింది. మరి ఎన్ని కష్టాలు వచ్చినా టైం కి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర బృందానికి.... ఇపుడు రాశి డబ్బింగ్ వల్ల ఆలస్యమవ్వొచ్చనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్, రాశి డబ్బింగ్ తో రిస్క్ వద్దని దర్శకుడు బాబీకి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మాములుగా అయితే రాశికి తెలుగు భాష కొత్త కాబట్టి ఎమన్నా తేడా వస్తే మళ్ళీ ఆమె గొంతుకు సరిపోయే డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పట్టుకుని మళ్ళీ డబ్బింగ్ చెప్పించాలంటే ఖచ్చితంగా ఆలస్యమవుతుంది అందుకే ఎన్టీఆర్ చిత్ర బృందానికి ఈ సూచన చేసాడన్నమాట. పాపం రాశి ఆశను ఎన్టీఆర్ ఇలా వమ్ము చేసాడన్నమాట
https://www.telugupost.com/movie-news/big-boss-season-3-telugu-prize-money-139458/
బిగ్ బాస్ సీజన్ 3 ముగిసి మూడు రోజులైంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 3 పై వార్తలకు చెక్ పెట్టలేదు. సోషల్ మీడియాలోనూ, టివి ఛానల్స్ లోను బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ఇంటర్వ్యూ ల కోసం పోటీ పడుతున్నారు. మెగా స్టార్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీ, 50 లక్షల చెక్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ లో ఎంత బిజీ అవుతాడో తెలియదు కానీ…. ప్రస్తుతం టివి షోస్ తో తెగ హైలెట్ అవుతున్నాడు. మరోపక్క శ్రీముఖి ఫ్యాన్స్ ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అనుకుంటే.. షాకిస్తూ రాహుల్ విన్నర్ అయ్యేసరికి వారు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇకపోతే తనకి 50 లక్షలు వస్తే గనక ఓ సెలూన్ ఓపెన్ చేసుకుని, తన తల్లితండ్రులకు ఇల్లు కట్టించి వారి రుణం తీర్చుకుంటా అన్న రాహుల్ కి బిగ్ బాస్ యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజి మీద రాహుల్ కి 50 లక్షలు ఇచ్చేసినట్టుగా చూపించారు. అబ్బా 50 లక్షలు అందుకున్న రాహులా అంటూ అందరూ మురిసిపోయారు కూడా. అయితే రాహుల్ ఆ 50 లక్షల ప్రైజ్ మని అందుకోలేదనే న్యూస్ రాహుల్ అభిమానులని నిరాశకి గురిచేస్తుంది. ఎందుకంటే… రాహుల్ కి ఇవ్వాల్సిన 50 లక్షల ఒప్పందం ప్రకారం 50 లక్షలు ఇచ్చినప్పటికీ.. అందులో కటింగ్స్(ఇంకమ్ టాక్స్ నిబంధనల ప్రకారం) పోను కేవలం 35 లక్షలు మాత్రమే రాహుల్ చేతికి వచ్చినట్లుగా టాక్. మరి 50 లక్షలు అనుకుంటే ఇలా 35 లక్షలతో రాహుల్ సరిపెట్టుకోవాల్సి రావడం పాపం అనిపిస్తుంది కదూ
https://www.telugupost.com/crime/brawl-between-women-on-mumbai-local-woman-cop-injured-1442197
ముంబై సబర్బన్ రైలులోని మహిళా కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మహిళల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కొంతమంది మహిళలు డ్యూటీలో ఉన్న మహిళా పోలీసును కూడా గాయపరిచారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, థానే-పన్వేల్ లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు.వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) ఇన్స్పెక్టర్ శంభాజీ కటారే మాట్లాడుతూ మహిళల మధ్య ఇంత పెద్ద గొడవకు కారణం ట్రైన్ లో సీటు గురించే అని తెలిపారు. ఈ గొడవ ట్రిగ్గర్ తుర్భే స్టేషన్ సమీపంలో సీటు విషయంలో జరిగిందని.. ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు. వీడియోలో, కొంతమంది మహిళా ప్రయాణీకులు తమకెలాంటి గాయాలు అవ్వకుండా పక్కకు వెళ్లిపోవడం చూడవచ్చు. వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకున్న ఓ పోలీసు మహిళపై కొందరు మహిళా ప్రయాణికులు దాడి చేయడంతో ఆమె గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీడియోలో, ఇద్దరు మహిళా ప్రయాణీకుల తలపై తీవ్ర రక్తస్రావం చూడవచ్చు. ఈ ఘటనపై జిఆర్‌పి దర్యాప్తు జరుపుతోందని, కేసు నమోదు చేసినట్లు కటారే తెలిపారు.తుర్భే స్టేషన్‌లో ఒక సీటు ఖాళీ అయింది.. ఒక మహిళా ప్రయాణీకురాలు తనకు తెలిసిన మహిళను సీటులో కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. అదే సీటును మూడో మహిళ కూడా ఆ సీటుపై కూర్చోడానికి ప్రయత్నించింది. దీంతో ముగ్గురు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అలా ఆ గొడవలో మరికొందరు ప్రయాణీకులు కూడా భాగమయ్యారు.
https://www.telugupost.com/movie-news/kangana-krish-differences-86601/
ఈమధ్యన బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు దర్శకుడు క్రిష్ కి, హీరోయిన్ కంగనా రనౌత్ కి మధ్యన విభేదాలంటూ సోషల్ మీడియా దగ్గర నుండి... వెబ్, ప్రింట్ మీడియా వరకు బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ విభేదాల గురించి దర్శకుడు క్రిష్ కామ్ గా ఉండడం... కంగనా తమ మధ్యన ఎలాంటి విభేదాలు లేవంటూ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అయినా, మణికర్ణికా విషయంలో చాలానే సమస్యలు దర్శకుడు క్రిష్ కి, కంగనకి ఉన్నట్టుగా వార్తలు రావడం మాత్రం ఆగడం లేదు. కంగనా ఏదో మా మధ్యన మణికర్ణికా విషయంలో విభేదాలు లేవని చెప్పినా... వారి మద్యన నిజంగానే గొడవులున్నాయని కొన్ని విషయాల్లో కంగనా రివీల్ చేస్తూనే ఉంది.క్రిష్ పేరుకి బదులు కంగనా...మణికర్ణికా సినిమా విషయంలో కంగనాతో విభేదించిన క్రిష్ సైలెంట్ గా టాలీవుడ్ లో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో బిజీ అయ్యాడు. ఇక కంగనా మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఓన్ గా చూసుకుంటుందని టాక్ ఉంది. అయితే ఈ మధ్యన తాజాగా కంగనా మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో క్రిష్ ని తప్పించి తన పేరునే హైలెట్ చేసుకుంటుందంటున్నారు. అయితే ఆ విషయం నిజమనే సంకేతాలు కనబడుతున్నాయి. ఎలా అంటే కంగన డైరెక్షన్ లో అంటూ మణికర్ణిక క్లాప్ బోర్డ్పై ప్రింట్ చేసింది అంటూ ఇప్పుడొక క్లాప్ బోర్డు ఫోటో సోషియల్ మీడియాలో హంగామా చేస్తుంది.విభేదాలు లేవని చెబుతున్నా...ఇక అదేమిటి కంగనా పేరు డైరెక్షన్ లో కనబడం చూసి ఆమెని ప్రశ్నిస్తే... అదేం లేదు క్రిష్ మణికర్ణికా డైరెక్టర్ అని చెబుతూనే మా మధ్యన విభేదాలు లేవని చెబుతుంది. అలాగే ఈ విషయాలపై తనకు కాకుండా తన తన తరుపున తన పీఆర్వో రాజేష్ మాట్లాడడం చూస్తుంటే కంగనాకు, క్రిష్ కి మధ్యన చెడిందనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ విషయమై ఇప్పటివరకు దర్శకుడ క్రిష్ స్పందించక పోవడం కూడా పలు అనుమానాలు తావిస్తుంది.
https://www.telugupost.com/movie-news/mahesh-pawan-multi-starer-154616/
టాలీవుడ్ హీరోలను మల్టీస్టారర్ మూవీస్ లో చూడాలనే కోరిక చాలామంది ఫాన్స్ కి ఉంది. ఇప్పటికే మహేష్ – వెంకటేష్ లు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేస్తే.. వెంకటేష్ – పవన్ కళ్యాణ్ లు కలిసి గోపాలా గోపాలా సినిమా చేసారు. తాజాగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు బడా హీరోలు కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నారు. అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఫాన్స్ ఇద్దరు మాత్రమే కాదు….. ఇండియా వైడ్ గా అందరిలో ఆసక్తి ఉంది. ఇక ఎప్పటినుండి పవన్ కళ్యాణ్ – మహేష్ కాంబోలో బడా మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరగడమే కానీ… ఆ కాంబో ఎప్పటికి పట్టాలెక్కుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే తాజాగా ఓ కుర్ర దర్శకుడు మహేష్ – పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ తన కల అంటున్నాడు. అతనే రాహుల్ రవీంద్రన్… చి ల సౌ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ నటుడు రెండో సినిమాని కింగ్ నాగార్జున తో చేసాడు. మన్మధుడు 2 సినిమాని నాగ్ తో తెరకెక్కించి డిజాస్టర్ అందుకున్న రాహుల్ ప్రస్తుతం ఓ చిన్న సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నారు. అయితే రాహుల్ రవీంద్రన్ రెండు సినిమాలు స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకున్నాడని… అందులో ఒకటి తమిళ బిగ్ స్టార్‌తో ప్లాన్ చేస్తున్నానని.. ఇంకోటి చి ల సౌ తరహాలో చిన్న ప్రాజెక్టని చెబుతున్నాడు రాహుల్. ఇక పవన్ – మహేష్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చెయ్యాలని అది తన డ్రీం ప్రాజెక్ట్ అంటున్నాడు రాహుల్. మహేష్ – పవన్ కాంబో అంటే.. కథ పవర్ ఫుల్ గా ఉండాలని, వీళ్ళని కలిపి సినిమా చెయ్యడం అనేది సామాన్యమైన విషయం కానప్పటికీ.. వాళ్లతో సినిమా చెయ్యాలనేది తన కోరిక అంటున్నాడు.
https://www.telugupost.com/movie-news/కాస్మెటిక్-సర్జరీ-పుకార్-56827/
మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ హిందీ సినిమాలలో వరుస విజయాలతో, కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేక నిర్మాతలని వెయిటింగ్ లో పెట్టె స్థాయికి వెళ్లి అప్పటికి టాప్ పోసిషన్ రేస్ లో ఉన్న భామలందరికి గట్టి పోటీ ఇచ్చింది. అయితే కొద్ది కాలం గా అమ్మడి హవా బాలీవుడ్ లో తగ్గిపోయింది. ఇదివరకటిలా అవకాశాలంటూ నిర్మాతల ఫోన్ ల ఒత్తిడి లేదు. వచ్చే అరుదైన అవకాశాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయాయి. దానితో కొంత కాలం చాలా తీవ్ర పరిణామాలని ఎదుర్కొంది కత్రినా.గత ఏడాది జగ్గా జాసూస్ తో బౌన్స్ బ్యాక్ కావాలని ప్రయత్నించినా ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది. ఏడాది చివరిలో వచ్చిన టైగర్ జిందా హై లో తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో జతకట్టి యాక్షన్ ఎపిసోడ్స్ లో విజృంభించిన కత్రినా కి ఆ చిత్రం బౌన్స్ బ్యాక్ చిత్రం ఐయింది. అయితే అంతకు ముందు కంటే కత్రినా ముఖంలో చాలా మార్పులు వచ్చాయని గమనించిన టైగర్ జిందా హై చూసిన ప్రేక్షకులు కత్రినా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుందని అనుకోవటం, ఈ ఊహలకి బలాన్ని ఇస్తూ సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవ కథనాలు ఊపందుకోవటంతో వీటిని ఖండిస్తూ తాను ఎలాంటి కాస్మెటిక్ సర్జరీ లు చేపించుకోలేదని స్వయంగా కత్రినా కైఫ్ వివరణ ఇచ్చుకుంది. చాలా కాలం తరువాత వచ్చిన భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్న తనకి ఈ పుకార్లు తల నొప్పి గా మారటంతో తానే నోరు విప్పక తప్పలేదు కత్రినా కి.
https://www.telugupost.com/movie-news/deepika-returned-advance-back-167847/
ప్రభాస్ తో ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీ కోసం బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పదుకొనే రావడం నిజముగా నాగ్ అశ్విన్ – ప్రభాస్ లకు గ్రేటనే చెప్పాలి. ప్రభాస్ క్రేజ్ ఎంత ఉన్నా సౌత్ హీరోతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నటించడమనేది నిజంగా సంతోషించవలసిన విషయమే. అయితే దీపికా పదుకొనేని భారీ పారితోషకానికి అశ్విన్ దత్, నాగ అశ్విన్ లు ఒప్పించారని, కాదు దీపికా రోల్ సినిమాలో అతి ముఖ్యం గనుకనే దీపికా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒప్పుకుంది అని.. భారీగా అడ్వాన్స్ ఇచ్చి మరీ దీపికాని నాగ శ్విన్ బ్యాచ్ లాక్ చేసింది అని అన్నారు. మరి దీపికా పదుకొనె నాగ్ అశ్విన్ మూవీ మహానటిని చూసి మెచ్చుకోవడం కూడా దీపికా నాగ్ అశ్విన్ మీద నమ్మకంతోనే చేసింది అని చెప్పాలి. అయితే తాజాగా ప్రభాస్ 21 లో దీపికా పదుకొనె పై ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో షేకవుతుంది. అది వైజయంతి మూవీస్ ప్రభాస్ 21 మూవీ కోసం ఇచ్చిన అడ్వాన్స్ ని దీపికా పదుకొనే వెనక్కి ఇచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీపికా అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసింది అంటే.. నాగ్ అశ్విన్ – ప్రభాస్ సినిమా చెయ్యడం లేదేమో అనే భయంతో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు. కానీ దీపికా పదుకొనే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసింది.. సినిమా మొదలయ్యాకే అశ్విని దత్ దగ్గరనుండి అడ్వాన్స్ తీసుకోవాలని, ఎలాగూ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కాబట్టి సినిమా మొదలయ్యాక అడ్వాన్స్ అందుకుందామని అనుకుంటుందట. అలాగే దీపికా పదుకొనే మరో ఆలోచనలు ఏమిటంటే.. నాగ్ అశ్విన్ – ప్రభాస్ మూవీ కాస్త లెట్ అయ్యేటట్లుగా ఉందని, ప్రబస్ రాధేశ్యాం అవ్వాలి, తర్వాత అనూహ్యంగా ఆదిపురుష్ లైన్ లోకొచ్చినా.. నాగ శ్విన్ సినిమా పూర్తయ్యాకే ఆదిపురుష్ ఉంటుంది అనుకుంటే.. ఓం రనౌత్ ఆదిపురుష్ నాగ శ్విన్ కన్నా ముందే మొదలెట్టే సూచనలు ఇవ్వడంతో.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లేటవుతుంది. అందుకే అడ్వాన్స్ ఇచ్చేస్తే.. నిర్మాతలకు భారం పడకండా ఉంటుంది.. సినిమా మొదలయ్యాకే అడ్వాన్స్ పుచ్చుకోవచ్చని దీపికా ఆలోచనగా చెబుతున్నారు.
https://www.telugupost.com/movie-news/ప్రభాస్-విషయంలో-పూజ-ని-బల-145603/
ప్రభాస్ సినిమా లుక్ వదలడం, సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది అని చెప్పడం రెండో రోజే ప్రభాస్ – రాధాకృష్ణ సినిమా షూటింగ్ కి బ్రేకివ్వడం, దానితో సినిమా 2020 నుండి 2021 కి వెళ్ళిపోయినట్టుగా ప్రచారం జరిగింది. ఫస్ట్ లుక్ లో టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యకుండా దాచేసిన ప్రభాస్ టీం పూజాహెగ్డే అనారోగ్యం కారణంతో ప్రభాస్ – పూజ హెగ్డే నటించాల్సిన సెకండ్ షెడ్యూల్ కి బ్రేకిచ్చినట్లుగా చెప్పారు. అల వైకుంఠపురములో ప్రమోషన్స్, అఖిల్ సినిమా షూటింగ్ తో క్షణం తీరిక లేని పూజ సిక్ అయినందువలనే ప్రభాస్ సినిమా షూటింగ్ కి హాజరవలేదన్నారు. కానీ తాజాగా పూజ హెగ్డే అల వైకుంఠపురములో సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం వైజాగ్ లో దిగింది. దబ్బ పండులా మెరిసిపోతున్న పూజ హెగ్డే కి నీరసం ఏమిటి? పూజ వలన ప్రభాస్ సినిమా షూటింగ్ కి బ్రేక్ రావడమేమిటి? అంటూ పూజ ని ట్రోల్ చేస్తున్నారు. హిట్ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ లో యాక్టీవ్ గా ఉన్న పూజ ని చూసిన ఎవ్వరన్నా అలాగే అంటారు. అయితే ప్రభాస్ సినిమా షూటింగ్ పూజ వలన వాయిదా పడలేదనేది లేటెస్ట్ న్యూస్. ఇతర కారణాల వలన ప్రభాస్ – రాధాకృష్ణ సెకండ్ షెడ్యూల్ ఆగిందని.. ఇక కృష్ణంరాజు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో కృష్ణంరాజు తాను ప్రభాస్ సినిమాలో ఓ రోల్ చేస్తున్నట్లుగా చెప్పాడు. అలాగే ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైద్రాబాదులో మొదలయ్యిందని.. ఇక్కడే హైదరాబాద్ లోనే మూడు నెలల షూటింగ్ ఉంటుందని.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి…. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నామని స్వయానా కృష్ణంరాజే ప్రకటించడంతో ప్రభాస్ ఈ ఏడాదిలో ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చాడని క్లారిటీ వచ్చేసింది.
https://www.telugupost.com/movie-news/రాజు-గారికి-కాలం-కలిసి-రా-67241/
టాలీవుడ్ లో సూపర్ నిర్మాత ఎవరు అంటే వెంటనే దిల్ రాజు పేరే చెబుతారు. సినిమా కథలను ఎంతో కాలిక్యులేట్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. గత ఏడాది వరుస హిట్స్ తో ఉన్న దిల్ రాజు నుండి సినిమా వస్తుంది అంటే అందరిలో అమితాసక్తి ఉంటుంది. కానీ దిల్ రాజు నిర్మాతగా సక్సెస్ అయినట్లుగా డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం వరుస పరాజయాలతో కుదేలైయ్యాడు. గత ఏడాది స్పైడర్ విషయం లో బాగా దెబ్బతిన్న దిల్ రాజు.. ఈఏడాది అజ్ఞాతవాసి విషయంలోనూ గట్టిగా దెబ్బ తిన్నాడు. ఈ రెండు సినిమాల నైజాం హక్కులను భారీగా కొనుగోలు చేసిన దిల్ రాజు కి ఆ సినిమాల ప్లాప్స్ తో భారీ నష్టాలొచ్చాయి.నైజాం లో స్పైడర్ తో పాటు విడుదలైన మరో భారీ చిత్రం జై లవ కుశ కూడా దిల్ రాజుని బయట పడెయ్యలేకపోయింది. భారీ సినిమాల మీద భారీ నమ్మకంతో దిల్ రాజు భారీగా నష్టపోతున్నాడు. అందుకే పెద్ద సినిమాల పంపిణీ జోలికి ఇకనుండి వెళ్లకూడదని దిల్ రాజు డిసైడ్‌ అయ్యాడు. అలాగే పెద్ద సినిమాలని ఒక ఏరియాకి కొని నష్టపోయేకంటే.... పెద్ద సినిమా లు ఒక ఏరియా కొనే మొత్తంతో ఒక మీడియం బడ్జెట్‌ సినిమా పంపిణీ హక్కుల్ని హోల్‌సేల్‌గా తీసేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగానే వరుణ్ తేజ్ - రాశి ఖన్నాలు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమను హోల్సేల్ గా కొని పంపిణి చేసిన దిల్ రాజుకి పెద్దగా లాభాలు రాకపోయినా.. ఒక హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.అలాగే నాని సినిమాల మీది ఉన్న నమ్మకంతో దిల్ రాజు కృష్ణార్జున యుద్ధం తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు హోల్సేల్ గా తీసేసుకున్నాడు. కానీ ఈ కృష్ణార్జున తో దిల్‌ రాజుకి నష్టాలు తప్పేట్టు లేవు. ఎందుకంటే ఈ సినిమా మొదటి షోకే మిక్స్డ్ టాక్... రెండు రోజులకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమాల మీదున్న నమ్మకం దిల్ రాజుని ఏ దారికి చేరుస్తుందో తెలియదు గాని.. పెద్ద సినిమాల నైజాం లో కొని నష్టపోవడం కరెక్ట్ కాదనుకుని ప్రస్తుతం సూపర్ హిట్ అయినా రంగస్థలం నైజాం హక్కులను దిల్ రాజు చేజేతులా వదులుకున్నాడు. నైజాంలో రంగస్థలం చిత్రాన్ని 18 కోట్లకి కొనేందుకు దిల్‌ రాజు నిరాకరించాడు. దాంతో మైత్రి నిర్మాతలు యువి ద్వారా నైజాంలో స్వయంగా విడుదల చేసుకున్నారు. ఇప్పుడు నైజాంలోనే రంగస్థలానికి ఇరవై అయిదు కోట్లకి పైగా షేర్‌ వస్తోంది. అలా దిల్ రాజు ఒక మంచి లాభాన్ని వదిలేసుకున్నాడు
https://www.telugupost.com/movie-news/nagababu-comedy-plans-163031/
నాగబాబు జబర్దస్త్ లో ఏడేళ్లు జేడ్జ్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించాడు. కానీ నాగబాబు జబర్దస్త్ మీద కోపం తనకి బాగా కావాల్సిన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక జీ ఛానల్ తో మాట్లాడి.. జబర్దస్త్ మాజీ డైరెక్టర్స్ తో అదిరింది షో ప్లాన్ చేయించాడు. తనతో పాటు జబర్దస్త్ టీం లను అదిరింది షో కి లాగేసి జబర్దస్త్ షో ని పడేసి అదిరింది షోని సక్సెస్ చెయ్యాలని చూసి ఘోరంగా దెబ్బతిన్నాడు. రోజా జేడ్జ్ గా జబర్దస్త్ షో ఎప్పటిలాగే జబర్దస్త్ గా నడవడం అదిరింది షో అడుగడుగా విఫలమవడంతో ఇప్పుడు నాగబాబు ఓ ప్లాన్ చేసాడట. అది కూడా తన సొంతగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కామెడి షోని ప్లాన్ చేస్తున్నాడట. తన యూట్యూబ్ ఛానల్ లో ఓ కామెడీ షో చెయ్యాలని, మన ఛాన‌ల్ మ‌న ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కమెడియన్స్ ని తీసుకోవాలని, అలాగే జబర్దస్త్, అదిరింది షోలో చేసే టాప్ కమెడియన్స్ ని, టీం లీడర్స్ ని లాగేసి.. జబర్దస్త్, అదిరింది షోలకి ధీటుగా తన మన ఛాన‌ల్ మ‌న ఇష్టం అనే ఛానల్ ద్వారా కామెడీ షోని ప్లాన్ చేస్తున్నాడట. చెయ్యడమే కాదు.. ఇప్పటికే ఎంట్రీల‌ను కూడా ఆహ్వానిస్తున్నాడట నాగబాబు. ఇక నాగబాబు ఒక్కటి కాదు రెండు కామెడీ షోస్ ని ప్లాన్ చేసుకుంటున్నాడట. రెండు షోస్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు తెస్తాడట. మరి నాగబాబు అదిరింది, జబర్దస్త్ లను కొట్టేసి కామెడీ పరంగా సక్సెస్ అయ్యే ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
https://www.telugupost.com/movie-news/ariana-mehboob-173672/
బిగ్ బాస్ చివరి ఐదు వారాలలో ఏం జరగబోతుందో.. ఎలాంటి టాస్క్ లు బిగ్ బాస్ లో ఉంటాయో.. ఎవరు టాప్ 5 కి వెళతారో అనేది బుల్లితెర ప్రేక్షకుడు ఓ అంచనాకి వచ్చేసాడు. బిగ్ బాస్ ఫైనల్ కి వెళ్ళేది వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో నలుగురు పేర్లు హల్చల్ చేస్తున్నాయి. అందులో అభిజిత్, లాస్య, సోహైల్, అఖిల్ పేర్లు టాప్ 5 లో ఉండగా.. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన మెహబూబ్, అరియనాలు బ్యాగ్స్ సర్దుకోవాలంటున్నారు. మెహబూబ్ ని గత ఐదు వారాలుగా కాపాడుతున్న బిగ్ బాస్ ఈ వారం బయటికి పంపడం ఖాయంగానే కనబడుతుంది. అందుకే రెండు వారాలుగా మెహబూబ్ స్క్రీన్ స్పేస్ తగ్గించింది. ఇక అరియానని ఓ రేంజ్ లో వెనకేసుకొచ్చిన బిగ్ బాస్, నాగార్జునలు కూడా ఇప్పుడు అరియనా ని బ్యాడ్ చెయ్యడం మొదలు పెట్టాడు. అంటే మెహబూబ్, అరియనాలకు టాస్క్ ల పరంగా, బిగ్ బాస్ గేమ్ పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ.. వాళ్ళ క్రేజ్ పరంగా కాస్త వీక్ గా ఉండడం వాళ్ళిద్దరికీ శాపంగా మారింది. అందుకే ఈ వారంలో అరియానని.. అవినాష్ తప్ప మిగతా అందరూ నామినేట్ చేసారు. ఇక మెహబూబ్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. దీన్నిబట్టి ఈసారి మెహబూబ్ అయినా, లేదంటే అరియనా అయినా ఎలిమినేషన్ అయ్యేలా కనబడుతుంది. అయితే నామినేషన్స్ ప్రక్రియలో అందరిలో అరియనకి ఓట్స్ ఎక్కువ పడి ఆమె ని బ్యాడ్ చేసినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకి సింపతీ వర్కౌట్ అవుతుంది. మరి అరియనాకి అతి ట్యాగ్ తగిలించినప్పటికీ.. ఇప్పుడు అరియనా ట్రెండ్స్ లోకి రావడం అందరిని షాక్ కి గురు చేస్తుంది. అరియనా కి సింపతీ వర్కౌట్ అయ్యి ఆమెని సపోర్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దేన్నీ బట్టి ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది కేవలం మెహబూబ్ మాత్రమే.
https://www.telugupost.com/crime/nagpur-teen-gives-birth-to-baby-after-watching-delivery-videos-in-youtube-1465631
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దాని వల్ల కలిగే ఉపయోగాలకంటే అనర్థాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసాలు, హనీ ట్రాప్ లు ఇలా చాలానే జరుగుతున్నాయి. తాజాగా ఓ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానుగా కాన్పు చేసుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం హద్దులు మీరింది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.బాలిక పొట్ట పెరుగుతుండటాన్ని గమనించిన తల్లి ఏంటని ప్రశ్నించగా.. అది అనారోగ్యం వల్ల పెరుగుతోందని తల్లిని బురిడీ కొట్టించింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు బాలిక జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ శిశువును గొంతు నులిమి చంపేసింది. ఇంట్లోనే ఉన్న ఓ పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. తిరిగి ఇంటికెళ్లిన తల్లికి కుమార్తె నీరసంగా కనిపించడంతో.. కాస్త గట్టిగా అడగ్గా అసలు విషయం చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/geetha-govindam-troubles-84607/
విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అసలు ఈ మూవీ సెట్స్ మీదకు రావడానికి డైరెక్టర్ పరుశురామ్ ఎంత కష్టపడో చూద్దాం. ఈ కథను పరుశురామ్ చాలా మంది హీరోలకి చెప్పారంట. కానీ ఎవరూ ఓకే చెప్పకపోవడంతో ఈ కథను పక్కన పెట్టేసి 'శ్రీరస్తు శుభమస్తు' ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కు 'గీత గోవిందం' చేబితే ఆయన కూడా వెతికి వెతికి ఎవ్వరూ ఓకె అనక.. 'శ్రీరస్తు శుభమస్తు' సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.విజయ్ ఇమేజ్ కి తగ్గట్లుగా...'శ్రీరస్తు శుభమస్తు' జరుగుతున్న టైంలో బన్నీ ఓ మాట సాయం చేయడంతో విజయ్ కాస్త అయిష్టంగానే 'గీత గోవిందం' కథను ఓకె చేసాడట. 'అర్జున్ రెడ్డి' కన్నా ముందు కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కొన్ని మార్పులు చేశారట. ఆ టైంలో విజయ్ పక్కన చేయడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోలేదట. దాంతో చాలా నెలలు ఈ సినిమాను స్టార్ట్ చేయలేకపోయారు. ఈలోపు 'అర్జున్ రెడ్డి' రిలీజ్ అవ్వడం, విజయ్ ఇమేజ్ మారడం, పెరగడంతో మరి కొన్ని సీన్లు మార్చారు. ఇక లాస్ట్ కి ఫైనల్ ప్రొడెక్ట్ వచ్చింది.విజయ్ తండ్రి ఓకే చేశాక...అప్పుడు విజయ్ ముందు ఈ సినిమా వద్దు 'టాక్సీవాలా'ను వదులుదాం అని అన్నాడు. నిర్మాతలు అందుకు ఒప్పుకోకపోవటంతో విజయ్ తండ్రి 'గీత గోవిందం' సినిమాను చూసి ఇది రిలీజ్ చెయ్యొచ్చు అన్నాక.. 'గీత గోవిందం' విడుదలకు మార్గం సుగమం అయింది. అంతా అయ్యిపోయింది ఇక సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో.. ఈ కథ నాదే అని ఓ అసిస్టెంట్ డైరక్టర్ ఫిర్యాదు చేశాడు. అతనితో రాజీ పడి.. కొంత డబ్బు ఇచ్చి ఆ సమస్యకు ఎండ్ కార్డు వేశారు. మళ్లీ ఈ లోపు సినిమా నుండి సీన్స్ బయటికి రావడంతో టీం మొత్తం ఒక్కసారిగా ఖంగుతింది. సరే, ఆ అడ్డంకులు దాటి సినిమాను రిలీజ్ చేశారు. 14 కోట్ల సినిమాకు అయిదు కోట్లే రికవరీ. మిగిలినదంతా ఓన్ రిలీజ్ అనుకుని రిలీజ్ చేశారు. ఇప్పుడు 'గీత గోవిందం' సూపర్ హిట్ అయింది. దాంతో డైరెక్టర్ పరుశురామ్ ఊపిరి పీల్చుకున్నాడు. అది మ్యాటర్. ఒక్క సినిమాను రిలీజ్ చేయాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడాలలో.. ఎన్ని సమస్యలు ఎదురుకోవాలో.. ఈ సినిమా విషయంలో అర్థం అవుతుంది.
https://www.telugupost.com/movie-news/మళ్ళీ-హిట్-కాంబినేషన్-రి-31788/
ఎన్టీఆర్ ముందునుండి హిట్ దర్శకుల వెంటపడి వారితో సినిమాలు చేసేస్తుంటాడు. అయితే అలా ఎన్టీఆర్ వెంటపడిన ప్రతిసారి ఆ సినిమాలు మంచి ఫలితాన్నివ్వలేదు. అయినా ఎన్టీఆర్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ మైండ్ సెట్ లో కొంచెం మార్పొచ్చినట్లు కనబడుతుంది. అందుకే 'టెంపర్' చిత్రం నుండి హిట్ ట్రాక్ పట్టాడు. అయితే ఎన్టీఆర్ కి ఎప్పటినుండో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చెయ్యాలనే కోరిక బలంగా ఉండేది. అది ఎట్టకేలకు ఇప్పుడు తీరబోతుంది. ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ తో సినిమాని సెట్ చేసాడు ఎన్టీఆర్. ఇక త్రివిక్రమ్ కూడా పవన్ హీరోగా చేస్తున్న చిత్రం కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టేస్తాడని అంటున్నారు. ఇక ఈ చిత్రం నవంబర్ నుండి సెట్స్ మీదకెళ్లనున్నట్లు వార్తలొస్తున్నాయి.అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మూవీ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టాశాడని అంటున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కొరటాల ప్రస్తుతం మహేష్ బాబుతో చెయ్యబోయే చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. ఇక మహేష్ తో సినిమా కంప్లీట్ కాగానే కొరటాల మరలా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట. ఇక కొరటాల అలా అనుకున్నాడో లేదో ఇలా ఎన్టీఆర్ ని కలవడమూ... ఎన్టీఆర్ తో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడడమూ... ఎన్టీఆర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమూ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. చూద్దాం అధికారిక ప్రకటన వచ్చేవరకు కాస్త అనుమానమే మరి ఈ కాంబినేషన్ లో సినిమా రావడం అనేది.ఒకవేళ ఈ కాంబినేషన్ లో మూవీ సెట్ అయితే గనక అంచనాలు మాత్రం తారా స్థాయిలో ఉండడం మాత్రం నిజం. ఇప్పటికే కొరటాల తీసిన మూడు చిత్రాలు హిట్ అవడం... ఇక మహేష్ తో తీసే 'భరత్ అను నేను' కూడా హిట్ అయితే కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే చిత్రం మీద అంచనాలు మాములుగా వుండవు.
https://www.telugupost.com/movie-news/bigg-boss-contestant-tamannah-simhadri-sensational-comments-on-cpi-narayana-1356799
హైదరాబాద్ : బిగ్ బాస్.. ఈ షో కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకూ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. నిన్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ సీజన్ ప్రారంభమవ్వగా.. 17 మంది కంటెస్టంట్లు హౌస్ లోకి వెళ్లారు. వారిలో 8 మంది పాత కంటెస్టెంట్లు ఉన్నారు. కాగా.. ఇప్పుడీ షో పై సీపీఐ నారాయణ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్ అని పిలిచే వ్యభిచార గృహమని, అసభ్యకరమైన విషయాలను ప్రోత్సహిస్తూ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని, షో అనుమతిని రద్దు చేయాలని సంచలన కామెంట్స్ చేశారు.Also Read : ఓటీటీలో డీజే టిల్లు.. ఎప్పట్నుంచో మీరే చూడండి !రోజుకి ఒక గంట ప్రసారం చేస్తేనే.. అందులో ఉండే బూతు పురాణం చూడలేకపోతున్నామన్న ఆయన.. ఇక 24 గంటలు ప్రసారం చేస్తే.. అందులో ఉండే కంటెంట్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై బిగ్ బాస్ మాజీ కంటస్టెంట్ తమన్నా సింహాద్రి ఘాటుగా స్పందించింది. తాజాగా జరిగిన ఓ టీవీ డిబేట్ లో తమన్నా మాట్లాడుతూ.. బిగ్ బాస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలన్నారు. ఈ వ్యాఖ్యలపై డిబేట్ లో పాల్గొన్న ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నారాయణపై తమన్నా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ.. తమన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిగ్ బాస్ షోను సమర్థిస్తూ అదే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందని, బయట ఊహిస్తున్నది నిజం కాదని అన్నారు. పైగా షో నచ్చనివాళ్లు బలవంతంగా చూడాల్సిన పనిలేదని బదులిచ్చింది.
https://www.telugupost.com/movie-news/అప్పుడే-మొదలెట్టేసింది-40180/
సమంత మరి కొద్దీ రోజులో తన ఇంటిపేరును మార్చుకోబోతుంది. నాగ చైతన్య ని పెళ్ళాడి అక్కినేని ఇంట కాలు పెట్టబోతోంది. ఈ ఏడాది మొదట్లోనే సమంత - నాగ్ చైతన్య ల ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే అక్టోబర్ 6 న గోవాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగబోతుంది. మరి తన ఇంటిపేరును అక్కినేని గా మార్చుకోబోతున్న సమంత అప్పుడే ఆ ఫామిలీ లో ఒక మెంబర్ గా కలిసిపోయింది. ఇప్పటికే నాగ్ సర్ అంటూ పిలిచే సామ్ ఇపుడు నాగ్ మామ అంటూ వరుసలు పెడుతూ పిలవడం, అఖిల్ ని మరిదిగా చెప్పడం, అత్తగారు అమలతో ఎంతో క్లోజ్ గా మూవ్ అవడం చూస్తుంటే సమంత తన అత్తింటిలో త్వరగానే కలిసిపోయేలా వుంది.కేవలం అలా అక్కినేని ఇంటితోనే సంబంధాలు మైంటైన్ చేయడంలేదు సమంత, అటు దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఆ ఫ్యామిలిలో కూడా త్వరగానే కలిసిపోయింది. నాగ చైతన్య అమ్మమ్మ చీరని తన పెళ్ళికి కట్టుకోవడం దగ్గరనుండి అన్ని విషయాల్లో బాగా కలిసిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా వరుసకు అన్న అవుతున్న రానా సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడింది. దగ్గుబాటి రానా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలోని రానా కటౌట్‌ను ట్వీట్ చేసింది. ‘అదిగో నా సూపర్‌స్టార్ అన్నయ్య’ అంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన రానా భారీ కటౌట్‌ ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. 'నేనే రాజు నేనే మంత్రి' ఫస్ట్‌డే ఫస్ట్ షో ఆగస్టు 11 అని ఆ పోస్ట్‌కు హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా జతచేసింది సమంత.మొత్తానికి ఇలా రాణా కటౌట్ ని పోస్ట్ చేస్తూ 'నేనే రాజు - నేనే మంత్రి' ని భలేగా ప్రమోట్ చేసింది కదా సమంత. ఇక రానా - కాజల్ - కేథరిన్ లు నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం రేపు శుక్రవారమే విడుదల కానుంది
https://www.telugupost.com/movie-news/mahesh-babu-maharshi-cinema-updates-113228/
మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మహర్షి’ సినిమా మీద ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ ఆలస్యమవడంతో.. ఏప్రిల్ 25 న విడుదలవ్వాల్సిన సినిమా మే తొమ్మిదికి మర్చారు. ఇక దిల్ రాజు – పివిపి – అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో… మండుటెండలో కూడా మహర్షి షూటింగ్ లో మహేష్ అండ్ మహర్షి టీం కష్టపడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ప్రమోషన్‌లో నిమగ్నమైంది మహర్షి టీం. అయితే తాజాగా వదిలిన ‘మహర్షి’ వర్కింగ్ స్టిల్స్ లో మహేష్ ఎంతో అందంగా కనబడుతున్నాడు. మహేష్ కి అంత ఏజ్ ఉంటుందా.. ఇంకా 30 ఏళ్ళ కుర్రాడిలా మెరిసిపోతున్నాడు. ‘మహర్షి’ వర్కింగ్ ఫొటోస్ లో మహేష్ యంగ్ అండ్ హ్యాండాసోమ్ లుక్ లో ఇరగదీస్తున్నాడు. వంశి పైడిపల్లి మహేష్ ని చాలా స్టైలిష్ గా ఈ సినిమా లో చూపించబోతున్నాడు. ఇక అల్ల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ సినిమా రైతుల సమస్యల చుట్టూనే తిరుగుతుందని టాక్ ఉంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహేష్ ‘మహర్షి’ సినిమా టీజర్ ఈ నెలాఖరున విడులవుతుంది అంటున్నారు. మరి మే తొమ్మిదిన విడుదలకాబోతున్న ‘మహర్షి’ సినిమా ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది.. ఇప్పుడు వదిలిన ‘మహర్షి’ వర్కింగ్ ఫొటోస్ చూస్తుంటే.
https://www.telugupost.com/movie-news/pooja-hegde-comments-on-her-remuneration-146367/
ఈమధ్యన పూజ హెగ్డే హిట్స్ చూసికుని రెచ్చిపోయి.. నిర్మాతలను అధిక పారితోషకం డిమాండ్ చేస్తుంది అనే న్యూస్ సోషల్ అండ్ వెబ్ మీడియాలో విపరీతముగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఆ వార్తలేమి గాసిప్ కాదండోయ్ నిజమే. నిర్మాతలు తనకి అడిగింది ఇస్తున్నారు అంటుంది. ఎందుకంటే వరసగా పూజ హెగ్డే నటిస్తున్న సినిమాలు హిట్ కావడటంతో ఇప్పుడు పూజ ఏం మాట్లాడిన కరెక్ట్ గానే కనబడుతుంది. వాల్మీకి, అల వైకుంఠపురములో హిట్ అవడంతో పూజ కూడా నిర్మాతలను భారీగానే డిమాండ్ చేస్తుంది అనే టాక్ వినబడుతుంది. అది నిజమే అంటూ పూజ హెగ్డే తాజాగా క్లారిటీ ఇచ్చింది. కథలతో పాటు…. ఆ సినిమా హిట్ గురించి, కలెక్షన్స్ గురించి కూడా పట్టించుకుంటాను అలాగే… సినిమా ప్రమోషన్స్ కి కూడా నాకు చేతనైనంతగా కష్టపడతాను కాబట్టే నా పై నమ్మకంతో నా నిర్మాతలు కూడా నేను అడిగినంత పారితోషికం ఇస్తున్నారు అంటుంది. అలాగే పెద్ద హీరోల సినిమాల్లో తాను ఉండాలని వారు కోరుకుంటున్నారని.. అలాగే నాకిచ్చిన పాత్రకి నేను తగిన న్యాయం చేస్తున్నా అని, నా నిర్మాతలకు లాభం రావడం కూడా ముఖ్యమే కదా అంటూ చిలకపలుకులు పలుకుతుంది ఈ చిన్నది
https://www.telugupost.com/movie-news/hero-vijay-sarkar-94145/
అతనొక కార్పొరేట్‌ మోన్స్టర్. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్లను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పని గట్టుకుని ఎలక్షన్ల కోసం ఇండియాకు రావడానికి కారణమేంటి..? భారత్‌లో ఏం చేశాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్‌ వల్లభనేని. విజయ్‌ హీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన 'సర్కార్‌' చిత్రాన్ని ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళంలో సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిథి మారన్‌ నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కథానాయికలు. దీపావళి సందర్భంగా వచ్చేనెల 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.
https://www.telugupost.com/movie-news/sai-dharam-tej-rashi-khanna-prati-roju-panduge-world-wide-business-142689/
సాయి తేజ్ – రాశి ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందు కు రాబోతున్న ఈ సినిమాపై సాయి తేజ్- రాశి ఖన్నా ఇద్దరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. సాయి తేజ్ మార్కెట్ కాస్త అటు ఇటు గా మార్పులు జరగడం, మారుతీ కూడా యావరేజ్ సినిమాల్తో ఉండడంతో.. ప్రతి రోజు పండగే సినిమాకి ఓ అనుకున్నంత బిజినెస్ జరగదనే అనుకున్నారు. కానీ ప్రతి రోజు పండగే పాటలు, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రావడం.. పండగ బిజినెస్ జరగడం పూర్తయ్యింది. ప్రతి రోజు పండగే రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల బిజినెస్ జరగ్గా… వరల్డ్ వైడ్ గా 18.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఏరియా: బిసినెస్ (కోట్లలో) నైజాం 5.50 సీడెడ్ 2.80 నెల్లూరు 0.65 కృష్ణ 1.20 గుంటూరు 1.45 వైజాగ్ 2.00 ఈస్ట్ గోదావరి 1.30 వెస్ట్ గోదావరి 1.10 టోటల్ ఏపీ & టీస్ 16.00 కర్ణాటక 0.80 ఇతర ప్రాంతాలు 0.20 ఓవర్సీస్ 1.00 టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 18.00
https://www.telugupost.com/movie-news/what-about-krack-177690/
ప్రస్తుతం థియేటర్స్ లో కొత్త సినిమాల హడావిడి కనబడుతుంది. సాయి ధరమ్ తేజ్ ధైర్యం చేసాడు సక్సెస్ అయ్యాడు. సోలో బ్రతుకే సో బెటరుతో సోలోగా థియేటర్స్ లో దున్నేస్తున్నాడు. ఇక సాయి తేజ్ ని చూసిన హీరోలందరూ సంక్రాంతికి తమ సినిమాల డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. రామ్ రెడ్ సినిమాని జనవరి 14 అంటూ అనౌన్స్ చేసాడు. ఇక తాజాగా ఎటువంటి హడావిడి లేకుండా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా జనవరి 15 న అల్లుడు అదుర్స్ ని లైన్ లోకి తీసుకొచ్చాడు. ఇక తమిళనాట భారీగా తెరకెక్కిన మాస్టర్ సినిమా కూడా పొంగల్ రేస్ లోనే ఉంది. మరి వీటితో పాటుగా రవితేజ క్రాక్ సినిమా కూడా సంక్రాతి రేస్ లోనే ఉండబోతుంది అని.. ఎప్పటినుండో హడావిడి చేసున్నారు.సోషల్ మీడియాలో క్రాక్ సాంగ్స్ వదులుతూ మాస్ సినిమాగా క్రాక్ ని ప్రమోట్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని – రవితేజ కాంబోలో రాబోతున్న క్రాక్ సినిమా సంక్రాంతికే అని ఫిక్స్ అయ్యారు కానీ.. డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే శృతి హాసన్ తో రవితేజ రొమాంటిక్ సన్నివేశాల ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే క్రాక్ సినిమాని సంక్రాంతికే విడుదల అంటూ అనౌన్స్ చేసినా డేట్ విషయంలో క్లారిటీ లేకపోయేసరికి రామ్ రెడ్, అల్లుడు అదుర్స్, విజయ్ మాస్టర్ తో పోటీ పడి కలెక్షన్స్ షేర్ చేసుకునే కన్నా జనవరి 12 న కానీ, లేదంటే జనవరి చివరి వారంలో కానీ దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో రవితేజ బ్యాచ్ ఉన్నారట. మరోపక్క జనవరి 15 డేట్ పరిశీలనలో కూడా ఉన్నారనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతం ఉన్నపసరిస్థితుల్లో హీరోలెవరూ కలెక్షన్స్ షేర్ చేసుకోవడానికి రెడీ అవ్వడం లేదు. సో రవితేజ వెనక్కి తగ్గినా తగ్గొచ్చనే టాక్ నడుస్తుంది.
https://www.telugupost.com/movie-news/saira-releases-fifteen-hundred-screens-in-bollywood-134877/
మెగాస్టార్ చిరంజీవి అంటే మనకి క్రేజ్ కానీ ఇతర భాషల్లో కాదు. అందుకే సైరా సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో తారాస్థాయికి చేరినా మిగిలిన భాషల్లో చాలా తక్కువ మొత్తానికి తీసుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను చాలా తక్కువ రేట్ కి కొన్నారు ఎక్సెల్‌ సంస్థ వారు. మినిమం గ్యారెంటీ పద్ధతిలోనే హిందీ రైట్స్‌ రామ్ చరణ్ ఇచ్చారట. పదిహేను వందల స్క్రీన్లలో… హిందీ లో ఎంత వస్తుందో చెప్పలేం కాబట్టి అందుకే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల సినిమా కి వచ్చిన లాభాలు మొత్తం డిస్ట్రిబ్యూటర్ కి వెళ్లిపోకుండా తనకి యాభై శాతం వాటా వచ్చేలా చూసుకున్నాడు. నిజానికి రామ్ చరణ్ సైరా ను హిందీ లో సోలో గా రిలీజ్ చేద్దాం అనుకున్నాడు కానీ అతనికి హిందీ మార్కెట్ మీద పట్టు లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక హిందీ లో రిలీజ్ చేస్తున్న ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాను లైట్ గా తీసుకోవడం లేదు. అక్కడ ఈ మూవీని ఏకంగా పదిహేను వందల స్క్రీన్లలో విడుదల చేస్తూ తమ క్రెడిబులిటీ చాటుకుంటున్నారు. మరి సైరా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చూడాలి.
https://www.telugupost.com/movie-news/kalyani-priya-darshan-75696/
అఖిల్ 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన కల్యాణి ప్రియదర్శన్... సినిమా ప్లాప్ అయిన ఆమె నటన పరంగా.. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఆమెకు తెలుగులోనే అవకాశాలు వస్తున్నాయి. సుధీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె మెగా హీరోతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని తాజా సమాచారం.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంట. కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు హిట్ అయితే, మరిన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఆమె తమిళంలో కూడా చేస్తునట్టు టాక్.
https://www.telugupost.com/movie-news/చిరకాల-మిత్రుల-రహస్య-భేట-13429/
రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ చిరకాల మిత్రులు. వీరిద్దరి స్నేహ బంధం ఎప్పుడో మొదలైంది.వీరు తరుచూ ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో కలుస్తూ ఒకరికొకరు పలకరించుకుని ముచ్చట్లు చెప్పుకునేవారు. కానీ ఈ మధ్య ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం తో వీరు కలవకుండా చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకరినొకరు పరామర్శించుకున్నారు. ఇద్దరికీ ఈ మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎవరి ట్రీట్మెంట్స్ లో వారు బిజీ అయ్యారు. రజిని చికిత్స రీత్యా అమెరికాలో వైద్యం చేయించుకుని ఇటీవలే చెన్నై కి తిరిగొచ్చాడు. అయితే రజినీని పరామర్శించడానికి కమల్ వెల్దామనుకునేలోపు రజిని మళ్ళీ అమెరికా వెళ్లడం తో కలవడం కుదరలేదు.ఇక తర్వాత రజినీని పలకరిద్దామనుకుంటే కమల్ కూడా గాయాల పాలై ఆసుపత్రిలో చేరాడు. కమల్ హాసన్ తన శభాష్ నాయుడు షూటింగ్ లో మెట్లపై నుండి జారిపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కలయికకు అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదు. అయితే తాజాగా వీరిద్దరూ సోమవారం రాత్రి కలిసారని కోలీవుడ్ మీడియాలో ఒకటే న్యూస్. రజినీకాంత్ స్వయంగా కమల్ హాసన్ ఇంటికి వచ్చారని.... కమల్ కూడా గుమ్మనుండే రజినీని సాదరంగా లోపలి ఆహ్వానించాడని సమాచారం. కమల్ ఆరోగ్యం గురించి తెలుసుకుని కమల్ ని పరామర్శించడానికి రజినీ కమల్ ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ భేటీ మాత్రం రహస్యంగానే జరిగింది. ఇక ఒకరి ఆరోగ్య సమస్యలు మరొకరు కనుక్కున్నట్లు సమాచారం. చాలా గ్యాప్ తర్వాత కలవడం తో ఇద్దరూ ఎంతో ఆత్మీయం గా మాట్లాడుకుని భావోద్వేగానికి లోనైనట్లు చెబుతున్నారు.ఇక ఈ భేటీ గురించి కమల్ హాసన్ కి సహాయకుడిగా ఉంటున్న రాజేష్‌ ఎం.సెల్వా బయటపెట్టాడు. కమల్, రజినీ కలుసుకున్నప్పుడు రాజేష్‌ ఎం.సెల్వా వారిద్దరితో ఒక ఫోటో తీయించుకున్నాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తో ఈ భేటీ విషయం బయటికి వచ్చింది. ఎంతైనా ఇద్దరు బడా స్టార్స్ కలిస్తే అది సంచలన విషయమే అవుతుంది కదా. ఇక రజినీ రోబో 2 .0 తో బిజీగా ఉండగా... కమల్ కూడా తన శభాష్ నాయుడు సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.
https://www.telugupost.com/movie-news/500-కోట్లతో-మరో-భారీ-ప్రాజెక-31840/
ఇప్పడు నిర్మాతలంతా బాహుబలి సీరీస్ ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అతి పెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కిన బాహుబలి పెట్టుబడిపెట్టిన మొత్తానికి నాలుగింతలు సంపాదించే దిశగా పరుగులు పెడుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో 'మగధీర, బాహుబలి' వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు చాలా ప్రాఫిట్ వెనకేసుకున్నారు. అందుకే ఇప్పుడు నిర్మాతలంతా భారీ ప్రాజెక్టుల వెంట పడుతున్నారు. ఇప్పటికే ఒక ఎన్నారై సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూ. 1000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ‘మహాభారత' ని అనౌన్స్ చేశారో లేదో ఇప్పుడు టాలీవుడ్ లో అపార చాణిక్యునిగా పేరు మోసిన అల్లు అరవింద్ మరో ఇద్దరితో కలిసి 500 కోట్ల భారీ వ్యయంతో సంపూర్ణ రామాయణాన్ని తీస్తానని చెబుతున్నాడు.పురాణ గాధ రామాయణాన్ని ఆలు అరవింద్,నమిత్ మల్హోత్ర, మధు మాతేన తో కలిసి మూడు పార్టులుగా నిర్మించనున్నట్టు సమాచారమందుతుంది. అయితే ఈ రామాయణాన్ని త్రీడి వెర్షన్ లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇక ఈ మూడు పార్టులను 500 కోట్ల భారీ వ్యయంతో తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ లో తెరేక్కించి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే ఈ అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే నవంబర్ లో గ్రాండ్ గా లాంచ్ చేసి పట్టాలెక్కించేందుకు సిద్ధం చేస్తున్నారని వినికిడి. అప్పటిలోగా రామాయణం మూడు పార్టులలో నటించే నటీనటుల ఎంపిక పూర్తి చేస్తామని కూడా చెబుతున్నారు.
https://www.telugupost.com/crime/hyderabad-software-engineer-suspicious-death-at-vellulla-1359639
జగిత్యాల : హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న బర్ల హరీశ్ (31) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన బర్ల హరీశ్ ది జగిత్యాల జిల్లా మెట్ పల్లి. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న హరీశ్.. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారం క్రితమే స్వగ్రామమైన మెట్ పల్లికి వచ్చిన హరీశ్.. ఆదివారం సాయంత్రం స్నేహితులు ఫోన్ చేయడంతో బయటికి వెళ్లాడు.ఆ తర్వాత వెల్లుల్ల గ్రామ శివారులో హరీశ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిపోయిందని అతని బాబాయ్ కొడుకుకి హరీశ్ స్నేహితులు సమాచారమిచ్చారు. దగ్గర్లో ఉన్న తోటల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం బావిలో పడిపోయిందని వారు తెలిపారు. హరీశ్ బావిలో పడిపోయాడని, వెనుక కూర్చున్న మరో యువకుడు గట్టుపై పడిపోయాడని చెప్పారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. ఈతగాళ్లతో బావిలో గాలించారు. సోమవారం తెల్లవారుజామున హరీశ్ మృతదేహం లభ్యమైంది.హరీశ్ మృతదేహాన్ని పరీక్షగా చూసిన కుటుంబ సభ్యులు.. తల వెనుకభాగం, ముక్కు, చెవుల వద్ద రక్తం కారడం గమనించారు. దాంతో అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హరీశ్ కు బాబాయ్ అయిన అభిషేక్ కూడా 12 ఏళ్ల క్రితం బావిలో పడి చనిపోగా.. ఇప్పుడు హరీశ్ అదేరీతిలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/lakshmi-rai-hot-shoot-127537/
టాలీవుడ్ లో స్టార్ హీరోలైన చిరు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన లక్ష్మి రాయ్.. తమిళనాట హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అయితే లక్ష్మి రాయ్ కెరీర్ లో యావరేజ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది కానీ.. టాప్ చైర్ ఎక్కలేకపోయింది. అయితే అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని ఈ చిన్నది.. మొన్నామధ్యన అంటే బాలీవుడ్ లో జూలై సినిమా చేసినప్పుడు.. స్పెషల్ అకేషన్స్ లో బీచ్ ఒడ్డున బికినీ అందాలతో అదరగొట్టేసింది. ఎప్పటికప్పుడు బికినీ తో లక్ష్మి రాయి చేసే రచ్చ మాములుగా ఉండడం లేదు. ఈ వయసులోనూ ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న ఈ పాపకి సినిమా అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే. హాట్ హాట్ గా…. తాజాగా లక్ష్మి రాయి బ్లు బికినిలో చేసిన గ్లామర్ షో యూత్ గుండెల్లో హాట్ హాట్ సెగలు రేపుతోంది. బ్లు బికినీ లో సైడ్ యాంగిల్ లో లక్ష్మి రాయ్ ఇచ్చిన హాటెస్ట్ సెక్సీ ఫోజ్ చూస్తే అబ్బా.. ఇంతందం మనం సినిమాల్లో మిస్ అవుతున్నామే అనిపిస్తుంది. నిజంగా లక్ష్మి రాయ్ బ్లు బికినీ అందాలు మాత్రం అదరహో… బికినీ వేసుకుని స్పెట్స్ పెట్టుకుని.. లూజ్ హెయిర్ తో అమ్మడు అలా అలా నవ్వుతుంది… చూశారూ.. కుర్రకారు గుండెల్లో సెగలు రావడం కాదు.. రంపం పెట్టి కోసేసినట్టుగా ఉంటుందనడంలో సందేహమే లేదు. పాపం పాపకి ఫేట్ బాగోక గాని.. లేదంటే ఈ సెక్సీ అందాలతో ఓ ఊపు ఊపడం ఖాయం. కానీ అందం ఎంతుంటే ఏం ఉపయోగం.. లక్కుండాలమ్మా..
https://www.telugupost.com/politics/leaders-of-the-congress-party-are-expressing-their-anger-against-the-former-member-of-parliament-chinta-mohan-1501292
మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ పై కాంగ్రెస్ పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును వెనకేసుకొస్తూ కాంగ్రెస్, టీడీపీ కలవాలని కోరుకుంటున్న చింతామోహన్ వ్యాఖ్యలను కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా చింతా మోహన్ చంద్రబాబుది అక్రమ అరెస్ట్‌ అని చెబుతున్నారు. అంత వరకూ ఓకే గాని, చంద్రబాబు నిర్దోషి అన్నట్లు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.హైకమాండ్ దృష్టికి...చంద్రబాబుపై చింతా మోహన్‌కు అంత ప్రేమ ఎందుకని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న ఆయన కామెంట్స్‌ను పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని రాజమండ్రి జైలులో పెట్టడం తప్పని, చంద్రబాబు ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయా? అని చింతా మోహన్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ కుట్ర ఉందన్న ఆయన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాబు మాత్రం...కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు బీజేపీ మద్దతు కోరుకుంటుంటే.. మనం ఎందుకు సపోర్టుగా ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించి వదిలేస్తే సరిపోతుందని, అదే పనిగా ప్రతిరోజూ చింతామోహన్ చంద్రబాబుకు అనుకూల ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత అసలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. మళ్లీ బీజేపీ వైపునకే ఆయన మొగ్గు చూపారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఇంత స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆలోచన...అయితే చింతామోహన్ ఆలోచన మరోలా ఉందన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తాను గెలవాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారని, అందుకే ఆయన గత కొద్ది రోజులుగా బాబు నామస్మరణ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీలో చేరితే నేరుగా చేరవచ్చు కాని, కాంగ్రెస్ లో ఉండి మాజీ పార్లమెంటు సభ్యుడిగా చంద్రబాబును ప్రతి రోజూ వెనకేసుకు రావడం వల్ల పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. మొత్తం మీద చింతా మోహన్ ఆలోచన ఎలా ఉన్నా ఆయన చేస్తున్న కామెంట్స్ మాత్రం పార్టీలో కాక రేపుతున్నాయనే చెప్పాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/చెత్త-సినిమా-చేస్తే-చెప్-49348/
తెలుగులో ఒకప్పుడు సిద్దార్థ్ లవర్ బాయ్ లా వెలిగిపోయాడు. అతని సినిమా కోసం యూత్ తెగ ఎదురు చూసేది. కానీ ఈ మధ్య కాలంలో సిద్దార్థ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అసలే ప్లాప్స్ లో ఉన్న హీరోతో ఏ దర్శక నిర్మాత అయినా ధైర్యం చేసి సినిమాలు చెయ్యరు. లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సిద్దార్థ్ తో సినిమాలు చేసే వారు లేక అతని మర్కెట్ తో పాటే అతని కెరీర్ కూడా ముగిసిపోయింది... అనుకున్న సమయానికి సిద్ధు తాజాగా గృహం అనే థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.ఘాటుగా సమాధానం...తమిళంలో తెరకెక్కిన ఈసినిమా కి హీరో, నిర్మాత సిద్దార్థే. అయితే అక్కడ తమిళంలో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులో రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. అయితే తెలుగులో గృహం ప్రీమియర్ షో కోసం హైదరాబాద్ వచ్చిన సిద్ధుకి ఊహించని ప్రశ్న ఒకటి ఎదురైంది. కెరీర్ విషయమై ఒక విలేఖరి సిద్ధుతో మధ్యలో మీరు చాలా కాలం పడిపోయారే అని అనగా... దానికి బాగా హార్ట్ అయిన సిద్దార్థ్.. కొంచెం ఘాటుగా.. మరికొంచెం స్వీటుగా సమాధానమిచ్చాడు.గతం గురించి అనవసరం....అసలు నెప్పుడూ పడిపోయానని అనుకోవట్లేదు..... ఈ రోజు ఒక హీరోగా, నిర్మాతగా ఒక మంచి సినిమా తీసి.. అందరి ముందూ తలెత్తుకుని నిలబడగలిగాను. మరి నేను పడిపోయానని ఎలా అనుకుంటాను. ఆ మాట అనడం మీ ప్రాబ్లెమ్ కావచ్చు. కానీ నేను అలా అనుకోవట్లేదు. ఈ రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగితే 20 మంది నా చుట్టూ చేరి దగ్గరికి వచ్చి మరి ఫొటోలు దిగారు. కానీ వాళ్లెవ్వరూ కూడా 10 ఏళ్ల ముందైతే ఇతడితో ఫొటో దిగే వాడిని అనుకోలేదు... నాదగ్గరికి వచ్చి మరి నేనంటే ఎంతో ఇష్టమని చెప్పారు. గతం గురించి అస్సలు ఆలోచించను..... మంచి సినిమా తీస్తే ఆదరించండి..... లేదా చెత్త సినిమా తీస్తే చెప్పుతో కొట్టండి అంటూ ఘాటైన రిప్లై ఇచ్చాడు.
https://www.telugupost.com/movie-news/గౌతమీపుత్ర-శాతకర్ణి-టూ-డ-19723/
ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 3 .50సీడెడ్ 3 .10వైజాగ్ 1 .57ఈస్ట్ గోదావరి 1 .19వెస్ట్ గోదావరి 1 .73క్రిష్ణ 1 .22గుంటూరు 2 .14నెల్లూరు 0 .65టూ డేస్ ఏపీ, టీఎస్ కలెక్షన్స్ 15 .10
https://www.telugupost.com/movie-news/popular-stunt-master-kanal-kannan-arrested-by-tamilnadu-police-1484557
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్ని సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పని చేశారు కనల్ కన్నన్. ఇప్పుడు ఆయనను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పాస్టర్ కు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసినందుకు కనల్ కన్నన్ ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్‌కోయిల్‌లో అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ డీఎంకే నేత ఫిర్యాదు చేయడంతో కన్నన్‌ను అరెస్ట్ చేశారు. ఒక యువతితో ఓ పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను జూన్ 18న పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో ద్వారా కొందరి మనోభావాలు దెబ్బతీశారంటూ డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 1న కేసు నమోదు అయింది. విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.కన్నన్ జూన్ 18న పాస్టర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. విదేశీ మతాచారాలు ఇలానే ఉంటాయంటూ కనల్ కన్నన్ ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు ఓ తమిళ సాంగ్ ను కూడా జోడించాడు కనల్ కన్నన్. ఆస్టిన్ బెన్నెట్ కన్నన్‌పై పోలీసులకు సమాచారం అందించాడు. నాగర్‌కోయిల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కనల్ కన్నన్ పై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బెన్నెట్ తన ఫిర్యాదులో ఈ వీడియోను ఎడిట్ చేశారని, క్రైస్తవ మతం ప్రతిష్టను దిగజార్చడానికి, విభిన్న మతాల మధ్య ద్వేషాన్ని ప్రేరేపించే ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ చేశారని ఆరోపించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కన్నన్‌కు సమన్లు ​​జారీ చేయడంతో.. జూలై 10వ తేదీ ఉదయం 10 గంటలకు నాగర్‌కోయిల్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సాయంత్రం 7 గంటలకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇది పూర్తిగా డీఎంకే ప్రభుత్వం ప్రేరేపిత కేసని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.
https://www.telugupost.com/movie-news/పవన్-వెనుక-త్రివిక్రమ్-న-51599/
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటినుండి పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు త్రివిక్రమ్, పవన్ వెంట వున్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? పవన్ - త్రివిక్రమ్ కలిసి జల్సా సినిమా చేసినప్పటినుండి వీరి మధ్యన దర్శక హీరో బంధం కాస్తా.. స్నేహబంధంగా మారిపోయింది. అప్పటినుండి పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటున్నాడు త్రివిక్రమ్. పవన్ ఎక్కడ ఉంటే త్రివిక్రమ్ అక్కడ ఉండడం దగ్గరనుండి.. అన్ని విషయాల్లోనూ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కి మంచి ఆప్తుడిగా దగ్గరయ్యాడు. కేవలం సినిమాల్లోనే కాదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుండి పవన్ వెనుక త్రివిక్రమ్ ఉన్నాడు. పవన్ మాట్లాడే ప్రతి మాట త్రివిక్రమ్ చేతి రాతే అని ప్రచారం జరిగింది అక్షరాలా నిజం. అందుకే త్రివిక్రమ్ ని మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందనే ప్రచారం కూడా జరిగింది. అసలు ఇప్పుడు ఇంత సోది ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాల్తో బిజీగా ఉంటూనే మరోపక్క రాజకీయాల్లో బిజీగా మారుతున్నాడు. 2019 ఎన్నికలను టార్గెట్ గా జనసేన కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్ గా మారడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పాద యాత్ర కూడా చేపట్టబోతున్నాడు. అందులో భాగంగానే.. చలోరే చలోరే చల్... జనం లోకి జనం కోసం జనసేనాని అంటూ పవన్ కళ్యాణ్ బయలుదేరాడు.అయితే పవన్ కళ్యాణ్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే అంటూ చెప్పే ముందుగా పవన్ కళ్యాణ్ ఆప్తుడు, మిత్రుడు అయిన త్రివిక్రమ్ వాయిస్ ఆ ఆడియో లో స్పష్టంగా వినబడుతుంది. ఆ ఆడియో మొదట్లో త్రివిక్రమ్ వింటారా! వెనకాలే వస్తారా! తోడుగఉందాం వస్తారా! రండి విందాం.... అటూ చెప్పగా.. పవన్ కళ్యాణ్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్మిత్రమా! అసలే చీకటి! ఇల్లేమో ధూరం! దారంతా గోతులు! చేతిలో దీపం లేదుధైర్యమే ఒక కవచం... రా అంటూ గర్జిస్తూ...ఒక దేశపు సంపద నదులు కాదు... ఖనిజాలు కాదు.. అరణ్యాలు కాదు.. కలలు ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశపు భవిష్యత్తుకు నాయకులు.మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వారికి ఇదే చెబుదాం. పర్వతం ఎవరిముందు వంగి సలాం చెయ్యదు. నేను పిడికిలంతా మట్టే కావచ్చు.. కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా మోసేంత పొగరుంది అంటూ ఆవేశపూరితమైన మాటలు వింటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయి రాజకీయనాయకుడిలా కనబడుతున్నాడు. మరి త్రివిక్రమ్ మాటలు పవన్ చేతలు చూస్తుంటే.. ఈసారి జనసేనాని మాత్రం గట్టిగా కొట్టేలాగే కనబడుతున్నాడు.
https://www.telugupost.com/movie-news/చిరు-కి-అక్కడేం-పని-25381/
మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకొని జూన్ లో విడుదలకు సిద్దమవుతున్నా కూడా ఆ చిత్రానికి సంబందించిన టీజర్ గాని మహేష్ బాబు లుక్ గాని ఇంతవరకు బయటికి రాలేదు. మరి మహేష్ - మురుగదాస్ మనసులో ఏముందో తెలియదు గాని ఆ చిత్ర విశేషాలు మాత్రం మీడియాకి పొక్కకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు కొత్త చిత్ర లుక్ కోసం మొహం వాచిపోయారు. ఇక ఈ సినిమాకి టైటిల్ అంటూ కూడా ఏది ఫైనల్ చెయ్యలేదు. ఏదో 'సంభవామి' అనే టైటిల్ ని మాత్రం మహేష్ బాబు చిత్ర టైటిల్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే మహేష్ చిత్రం సాంగ్ షూటింగ్ ఒకటి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. స్పెషల్ గా వేసిన ఒక సెట్ లో మహేష్ సాంగ్ షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతుండగా అక్కడ మెగా స్టార్ చిరు ప్రత్యక్షమవడంతో సెట్ అంతా సందడిగా మారిపోయింది. ఇక చిరు డైరెక్టర్ మురగదాస్, మహేష్ బాబు తో కలిసి ఆ సాంగ్ రషెస్ ని తిలకించారట. అయితే సడన్ గా అక్కడికి చిరంజీవి వచ్చేసరికి ముందు యూనిట్ సభ్యులతో పాటు మహేష్ బాబు ఆశర్యపోయినప్పటికీ... చిరంజీవి తో కలిసి మహేష్ కూడా కలిసిపోయి సందడి చేశారట . అయితే చిరు అక్కడ ప్రత్యక్షమవడానికి కారణం మాత్రం చిరంజీవి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్లగా.... మహేష్ చిత్రం కూడా అక్కడే షూటింగ్ జరుపుకోవడంతో చిరు సర్ప్రైజింగ్ గ మహేష్ బాబు చిత్ర సెట్స్ కి వెళ్ళాడట.మరి మెగా స్టార్, సూపర్ స్టార్ ఒకే చోట ఇలా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇక చిరు, మురుగదాస్, మహేష్ కలిసి మహేష్ చిత్ర రషెస్ చూస్తున్న పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లా పాకిపోయింది మీరు ఒకసారి ఆ పిక్ ని తిలకించండి.
https://www.telugupost.com/andhra-pradesh/jana-sena-chief-and-deputy-chief-minister-pawan-kalyan-has-a-big-task-ahead-of-him-many-janasena-leaders-are-waiting-for-his-decision-1547164
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు పెద్దటాస్క్ ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎంతో మంది జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో పవన్ కల్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. పవన్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. అలా అని పవన్ కల్యాణ్ తొలి నుంచి చెబుతున్నట్లుగానే ఒక వ్యూహం ప్రకారం గత ఎన్నికల సమయంలో ముందుకు వెళ్లారు. కూటమి ఏర్పాటుతో పాటు ఇబ్బందులు లేకుండా సీట్ల పంపిణీలో కూడా ఆయన కీలక భూమిక వహించారు. జగన్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఒకింత తగ్గడం మంచిదని ఆయన నిర్ణయించుకుని 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేశారు.పర్సెంట్ స్ట్రయిక్ రేటు...దీంతో మొన్నటి ఎన్నికల్లో జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటు వచ్చింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు. అంటే పవన్ ఆలోచన మేరకు తీసుకున్న నియోజకవర్గాల్లో ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ క్యాడర్ కూడా పనిచేశాయి. అదే సమయంలో టీడీపీ, బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ జనసేన కార్యకర్తలు ఎన్నిక తమది అని భావించి పోలింగ్ కు సహకరించారు. ఓట్ల బదిలీ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలకు గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఎందుకంటే టీడీపీకి ఎన్నడూ రాని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే ఇందుకు కారణం.ఓట్ల బదిలీ...కులాలు, అభిమానులు అందరూ గంపగుత్తగా టీడీపీకి ఓటు వేశారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబును, మోదీని కాపు సామాజికవర్గం ప్రజలు, పవన్ అభిమానులు చూడలేదు. కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే చూసి ఓటు వేశారు. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇప్పటికే దీనిపై పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చర్చించారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వారితో పాటు పార్టీ కోసం కష్టపడిన వారు తమకు ఏదో ఒక పదవిని పవన్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఆ దిశగా అనేక మంది ఇప్పటికే పార్టీ నేతలకు తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలిసింది. బాబు నిర్ణయం...కానీ నామినేటెడ్ పోస్టుల్లో 65 శాతం టీడీపీ తీసుకోవాలనుకుంటుందని సమాచారం. 25 శాతం పోస్టులు జనసేనకు ఇవ్వాలని భావిస్తుంది. పది శాతం పదవులను బీజేపీకి ఇవ్వాలన్న నిర్ణయానికి చంద్రబాబు దాదాపుగా వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. టీడీపీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో సహజంగా ఆ పార్టీ ఎక్కువ పదవులు తీసుకునే అవకాశముంది. అయితే జనసేన నేతలు మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకున్నా నామినేటెడ్ పదవుల విషయంలో పవన్ కల్యాణ్ రాజీ పడతారా? లేక చంద్రబాబును ఒప్పించి ఎన్నికల్లో కష్టపడ్డ నేతలను మంచి, కీలకమైన పోస్టులను తెచ్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
https://www.telugupost.com/crime/encounter-took-place-in-pulwama-in-jammu-and-kashmir-aterrorist-was-killed-in-the-encounter-1359086
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది మరణించాడు. మరో ఉగ్రవాదులను భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. పుల్వామాలోని నైనా బట్‌పోరాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందింది. దీంతో వారు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. ఉగ్రవాదులు ఒకచోట దాక్కుని ఉండగా భద్రతాదళాలు లొంగిపోవాలని హెచ్చరించాయి.ఇద్దరిని అదుపులోకి.....అయినా లెక్క చేయకుండా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాదళలాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. ఇద్దరిని భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఒక ఉగ్రవాది హత మయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మృతి చెందిన ఉగ్రవాది జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాడిగా గుర్తించారు.
https://www.telugupost.com/movie-news/bb3-title-update-189233/
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న BB3 సినిమా ముచ్చట్లు సోషల్ మీడియాలో చాలా తక్కువగా వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. అటు చూస్తే మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లో హడావిడి చేస్తున్నాయి. మరోపక్క సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ రచ్చ చూసిన నందమూరి ఫాన్స్ చాలా డల్ అయ్యారు. బాలయ్య BB3 నుండి అప్ డేట్ ఇవ్వాలంటూ బోయపాటిని అడుగుతున్నారు. చాలా సీరియస్ గా షూటింగ్ చిత్రీకరణలో ఉన్న బోయపాటి BB3 షూటింగ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ముందుకురావడం లేదు. ఇంతవరకు టైటిల్ ఎనౌన్సమెంట్ లేదు.. సినిమా చూస్తే మే 28 న రిలీజ్ డేట్ ఇచ్చేశారనే కన్ఫ్యూజన్ లో ఫాన్స్ ఉన్నారు.అయితే ఈ ఉగాదికి BB3 టైటిల్ ఇవ్వొచ్చని టాక్ నడుస్తున్న టైం లో ఉగాది రోజున అంటే ఏప్రిల్ 13 మద్యాన్నం 12.33 గంటలకి బాలయ్య – బోయపాటి BB3 టైటిల్ ఇవ్వబోతుననట్టుగా అనౌన్స్ చేసింది టీం. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న BB3 పై మంచి అంచనాలున్నాయి. అలా వైకుంఠపురములో, రీసెంట్ గా వకీల్ సాబ్ హిట్ జోష్ లో ఉన్న థమన్ మ్యూజిక్ BB3 కి ప్లస్ అవుతుంది అని ఫాన్స్ నమ్ముతున్నారు. ఇక ఉగాదికి టైటిల్ ఎనౌన్సమెంట్ చేస్తే.. అప్పటినుండి అధికారికంగా BB3 ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తుందట టీం. అన్నట్టు #BB3 టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఉగాది రోజున BB3 టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ నే టీం అనౌన్సమెంట్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ అప్ డేట్ తో బాలయ్య ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-meeku-matrame-chepta-collections-139311/
విజయ్ దేవరకొండ హీరోగా సినిమా వస్తే… దానికి యావరేజ్ టాక్ వచ్చినా ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. ప్లాప్ టాక్ వచ్చినా.. మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. కానీ నిర్మాతగా మారి సినిమా తీసి దాన్ని తనకున్న క్రేజ్ తో అమ్మేసి చేతులు దులుపుకోకుండా…. ఆ సినిమాని బాగా ప్రమోట్ చేసినా.. సినిమాకి ప్లాప్ టాక్ పడితే.. దాన్ని ఆడించడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సినిమాలో విజయ్ హీరో కాదు, కేవలం నిర్మాత మాత్రమే గనక. తాజాగా విజయ్ దేవరకొండ నిర్మాతగా వచ్చిన మీకు మాత్రమే చెప్తా సినిమాకి ప్లాప్ టాక్ పడింది. కామెడీ బావున్నప్పటికీ.. సినిమాలో ఉన్న నెగెటివ్ పాయింట్స్ తో సినిమాకి ప్లాప్ టాక్ పడింది. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కూడా సినిమాని నిలిబెట్టలేకపోయాయి. ఫస్ట్ డే కాస్త పర్వాలేదనిపించిన మీకు మాత్రమే చెప్తా సినిమా ఫస్ట్ వీకెండ్ లో కాస్త పుంజుకుంటుంది అనుకుంటే… అదేం లేదు… వీకెండ్ లో మీకు మాత్రమే చెప్తా థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడాల్సింది పోయి బోసిపోయాయి. మరి వీకెండ్ లోనే సత్తా చాటని సినిమా వీక్ డేస్ లో మరింత వీక్ అవడం ఖాయం. అయితే తక్కువ మొత్తానికే థియేట్రికల్ రైట్స్ అమ్మినప్పటికీ… ఇప్పుడు బయ్యర్లు బాగా నష్టపోయేలా కనబడుతున్నారు. 40 లక్షలకు కొంటే ఇప్పటికి 10 లక్షలు కూడా రాని బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారని టాక్. కొన్ని ఏరియాస్ లో బయ్యర్లకు మినిమమ్ ఖర్చులు కూడా రావని అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/charan-next-movie-74721/
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా తెరకెక్కిన చిత్రం 'తేజ్ ఐ లవ్ యూ'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అథితిగా వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడారు. క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు గారి కోసమే నేను ఇక్కడకి వచ్చాను కానీ తేజు గురించి కాదు అని ఆయన అన్నారు.ఆయనతో చిరంజీవి కి అనుబంధం గుర్తు పెట్టుకుని, కెఎస్ రామారావు గురించి తన కొడుకు రామ్ చరణ్ తనంతట తాను ప్రస్తావించి, ఓ సినిమా చేస్తానని చెప్పాడని చిరు ప్రకటించారు. రాజమౌళి సినిమా తర్వాత చరణ్.. కెఎస్ రామారావు గారితో ఓ సినిమా చేస్తాడని స్పష్టం చేశారు. చరణ్ తో మాట్లాడాకే నేను ఇక్కడ ప్రకటన చేస్తున్న అని చిరంజీవి తెలిపారు.అంతేకాకుండా నిన్న చిరంజీవి.. పవన్ కళ్యాణ్ - కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన 'తొలిప్రేమ' సినిమా గురించి ప్రస్తావిస్తూ... నా తమ్ముడు అంటూ ఆ సినిమా ముచ్చట్లు, వైట్ అండ్ వైట్ లో పవన్ గెటప్ ను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. మా ఫామిలీలో ఎవరైనా తప్పు చేస్తే ముందుగా నేనే మందలిస్తానని కానీ.. తేజు ఇప్పటివరకు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. ఇకపై ఇవ్వడు కూడా అని చిరంజీవి తెలిపారు
https://www.telugupost.com/movie-news/రంగస్థలం-సినిమా-అందుకే-ల-54273/
రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో వస్తున్న చిత్రం రంగస్థలం. ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సి వుంది కానీ.. ఈ సినిమా షూటింగ్ బాగా లేట్ అవుతూ వచ్చింది. అందుకే సంక్రాంతికి రావాల్సిన రంగస్థలం మార్చ్ కి వెళ్ళిపోయింది. అయితే సమంత, రామ్ చరణ్ ఈ చిత్రానికి సరిగా డేట్స్ కేటాయించక పోవడం వలెనే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమైనదని ప్రచారం జరుగుతోంది. మొదటి నుండి ఈ సినిమాపై ఏదొ ఒక పుకారు వచ్చి పడుతుంది.అయితే లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా షూట్ కి సంబందించిన హార్డ్ డిస్క్ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కొన్ని సన్నివేశాలు డిలీట్ అయినట్లు తెలుస్తోంది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం షాక్ లో ఉందట. ఇంకా చేసేది ఏమి లేక డిలీట్ అయిన సీన్స్ ని దర్శకుడు సుకుమార్ మళ్ళీ రీషూట్ చేస్తున్నారట అందుకే సినిమా లేట్ అవుతుందని ఇప్పుడు తాజా టాక్
https://www.telugupost.com/movie-news/ram-charan-pooja-hegde-acharya-look-189509/
చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మే 13 న విడుదలకు సిద్దమవుతుంది. కరోనా కారణంగా షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే అనుకున్న టైం కే ఆచార్య వచ్చేస్తుంది. ఇకపోతే ఆచార్య సినిమాలో చిరు తో పాటుగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తండ్రి కొడుకుల మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ద గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా చరణ్ పుట్టిన రోజున ఆచార్య నుండి సిద్ద లుక్ ని రివీల్ చేసిన టీం ఉగాది రోజున సిద్ద ని తన ప్రేమికురాలితో రొమాంటిక్ గా రివీల్ చేసింది. ఆచార్య లో రామ్ చరణ్ సిద్ద పాత్రకి జోడిగా టాప్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుంది. సిద్ద – నీలాంబరి పాత్రధారి పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ ని ఉగాది కానుకగా రిలీజ్ చేసింది ఆచార్య టీం. రామ్ చరణ్ మెడలో రుద్రాక్ష మాలతో వైట్ టి షర్ట్ తో పూజ హెగ్డే ని అలా రొమాంటిక్ గా పట్టుకుని ఉన్న పోస్టర్ క్యూట్ గా రొమాంటిక్ గా ఉంది. పూజ హెగ్డే కూడా కాస్త డీ గ్లామర్ గా అనిపిస్తూ ఓల్డ్ లుక్ లో కనిపిస్తుంది. సారీ లో పూజ హెగ్డే నీలాంబరిగా చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. రామ్ చరణ్ తో ఫస్ట్ టైం ఇంత రొమాంటిక్ గా పూజ హెగ్డే నటించడం. గతంలో చరణ్ తో రంగస్థలం లో ఓ ఐటెం సాంగ్ లో పూజ హెగ్డే స్టెప్స్ వేసినా.. ఆచార్య లో వీళ్లది ఫ్రెష్ జోడిగా కనిపిస్తుంది. ఆచార్యలో చరణ్ – పూజ కాంబో పై ఫాన్స్ లో మంచి అంచనాలున్నాయి.
https://www.telugupost.com/movie-news/pantham-teaser-review-73853/
ప్రస్తుతం హీరో గోపీచంద్ కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్ లో 'పంతం' అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గోపీచంద్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేసింది టీం.పవర్ ఫుల్ డైలాగ్ లతో...గోపీచంద్ సరికొత్త లుక్ తో కనిపించిన ఈ టీజర్ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి కూడా ప్రాధ్యానత ఇచ్చారని అర్ధం అవుతుంది. టీజర్ లో గోపీచంద్ కోర్ట్ లో చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్ అయ్యే అవకాశం ఉంది. "ఫ్రీగా ఇళ్లిస్తాం .. కరెంట్ ఇస్తాం .. రుణాలు మాఫీ చేస్తాం .. ఓటుకు ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక .. మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి .. అవినీతిలేని సమాజం కావాలి .. కరెప్షన్ లేని కంట్రీ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయ్" అంటూ పవర్ ఫుల్ గా చెప్పాడు హీరో గోపీచంద్. టీజర్ మొత్తానికి ఆ సీన్ హైలైట్ గా నిలిచింది. టీజర్ చూస్తుంటే ఈసారి గోపి కచ్చితంగా హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఈ సినిమాకు ప్లస్ అవ్వనుంది. ఇక హీరోయిన్ మెహ్రీన్ ఎప్పటిలానే చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు.
https://www.telugupost.com/movie-news/chirajeevi-sye-raa-narasimha-reddy-collections-139072/
ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 32.76 సీడెడ్ 19.35 నెల్లూరు 4.62 కృష్ణ 7.53 గుంటూరు 9.69 వైజాగ్ 16.62 ఈస్ట్ గోదావరి 9.21 వెస్ట్ గోదావరి 6.61 టోటల్ ఏపీ & టీస్ షేర్ 106.39 కర్ణాటక 16.85 తమిళనాడు 2.70 కేరళ 0.90 ఇతర ప్రాంతాలు 6.70 నార్త్ అమెరికా 9.28 గల్ఫ్ 1.66 ఆస్ట్రేలియా 0.95 మలేషియా 0.36 టోటల్ వరల్డ్ వైడ్ 145.79
https://www.telugupost.com/crime/cbi-conducts-searches-across-the-country-searches-are-conducted-in-many-parts-of-the-country-1441100
దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది. ఆపరేషన్ గరుడ పేరుతో ఈ తనిఖీలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. ఇంటర్ పోల్ సహకారంతో ఈ సీబీఐ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. ఈ దాడుడ్లోల 150 మంది డ్రగ్ ప్లెడర్స్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నేరుగా దేశంలోకి ఉగ్రవాద సంస్థలు డ్రగ్స్ ను డంప్ చేస్తున్నాయి. తీర ప్రాంతాల నుంచి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.ఇంటర్‌పోల్ సహకారంతో...వీరి నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ పోల్, సీబీఐ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోతో కలసి ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ దాడులు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశముంది. ఈ దాడుల్లో రాష్ట్ర పోలీసులు కూడా పాల్గొంటున్నారు. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకునే లక్ష్యంగా ఈ దాడులు చేస్తుంది.
https://www.telugupost.com/movie-news/ఒకే-ఫ్యామిలిలో-మూడు-నిర్-53955/
స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత.... హీరో నాగ చైతన్య తో పెళ్లి తరువాత పూర్తి స్థాయి అక్కినేని కోడలిగా మారిపోయింది. అయితే అక్కినేని ఫ్యామిలీ లోకి వెళ్ళాక సమంత ఒక కొత్త అవతారం ఎత్తబోతుంది. అది కూడా ప్రొడ్యూసర్ గా.... అవును సమంత త్వరలో నాగ చైతన్య తో కలిసి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయబోతుంది అని ఫిలిం నగర్ టాక్. కన్నడలో హిట్ మూవీ అయిన 'యూటర్న్'ని తెలుగులో సమంతా రీమేక్ చేస్తుంది. చైతుతో కలిసి ఓ కొత్త బ్యానర్ స్థాపించి.... ఆ బ్యానర్ లో మొదటి సినిమా గా ఈ మూవీ ని నిర్మించాలని అనుకుంటుంది సమంతా. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ పై మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్న నాగార్జున…. కొత్తగా 'మనం' అనే పేరు వచ్చేలా మనం ఎంటర్ ప్రైజెస్ అని స్థాపించి 'హలో' మూవీ ని ప్రొడ్యూస్ చేసాడు నాగార్జున. ఈ మనం ఎంటర్ ప్రైజెస్ పై నాగ చైతన్య ఇంకా అఖిల్ తో కలిసి మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తాడట నాగార్జున. ఇప్పుడు ఈ బ్యానర్ కాకుండా ఆ కుటుంబం నుంచి మరో బ్యానర్ ని సమంతా ఏర్పాటు చేస్తుండటంతో అక్కినేని ఫాన్స్ ఫుల్ హ్యాపి గా ఉన్నారు.ఈ లెక్కన అక్కినేని ఫ్యామిలీ నుండి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, మనం ఎంటర్ ప్రైజెస్, ఇపుడు కొత్తగా నాగ చైతన్య - సమంత ల నిర్మాణ సంస్థ తో కలిపి 3 నిర్మాణ బ్యానర్స్ అవుతాయన్నమాట.
https://www.telugupost.com/movie-news/vijay-and-yash-success-103302/
కన్నడలో య‌శ్ హీరోగా ప్ర‌శాంత్‌ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై సంచలన విజయాన్ని మూట గట్టుకుంది. సినిమాకి తెలుగు, తమిళంలో మిక్స్డ్ రివ్యూస్ పడినప్పటికీ… తొలి 3 రోజుల్లో 58 కోట్ల నెట్ వ‌సూళ్లు సాధించిన కెజిఎఫ్ గ్రాస్ ప‌రంగా మొదటి వారంలోనే 100 కోట్ల క్ల‌బ్ లో చేరడం ఖాయంగా చెబుతున్నారు. తొలిరోజు టాక్ చూసి.. తెలుగు, తమిళంలో కెజిఎఫ్ కి థియేటర్స్ పెంచడంతో ఇక్కడ కూడా నెట్ వసూళ్లు పెరిగాయనేది తెలుగు, తమిళంలో కొన్న నిర్మాతల మాట. కన్న‌డ‌లో తొలి 100 కోట్ల క్ల‌బ్ చిత్రంగానూ కెజిఎఫ్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. విజయ్ తో పోలిక… భారీ మాఫియా బ్యాక్‌డ్రాప్‌, కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా మైమ‌రిపిస్తోంది. అయితే, కన్నడలో ఈ యంగ్ హీరో కెజిఎఫ్ తో 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం… తెలుగులో మరో యంగ్ హీరో కూడా ఈ ఏడాది స్టార్ హీరోల రేంజ్ లో 100 కోట్లు సాధించడంతో ఇద్దరినీ పోలుస్తున్నారు. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ గీత‌ గోవిందం ఈ ఏడాది రిలీజై 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక డ్రైవ‌ర్ కొడుకైన య‌శ్ 100 కోట్ల క్ల‌బ్ సినిమాని అందించ‌డం ఓ సెన్సేష‌న్ అంటూ యశ్ ని క్రిటిక్స్ తో సహా కన్నడ సినీప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
https://www.telugupost.com/movie-news/raviteja-gopichand-168014/
రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న క్రాక్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణలో క్రాక్ ఉన్నట్లుగా ప్రకటించడం కరోనా తర్వాత షూటింగ్ కి రవితేజ వెళ్లిన విషయాన్నీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అయితే రవితేజ క్రాక్ తో పాటుగా వరసగా సినిమాలు చేస్తున్నాడు. క్రాక్ తర్వాత రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో రవితేజ ఖిలాడీ సినిమా చెయ్యబోతున్నాడు. అయితే ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడనే టాక్ ఉంది. తాజాగా రవితేజ డ్యూల్ రోల్ కాకుండా మరో హీరో కూడా ఖిలాడీలో నటించబోతున్నాడని… అయితే ఈ మధ్యన సినిమాల్తో క్రేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ కానీ, లేదంటే హీరో శ్రీ విష్ణు కానీ.. రవితేజ ఖిలాడీ లో ఆ పాత్రకి సెట్ అవుతారని… అందుకే రమేష్ వర్మ అటు శ్రీ విష్ణు, ఇటు సత్యదేవ్ లను సంప్రదిస్తున్నదని అంటున్నారు. అలా హీరోలే కాకుండా ఈ సినిమాలో ముగ్గురు మెయిన్ విలన్స్ కూడా ఉండబోతున్నారట. అందులో ఒక విలన్ గా సోను సూద్ ని తీసుకునే యోచనలో ఉన్నారట. ఎలాగూ సోను సూద్ ఈమధ్యన బాగా పాపులర్ అవడం తో విపరీతమైన క్రేజ్ వచ్చింది కాబట్టే.. సోను సూద్ నే మెయిన్ విలన్ గా తీసుకుంటారని వినికిడి.
https://www.telugupost.com/movie-news/విజయ్-తన-మనుసులో-మాట-బయటప-51727/
పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు మనవాడు. అయితే విజయ్ ఎంచుకునే కథ ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు గని... ఆ సినిమాపై కొంచెం భారీ అంచనాలు ఉంటాయని చెప్పవచ్చు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ లో తెరకెక్కుతోన్న ఆ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా ఏదైనా కొత్తదనం ఉన్న కథలనే ఒకే చేస్తానని ఇంతకుముందు విజయ్ చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన ఒక కన్నడ సినిమా ఆడియో వేడుకలో తన మనసులోని కోరికను చెప్పాడు.రష్మిక మందాన్నా - గణేష్ కాంబినేషన్ లో చమక్ ఆడియో లాంచ్ కి వెళ్లిన విజయ్.. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఫ్తీ ట్రైలర్ ని చూసి నాకు కూడా ఇలాంటి గ్యాంగ్ స్టార్ సినిమా చేయాలనుంది అని తన మనసులో మాట చెప్పాడు. ఇంతే కాదు కన్నడ ఇండస్ట్రీపై ప్రశంసల జల్లును కురిపించారు. మరి మనవాడు బాడీ లాంగ్వేజ్ తగట్టు ఎవరన్నా దర్శకులు గ్యాంగ్ స్టార్ కథ రాసి విజయ్ ని డైరెక్ట్ చేస్తారో లేదో చూడాలి.
https://www.telugupost.com/movie-news/hero-vishwak-sen-said-that-he-was-disrespected-on-the-set-and-thats-why-he-was-absent-from-the-shoot-1446816
తనకు సెట్ లో గౌరవం లేకుండా పోయిందని, అందుకనే తాను షూటింగ్ కు గైర్హాజరయ్యానని హీరో విశ్వక్ సేన్ తెలిపారు. చిన్న చిన్న సూచనలను తాను చేసినా అర్జున్ పట్టించుకోలేదని తెలిపారు. అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని అర్జున్ చెప్పడంతోనే తాను హర్ట్ అయ్యానని విశ్వక్ సేన్ చెప్పారు.నచ్చని పని చేయలేకనే...తన మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి తాను బయటకు వచ్చానని విశ్వక్ సేన్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్, చెక్ లు, డాక్యుమెంట్లు, నిర్మాత మండలికి పంపినట్లు ఆయన తెలిపారు. చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ పట్టించుకోకపోవడంపై తాను కలత చెందానని తెలిపారు.
https://www.telugupost.com/movie-news/సుచి-లీక్స్-గుండెల్లో-రై-25218/
ఇప్పుడు సుచి లీక్స్ తమిళ ఇండస్ట్రీనే కాక తెలుగు ఇండస్ట్రీ ని తాకింది. ఒకప్పుడు నల్లధన కుబేరుల గుండెల్లో పనామా లీక్స్ ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో... ఇప్పుడు కోలీవుడ్ ని సుచి లీక్స్ అంతటి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఈ సుచి లీక్స్ ఏమిటా అనుకుంటున్నారా ? గత కొన్ని రోజుల నుండి సింగర్ సుచిత్ర తనని ధనుష్ చిత్ర బృందం వేధించిందని... ఈ విషయంలో హీరో ధనుష్ కూడా తనకి సపోర్ట్ చెయ్యలేదని ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయింది. ఇక తనని ఎలా వేధించారో కూడా కొన్ని ఫోటో లు తీసి మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫొటోస్ లో తన ముఖాన్ని మాత్రం దాచేసి చేతులని మాత్రమే హైలెట్ చేసింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సుచిత్ర భర్త కార్తీక్ లైన్ లోకొచ్చి తన భార్య అటువంటి ట్వీట్స్ ఏం చెయ్యలేదని... తన భార్య ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో స్పందించాడు. మరి ఆ హీరో ఫ్యాన్స్ నుండి సుచిత్రకి బెదిరింపులు రావడం మూలంగానే సుచిత్ర భర్త అలా ఆమె ఏమి చెయ్యలేదని చెప్పాడా? అనే అనుమానం మొదలైంది. అయితే ధనుష్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను ధనుష్ అంతటి హీరో మీద నింద మోపేంతటి గొప్పదానివా అంటూ ఆమెను నానారకాల ఇబ్బందులకు గురిచేస్తూ రచ్చ చేస్తున్నారు.ఇక ఆ రచ్చ ముగియకముందే సుచిత్ర మళ్ళీ ధనుష్ పర్సనల్ ఆల్బమ్ తోపాటు ఇంకొందరి తమిళ హీరోల బండారం బయటపెట్టింది. ఇక ధనుష్, త్రిషతో క్లోజ్ గా వున్న ఫొటోస్ తో పాటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పర్సనల్ ఫొటోస్ ని లీక్ చేసి పడేసింది. అనిరుధ్ తమిళ హీరోయిన్ ఆండ్రియాతో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా సింగర్ సుచిత్ర, శింబు, హన్సిక రొమాన్స్ ఫొటోలతో పాటు పనిలోపనిగా టాలీవుడ్ హీరో రానా మీద కూడా తన ప్రతీకారం తీర్చుకుంది. రానా ఒక పార్టీలో హీరోయిన్ త్రిషని గట్టిగా హాగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో పోస్ట్ చేసి అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ కి పెద్ద షాక్ ఇచ్చింది.అసలు ఇంతకుముందే రానా కి త్రిష కి ఎఫ్ఫైర్ ఉందని మీడియా కోడై కూసింది. కానీ అది నిజమని ఎక్కడా రుజువు కాలేదు. కానీ ఎప్పుడు సుచి లీక్స్ అది నిజమని నమ్మేలా చేసింది. మరి ఒక్క ధనుష్ మీద ఉన్న పగతో సుచిత్ర ఆయన రిలేటివ్ అనిరుధ్ తో పాటే శింబు, రానాల పరువు కూడా తీసిపారేసింది. అసలు సుచిత్రే ఈ పర్సనల్ ఫొటోస్ ని లీక్ చేసిందా? లేక ఇంకెవరన్నా ఇలా చేస్తున్నారా అని అందరూ అనుకుంటున్నారు. ధనుష్ ఫ్యాన్స్ చేసిన పనికి సుచిత్ర ఇలా పగ తీర్చుకుందని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరోపక్క ఈ లీక్స్ ని ఆపాలని కోలీవుడ్, టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగినట్టు వార్తలొస్తున్నాయి.
https://www.telugupost.com/movie-news/akkineni-samantha-new-post-109959/
టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లికి ముందు వేరు.. పెళ్లి తరువాత వేరు అన్నట్టు మారిపోయింది. పెళ్లి తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్ అక్కినేని ఫ్యాన్స్ నుండి ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. హనీమూన్‌ సమయంలో చైతుతో కలిసి దిగిన ఫొటోస్ విషయంలో.. పెళ్లి తరువాత రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం సినిమాలో చెర్రీకి లిప్‌లాక్ ఇచ్చినప్పుడు సమంత మీద తీవ్ర విమర్శలొచ్చాయి. నాగార్జున నుంచి చివాట్లు పడ్డట్లు కూడా వార్తలొచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా ‘డోంట్ కేర్’ ధోరణితోనే దూసుకెళ్తోంది సామ్. తెలుగమ్మాయిలా… ఇక తాజాగా ‘నేను మారిపోయానోచ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ‘చీరకట్టు’ ఫోటోలు పెట్టి దండోరా వేసుకుంది. ఎన్నడూ లేని విధంగా చూడముచ్చటగా, పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించిన సమంత మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం ఈమెకు ఫాలోయర్స్ సంఖ్య కూడా 60 లక్షలకు చేరుతున్న సందర్భంగా ఖుషీగా ఉందంటూ ‘దిసీజ్ మీ’ అంటూ కన్నుగీటుతోంది.
https://www.telugupost.com/crime/police-have-found-that-two-persons-were-behind-the-bodhan-riots-gopi-of-shiv-sena-was-found-to-be-involved-1360682
బోధన్ అల్లర్ల వెనక ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. శివసేన కు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్లు గుర్తించారు. నెలరోజుల క్రితం బోధన్ మున్సిపాలిటీలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అయితే ఎప్పుడు విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న దానిపై కౌన్సిల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే శివసేనకు చెందిన గోపి, టీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ శరత్ తో కలసి శివాజీ విగ్రహ ప్రతిష్టకు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.ఆ ఇద్దరి వల్లనే.....ఎవరికీ తెలియకుండా గుప్పు చప్పుడు కాకుండా గోపి, శరత్ లు శివాజీ విగ్రహ ప్రతష్టాపన చేశారని పోలీసులు చెబుతున్నారు. అందువల్లనే అల్లర్లు చోటు చేసుకున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరి వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియవచ్చింది. పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
https://www.telugupost.com/movie-news/చిరు-సై-రా-త్వరలోనే-44328/
ఈ ఏడాది ఖైదీ తో హిట్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టడానికి ఆచి తూచి అడుగు వేస్తున్నాడు. చిరు 151 వ ప్రాజెక్ట్ 'సై రా' చిత్రం ఆఫీషియల్ గా మొదలైనప్పటికీ ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాలుగు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో నాలుగు భాషల నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారనే విషయాన్ని కూడా సై రా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే ఈచిత్రం నుండి ఇద్దరు టాప్ టెక్నీషియన్స్ తప్పుకున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్, సినిమాతో గ్రాఫర్ రవి వర్మన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడం కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని రకాలుగా సంసిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ పనుల కోసం సురేందర్ రెడ్డి లండన్ కి వెళ్లినట్లుగా చెబుతున్నారు. అక్కడ సురేందర్ రెడ్డి ఒక ప్రముఖ VFX స్టూడియోస్ తో ఒప్పందం కుదుర్చుకొని త్వరలోనే షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఇక హీరో చిరు కూడా 'సైరా నరసింహారెడ్డి' లుక్ కోసం బాగా శ్రమిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మరి చిరు సై రా నరసింహ రెడ్డి గా ఎలా కనిపిస్తాడా అనే క్యూరియాసిటీతో మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సైరా కోసం బ్రిటిష్ కాలంనాటి సెట్టింగ్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియో లో భారీ సెట్ ను వేసాడట. ఇక ఆ సెట్ అలనాటి బ్రిటిష్ సామ్రాజ్యం మరియు రాజుల కోటలతో ఆ సెట్ ఉండనుందనే విషయం తెలిసిందే. ఇక దీన్ని బట్టి సై రా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందన్నమాట.
https://www.telugupost.com/movie-news/రిలీజ్-సాహసం-వెనుక-సీక్ర-13631/
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా రేపు నవంబర్ 18 న విడుదలకు సిద్ధమైంది. మోడీ పెద్ద నోట్ల రద్దు కి ఏమాత్రం భయపడకుండా ఈ సినిమాని విడుదల చెయ్యడానికి నిఖిల్ సిద్ధమయ్యాడు. ఇంతకుముందు నాగ చైతన్య కూడా మోడీ దెబ్బకి భయపడకుండా సాహసం శ్వాసగా సాగిపో సినిమాని విడుదల చేసి దమ్ము చూపించాడు. నాగ చైతన్యలాగే నిఖిల్ కూడా తన సినిమాని ధైర్యంగా విడుదల చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రయిలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మొదటి లుక్ నుండే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా... ఈ ట్రైలర్ తో తన సత్తా చాటిందనే చెప్పాలి. అందుకే ఈ సినిమాని ధైర్యం గా విడుదల చెయ్యడానికిసిద్ధపడ్డారని ఈ ట్రైలర్ చూసిన వాళ్లకి అర్ధమవుతుంది.అసలు ఆత్మలంటేనే నమ్మకం లేని కుర్రాడుని ఒక ఆత్మ వెంటాడడం... ఆత్మ నుండి తప్పించుకునేందుకు మహిషాసుర మర్ధిని గుడికి వెళ్లమని ఆతనికి ఓ మాంత్రికుడు చెప్పడం.... ఆత్మనుండి తప్పించుకుని ప్రాణాల కోసం పరిగెత్తడం... తాను అందరిలాంటి అమ్మాయిని కానని .. ఆత్మననే అర్థంలో ఓ హీరోయిన్ చెప్పడం వంటి విషయాలు ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమా విడుదలై థెటర్స్ లో ప్రభంజనం సృష్టించడమే మిగిలింది. ఇక ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా హేబా పటేల్, నందిత నటిస్తున్నారు.
https://www.telugupost.com/crime/gang-rape-attempt-on-georgia-woman-in-nellore-district-1358491
నెల్లూరు : జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చిన విదేశీ యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సైదాపురానికి సమీపంలో జరిగింది. సైదాపురం పరిధిలోని రావూరు రోడ్డులో జార్జియాకు చెందిన మహిళపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెప్పిన వివరాల మేరకు ఘటనా ప్రాంతాన్ని గుర్తించి, పరిశీలించారు.జార్జియాకు చెందిన యువతి కృష్ణపట్నం పోర్టును చూసేందుకు రాగా.. క్యాబ్ డ్రైవర్ సైదాపురంలో ఉన్న మైనింగ్ క్వారీ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ తో పాటు.. పలువురు అక్కడికి చేరుకుని యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడగా.. ఆమె వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/ismart-shaker-day-one-collections-127645/
పూరి జగన్నాధ్ – రామ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా మంచి అంచనాలతో విడుదలైంది. మొదటి షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఇస్మార్ట్ శంకర్ కి భారీ ఓపెనింగ్స్ పడ్డాయి. రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ బెస్ట్ ఓపెనింగ్స్ గా కనబడుతున్నాయి. రామ్ మార్కెట్ డల్ అయినా.. పూరి మార్కెట్ జీరో అయినా.. ఇస్మార్ట్ మీద ఆయా ఆఛాయలేమి కనబడలేదు. ఇక ఇస్మార్ట్ మొదలైనప్పుడు జీరో అంచనాలున్నా… ఇస్మార్ట్ మీద విడుదలయ్యే సరికి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాలతోనే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రామ్ ఎనర్జటిక్ నటన, హీరోయిన్స్ గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ అండ్ నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఇస్మార్ట్ ప్లస్ పాయింట్స్ గా మారడంతో.. ఈ వీకెండ్ ఇస్మార్ట్ శంకర్ జోరు పెరిగేలా కనబడుతుంది. ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చినా.. ఇస్మార్ట్ కలెక్షన్స్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో ఉన్నాయి. మరి ఇస్మార్ట్ శనకర్ మొదటి రోజు కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా మీ కోసం…. ఏరియా: షేర్ (కోట్లలో ) నైజాం 3.43 సీడెడ్ 1.20 నెల్లూరు 0.30 కృష్ణ 0.53 గుంటూరు 0.57 వైజాగ్ 0.86 ఈస్ట్ గోదావరి 0.50 వెస్ట్ గోదావరి 0.40 టోటల్ ఏపీ & టీస్ షేర్: 7.79
https://www.telugupost.com/movie-news/ఏమిటి-వెంకీని-కాపీ-కొట్ట-48729/
దర్శకుడు త్రివిక్రమ్ ఈ మధ్యన తానూ తెరకెక్కించే సినిమాలను కాపీ కంటెంట్ తోనే తీస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మొన్నటికి మొన్న నితిన్, సమంత తో తెరకెక్కించిన అ..ఆ సినిమాని మీనా అనే నవల నుండి కాపీ కొట్టి తీసినట్టుగా త్రివిక్రమ్ మీడియా ముందు ఒప్పేసుకున్నాడు. కానీ మీనా నవల రచయిత పేరు అ...ఆ సినిమా టైటిల్ కార్డులో ఎందుకు వెయ్యలేదంటూ నానా రచ్చ జరిగి.... బోలెడు విమర్శలు అందుకున్నాడు త్రివిక్రం. ఇక ఇప్పుడు కూడా ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమా కోసం డిటెక్టీవ్ అనే నవల హక్కులను త్రివిక్రమ్ కొన్నట్టుగా వార్తలొచ్చాయి. ఆ వార్తలు మరుగున పడకముందే... ఇప్పుడు త్రివిక్రమ్ తాజా చిత్రంపై కూడా అనుమానపు కథనాలు మొదలయ్యాయిఅదేమిటంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, అను ఇమ్మాన్యువల్, కీర్తి సురేష్ లు నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా కూడా మరో సినిమాకి కాపీ అంటూ వార్తలొస్తున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ వెంకటేష్ పాత సినిమా ని స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ PSPK 25 ని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది. గతంలో వెంకటేష్ నటించిన ఒంటరి పోరాటం చిత్రం మాదిరిగానే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కథ ఉంటుందట. అజ్ఞాతవాసి కూడా రివెంజ్ డ్రామానే అని.. వెంకటేష్ ఒంటరి పోరాటంలో జయసుధ కథని నడిపిస్తే.... అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూ కథ నడిపిస్తుందంటున్నారు.ఖుష్బూ తన పగను తీర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ మార్చి ఖుష్బూ గేమ్ ప్లాన్ ఆడుతుందట. ఇక కామెడీ విషయంలో మాత్రం పవన్ ఈ సారి కాస్త నెమ్మదిస్తాడని.. కానీ పవన్ చుట్టూ ఉన్న పాత్రలు బోలెడంత కామెడీ ని పండిస్తాయంటున్నారు. ఆ పాత్రల్లో హీరోయిన్ కీర్తి సురేష్ చేసే కామెడీ సినిమాకే హైలెట్ అంటున్నారు
https://www.telugupost.com/movie-news/కొడుకు-సినిమాల-కోసమే-తమ్-20838/
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్న నాటి నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ గా ఖ్యాతి గడించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం చాలా అరుదుగా సినిమా నిర్మాణాలు చేపడుతుంది. ఏడాదికి ఒక చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో విడుదల కానీ పరిస్థితిని చూస్తున్నాం. అయితే బాలీవుడ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన సాల ఖడూస్ చిత్ర రీమేక్ రైట్స్ దక్కించుకుని విక్టరీ వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో గురు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం నేడు(26 జనవరి) విడుదల చేయాల్సి ఉండగా కొన్ని రోజుల కిందట ఎటువంటి కారణాలు తెలుపకుండానే నిర్మాత సురేష్ బాబు గురు చిత్రాన్ని ఏకంగా మూడు నెలల పాటు వెనక్కి నెడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.రానున్న ఫిబ్రవరి నెలలో దగ్గుబాటి రానా నటించిన ఘాజీ చిత్రం విడుదల కానుండటంతో ఫెబ్రవరి నెల లో కూడా గురు విడుదల ప్లాన్ చేయకుండా ఏకంగా రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తున్న బాహుబలి 2 విడుదలైన అనంతరం మే నెలలో గురు చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట సురేష్ బాబు. తన కొడుకు రానా దగ్గుబాటి నటించిన ఈ రెండు సినిమాలను కొన్ని ప్రాంతాలలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేయనుండటం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సురేష్ బాబు చేతులలో ఒక పెద్ద కథానాయకుడి చిత్రాన్ని గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించే విధంగా రిలీజ్ చేయటానికి కావలసినన్ని థియేటర్లు ఉన్నప్పటికీ వెంకటేష్ సినిమాని ఇలా వాయిదా వేయటం వెంకీ అభిమానులకు మింగుడు పడటం లేదు. బాహుబలి అనంతరం గురు ని విడుదల చేయాలనుకుంటున్న సురేష్ బాబు కి బాహుబలి టీం నుంచే ముప్పు కూడా ఎదురవ్వొచ్చు. బాహుబలి ది బిగినింగ్ కూడా అనుకున్న సమయానికి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తవ్వక సినిమా విడుదల వాయిదా వేసుకున్న ఆర్కా మీడియా వారు ఈ సారి ఏప్రిల్ కి కచ్చితంగా బాహుబలి 2 విడుదల చేయగలరా అనేదాని పై సురేష్ బాబు కే కాదు ఎవరికీ స్పష్టత లేదు. కాబట్టి గురు చిత్రం మే నెలలో విడుదలవటం కూడా కష్టంగానే కనపడుతుంది.
https://www.telugupost.com/movie-news/rajamouli-rrr-66565/
రాజమౌళి గారు బాహుబలి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాను తియ్యబోతున్నాని ఒకే ఒక్క పిక్ ద్వారా ప్రకటించాడు. ఆదిపట్టుకుని అందరూ ఎవరికి తోచిన విధంగా వారు కథలు అల్లేశారు. ఇక దానయ్య కూడా ఆఫీసియల్ గా #RRR అంటూ ఒక మోషన్ పోస్టర్ ద్వారా రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అంటూ ప్రకటించాడు. అంతేకాని రాజమౌళి మాత్రం ఈ మల్టీస్టారర్ విషయమై ఎక్కడా పెదవి విప్పలేదు. కానీ చరణ్, ఎన్టీఆర్ అయితే మాకేం తెలియదు అంతా రాజమౌళినే అంటున్నారు.అయితే ఈ సినిమాపై కొన్ని షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు దర్శనమిస్తున్నాయి. అందులో మచ్చుకు కొన్ని. రాజమౌళి తియ్యబోయే ఈ బడా మల్టీస్టారర్ ని భారీ అంటే అతి భారీ గా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే అసలే భారీ బడ్జెట్ అంటుంటే... అందులో రాజమౌళి, రామ్ చరణ్, రామారావు లకే చాలా మొత్తం పారితోషకాల కింద పోతుందట. అయితే ఆ ముగ్గురు పారితోషకాలే ఈ 250 కోట్లలో 75 కోట్లు ఉండబోతున్నట్టుగా వీర లెవల్లో సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.అలాగే రాజమౌళి ఎలాంటి కథతో సినిమాని డిజైన్ చేస్తున్నాడో అనేది కూడా ఎవ్వరికి క్లారిటీ లేదు... కానీ ఇప్పుడు రెండు మూడు కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కథ అని కొందరు చెబుతున్నారు. 1980 నేపథ్యంలో సాగే కథ అని మరి కొందరు చెబుతున్నారు. అలాగే ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ మల్ల యోధుడుగాను, రామ్ చరణ్ హార్స్ రైడర్ గాను కనిపించబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇవన్నీ నిజమా కాదా అనేది మాత్రం రాజమౌళి స్పందనను బట్టి ఉంటుంది మరి.
https://www.telugupost.com/movie-news/dev-first-look-94381/
కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. కాగా ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చేతిలో హెల్మెట్ తో, వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా, ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకి హరీష్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/sai-palpavi-rejected-bellamkonda-srinivas-movie-85076/
తెలుగులో ఫిదా తో ఫిదా చేసిన ఫిదా పోరి సాయి పల్లవి పై బోలెడన్ని హాట్ న్యూస్ లు మీడియాలో హల్చల్ చేసాయి. ఆమెకి పొగరెక్కువని, సహా నటులను గౌరవించదని, అందరితో గొడవలు పడుతుందని, అలాగే కాస్త ఈగో పర్సెంట్ కూడా ఎక్కువనే న్యూస్ లు సాయి పల్లవి పై తరుచూ వినిపించడం, అలాగే.. ఆమెకి ఒక సినిమాలో తన పాత్ర నచ్చకపోతే కోట్లు కుమ్మరించినా సినిమా ఒప్పుకోదనే టాక్ ఉంది. అందుకే శ్రీనివాస కళ్యాణం సినిమా లో తన పాత్ర నచ్చకే సాయి పల్లవి ఆ సినిమాని రిజెక్ట్ చేసిందని.. దిల్ రాజు బ్రతిమాలినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదన్నారు. ఇక ఆ ఆసినిమాకి రాశి ఖన్నా చెయ్యడం.. విడుదలవడం.. ప్లాప్ అవడం జరిగిపోయాయి.అలాగే సాయి పల్లవి తాజాగా రెండు కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిందనే న్యూస్ మీడియాలో నడిచింది. అది కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన చెయ్యనని సాయి పల్లవి ఆ ఆఫర్ ని వదిలేసిందని అన్నారు. అయితే బెల్లంకొండ కొత్త దర్శకుడి డైరెక్షన్ లో కాజల్ హీరోయిన్ గా సినిమా మొదలు పెట్టబోతున్నాడు. అయితే కాజల్ మెయిన్ కాగా.. రెండో హీరోయిన్ గా సాయి పల్లవి కోసం బెల్లంకొండ ట్రై చేసాడట. అందులోను మనోడు ఎప్పుడూ టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యడం అలవాటాయే. అందుకే ఒకేసారి కాజల్ తోనూ, సాయి పల్లవితోను రొమాన్స్ చెయ్యాలనుకున్నాడు.మరి తన పాత్ర సెకండ్ హీరోయిన్ పాత్ర అనేసరికి సాయి పల్లవి ఆ అవకాశాన్ని వదులుకుంది. మరి ఇప్పుడు సాయి పల్లవి ప్లేస్ లోకి మెహ్రీన్ కౌర్ వచ్చి చేరింది. మెహెరీన్ కాస్త వెనకబడిన వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటుంది. మరి ఇప్పటివరకు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే వంటి హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన శ్రీనివాస్ ఇప్పుడు కాజల్ తో పాటుగా మెహ్రీన్ కౌర్ తో ఆడి పాడనుంది. సాయి పల్లవితో రామన్స్ చేద్దామనుకుంటే ఆమె నో చెప్పడంతో బెల్లంకొండ కాస్త డల్ అయినా అతనికి కాస్త ఫామ్ లో ఉన్న మెహ్రీన్ దొరికింది. మరి సాయి పల్లవికి 2 కోట్లు ఆఫర్ చేసిన బెల్లంకొండ ఇప్పుడు మెహ్రీన్ కి ఎంతటితో సరిపెడుతున్నాడో చూద్దాం
https://www.telugupost.com/movie-news/puja-hegde-glammour-heroien-in-tollywood-143128/
ఒక్క హిట్… ఒకే ఒక్క హిట్ అంటూ హీరోయిన్స్ అందరూ అవకాశాలు కోసం ఎదురు చూస్తుంటే.. లక్కమ్మ.. లక్కుంటే చాలు హిట్ అవసరం లేదంటూ అవకాశాలు మీదే అవకాశాలు పడుతుంది పూజ హెగ్డే. పూజ హెగ్డే స్టయిల్ కో.. గ్లామర్ కో స్టార్ హీరోలు పడిపోతున్నారు. స్టయిల్ అని కాదు గాని, క్రేజ్ ఉంది కనుకనే పూజ హెగ్డే వెంట పడుతున్నారు స్టార్ హీరోలు. ఒక్క స్టార్ హీరో పూజ కి ఛాన్స్ ఇచ్చాడు. అంతే అమ్మడు దశ అల అలా తిరిగింది. ఇక పూజ హెగ్డే బన్నీ చిత్రం డీజే నుండి ఇప్పటివరకు అంటే అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న సినిమా వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక బాలీవుడ్ లో హిట్ లేకపోయినా.. అమ్మడు గ్లామర్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఎందుకంటే పూజ హెగ్డే గ్లామరస్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. అందాలు ఆరబోస్తూ….. బాలీవుడ్ బడా మ్యాగజైన్స్ కోసం పూజ హెగ్డే ఆరబోస్తున్న అందాలు మాములుగా లేవు. క్యూట్ అండ్ హాట్ కాదు కాదు… క్లివేజ్ షో తో పూజ హెగ్డే పిచ్చెక్కిస్తుంది. బేబి పింక్ ఫ్రాక్ లో పూజ హెగ్డే చూపిస్తున్న లైట్ హాట్ అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే. అలా ఫ్రాక్ లో ఉన్న పూజ హెగ్డే అందాలను జారవిడుస్తూ పైకి చూస్తూ ఫోటో దిగింది. మరా హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చగా వైరల్ అయ్యింది. ఇంతకుముందు వెడ్డింగ్ వావ్ మ్యాగజైన్ కోసం పూజ హెగ్డే చేయించుకున్న ఫోటో షూట్ చూస్తే.. అమ్మ పూజ ఇంతందాలను ఎక్కడ దాచవమ్మా… అసలు పూజమ్మ స్టయిల్ వేరయా అన్నట్టుగా ఉన్నాయి ఆ హాటెస్ట్ ఫొటోస్.
https://www.telugupost.com/movie-news/director-krish-jagarlamudi-commnets-on-pawan-kalyan-177515/
అసలు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ని క్యాచ్ చెయ్యడం ఒక్క త్రివిక్రమ్ లాంటివాడికే సాధ్యమేమో. ఎందుకంటే త్రివిక్రమ్ తో తప్ప మరెవ్వరితోను స్నేహంగా ఉండడు. పవన్ ఎవ్వరిని పెద్దగా దగ్గరకి రానియ్యడు. అలాంటి పవన్ తో సినిమా మొదలు పెట్టి.. ఖాళీగా ఉన్నా కదా అని మరో సినిమా తీస్తే పవన్ ఊరుకుంటాడా? పవన్ మాత్రమేనా తనతో సినిమా మొదలు పెట్టి గ్యాప్ వచ్చింది కదా అని మరో హీరోతో సినిమా చేస్తే ఏ హీరో ఊరుకోడు. కానీ పవన్ ఊరుకున్నాడు. అదే కదా పవన్ ఏ టైం లో ఎలా ఉంటాడో అనేది. అసలు మేటర్ లోకి వెళితే పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ ఫిబ్రవరిలోనే ఓ పిరియాడికల్ మూవీ స్టార్ట్ చేసి ఓ షెడ్యూల్ చిత్రకరణ కూడా చేసాడు. మధ్యలో వకీల్ సాబ్, కరోనా తో క్రిష్ – పవన్ మూవీకి బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా, దీక్షల కారణంగా పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా షూటింగ్స్ కోసం తయారవలేదు కదా అని తాను ఇష్టపడ్డ కొండనవల ని సినిమా చేద్దామని పవన్ పర్మిషన్ అడిగితే చేసుకోమన్నాడట. కొండనవల చదివాకా నిద్రపట్టలేదని.. పవన్ పర్మిషన్ అడిగి ఒక 45 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసి మళ్ళీ మన సినిమా కోసం సిద్దమవుతానని పవన్ ని అడగ్గానే ఒప్పుకున్నాడట. కొండనవల ఆధారంగానే పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్ – రకుల్ కాంబోలో సినిమాని 45 రోజుల్లో ముగించేశాడు క్రిష్. మరి ఇలా పవన్ మాత్రమే ఒప్పుకున్నాడు కానీ.. మరో హీరో అయితే మరో సినిమా చేస్తే ఒప్పుకోరంటూ క్రిష్ ఓ టాక్ షోలో చెప్పుకొచ్చాడు.
https://www.telugupost.com/movie-news/jayalalitha-biopic-75746/
ఇప్పడు అన్ని భాషల్లోనూ బయోపిక్స్ జోరు మాములుగా లేదు. బాలీవుడ్ లో బయోపిక్స్ ఎప్పుడో ఆదరణకు నోచుకున్నాయి. ఇక టాలీవుడ్ లోనూ మహానటి తో ఈ బయోపిక్స్ క్రేజ్ స్టార్ట్ అయ్యింది. మహానటి చలవతో అనేక బయోపిక్స్ తెర మీదకి తెచ్చే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక తమిళనాట కూడా ఈ రకమైన బయోపిక్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు మొదలైపోయాయి. గతంలో జయలలిత చనిపోయినప్పుడు అమ్మ బయోపిక్ అంటూ అనేకమంది హడావిడి చేసిన సంగతి తెలిసిందే. కానీ జయలలిత బయోపిక్ మాత్రం పట్టాలెక్కలేదు. అయితే మహానటి మూవీ విడుదలయ్యాక సావిత్రిగా మెప్పించిన కీర్తి సురేష్ జయలలిత కేరెక్టర్ లో అమ్మ బయోపిక్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.ఎన్టీఆర్ బయోపిక్ బ్యానర్ పైనే...అయితే తాజాగా జయలలిత బయోపిక్ నిర్మించడానికి ఏర్పాట్లు మొదలైనట్లుగా తెలుస్తుంది. నటిగా, రాజకీయ వేత్తగా జయలలిత జీవితంలో తెలిసిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు అనేకానేకం ఉన్నాయి. ప్రస్తుతం జయలలిత బయోపిక్ ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని... విష్ణు ఇందూరి (సిసిఎల్ సూత్రధారి) స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే విష్ణు ఇందూరి ఎన్టీఆర్ బయోపిక్ ని తన బ్యానర్ లో చేస్తున్నాడు. ఇక ఇపుడు జయలలిత బయోపిక్ కూడా తన బ్యానర్లో చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసాడు. అయితే జయలలిత బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయినదని.. ఇంకా జయలలిత పాత్రకు బాలీవుడ్ నటి డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ ని సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి.జయలలితగా విద్యాబాలన్...మరి సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ లో విద్య బాలన్ కి విమర్శకుల సైతం బ్రహ్మరథం పట్టారు . మరి సిల్క్ స్మితగా అలరించిన విద్యాబాలన్ ఇపుడు జయలలితగా అటు నటిగా ఇటు పొలిటీషియన్ గా అంటే అమ్మగా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలయ్యింది. అయితే విద్య బాలన్ ని జయలలిత పాత్రకు ఎంపిక చేసినట్టుగా అధికారిక సమాచారం అయితే లేదు. కానీ ఫైనల్ గా విద్యా బాలన్ జయలలిత బయోపిక్ లో చేస్తుందనేది నిజమంటున్నారు.
https://www.telugupost.com/movie-news/pooja-in-telugu-does-not-have-a-single-hit-but-her-remuneration-is-more-134776/
అల్లు అర్జున్ తో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో తెలుగు తెరకు పరిచయం అయినా పూజా హెగ్డే చాలా తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం కొట్టేసింది. మహర్షి తో మహేష్ బాబు తో నటించిన పూజా ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ లతో నటిస్తుంది. తెలుగు లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ తన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తుంది. ఇలా కలిసోస్తుంది….. ఆమెకు తెలుగులో చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు కానీ ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ మాత్రం రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకూ ఉందట. ఈ రెమ్యూనరేషన్ ఎక్కువ అని ఇండస్ట్రీ జనాలు కామెంట్స్ చేస్తున్నా ప్రొడ్యూసర్స్ కి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆమె చెప్పినంత ఇచ్చేస్తున్నారు. కాజల్, తమన్నా, రకుల్ వంటి స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ తో చేయడంతో పూజాకి ప్లస్ అయింది. ఇంకా సామ్ ఏమో పెళ్లి చేసుకుని సెలెక్టెడ్ సినిమాలే చేయడంతో ఈ బ్యూటీకి ప్లస్సుగా మారింది. అలా ఈ అమ్మడుకి అన్ని విధాలుగా కలిసొస్తుంది.
https://www.telugupost.com/crime/hyderabad-youth-killed-while-protecting-sister-from-assault-1493000
హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పట్టపగలు ప్రియురాలి ఇంట్లోకి చొరబడిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిని పొడిచాడు. కేకలు విన్న స్థానికులు నిందితుడిని ఓ గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. యువతి తమ్ముడు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఉస్మానియాకు తరలించారు.షాద్‌నగర్‌ కొందుర్గులో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహించే సురేందర్‌ గౌడ్‌, ఇందిర దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె సంఘవి (25) ఉప్పల్‌ రామాంతపూర్‌లో చదువుతోంది. ఆమె తమ్ముడు పృథ్వీ (24) అలియాస్‌ చింటూ బీటెక్‌ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మరో తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. సంఘవి, పృథ్వీ ఇద్దరూ చదువుల కోసం ఎల్‌బీ నగర్‌ ఆర్టీసీ కాలనీ రోడ్‌ నెం.5లో గల భవనం మొదటి అంతస్తులో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 సమయంలో సంఘవి ఉంటున్న పోర్షన్‌ నుంచి అరుపులు కేకలు వినిపించడంతో పక్క వాటాలో ఉంటున్న ఝాన్సీ అనే మహిళ పరుగున బయటకొచ్చి చూసింది. ఛాతీ నుంచి రక్తం కారుతూ పృథ్వీ కనిపించాడు. అక్కా, తమ్ముడి ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చిన యువకుడు వారిద్దరిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన యువతి తమ్ముడు చింటు(20) మృతి చెందాడు. యువతి తీవ్రంగా గాయపడగా ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి శివకుమార్ కత్తితో రావడంతో యువతి, ఆమె తమ్ముడు గట్టిగా కేకలు వేశారు. దీంతో స్థానికులు దాడికి పాల్పడిన యువకుడిని ఓ గదిలో బంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు.సంఘవి, పృథ్వీలపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఫరూక్‌ నగర్‌ మండలానికి నిందితుడు శివకుమార్‌ (26) రామాంతపూర్‌లో ఉంటూ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. అతను, సంఘవి కొందుర్గులో పదో తరగతి కలిసి చదువుకున్నారు. దీంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత మనస్ఫర్థలు రావడంతో సంఘవి శివకుమార్‌తో మాట్లాడడం మానేసింది. దాంతో అతను ఆమెపై పగపెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమెను చంపడానికి ప్రయత్నించాడు.
https://www.telugupost.com/movie-news/savyasachi-teaser-review-91010/
నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చాలా స్టైలిష్ గా.. కొత్త‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది. ఇందులో చైతూ పాత్ర భార‌తంలో అర్జునుడి స్పూర్తితో తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు చందూ మొండేటి. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనగా.. గర్భంలోనే ఇద్దరు కవలలు ఒకరిగా కలిసిపోతే ఏమవుతుంది అనేది సినిమా కాన్సెప్ట్. ఈ టీజ‌ర్ చాలా రి ఫ్రెషింగ్ గా అలాగే సృజ‌నాత్మ‌కంగా ఉంది. మామూలుగా ఒక త‌ల్లి ర‌క్తం పంచుకుని పుడితే అన్నాద‌మ్ములు అంటారు.. అదే ఒకే ర‌క్తం.. ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొద‌లుని.. క‌డ‌దాకా ఉండే క‌వచాన్ని.. ఈ స‌వ్య‌సాచిలో స‌గాన్ని అంటూ చైతూ టీజ‌ర్ లో చెప్పిన డైలాగ్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.వైవిధ్యమైన పాత్రలో మాధవన్...ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలో ఎప్పుడూ రాని ఓ కాస్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉంది. విజువ‌ల్స్ ను చాలా బాగా చూపించారు. స‌వ్య‌సాచి కొన్ని క‌ళ్లు చెదిరిపోయే లొకేష‌న్స్ లో చిత్రీక‌రించారు. అవ‌న్నీ టీజ‌ర్ లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. మాధ‌వ‌న్, భూమికా చావ్లా ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మాధవన్ ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారని కూడా టీజర్ లో చిన్న క్లూ ఇచ్చారు. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో విడుదలకానుంది.